gangster nayeemuddin
-
నయీమ్ ఆస్తుల్ని లెక్క తేల్చిన సిట్
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ ఆస్తుల వివరాలను ఎట్టకేలకు పోలీసులు లెక్కగట్టారు. నయీమ్ ఆస్తుల విలువ అక్షరాలా రూ.2వేల కోట్లుగా సిట్ లెక్కతేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకుంది. నయీమ్కు సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టు ఆధీనం ఉన్నాయి. మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. మరో రెండు నెలల్లో నయీమ్ కేసు దర్యాప్తును సిట్ ముగించనుంది. మొదటి దఫాలో రూ. 140 కోట్ల ఆస్తి... నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా అతని భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే... హైదరాబాద్లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్నగర్లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్. నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లు. గోవాలోని కోకనట్ హౌస్తోపాటు మరో ఇల్లు గుర్తింపు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు. నాగోల్, సరూర్నగర్లో ఓ సెటిల్మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్లోని పోలీస్హౌస్ విలువ రూ. 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మేడ్చల్లో 3 ఎకరాలు, శామీర్పేట్లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజా ప్రతినిధితో చేసిన సెటిల్మెంట్లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు. మొయినాబాద్లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్లోని అజీజ్నగర్ ల్యాండ్ సెటిల్మెంట్తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు. మొత్తం 1,019 ఎకరాలు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది. నయీమ్ మొత్తం 1,019 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. అయితే ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది. అలాగే అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆదాయ మార్గాలు చూపించడంతోపాటు ఆస్తులను సీజర్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది. దీంతో సిట్ ఆస్తులను గుర్తించినా స్వాధీనానికి తగ్గ ఆధారాలు సంపాదించలేకపోయినట్లు తెలుస్తోంది. -
నయీం గ్యాంగ్తో బెదిరించారు
మిర్యాలగూడ: ‘మేము 9వ తరగతినుంచి ప్రేమించుకున్నాం. మొదటినుంచీ మాకు నా తండ్రినుంచి బెదిరింపులు ఉన్నాయి. గతంలో నయీం గ్యాంగ్ ద్వారా బెదిరించాడు. నన్ను కూడా చంపి నాగార్జునసాగర్లో పడేస్తానని హెచ్చరించాడు. అయినా మేము భయపడలేదు. కానీ చివరికి అనుకున్నంత పనిచేశాడు. నా భర్తను అకారణంగా చంపేశాడు’అంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత రోదిస్తూ చెప్పింది. ప్రణయ్ హత్య అనంతరం మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అమృతను శనివారం పలువురు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలపిస్తూ పలు సంచలన విషయాలు చెప్పింది. పలువురు రాజకీయనాయకులు సహా, అక్కడికి వచ్చిన వారు ఆమె పరిస్థితి చూసి కంటనీరు పెట్టుకున్నారు. ప్రణయ్ని హత్య చేసిన వారిని చంపేయాలంటూ అమృత విలపించింది. ప్రణయ్ని తన తండ్రి మారుతీరావే చంపినట్లు పేర్కొంది. తన భర్తను చంపించిన పుట్టింటికి వెళ్లేది లేదని, తనకు పుట్టే బిడ్డను ప్రణయ్ గుర్తుగా పెంచుకుంటానని వెల్లడించింది. ప్రణయ్తో తాను 9వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నానని, తనను ఎంతో బాగా చూసుకునే వాడని, తనను కూడా ప్రణయ్ వద్దకు పంపించేయాలని రోదించింది. మాట్లాడుకోవద్దని కొట్టారు.. తామిద్దరూ ప్రేమించుకున్న విషయం గతంలోనే ఇంట్లో వారికి తెలియడంతో తన తండ్రి మారుతీరావు ప్రణయ్ని నయీం గ్యాంగ్తో బెదిరించినట్లు అమృత తెలిపింది. దాంతో అప్పట్లో ప్రణయ్ కొద్ది రోజుల పాటు కళాశాలకు కూడా రాలేదని చెప్పింది. ఆ తర్వాత ప్రణయ్తో మాట్లాడవద్దని ఇంట్లో తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్కుమార్లు ఎన్నోసార్లు తనను కొట్టారని, కాలితో తన్నారని తెలిపింది. ఆ క్రమంలోనే ప్రణయ్తో మాట్లాడినట్లు తెలిస్తే తనను కూడా చంపి సాగర్లో పడేస్తామని బెదిరించినట్లు వెల్లడించింది. తాను ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రికి, బాబాయికి ఇష్టం లేదంది. తన తండ్రి మారుతీరావు కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుతున్నాడని, గర్భవతి అయిన విషయాన్ని చెప్పగా అబార్షన్ చేయించుకోవాలని కోరినట్లు తెలిపింది. ప్రణయ్ హత్య జరగడానికి ఐదు నిమిషాల ముందు ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తండ్రి మారుతీరావు ఫోన్ చేశాడని, కానీ ఫోన్ ఎత్తలేదని చెప్పింది. కాగా, రిసెప్షన్ సమయంలో ప్రణయ్, అమృతలు తీయించుకున్న వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. దానిని చూసిన అమృత తండ్రి మారుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. కూతురులా చూసుకున్నాం ప్రణయ్ తండ్రి బాలస్వామి గతంలో నయీం గ్యాంగ్తో బెదిరించారని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి చెప్పారు. శనివారం తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు రాజకీయ నేతలకు ఆయన గత విషయాలను చెబు తూ విలపించారు. అమృతను కూతురులా చూసుకుంటున్నా తన కొడుకును మారుతీరావు పొట్టనబెట్టుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి కోరిక మేరకు ఇంటికి వెళ్లాలని అమృతకు చెబితే, ఆత్మహత్య చేసుకుంటానేగానీ అక్కడికి వెళ్లేదిలేదని, ప్రణయ్తోనే ఉంటానని చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమృత తన తండ్రి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ కోసం నయీం చిత్రీకరణ
సాక్షి, సిటీబ్యూరో: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు సిటీకి వచ్చాడు... మారుపేరుతో పాస్పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు...ఓ వీడియో కెమెరాతో నగరం మొత్తం తిరుగుతూ కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు...ఆ సమయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్ను కలిగి ఉన్నాడు...ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్) నమోదైన కేసు పూర్వాపరాలివి. ఇతడిని పీటీ వారెంట్పై గురువారం రాత్రి ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి తీసుకువచ్చిన సిట్ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. షేక్ సోహైల్ పేరుతో పాస్పోర్ట్కు... మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన నయీం ఇంజినీర్ అయినప్పటికీ ఎల్ఈటీకి సానుభూతిపరుడిగా మారాడు. పాకిస్థాన్లో ఉన్న ఆ సంస్థకు చెందిన వారి నుంచివచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందులో భాగంగానే ఇతడు 2007 ఫిబ్రవరిలో హైదరాబాద్కు వచ్చాడు. అప్పటికి సిటీలోనే ఉన్న ఇతడి సన్నిహితుడు షోయబ్ జాగీర్దార్ ఇతడిని రిసీవ్ చేసుకున్నాడు. హష్మత్పేటలోని తన బంధువు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. స్టార్ లైన్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ నగేష్ సహకారంతో సికింద్రాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి దొంగ పాస్పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు. షేక్ సోహైల్ పేరుతో రూపొందించిన పత్రాలపై సికింద్రాబాద్ వచ్చిన సమీర్ సంతకాలు చేశాడు. అక్కడ నుంచి తిరిగి హష్మత్పేటలోని ఇంటికి వెళ్ళకుండా నగరంలోని కీలక ప్రాంతాలను చుట్టి వచ్చాడు. ఆ సమయంలో తనతో పాటు ఓ వీడియో కెమెరా తీసుకువెళ్లిన నయీం అనేక కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు. ఓ అనుమానాస్పద బ్యాగ్ను తన వెంటే ఉంచుకున్నాడు. ఎల్ఈటీకి అందించడానికే సిటీలోని కీలక ప్రాంతాలు వీడియో తీశాడని, ‘ఆ బ్యాగ్’లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. కొన్నాళ్ల తర్వాత వెలుగులోకి... ‘సిటీ టూర్’ ముగించుకున్న నయీం మళ్ళీ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు మళ్లీ ఎల్ఈటీ నుంచి ఇతడికి మరో సమాచారం అందింది. దాని ప్రకారం ఇతగాడు బంగ్లాదేశ్ వెళ్లి కొందరిని కలవాలి. అక్కడ నుంచి ముగ్గురు సుశిక్షుతులైన ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి జమ్మూ కాశ్మీర్కు చేర్చాలి. కొన్ని నెలల పాటు పాక్లో శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదుల్లో అక్కడి కరాచీ, హరిపూర్లకు చెందిన మహ్మద్ యూనస్, అబ్దుల్లాలతో పాటు కాశ్మీర్లోని అనంత్నాగ్కు చెందిన ముజఫర్ అహ్మద్ రాథోడ్ ఉన్నారు. కాశ్మీర్లో భారీ ఆపరేషన్కు ప్లాన్ చేసిన ఎల్ఈటీ దాని కోసమే వారిని పంపింది. 2007 ఏప్రిల్ 4న పశ్చిమ బెంగాల్లో ఉన్న 24 పరగణాల జిల్లాలోని పెట్రాపోల్ నుంచి ఈ నలుగురూ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పట్టుకోవడంతో వీరిపై బన్గావ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎంతకీ నోరు విప్పని ఈ ఉగ్రవాదులకు పోలీసులు పాలిగ్రఫీ, నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి నిజ నిర్థారణ పరీక్షలు చేసింది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ కుట్రతో పాటు ‘సిటీ టూర్’ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ కుట్ర కేసు నమోదు చేసింది. అప్పట్లోనే సిటీకి తీసుకువచ్చి విచారించడంతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఆ ముగ్గురికీ ఉరి శిక్ష విధింపు... పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు ఈ నలుగురిపై 2007 జూన్ 29న బన్గావ్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ జరుగుతుండగానే కోల్కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న సమీర్లో మరో కేసుకు సంబంధించి ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్ప్రెస్లో కోల్కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగిలిన ముగ్గురిపై విచారణ పూర్తి చేసిన బన్గావ్ కోర్టు గత ఏడాది జనవరిలో ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయీంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2017 నవంబర్ 29న లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం నయీంను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్లో నమోదైన కుట్ర కేసులో ట్రయల్ నిర్వహించాల్సి ఉండటంతో సిట్ నయీంను సిటీకి తీసుకువచ్చింది. -
5 ఎకరాలు, రూ. 5 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అన్ని కులాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం ప్రకటించింది. నాయీ బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి రాజధానిలో ఎకరం భూమి, కోటి రూపాయలు కేటాయించడం పట్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ పెదవి విరిచారు. రాష్ట్రంలో 12 లక్షల జనాభా ఉన్న నాయీ బ్రాహ్మణులకు కంటి తుడుపు కేటాయింపులు సరికాదన్నారు. తమ జనాభాను 3 లక్షల 9 వేలుగా చూపించి తీవ్రవైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో చూపించిన లెక్కలను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని, దీని ఆధారంగా తమకు కేటాయింపులు జరపడం తగదన్నారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులకు హైదరాబాద్లో 5 ఎకరాల భూమి, రూ. 5 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని, తమ విన్నపంపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిగతా హామీల మాటేంటి? నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని లింగం డిమాండ్ చేశారు. సెలూన్లకు విద్యుత్ రాయితీపై ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలకు నోచుకోలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తమకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదని వాపోయారు. నిబంధనల పేరుతో బీసీ రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి మద్దికుంట లింగం విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
భార్య భర్తల గొడవలో తలదూర్చిన నయీం అనుచరులు?
