కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని అధికార బీజేపీ నాయకులు ప్రశంసించగా, చప్పగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం లోక్ సభలో జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 సాధారణ బడ్జెట్ పై అధికార, విపక్ష నాయకులు భిన్నంగా స్పందించారు.