గ్యాంగ్స్టర్ నయీం కేసును సీరియస్గా తీసుకున్నామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. నయీం కేసులో అరెస్టైన నిందితులకు రాజభోగాలు కల్పించిన అధికారులపై జైళ్ల శాఖ తాజాగా చర్యలకు రంగం సిద్ధం చేసింది.