-
నయీం అనుచరుడి హల్చల్!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత.. అతని అనుచరుల కదలికలు పెద్దగా లేవు. నయీం హతమై రెండేళ్లు గడిచింది. ఇప్పుడు అతని అనుచరుడు శేషన్న విశ్వరూపం చూపిస్తున్నాడు. నయీం చేసిన దందాలు, సెటిల్ మెంట్లు, కూడబెట్టిన ఆస్తులు, ఇతరత్రా అన్నీ ఇతని కనుసన్నల్లోనే ఉన్నట్టు చెప్పుకుంటారు. అందుకే నయీం ఎన్కౌంటర్ జరిగిన రెండేళ్ల తర్వాత దందాలు మొదలుపెట్టాడు. ఎల్బీనగర్లోనే ఉంటూ కల్వకుర్తి, అమన్గల్, అచ్చంపేట్, షాద్నగర్, మహబూబ్నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నయీం గ్యాంగంతా అతడి వెనుకే... నయీం రెండు రకాలుగా గ్యాంగ్ను నడిపాడు. ఒకటి తన గురించి తెలిసిన కుటుంబీకులతో, రెండోది తనతో ముందు నుంచి ఉన్న అనుచరులతో.. ఎన్కౌంటర్ తర్వాత అతడి కుటుంబీకులు మొత్తం సైలెంట్ అయిపోయారు. కొందరు జైల్లో ఉంటే మరికొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. కానీ అనుచర వర్గంగా ఉన్నవారంతా మళ్లీ రంగంలోకి దిగారు. అనుచరులుగా ఉన్న 16 మంది గ్యాంగ్లో నంబర్ 2గా ఉన్న శేషన్నతో చేతులు కలిపినట్టు మహబూబ్నగర్ పోలీస్ వర్గాలు స్పçష్టం చేశాయి. హైదరాబాద్, మహబూబ్నగర్, నల్లగొం డలో బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ శేషన్న ఆర్థికంగా బలపడుతూ మళ్లీ దందాలోకి దిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. అతని వెంటే ప్రజాప్రతినిధులు.. నయీం ఎన్కౌంటర్ మరుసటి రోజు నుంచి ఎల్బీనగర్లో ఉన్న ఎంపీపీ ఇంటి పక్కన అపార్ట్మెంట్లోనే శేషన్న షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కడే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. అచ్చంపేట ప్రాంత ఓ ప్రజాప్రతినిధి, మహబూబ్నగర్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, కల్వకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధితో కలసి శేషన్న సెటిల్మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నయీం బినామీల ఆస్తులను శేషన్న ద్వారా దక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచూకీ తెలియడంలేదు... శేషన్న ఎక్కడున్నాడని పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అతను మాత్రం బహిరంగంగానే తిరుగుతున్నాడు. పైగా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే దందాలు చేస్తుండటం అనుమానం కలిగిస్తోంది. నయీం ఎన్కౌంటర్లో కీలక సమాచారం ఇచ్చినందుకే శేషన్నను వదిలిపెట్టినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. నలుగురు రియల్టర్లకు బెదిరింపులు.. కల్వకుర్తి, షాద్నగర్లో రియల్ ఎస్టేట్ చేస్తున్న నలుగురు వ్యాపారులను ఇటీవల శేషన్న బెదిరించినట్లు తెలిసింది. నయీం గతంలో కబ్జా చేసిన భూములను విక్రయించేందుకు మళ్లీ రియల్టర్లు ప్రయత్నం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై రియల్టర్లు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యే శేషన్నకు దగ్గరగా ఉన్న ఓ ఎంపీపీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. శేషన్న జోలికి రావద్దని ఎంపీపీ కూడా ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. రాచకొండ పరిధిలోని మల్కాజ్గిరి జోన్లో ఓ అపార్ట్మెంట్ విషయంలోనూ శేషన్న బెదిరింపులకు పాల్పడినట్లు ఓ సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
‘కరుణానిధి మృతి కలచివేసింది’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురందరుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం కరుణానిధి మరణం పట్ల అఖిల భారత నాయీ సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్ఐయూఎఫ్) సంతాపం ప్రకటించింది. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ‘కలైంజ్ఞర్’ మరణం పూడ్చలేనిదని ఏఐఎన్ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళ నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాజకీయ రంగంలో శిఖరస్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మరణం తమ జాతికి శరాఘాతమని ఏఐఎన్ఐయూఎఫ్ ప్రతినిధి సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఓటమి ఎరుగని దురందరుడు ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశ రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన కరుణానిధి మరణం తమను ఎంతగానో కలచివేసిందని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం పేర్కొన్నారు. కరుణానిధి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఓటమి ఎరుగని రాజకీయ దురందరుడు కరుణానిధి అని కొనియాడారు. 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత ఆయకే దక్కిందన్నారు. డీఏంకే పార్టీకి ఏకధాటిగా 50 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగారని, తమిళనాడులోనే కాక దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణ కులంలోని గొప్ప నాయకుడు అస్తమించడంతో తామంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయామన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నీటి నివాళులు కరుణానిధి నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, కరుణానిధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ద్రవిద యోధుడికి కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. -
నయీం కేసులో ఆ ముగ్గురికి ఊరట
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మరో ముగ్గురు అధికారులపై రాష్ట్ర పోలీస్ శాఖ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సస్పెన్షన్లో ఉన్న ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్వలీ తిరిగి విధుల్లో చేరారు. ఏసీపీ చింతమనేని శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేశారు. అదే విధంగా ఇన్స్పెక్టర్ రాజగోపాల్ నార్త్జోన్ ఐజీ కార్యాలయంలో, మస్తాన్వలీ వెస్ట్జోన్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. సస్పెన్షన్కు ముందు ఏసీపీ శ్రీనివాస్ నగర కమిషనరేట్లోని సీసీఎస్లో పనిచేయగా, రాజగోపాల్ కొత్తగూడెం ఇన్స్పెక్టర్గా, మస్తాన్వలీ సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితమే అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్రావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన పోలీస్ శాఖ.. తాజాగా మిగిలిన ముగ్గురిపై ఎత్తివేయడంతో మొత్తం ఐదుగురు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరిలో ఎవరికి కూడా ఇప్పటివరకు పోస్టింగ్లు కేటాయించలేదు. వీరితో పాటు అదనపు ఎస్పీ సునీతారెడ్డి సైతం ఇటీవల పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిపోర్ట్ చేసి వెయిటింగ్లో ఉన్నారు. పోలీస్ శాఖ వీరందరికీ త్వరలోనే పోస్టింగులు కల్పించనున్నట్లు తెలిసింది. -
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
వెలివేతపై నాయీ బ్రాహ్మణుల ఆగ్రహం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో నాయీ బ్రాహ్మణులు, రజకులపై గ్రామ బహిష్కరణ విధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఊరు నుంచి వెలివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన గ్రామ పెద్దలపై చట్టపరంగా తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన నాయీ బ్రాహ్మణులు, రజకులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. తమ వారికి న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఆందోళనలకు సిద్ధం: రజకులు రజకులకు న్యాయం జరగని పక్షంలో తాము కూడా రాష్ట్ర ఆందోళనలు చేపడతామని చాకలి ఎస్సీ సాధన సమితి ప్రకటించింది. తమ సంఘీయులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సాంఘిక దురాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. వాస్తవం లేదు: గ్రామస్తులు కొండపల్లిలో రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులను గ్రామం నుంచి బహిష్కంచలేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని సీఐ రమణమూర్తి, తహశీల్దార్ సాయన్నకు ఈ మేరకు తెలిపారు. గ్రామంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు గ్రామం నుంచి ఎలాంటి సహకారం అందించవద్దని తీర్మానించామే తప్ప గ్రామం నుంచి బహిష్కరించలేదని వారు చెప్పడం గమనార్హం. ఎటువంటి సహాయం అందించవద్దని చెప్పడం వెలివేత కాకపోతే ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. -
నయీం కేసులో కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ ఎన్కౌంటర్తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు 2 వారాల గడువునిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నయీం అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సూర్యాపేట హుజూర్నగర్కి చెందిన శ్రీనివాస్ 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసుల అండదండలతో నయీం వందల కోట్ల రూపాయాలతోపాటు వందల ఎకరాల భూములను అక్రమంగా ఆర్జించారని తెలిపారు. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశం తో నయీంను ఎన్కౌంటర్ చేశారని, అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. -
చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వం
సాక్షి, హైదరాబాద్ : నాయీ బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా నాయీ, సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్ఐయూఎఫ్) డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ సెయిన్ సమాజ్ సంఘ్(ఆర్ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. నాయీ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం క్షమాపణ చెప్పకపోవడం బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిందే.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు, వాయిద్య కళాకారులకు కనీస వేతనాలు ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ మేధావులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనుచ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎన్ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్ చంద్ర, చైర్మన్ మద్దికుంట లింగం, ఎం నరసింహారావు, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో మంద కృష్ణమాదిగ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తా: కృష్ణ మాదిగ నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హామీయిచ్చారు. ప్రెస్క్లబ్లో ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు కలిశారు. ఏపీ సచివాలయంలో నాయీ బ్రాహ్మణులను బెదిరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తానని ఈ సందర్భంగా కృష్ణమాదిగ అన్నారు. నాయీ బ్రాహ్మణులు తన మద్దతు ఉంటుందని, వారు ఎక్కడికి పిలిచినా వస్తానని హామీయిచ్చారు. ఇది కూడా చదవండి : నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి -
బేషరుతుగా బాబు క్షమాపణలు చెప్పాలి
ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు): నాయీబ్రాహ్మణులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద నాయీబ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జినంద అధ్యక్షత పలువురు సభ్యులు సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. వారికి దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నాయీబ్రాహ్మణులు సీఎం చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన తన స్థాయిని మరచి మరీ అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న చంద్రబాబుకు బీసీల కష్టనష్టాలు పట్టడంలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు, వారికి దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సెలూన్లకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటూరి బాబ్జీనంద మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి బేషరుతుగా క్షమాపణ చెప్పేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవరం రోహిత్, కాపు సంఘం నేత వంగవీటి నరేంద్ర, వడ్డెర సంఘం నాయకుడు వెంకట్, కుమ్మర యువసేన నేత లలిత్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
నయీం కేసులో సస్పెన్షన్ల ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసులో పోలీస్ అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నయీంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్రావు, చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్లపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. గతేడాది మే నుంచి ఈ ఐదుగురు అధికారులు సస్పెన్షన్లోనే ఉన్నారు. వారితోపాటు మరో 11 మంది అధికారులకు అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ చార్జి మెమోలు జారీ చేశారు. మరో ఆరుగురి నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తంగా 22 మంది అధికారులు నయీంతో సంబంధాలు కొనసాగించారని సిట్ తేల్చింది. సస్పెన్షన్కు గురైన అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పోలీస్శాఖ నుంచి ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన అందినట్లు హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏడాదిగా సస్పెన్షన్లోనే ఉన్న అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. 2 రోజుల్లో సస్పెన్షన్ ఎత్తివేతతోపాటు పోస్టింగ్లు కల్పిస్తూ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. అదనపు ఎస్పీ సునీతపైనా: వివాహేతర సంబంధం కేసులో సస్పెన్షన్కు గురైన అవినీతి నిరోధకశాఖ అదనపు ఎస్పీ సునీతనూ తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆమెతోపాటు ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రెడ్డిపైనా సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం ఉందని పోలీస్శాఖ ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. -
ఏపీ సచివాలయానికి వెళ్ళడానికి కొత్త నిబంధనలు
-
ఏపీ సచివాలయానికి వెళ్తున్నారా?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళుతున్నారా? కాస్త ఆగండి. ఇంతకుముందులా మీరు సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు. సందర్శకులను నియంత్రించేందుకు చంద్రబాబు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబుతో సోమవారం నాయీ బ్రాహ్మణుల వివాదం నేపథ్యంలో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) హడావుడిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పేషీలనుంచి జారీ చేసే పాసులు, ఫోనుకాల్స్ ను అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రతి పేషి నుంచి ఆన్లైన్లో సందర్శకుల వివరాలు నమోదు చేస్తే సందర్శకులకు జీఏడీ అనుమతి మంజూరు చేస్తుంది. ఈ అనుమతి పత్రంతో ఏ విభాగంలో పనివుంటే ఆ బ్లాక్కు మాత్రమే వెళ్లాల్సివుంటుంది. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు కనీస వేతనాల కోసం సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని నాయీ బ్రాహ్మణులు నిలదీశారు. ‘ఇంతమందిని ఇక్కడకు ఎవరు రానిచ్చారు. ఇదేమన్నా చేపల మార్కెటా? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా రౌడీయిజం ప్రదర్శించారు. సీఎం బెదిరింపు తరువాత సచివాలయం సందర్శకులపై నియంత్రణకు జీఏడీ చర్యలు చేపట్టడం గమనార్హం. ప్రజల ఆగ్రహం.. సచివాలయంలో సందర్శకులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో కట్టిన సచివాలయంలోకి ప్రజలను అనుమతించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ హక్కులను కాలరాస్తే సహించబోమన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే తమపై ఆంక్షలు విధించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను
-
‘పేదల రక్తానికి మరిగిన పులి చంద్రబాబు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం వీధిరౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని, పేదవాడి రక్తానికి మరిగిన పులి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. విశాఖలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల పట్ల సీఎం ప్రవర్తించిన తీరుకు రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. క్షురకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధర్మంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ.. ధర్మ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. బరితెగించి ఇసుక అమ్ముతున్నారని, దొంగల ప్రభుత్వం ఇదని ఆరోపించారు. మోదీ లేకపోతే చంద్రబాబు జీరో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు జీరో అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. విధానపరమైన నిర్ణయాల వల్లే కశ్మీర్లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీయే బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలపై మండల స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. -
చంద్రబాబు తీరుతో విస్తుపోయా!
సాక్షి, రాజమహేంద్రవరం: కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ట్విటర్లో స్పందించారు. విస్తుపోయా!... ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబుగారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో... ‘దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం’ అని నాయీ బ్రాహ్మణ వర్గానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 June 2018 -
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి
-
నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి
సాక్షి, అమరావతి: ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ హుంకరించారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై నోరు పారేసుకున్నారు. నాకే ఎదురు చెప్తారా అంటూ రంకెలు వేశారు. ‘నచ్చితే చెయ్యండి లేకుంటే వెళ్లిపోండి’... తమ డిమాండ్లను పరిష్కరించమని అడిగిన నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఇది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో జరిపిన చర్చలు విఫలం కావడంలో సచివాలయంలో సీఎం కాన్వాయ్ను నాయీ బ్రాహ్మణులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి మాత్రం బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని గర్జించారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించారు. దీంతో తమాషాలు చేస్తున్నారా అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేం: కేఈ దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమని అలాగే కన్సాలిడేటెడ్ పే ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. టిక్కెట్పై 25 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీంతో నెలకు ప్రతి క్షురకుడికి రూ. 25 వేలు వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెప్పారు. 25 రూపాయలకు అంగీకరించిన వారు ఎంతమంది వస్తే అంతమందితో పని చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ భారాన్ని దేవాలయాలే భరిస్తాయన్నారు. సమ్మె విరమించి భక్తుల మనోభావాలను కాపాడేలా నాయీ బ్రాహ్మణులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: కన్నా నాయీ బ్రాహ్మణుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి వద్ద నాయీ బ్రాహ్మణుల నిరసన దీక్షలను సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు. నాయీ బ్రాహ్మణుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. -
కేఈతో క్షురకుల చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట తపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలతో పాటు, బార్బర్ షాపులు కూడా బంద్ పాటించాలని సూచించాయి. ఆలయాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి క్షురకులు ఆందోళన చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
పేదోళ్ల మనోభావాలతో చెలగాటమా?
సాక్షి, విజయవాడ: పేదోళ్ల మనోభావాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బలహీనవర్గాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె. పార్థసారధి విమర్శించారు. కనీస వేతనాల కోసం విజయవాడ దుర్గగుడిలో ఆందోళన చేస్తున్న క్షురకులకు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాలకు మంచి ఆదాయం ఉన్నా క్షురకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ప్రభుత్వ పెద్దలను కలిసి అభ్యర్థించినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.17 వేలు ఇవ్వాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం లేకుండా ఎలా జీవించాలని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
అన్ని ఆలయాల్లో క్షురకుల ధర్నాలు
-
నాయీ బ్రాహ్మణ పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర హడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర కరపత్రాన్ని సోమ వారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం హడ్హక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... నాయీ బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 1న జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 12 రోజుల పాటు ఈ పాదయాత్ర వివిధ జిల్లాల గుండా నగరంలోని ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగుతుందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నాయీ బ్రాహ్మణుడికి నవీన కౌరశాల నిర్మాణానికి రూ. 25 వేలు, ప్రతి షాపునకు డొమెస్టిక్ విద్యుత్ మీటర్లుగా మార్చడం, 50 సంవత్సరాలు దాటిన వాయిద్య కళాకారులకు పింఛన్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు, ఫెడరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో రుణాలు, నాయీ బ్రాహ్మణులకు చట్ట సభలతో పాటు ఇతర నామినేషన్ పోస్టులలో అవకాశం, నగరంలో విద్యార్థి వసతి గృహం, జిల్లా, మండల హెడ్ క్వార్టర్స్లో భవనాలు, నాయీ బ్రాహ్మణ యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. జోగులాంబ దేవాలయం నుంచి ఆయిజా, గద్వాల్, ఎర్రవల్లి, బీచ్పల్లి, పెబెర్, వనపర్తి, కొత్తకోట, భూత్పూర్, మహబూబ్నగర్, జడ్చర్ల, బాలానగర్, షాద్నగర్, శంషాబాద్, అత్తాపూర్ మీదుగా ఈ పాదయాత్ర సాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో హడ్హక్ కమిటీ సభ్యులు బి.నరేందర్, సూర్యనారాయణ, మోహన్, జగదీష్, వాసు, గడ్డం మోహన్, పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు శిక్ష..నేడు ప్రోత్సాహం
-
వారికి పదోన్నతి ఇచ్చేద్దామా?
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న అధికారుల్లో కొంతమందికి పదోన్నతి కల్పించే అంశంపై పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో కొంతమంది అధికారులను స్వల్పంగా శిక్షించారు. అయితే నయీంతో వీరికి ఆర్థిక సంబంధాలు లేవని విచారణలో తేలడంతో పదోన్నతులు కల్పించేందుకు పోలీసు శాఖ చర్చలు జరుపుతోంది. పలువురు అధికారులపై ఉన్న స్వల్ప శిక్షను ప్రభుత్వం ఎత్తివేసిందని పదోన్నతులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయ వర్గాలు తెలిపాయి. నలుగురి డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నలుగురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, ఒకరికి నాన్క్యాడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా సస్పెండైన కొంతమంది అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్ కేటాయింపులపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది. -
‘నయీం’ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత?
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అదనపు ఎస్పీ స్థాయి అధికారి సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన ఫైలు హోంశాఖకు చేరింది. అలాగే ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లకు సంబంధించిన సస్పెన్షన్ రిలీఫ్ ప్రతిపాదన రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయానికి చేరినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేత అనంతరం ఐదుగురు అధికారులకు తిరిగి పోస్టింగ్స్ కల్పించనున్నారు. అలాగే మైనర్ పనిష్మెంట్లకు గురైన 16 మంది అధికారులు కూడా రిలీఫ్ అయినట్టు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో 16 మంది అధికారులకు డీజీపీ మెమోలు జారీ చేశారు. అయితే విధి నిర్వహణలో భాగంగానే నయీంను కలిశామని కొంతమంది అధికారులు వివరణ ఇవ్వగా.. క్లాస్మెట్, బంధుత్వం వల్ల కలవాల్సి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు మైనర్ పనిష్మెంట్లు పొందిన కొందరు అధికారుల పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. గతేడాది పదోన్నతి పొందాల్సిన వీరు పనిష్మెంట్ల వల్ల అవకాశం కోల్పోయారు. ఇప్పుడు వీరికి పదోన్నతుల ప్రతిపాదన ఫైలు కూడా తెరమీదకు రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
వరాలు కురిపించిన జననేత
సాక్షి, గుడివాడ: నాయి బ్రాహ్మణులకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీయిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను మంగళవారం నాయి బ్రాహ్మణులు కలిశారు. తమ సమస్యలను జననేతకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకు అన్ని విధాల మేలు చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... నాయి బ్రాహ్మణులు లేకపోతే నాగరికత ముందు సాగలేదు. నేడు వీరు బతకలేని పరిస్థితి ఉంది. చిన్న కులం కావడంతో రాజకీయంగా ఎవరూ పట్టించుకోలేదు. క్షౌరశాలల్లో ఫ్యాన్లు, టూబ్లైట్లకు రూ. 8 నుంచి రూ. 14 వరకు కరెంట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కనీసం 4 వేల రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలంటే ఎలా బతకాలని వాపోతున్నారు. సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 500 యూనిట్ల వరకు డొమెస్టిక్ టారీఫ్ ఉండేలా చూస్తాం. ప్రతి షాపుకు రూ. 10 వేలు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధం లేదా 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండింటిలో ఒకటి అందిస్తాం. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ బదులుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తాం. వైఎస్ జగన్కు వినతిపత్రం ఇస్తున్న నాయి బ్రాహ్మణులు ఆలయాల్లోనూ నాయి బ్రాహ్మణులు పనిచేస్తున్నారు. వాయిద్య కళాకారులుగా దేవుడికి సేవలు అందిస్తున్నారు. ఆలయాల్లో వీరిని పట్టించుకునే పరిస్థితి లేదు. వేతన భద్రత లేదు. వీళ్లకు జరగాల్సిన మేలు కచ్చితంగా చేస్తాం. ఆలయాల్లో పీస్ రేట్ల వల్ల క్షురకులు ఇబ్బంది పడుతున్నారు. గుర్తింపు పొందిన ఆలయాల్లో గుర్తింపు కార్డులు ఇచ్చి, స్థిరవేతనాలు ఇస్తాం. పాలక మండళ్లలో సభ్యులుగా అవకాశం కల్పిస్తాం. వాయిద్య కళాకారులకు ఇదేరకమైన మేలు చేస్తాం. చట్టసభల్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తాం. నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరులు, రజకులు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఇటువంటి కులాలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తాం. -
అక్రమ వసూళ్ల కేసులో నయీం భార్య అరెస్టు
సాక్షి, యాదాద్రి భువనగిరి: గ్యాంగ్స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్ ఎస్సై ఎం.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు పేర్కొన్న ఐటీ అధికారులు గతేడాది వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఏప్రిల్ 1న నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1న తెలుగు రాష్ట్రాల నాయీ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ మరియు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.రామానంద స్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్మన్ఘాట్ దుర్గానగర్ కాలనీలోని నాయీ బ్రాహ్మణ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని నాయీ బ్రాహ్మణ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9848781602 నంబర్లో సంప్రదించవచ్చు. -
బడ్జెట్ కేటాయింపులపై హర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో తమ సామాజిక వర్గానికి తగినన్ని కేటాయింపులు జరపడం పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్నివర్గాలకు సముచితంగా నిధులు కేటాయించారని ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందనడానికి ఈ బడ్జెట్ నిదర్శమని ప్రశంసించారు. నాయీబ్రాహ్మణుల సాధికారతకు తగినన్ని నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. తమకు కేటాయించిన నిధులను తగినవిధంగా ఖర్చుచేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారైనా నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని, తమ జనాభాను దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయిస్తే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలి చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బీసీల్లో తమ కులం బాగా వెనుకబడి ఉందని.. తమను చట్టసభకు పంపించడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైస్థాయికి తీసుకురావాలని కోరింది. ఈ మేరకు నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు అన్నిరకాలుగా వెనుబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు తమ కులానికి చెందిన వారెవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కాలేదని వెల్లడించారు. ఇతర వెనుకబడిన కులాలకు అవకాశం కల్పించినట్టుగానే తమకు కూడా అవకాశం ఇవ్వాలని మఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు(కేసీఆర్)కు విజ్ఞప్తి చేశారు. నాయీబ్రాహ్మణులను శాసనమండలి, రాజ్యసభకు నామినేట్ చేసి న్యాయం చేయాలని లింగం నాయీ కోరారు. రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, నామినేటెడ్ పదవుల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. -
మా భూములు మాకిప్పించండి
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్యాంగ్స్టర్ నయీమ్ ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక చట్టం తేవాలి. ఆ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించాలి. నష్టపోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద బడ్జెట్ కేటాయించి న్యాయం చేయాలి. వెంటనే నయీమ్ బాధితులకు న్యాయం చేయాలి’’అని సోమవారమిక్కడ జరిగిన సదస్సు డిమాండ్ చేసింది. వివిధ వామపక్షాల ఆధ్వర్యంలో నయీమ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ఈ సదస్సును నిర్వహించారు. ‘ఆనాటి నుంచి నేటి సీఎం కేసీఆర్ వరకు అందరూ నయీమ్ను పెంచిపోషించిన వారే. చివరికి భస్మాసుర హస్తాన్ని తన కుటుంబ సన్నిహితుల మీద ప్రయోగించే సరికి ... తనని తాను కాపాడుకునేందుకే నయీమ్ను ఎన్కౌంటర్ చేయించారు’అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఆరోపించారు. నయీమ్ సర్కారీ గూండా అని, పోలీసులు–నయీమ్ కలసి సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. తనను చంపేందుకు మూడుసార్లు రెక్కీ నిర్వహించాడని, కొన్నేళ్ల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకొన్నానని విప్లవ రచయిత వరవరరావు చెప్పారు. ఫిబ్రవరి 27న వరంగల్, మార్చి 7న మహబూబ్నగర్, 18న భువనగిరిలో నయీమ్ బాధితులను కలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. సదస్సులో నయీమ్ బాధిత పరిరక్షణ సమితి నాయకులు, వివిధ కమ్యూనిస్టు పక్షాల నాయకులు పాల్గొన్నారు. జొన్న చేను తగలబెట్టారు.. నీ పొలం నయీమ్కు నచ్చింది. రేపు వచ్చి పొలం కాగితాలు ఇచ్చి పైసలు తీసుకో అంటూ భయపెట్టారు. అందుకు నిరాకరించడంతో జొన్న పంటను నా కళ్లెదుటే తగలబెట్టారు. పోలీసులకు చెబితే తామేం చేయలేమన్నారు. ఏడున్నర ఎకరాల్లో 6.5 ఎకరాలను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. – రామిరెడ్డి, ఇమామ్గూడ చంపుతా అని బెదిరించాడు.. భువనగిరి బస్టాండ్ ఎదురుగా ఉన్న 1,700 గజాలను 13 మంది పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా తమ్ముళ్లిద్దరినీ చంపుతామని బెదిరించాడు. హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాం. మా ఆస్తి మాకు ఇప్పించాలని ముఖ్యమంత్రిని అర్థిస్తున్నా. – వారాల అశోక్, భువనగిరి బిల్డింగ్పై నుంచి తోసేస్తామన్నారు.. మా 13 ఎకరాల 30 కుంటల భూమిని ఇవ్వాలంటూ భయపెట్టారు. వారు ఏం చేసినా పట్టించుకోకుండా ఉన్నందున ఓ రోజు అర్ధరాత్రి నన్ను కిడ్నాప్ చేసి పెద్ద బిల్డింగ్పైకి తీసుకెళ్లారు. నీ భూమిని రాస్తావా.. ఇక్కడ నుంచి తోసేయమంటావా..? అంటూ బెదిరించి నాతో బలవంతంగా భూమిని రాయించుకున్నారు. – బాపిరెడ్డి, ఇమామ్గూడ వెళ్లిపో.. లేదంటే ప్రాణాలు పోతాయి నయీమ్ బెదిరింపులకు భయపడి భువనగిరిని వదిలిపెట్టి 14 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాం. కొమ్మయ్పల్లి వద్ద రూ.50 లక్షల ప్లాట్ ఉంది. ఒకరోజు పేపర్లు తీసుకురా.. మాట్లాడుకుందాం అని చెప్పాడు. పేపర్లు తీసుకెళ్లి చూపించడంతో అవి లాక్కుని ఇక్కడ నుంచి వెళ్లిపో.. లేదంటే ప్రాణాలు పోతాయి అన్నాడు. – పి.హనుమాయగుప్తా, వ్యాపారి, మచ్చుపాడు, జనగాం జిల్లా రెండేళ్లు దూరంగా ఉన్నా వదల్లేదు మా ఏడున్నర ఎకరాల భూమిని ఇచ్చేయాలంటూ.. నన్ను నయీమ్ దగ్గరకు తీసుకునిపోయారు. ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. నయీమ్కి భయపడి వేరే ఊళ్లకు పారిపోయా. దీంతో తమ్ముడ్ని బెదిరించారు. రెండున్నరేళ్ల తర్వాత ఇంటికి వస్తే.. నన్ను, తమ్ముడ్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తీసుకెళ్లి బలవంతంగా భూమిని రిజిస్టర్ చేయించుకున్నారు. – ప్రభాకర్రెడ్డి, శ్రీనగర్, మహేశ్వరం మండలం. పూట గడవడం కష్టంగా ఉంది మాది 7 ఎకరాల 2.6 కుంటల భూమి. దాన్ని నయీమ్ బామ్మర్ది ఇచ్చేయమంటూ వేధించాడు. పోలీసులకు చెప్తే మీరే ఏదో తప్పు చేసి ఉంటారన్నారు. చేసేది లేక భూమి ఇచ్చేశాం. రూ.15 లక్షలు ఇస్తామని ఆశ చూపి, డబ్బులు ఇవ్వకుండా వేధించారు. మాకు పూట గడవడం కూడా కష్టంగా ఉంది. – రామచంద్రరెడ్డి, పెహిల్వాన్పూర్ నా భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు మా ఊర్లో 750 గజాల్లో ఇల్లు ఉంది. మీ ఇల్లు నయీమ్ సర్కి నచ్చింది.. ఇచ్చేయాలి.. అంటూ ఆ యన మనుషులు వచ్చి అడిగారు. వారికి మాకూ మధ్య వాగ్వివాదం జరగడంతో నా భర్తని నా కళ్ల ముందే చంపేశారు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పు, లేదంటే నిన్ను, పిల్లల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. పోలీసులు కూడా నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. – వజ్రేశ్వరి, మన్సురాబాద్ ముఖ్యమంత్రే కాపాడాలి.. గోకుల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్న బ్యాంక్ని స్వాధీనం చేయమని నయీమ్ పట్టుబట్టాడు. లేదన్నందుకు నా భర్త జగదీశ్ యాదవ్ని కిడ్నాప్ చేశాడు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపుతామన్నాడు. చేసేది లేక మూడున్నర కోట్లు ఇచ్చాం. ఆ మొత్తం రికవరీ కోసం పోలీసుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఆ డబ్బులు ఈ–సేవకు చెందినవి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చట్టం తెచ్చి రూ.3.5 కోట్లును ఈ–సేవకు అందజేసి మమ్మల్ని ఆదుకోవాలి. –కళావతి, సికింద్రాబాద్, గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, మేనేజర్ -
నయీమ్ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీమ్ ఆస్తుల జప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, సెటిల్మెంట్ల విషయాల్లో లభించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకొని ఆస్తుల స్వాధీనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసి ఉత్తర్వులు పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొదటి దఫాలో రూ. 140 కోట్ల ఆస్తి... నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా అతని భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే... హైదరాబాద్లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్నగర్లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్. నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లు. గోవాలోని కోకనట్ హౌస్తోపాటు మరో ఇల్లు గుర్తింపు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు. నాగోల్, సరూర్నగర్లో ఓ సెటిల్మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్లోని పోలీస్హౌస్ విలువ రూ. 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మేడ్చల్లో 3 ఎకరాలు, శామీర్పేట్లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజాప్రతినిధితో చేసిన సెటిల్మెంట్లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు. మొయినాబాద్లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్లోని అజీజ్నగర్ ల్యాండ్ సెటిల్మెంట్తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు. మొత్తం 1,130 ఎకరాలు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది. నయీమ్ మొత్తం 1,130 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది. అలాగే అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆదాయ మార్గాలు చూపించడంతోపాటు ఆస్తులను సీజర్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది. దీంతో సిట్ ఆ ఆస్తులను గుర్తించినా స్వాధీనానికి తగ్గ ఆధారాలు సంపాదించలేకపోయినట్లు తెలుస్తోంది. -
నయీమ్ ఇంటికి మళ్లీ ఐటీ నోటీసులు
సాక్షి, యాదాద్రి: గ్యాంగ్స్టర్ నయీమ్ కుటుంబ సభ్యులకు ఐటీశాఖ రెండోసారి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం యాదాద్రి భువనగిరిజిల్లాకేంద్రం ఖిలానగర్లో గల నయీమ్ తల్లి తాహేరాబేగం, భార్య హసీనా బేగం, అక్క సలీమా æగం, తమ్ముడు కూతురు అహేలా బేగంకు షోకాజు నోటీసులు జారీ చేస్తూ వారి ఇంటికి అతికించారు. ఈ నోటీసుల్లో ఈ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆదాయం ఎలా సమకూరిందో తెలపాలని పేర్కొన్నారు. డిసెంబర్ 11లోగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో మిమ్మల్ని నయీమ్ బినామీలుగా గుర్తించి బినామీ ఆస్తుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆ విభాగం డిప్యూటీ కమిషనర్ బ్రజేంద్రకుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఎన్ని ఎన్కౌంటర్లన్నది చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: ‘‘నాకు జన్మనిచ్చింది రాజస్తాన్. కానీ జీవితాన్నిచ్చింది హైదరాబాద్. దానికి తోడు నా భార్య హైదరాబాదీయే. 60 ఏళ్లలో 25 ఏళ్లు మాత్రమే çస్వస్థలంలో ఉన్నా. మిగతా జీవితమంతా హైదరాబాదే. భార్య, పిల్లలు, చుట్టాలు, స్నేహితులు.. అంతా ఇక్కడే. హైదరాబాద్కు హాట్ సిటీ లాంటిది పాతబస్తీ.. కీలక సమయంలో ఆ ప్రాంతానికి డీసీపీగా పనిచేయడం జీవితంలో ఎనలేని సంతృప్తినిచ్చింది’’ అని డీజీపీ అనురాగ్శర్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. కీలకమైన గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్లలో చాలా కాలం పనిచేశారు, ఆ అనుభవం ఎలాంటిది? - ఇప్పుడున్నంత ప్రశాంత వాతావరణం అప్పుడు లేదు. 2007 వరకు ఉద్రిక్తమైన వాతావరణం ఉండేది. గ్రేహౌండ్స్లో గ్రూప్ కమాండర్గా పనిచేసిన సందర్భంలో ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటామో? అసలు వస్తామో లేదో కూడా నమ్మకం ఉండేది కాదు. ఉగ్రవాదుల హెచ్చరికలు, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, అనుమానితులను ప్రశ్నించడం.. అదంతా సెపరేట్ పోలీసింగ్. నా సక్సెస్లో ఆ పోస్టింగ్స్ కూడా కీలకం. ఇప్పటివరకు ఎన్ని ఎన్కౌంటర్లు చూశారు, మీ నేతృత్వంలో ఎన్ని జరిగాయి? - ప్రతీదీ ఎన్కౌంటర్ అనడం కరెక్ట్ కాదేమో. కొన్నిసార్లు ఎదుటి వారు ముందు కాల్పులు జరపడం మొదలుపెడితే.. ఇరువైపులా పరిస్థితి ఎవరి చేతుల్లో ఉండదు. అలా లెక్కలేనన్ని ఎన్కౌంటర్లు చూశాను. ఎన్ని అన్నది లెక్కపెట్టుకోలేదు. లెక్క ఉన్నా చెప్పడం మంచిది కాదు. చాలాసార్లు ఎన్కౌంటర్లలో యువత చనిపోయారు కదా.. అలాంటి సందర్భాల్లో బాధ అనిపించలేదా? - ప్రాణం చాలా విలువైంది. కాల్పులు శత్రువు వైపు నుంచి ప్రారంభమయ్యాక ఆపడం గానీ, నిలువరించడం గానీ మన చేతుల్లో ఉండదు. చాలా మంది తెలిసీ తెలియని వయసులో మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా యువతీ యువకులు మృతిచెందిన సమయంలో బాధనిపించినా.. బయటపడలేం. వృత్తి అలాంటిది. అలాగని మేం కర్కశులం కాదు. మీ 35 ఏళ్ల సర్వీసులో గర్వంగా అనిపించిన పోస్టింగ్ ఏది? - చెప్పాలంటే డీజీపీ పోస్టు కన్నా.. గ్రేట్గా ఫీలయ్యేది గతంలో చేసిన హైదరాబాద్ సౌత్జోన్ డీసీపీ పోస్టు. నిప్పు మీద వేలాడుతున్నట్టుగా ఉండే పోస్టింగ్లో మూడున్నరేళ్లపాటు చేశాను. ఇప్పటివరకు నా రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో, తర్వాత ముంబై పేలుళ్ల సమయంలో.. ఇలా ఒకదానిపై ఒకటి టెన్షన్ పెంచిన సమయంలోనూ.. అక్కడి యువత, ప్రజల సహకారంతో దుర్ఘటనలేమీ జరగకుండా పనిచేసి విజయం సాధించాను. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏమిటి, మళ్లీ పుంజుకుంటోందా? - అందుకు అవకాశమే లేదు. పేరుకు మావోయిస్టు తెలంగాణ కమిటీ ఉన్నా.. పూర్తిగా ఛత్తీస్గఢ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. గిరిజన యువతను రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న విద్య, ఉపాధి అవకాశాలతో యువత అభివృద్ధి వైపు చూస్తోంది. మావోయిస్టు పార్టీలో చేరి ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితిని యువత వద్దనుకుంటోంది. భవిష్యత్లో మావోయిస్టు పార్టీ పుంజుకునే పరిస్థితులు లేవు. శాఖలో అధునాతన సాంకేతికత వినియోగం పరిస్థితి ఏమిటి? - గత పదేళ్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఏ సమాచారమైనా క్షణాల్లో కేంద్ర కార్యాలయాలకు చేరిపోతోంది. దాంతో ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో రాష్ట్ర పోలీసు శాఖ విజయవంతమైంది. అధికారులు, సిబ్బంది కూడా టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు. నిందితుల లొకేషన్లు, కాల్డేటా, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం వేగంగా తెలుసుకోగలుగుతున్నాం. నేరస్తులకు శిక్ష పడేలా సాంకేతిక ఆధారాలు తోడ్పడుతున్నాయి. నయీమ్ కేసులో రాజకీయ నేతలపై కేసులు పెట్టలేకపోయారన్న ఆరోపణలపై మీ వివరణ? - నయీమ్తో కలసి తిరిగిన కొందరు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. రాజకీయ నేతల విషయానికొస్తే పెద్దగా ఆధారాల్లేవు. ఆధారాలున్న అంశాల్లో చర్య లు తీసుకున్నాం. సిట్ కేసులు నమోదు చేసి చార్జిషీట్లు వేస్తోంది. రాజకీయంగా నయీమ్ కేసులో కొంత ఒత్తిడి వచ్చినా అది ఆధారాలను బట్టి చూడాల్సి ఉంటుంది. పక్కాగా ఆధారాలుంటే ఎవరినీ వదలే ప్రసక్తి లేదు. మీ తర్వాత వచ్చే డీజీపీకి మీరిచ్చే సూచనలు, శాఖాపరంగా ఉన్న సమస్యలు? - నా తర్వాత డీజీపీగా వచ్చే అధికారి చాలా సమర్థవంతుడే. పోలీస్ శాఖకు ఉన్న సమ స్య అధికారుల విభజన పూర్తికాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, స్టేషన్ల నిర్మాణం, టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్లో మాదిరి రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర పోలీసు శాఖ మూడున్నరేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని సాధించింది. దీన్ని కొనసాగిస్తూ మరింత ఆధునీకరణ సాధిస్తే దేశంలోనే టాప్గా నిలుస్తాం. -
అతనిపై పీడీ యాక్ట్ తప్పు కాదు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ అనుచరుడు శ్రీధర్గౌడ్ను తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధంలోకి తీసుకోవడంలో ఎటువంటి తప్పులేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీధర్గౌడ్ వంటి వ్యక్తులు సాధారణ చట్టాలకు భయపడే పరిస్థితి లేదని, అటువంటి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగమే సరైన చర్యని అభిప్రాయపడింది. శ్రీధర్గౌడ్పై పీడీ యాక్ట్ ప్రయోగించ డాన్ని సవాలు చేస్తూ అతని భార్య ఎన్.శ్రీలత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ షమీమ్ అక్తర్ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. శ్రీధర్గౌడ్పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ కమిషనర్ 2016లో ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఆమోదిస్తూ 2017 జనవరి 5న జీవో జారీ చేసింది. అనంతరం పీడీ యాక్ట్ కింద శ్రీధర్గౌడ్ను నిర్బంధిం చడాన్ని సలహా బోర్డు కూడా ధ్రువీకరిం చింది. వీటన్నింటిపై శ్రీధర్ గౌడ్ భార్య శ్రీలత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించా లంటూ హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 2016 జనవరి నుంచి ఆగస్టు వరకు శ్రీధర్గౌడ్ 8 నేరాలు చేశారన్నారు. నేరాలకు పాల్పడటం శ్రీధర్గౌడ్ అలవాటు చేసుకున్నారని, దీని వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత కూడా శ్రీధర్గౌడ్ తన తీరును మార్చుకోలేదన్నారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, శ్రీధర్ చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయంది. పోలీస్ కమిషనర్, ప్రభుత్వం అనాలోచితంగా నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. ఈ ఉత్తర్వుల్లో ఎటువంటి తప్పులేదంటూ శ్రీలత పిటిషన్ను కొట్టేసింది. -
తిరుమలలో క్షురకుల ఆందోళన
-
నయీమ్ కేసులో మనీల్యాండరింగ్?
సాక్షి, హైదరాబాద్: నయీమ్ సంపాదించిన ఆస్తులు, భవనాలు, ఇతరత్రా వ్యవహారాల్లో అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ జరిగి ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఈ మేరకు నయీమ్ కేసుపై దృష్టి సారించిన ఈడీ అధికారులు.. సంబంధిత వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ‘నయీమ్’ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 214 కేసులు నమోదుచేయగా.. వాటికి సంబంధించి 30 చార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను, నయీమ్ అక్రమాస్తులకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, పంచనామాలు, డాక్యుమెంట్లను పరిశీలించాలని ఈడీ నిర్ణయించినట్లు తెలిసింది. వాటి ప్రతులు కావాలంటూ రెండు రోజుల కింద ఈడీ అధికారులు లేఖ రాయగా.. పోలీసు శాఖ అందించినట్టు సమాచారం. ‘పెద్దల’ ఖాతాల్లోకి సొమ్ము వెళ్లిందా? నయీమ్ ఎక్కడా కూడా సూట్కేస్ కంపెనీలు స్థాపించినట్టు సిట్కు ఆధారాలు లభించలేదు. గ్యాంగ్స్టర్గా దందాలు చేస్తూ దేశం నుంచి భారీగా సొమ్మును విదేశాలకు తరలించినట్టు కూడా ఆనవాళ్లేమీ దొరకలే దు. అయినా ఈడీ ఈ వ్యవహారంపై దృష్టి సారించడం, ఎఫ్ఐఆర్ లు, చార్జిషీట్లు, ఇతర డాక్యుమెంట్లు తీసుకో వడం సంచలనాత్మకంగా మారుతోంది. వాస్తవానికి సిట్ ఈ కేసు ప్రారంభంలోనే ఈడీకి లేఖ రాసింది. నయీమ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించి చర్యలు చేపట్టాలని కోరింది. కానీ మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు జరిగినట్టు ఆధారాలు లేకపోవడంతో కేసు టేకప్ చేసేందుకు ఈడీ వెనుకాడింది. కానీ ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంపై ఆసక్తి నెలకొంది. 15 రోజుల కింద ఐటీ శాఖ నయీమ్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగిందని, నయీమ్ నుంచి పలువురు ‘పెద్దల’ ఖాతాల్లోకి సొమ్ము ఏమైనా వెళ్లి ఉంటుందా అన్న కోణంలో పరిశీలన జరపనుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
నయీమ్ అనుచరుడి హత్యకు కుట్ర
భువనగిరి అర్బన్: గ్యాంగ్స్టర్ నయీమ్ అనుచరుడు కొనపూరి శంకరయ్యను హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం డీసీపీ పాలకుర్తి యాదగిరి మీడియాకు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంకు చెందిన కొనపూరి శంకరయ్యను హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు టీఆర్ఎస్ నేత కోనపురి రాములు వర్గానికి చెందిన కొమురెల్లి ప్రదీప్రెడ్డి పథకం పన్నాడు. ప్రదీప్రెడ్డి గతంలో శంకరయ్యను హత్య చేసేందుకు విఫలయత్నం చేసి జైలుకు వెళ్లాడు. విడుదలైన అనంతరం శంకరయ్యను హత్య చేయాలని కనకాల లింగస్వామి, దాసరి లవలేష్, దేవరపల్లి భూపాల్రెడ్డి, రాపోలు నాగభూషణం, పొగిళ్ల వెంకన్న, జోగు కిరణ్, కర్నాటి రమేశ్తో జతకట్టాడు. వీరందరూ స్కార్పియో వాహనం, బైక్పై చౌటుప్పల్ నుంచి వలిగొండకు వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గొల్నేపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి ఐదు గొడ్డళ్లు, రెండు నాన్చాక్లు, బటన్ చాకు, డమ్మీ పిస్తోల్, ఏడు సెల్ఫోన్లు, 9 మాస్క్లు, స్కార్పియో వాహనం, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
నయీం కుటుంబానికి ఐటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణ జరిపిన పోలీసులు చాలా రోజులుగా మౌనంగా ఉండగా, తాజా గా ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగింది. నయీం తల్లితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద తాఖీదులు జారీ చేసింది. నయీం తల్లి తాహేరా బేగం, భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, తమ్ముడి భార్య హీనా కౌసర్, తమ్ముడి కూతురు అహేలా బేగంలకు నోటీసులిచ్చింది. సోమవారం ఆదాయపన్ను శాఖ అధికారులు భువనగిరిలోని నయీం పాత ఇంటికి నోటీసులను అంటించి వెళ్లారు. బినామీ లావాదేవీల నిరోధక యూనిట్ (బీపీయూ) డిప్యూటీ కమిషనర్ బ్రజేంద్ర కుమార్ పేరిట జారీ అయిన ఈ నోటీసుల్లో మొత్తం 26 చోట్ల ఉన్న 98 ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలపాలని అందులో పేర్కొన్నా రు. నోటీసులో పేర్కొన్న వ్యక్తులు ఏం వ్యాపా రాలు చేస్తున్నారు? ఆదాయ వనరులు ఎక్క డ్నుంచి వస్తున్నాయి? ఆయా ఆస్తుల సేల్ డీడ్లు, గత పదిహేనేళ్ల ఐటీ రిటర్న్లు, స్థిర, చరాస్తుల క్రయ విక్రయాల వివరాలను తెలి యజేయాలని ఆదేశించారు. అక్టోబర్ 3లోగా వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా లేదంటే తమ ప్రతినిధి ద్వారా వివరాలను పంపాలని, లేదంటే జరిమానా విధిస్తామన్నారు. విలువ వేల కోట్లలో.. ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసుల్లోని ఆస్తుల వివరాలు విస్తుగొలుపుతున్నాయి. వందలు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు, నివాస స్థలాలు కేవలం ఐదుగురి పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆస్తులు ఇందులో ఉన్నాయి. నయీం తల్లి, భార్య, అక్క, తమ్ముడి భార్య, కూతురు పేర్లపై 258 ఎకరాలకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. వీటి విలువ కనీసం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా. ఇక నివాస స్థలాల విషయానికి వస్తే మొత్తం 12,911 చదరపు గజాల ప్లాట్లు ఈ ఐదుగురి పేరిట రిజిస్టర్ అయ్యాయి. అందు లో తమ్ముడి కూతురు అలేహ బేగం పేరిట ఎక్కువగా రిజిస్టర్ కావడం గమనార్హం. ఆమె ఒక్కరి పేరిటే 7,637 చదరపు గజాల నివాస స్థలాల ఉన్నట్టు ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు. తల్లి తాహెరాబేగం పేరిట 85 ఎకరాల భూమి, 746 చదరపు గజాల నివాస స్థలం, భార్య హసీనా బేగం పేరిట 69.79 ఎకరాల భూమి, 1,736 చదరపు గజాల నివాస స్థలం, అక్క సలీమా బేగం పేరిట 39.33 ఎకరాల భూమి, 2,937.50 చదరపు గజాల నివాస స్థలం, తమ్ముడి భార్య హీనా కౌసర్కు 15.9 ఎకరాల భూమి, 600 చదరపు గజాల నివాస స్థలం, ఆలేహ బేగం పేరిట 47.13 ఎకరాల భూమి, 7,637 చదరపు గజాల నివాస స్థలం ఉంది. భువనగిరిలోని ఖిలానగర్లో ఉన్న నయీం ఇంటిని తల్లి, భార్య, అక్క పేర్ల మీద ఉమ్మడి రిజిస్ట్రేషన్ చేయడంతో ముగ్గురికీ నోటీసులు జారీ చేశారు. -
నయీం కేసులో కదలిక.. భార్యకు నోటీసులు
హైదరాబాద్ : నయీం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఆదాయపన్ను శాఖ అధికారులు నయీం భార్యకు నోటీసులు పంపించారు. నయీం అక్రమంగా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని అవన్నీ ఎలా వచ్చాయో తమకు వివరించాని పేర్కొంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరిలోగల నయీం ఇంటికి ఈ నోటీసులు అంటించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. భువనగిరి, పరిసర ప్రాంతాలు, యాదగిరిగుట్ట, ఔషాపూర్, కుందన్పల్లి, కీసర, హైద్రాబాద్లో ఉన్న భూములపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీలపై ఐదుగురు కుటుంబ సభ్యుల పేరుతో నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 3వ తేదీలోగా సమాధానమివ్వాలని ఆదేశించారు. నయీం తల్లి తహెరా బేగం, సోదరి సలీమా బేగం, హుసేనా బేగం, అహేళ బేగం, హీనా కౌసర్ పేర్లతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణలో నయీం కేసు పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నయీం ఎన్కౌంటర్ తర్వాత కాస్త హడావిడి చేసిన సిట్ పోలీసులు ఆ తర్వాత కేసు విషయంలో కాస్త నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా ఈ కేసు గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, తాజాగా నయీం భార్యకు, తల్లికి, సోదరీమణులకు నోటీసులు పంపించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలు నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్న ఐటీ అధికారులు వారి నుంచి వివరాలు కోరారు. -
యువతులను చెరబట్టాడు..చంపేశాడు..
-
చెరబట్టాడు.. చంపేశాడు..
నయీమ్ దుర్మార్గాలపై వెలుగులోకి మరిన్ని సంచలనాలు - బాలికలు, యువతుల జీవితాలను బలితీసుకున్న గ్యాంగ్స్టర్ - దగ్గరి బంధువుల పిల్లలనూ వదలని దుర్మార్గం - తన మాట వినకపోతే దారుణంగా హింసించిన వైనం - చివరికి నిద్రమాత్రలిచ్చి, గొంతు నులిమేసి హత్యలు - ఈ పైశాచిక ఆనందానికి తోడ్పడిన నయీమ్ భార్య, అత్త, అక్క - దందాలు, సెటిల్మెంట్ల సమయంలో రక్షణగా పసికందులు - నెలల వయసున్న చిన్నారులను కొనుక్కువచ్చి వినియోగం - ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉన్న 30 మంది చిన్నారులు! - వారిని తీసుకెళ్లేందుకు ముందుకురాని తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: హత్యలు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో ఆగని గ్యాంగ్స్టర్ నయీమ్ మరెన్నో పాశవిక చర్యలకు పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం అభం శుభం తెలియని బాలికలు, యువతులను చెరబట్టా డు. పెంచి, పోషిస్తానని, చదివిస్తానని చెప్పి తీసుకువచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. కాదన్న వారిని క్రూరంగా హింసించాడు. చివరికి నిద్ర మాత్రలు ఇచ్చి, కాలితో గొంతు నులిమి చంపేశాడు. నయీమ్ అత్త, భార్య, అక్క, మేనకోడలు ఈ దారుణాలకు తోడ్పడ్డారు. ఇక తన దందాల సమయంలో పట్టుబ డకుండా ఉండేందుకు, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నెలల పసికందులను వినియోగించుకున్నాడు. నయీమ్ అనుచరులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో ఇలాంటి విస్తుపోయే దారుణాలెన్నో బయటపడుతున్నాయి. విచ్చలవిడిగా దుర్మార్గం.. తన పైశాచిక ఆనందాన్ని తీర్చుకోవడం కోసం నయీమ్ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు. బయటివారైతే విషయం బయటకు వెళతాయన్న ఉద్దేశంతో అమ్మాయిలను తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. చదివిస్తానని, ఉద్యో గం చేయిస్తానని చెప్పి తెప్పించుకున్నాడు. తాను ఎటు వెళ్లినా వారిని తీసుకువెళుతూ కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఒప్పుకోకుంటే తీవ్రంగా హింసించేవాడు, హతమార్చేవాడు. ► 2006లో నయీమ్ తన దగ్గరి బంధువులకు చెందిన నలుగురు బాలికలను పెంపకం పేరుతో తీసుకువచ్చి, లైంగికంగా వేధించాడు. వారిని కాపాడేందుకు యత్నించిన అనుచరుడు ఆరీఫ్ను దారుణంగా చంపేశాడు. ► 2008లో గోవాలో ఇల్లు కొనుగోలు చేసిన నయీమ్.. తరచూ హైదరాబాద్లోని వైట్ హౌజ్ ఇంట్లో ఉన్న ఆరుగురు 14 ఏళ్ల బాలి కలను అక్కడికి తీసుకెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. వాళ్లు వెళ్లేందుకు ఇష్టపడకపోతే నయీమ్ భార్య, అక్క వారిని కొట్టి మరీ బలవంతంగా పంపించేవారు. ► 2010లో బంధువులకు చెందిన 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ► 2012 ఆగస్టులో షాద్నగర్లోని ఇంట్లో 12 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచి మరీ అత్యాచారం చేశాడు. అదే సంవత్సరం నవంబర్లో మరో 14 ఏళ్ల బాలికను రెండు రోజుల పాటు లైంగికంగా వేధించాడు. కొద్దిరోజులకు నయీమ్ సొంత చిన్నాన్న బంధువులైన 12 ఏళ్ల ముగ్గురు బాలికలను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేశాడు. ► 2013లో 15 ఏళ్ల ఇద్దరు బాలికలను, 2014 లో ముగ్గురిని తన దుశ్చర్యలకు బలిచేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తమ్ముడితో కలసి భర్తను చంపింది నయీమ్ ఎంచుకున్న దారిలోనే నడిచిన అతడి సోదరి సలీమా తన భర్తను అతి దారుణంగా హతమార్చింది. నయీమ్ అనుచరుడు కృష్ణ అలియాస్ బాషాతో సలీమా అక్రమ సంబంధం పెట్టుకుందని ఇతర అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. అక్రమ సంబంధం విషయం తెలియడంతో సలీమా భర్త కొండా విజయ్కుమార్ అలియాస్ నదీం.. ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. తమ రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతో నయీమ్, సలీమా, ఇతర కుటుంబ సభ్యులు కలసి అతడిని హతమార్చారు. స్వయంగా సలీమానే భర్తను చున్నీతో బిగించి చంపేసింది. పసికందులను అడ్డం పెట్టుకుని.. తన కామవాంఛలకు బాలికలను, యువతు లను బలిచేసిన నయీమ్.. తన దందాల సమయంలో రక్షణగా నెలల వయసున్న పసికందులను ఉపయోగించుకున్నాడు. దందాల సమయంలో, సెటిల్మెంట్లలో వసూలు చేసిన సొమ్మును తరలించే సమయంలో నయీమ్ భార్య, అక్క, కోడలు ఆ పిల్లలను వెంట పెట్టుకునేవారు. పసిపిల్లలు, మహిళలు ఉండడంతో పోలీసులు ఆయా వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేసేవారని, అలా పట్టుబడకుండా తప్పించుకునేవారని అనుచరులు వెల్లడించారు. తన అత్త సుల్తానా మిర్యాలగూడ, నల్లగొండ సమీప ప్రాంతాల నుంచి పసిబిడ్డలను కొనుగోలు చేసి తీసుకువచ్చేది. అలా 2010 నుంచి నయీమ్ ఎన్కౌంటర్ సమయం వరకు 30 మందికిపైగా పిల్లలను తీసుకువచ్చారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి మూడు నెలల వరకు వయసున్న ఈ చిన్నారులకు తానే పేర్లు పెట్టి.. వివిధ ప్రాంతాల్లోని తన నివాసాల్లో పెట్టాడు. ఈ పిల్లలంతా ప్రస్తుతం ఓ రెస్క్యూ హోంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. కొందరి తల్లిదండ్రులను గుర్తించలేకపోతున్నారని, మరికొందరు పిల్లలను తీసుకెళ్లేందుకు ముందుకురావడం లేదని తెలిసింది. దారుణంగా హతమార్చాడు.. అలకాపురి కాలనీలోని ఇంట్లో 18 ఏళ్ల అనామిక (పేరు మార్చాం)పై 2015 జూలై 24న నయీమ్ అత్యాచారానికి పాల్ప డ్డాడు. ఆమె సహకరించలేదనే కోపంతో తీవ్రంగా గాయపరిచాడు. అదే రోజు రాత్రి తుక్కుగూడలో నయీమ్ తమ్ముడి కుమార్తె ఎంగేజ్మెంట్ ఉండడంతో.. అనామికకు నిద్ర మాత్రలు మింగించి, ఓ గదిలో పడేసి అందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం తిరిగి వచ్చారు. కదలకుండా పడి ఉన్న అనామికను చూసి చనిపోయిందనుకొన్నారు. బయటకు తరలించే క్రమంలో ఆమెకు ప్రాణం ఉన్నట్లు గుర్తించిన నయీమ్... క్రూరంగా ఆమె పొట్టపై తొక్కి, గొంతు నులిమి చంపేశాడు. తర్వాత డ్రైవర్తో కలసి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోని పొదల్లో మృతదేహాన్ని దహనం చేశారు. ► 2014లో ఇద్దరు బాలికలను తీసుకుని ఛత్తీస్గఢ్కు వెళ్లిన నయీమ్.. వారిని తిరిగి హైదరాబాద్కు తీసుకురాలేదు. వారిని చంపేశాడా? లేకా అక్కడి అనుచరులకు వదిలేశాడా.. అన్నదానిపై పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు. ► 2016 ఫిబ్రవరిలో గోవాలోని ఇంట్లో ఉన్న యువతి పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. నయీమ్ అతి దారుణంగా చంపేసినట్టు అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. -
నయీం గ్యాంగ్ పేరుతో బెదిరింపులు
► ఏఈ భార్య పేరుపై స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి ► పోలీసులకు బాధితుడి ఫిర్యాదు మైలార్దేవ్పల్లి (రాజేంద్రనగర్): గుర్తుతెలియని వ్యక్తులు నయీం గ్యాంగ్ పేరుతో ఫోన్ చేసి 600 గజాల స్థలాన్ని విద్యుత్ అధికారి భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని బెదిరింపులకు పాల్పడిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టీఎన్జీవోస్ కాలనీ 8–5–417 ఇంటి నెంబర్లోని స్థలాలకు ఎనిమిది విద్యుత్ మీటర్ల కోసం పోకల వీరేశ్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం దరఖాస్తు చేశారు. మీటర్ల మంజూరులో జాప్యం జరగడంతో వీరేశ్కు కాంట్రాక్టు బిల్క్లర్కు ఆశోక్ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక సిబ్బంది విజిలెన్స్ అధికారులతో దాడి చేయించి రూ.3 లక్షల కరెంట్ బిల్లును పంపారు. ఈ నేపథ్యంలో నయూం గ్యాంగ్ పేరుతో ఒక వ్యక్తి అతడికి ఫోన్ చేసి మీ ఫ్లాట్ సమీపంలోని 600గజాల ఖాళీ స్థలాన్ని ఏఈ విద్యాసాగర్ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తే విద్యుత్ మీటర్లను వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు బాధితుడు తెలిపాడు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే చంపుతామని బెదిరాంచాడన్నారు. ఈ బెదిరింపు కాల్స్ను రికార్డు చేసిన వీరేశ్ వాటిని పోలీసులకు అందజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నయీం అనుచరుల పేరుతో ఆడియో కలకలం
-
నయీం ఖాకీలకు చార్జిమెమోలు!
14 మందికి జారీ చేసిన డీజీపీ కార్యాలయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి డీజీపీ కార్యాలయం చార్జిమెమోలు జారీ చేసినట్టు తెలిసింది. నయీంతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను సస్పెండ్ చేసిన డీజీపీ అనురాగ్ శర్మ.. మైనర్ పనిష్మెంట్ల కింద 14 మందికి చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నయీంతో కలిసి ఎందుకున్నారు, అతడికి మీకు సంబంధం ఏంటి, సిట్ దగ్గరున్న ఆధారాలపై మీ వివరణ ఏంటి.. అనే అంశాలను చేరుస్తూ వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మెమోలపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిగానీ, సిబ్బందిగానీ ఇచ్చే వివరణ సరిగ్గా లేకుంటే తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. లైట్ తీసుకో..: మరోవైపు నయీం కేసులో ఇక పోలీస్ శాఖ గానీ, ప్రభుత్వం గానీ ముందుకు వెళ్లే వీలు లేదని చార్జిమెమోలు అందుకున్న అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. సస్పెన్షన్పైనే తీవ్రమైన ఒత్తిడి ఉందని, చార్జిమెమోలు సూత్రప్రాయంగా ఇచ్చినవేనని, అంతకు మించి ఇందులో తదుపరి చర్యలకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ డీఎస్పీ స్పష్టంగా చెబుతున్నారు. -
నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
-
నయీమ్ ‘ఐపీఎస్’ గాయబ్
కేసులో విచారిస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి.. ► గ్యాంగ్స్టర్తో చేతులు కలిపి కోట్లకు పడగలెత్తిన వైనం ► సెటిల్మెంట్లు, భూదందాలు, కబ్జాలతో అడ్డగోలు సంపాదన ► ఆస్తులకు బినామీగా తోడల్లుడు... ఇటీవలే ఆయన షోరూంలో సిట్ సోదాలు ► నయీమ్తో చుట్టరికం కూడా కలుపుకొన్న మాజీ ఐపీఎస్ అధికారి ► కేసులో తన పేరు బయటకు రాకుండా మాజీ డీజీపీతో స్కెచ్ ► అరెస్ట్ తప్పదని మాయమైపోయారంటున్న సిట్ సాక్షి, హైదరాబాద్: ఆయన పోలీస్ శాఖలో సీనియర్ ఐపీఎస్గా పనిచేశారు.. అదనపు డీజీపీ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందారు.. మావోయిస్టు కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు చీఫ్గా రెండున్నరేళ్లు పనిచేసిన ఆయన గ్యాంగ్స్టర్ నయీమ్తో చేతులు కలిపారు.. సెటిల్మెంట్లు, భూదందాలు, కబ్జాలకు పాల్పడ్డారు.. వందల కోట్లకు పడగలెత్తారు.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూమిని వెనకేసుకున్నారు.. ఇప్పుడు నయీమ్ కేసులో ఉచ్చు బిగుస్తుండటంతో జంప్ అయ్యారు! అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు!! పరువు పోతుందని.. నయీమ్ కేసులో తనను ఎక్కడ విచారిస్తారో నన్న భయంతోనే సదరు రిటైర్డ్ అదనపు డీజీపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. నయీమ్ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు అధికారులు, విచారణ ఎదుర్కొంటున్న మరో ముగ్గురు అధికారుల ద్వారా ఈయన కార్యకలాపాలు సాగించినట్టు సిట్ ఇప్పటికే ధ్రువీకరించింది. భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు ఢిల్లీలోని ఓ ఇంటిని సైతం నయీమ్ ఈ మాజీ అధికారికి ఇప్పించాడని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనను విచారిస్తారని భావించి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. నోటీసులు జారీ చేస్తే ఎక్కడ పరువు పోతుందోనని హైదరాబాద్కు రావడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉంటూ కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవలే తోడల్లుడి షోరూంలో సోదాలు నయీమ్ అండదండలతో రెచ్చిపోయిన సదరు మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి బంజారాహిల్స్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 500 గజాల స్థలం కబ్జా చేసి భవనం నిర్మించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో ఆయన కుటుంబీకులు ఓ షోరూం నిర్వహిస్తున్నారని, అందులో రెండు నెలల క్రితం తాము సోదాలు కూడా నిర్వహించి సంబంధిత పత్రాలు తీసుకున్నట్లు సిట్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలోని ఓ కీలక కమిషనరేట్కు కమిషనర్గా పనిచేసిన సమయంలోనూ నయీమ్ను అక్కడకు పిలిపించి సెటిల్మెంట్లు చేసినట్టు ఫిర్యాదులు వచ్చినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. నయీమ్తో ద్వారా చేయించిన భూకబ్జాలు, ఆస్తులన్నింటిని తన పేరిట కాకుండా తోడల్లుడి పేరిట సదరు మాజీ అధికారి రిజిస్ట్రేషన్ చేయించారని, ప్రస్తుతం తోడల్లుడు షోరూం నిర్వహణలో భాగంగా విదేశాల్లో ఉంటూ బిజినెస్ చేస్తున్నారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆయన కూడా.. నయీమ్ కేసులో విచారిస్తారని భయపడి విదేశాలకు వెళ్లినట్టు తెలిసిందన్నారు. మొత్తం ఆస్తులన్నీ వారి పేరిటే ఉండటంతో తనకేమీ సంబంధం లేన్నట్టు రిటైర్డ్ ఐపీఎస్ వ్యవహరిస్తున్నారని, కానీ త్వరలోనే ఆయనకు నోటీసులిచ్చి విచారిస్తామని దర్యాప్తు అధికారులు స్పష్టంచేశారు. నయీమ్తో చుట్టరికం కూడా.. మాజీ సీనియర్ ఐపీఎస్ కుటుంబంలో నయీమ్ కుటుంబానికి సంబంధించిన యువతి ఉందని, ఆమె ఎవరన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఆమె పేరిట నగర శివారులో నాలుగెకరాల భూమి పత్రాలున్నాయని పేర్కొన్నాయి. ఆ యువతిని రిటైర్డ్ ఐపీఎస్ తోడల్లుడి కుమారుడికి ఇచ్చి నయీమ్ స్వయంగా వివాహం జరిపించాడు. ఈ విషయాన్ని నయీమ్ భార్య తన వాంగ్మూలంలో పేర్కొందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టు కొని సదరు మాజీ ఐపీఎస్ భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు తమ దర్యాప్తులో బయటపడిందన్నారు. వీటింన్నింటిపై త్వరలోనే విచారణ జరుపుతామని, ఆయన దర్యాప్తునకు హాజరుకావాల్సి ఉంటుందని సిట్ అధికారులు స్పష్టంచేశారు. రిటైర్డ్ డీజీపీతో గేమ్ తన వద్ద పనిచేసి సస్పెండ్ అయిన వారు విచారణలో తన పేరు చెప్పకుండా ఉండేందుకు సదరు మాజీ ఐపీఎస్ అధికారి పథకం రచించారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దించాడని పోలీస్ అధికారులు తెలిపారు. తన పేరు బయటపడకుండా ఉండాలంటే సస్పెండ్ అయిన వారిని కాపాడాలని భావించారు. అందుకే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే రిటైర్డ్ డీజీపీని సీఎంవో కార్యాలయానికి పంపినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది సాధ్యపడకపోవడంతో నగరం విడిచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసిందన్నారు. రాజకీయాల్లో కలసి రాని అదృష్టం.. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులన్నింటికి తన తోడల్లుడిని బినామీగా పెట్టుకొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి కూడా దిగారు. అయితే రాజకీయాల్లో అదృష్టం కలిసి రాకపోవడంతో ఏపీలో బిజినెస్లు ప్రారంభించారు. పేరుకు తెలంగాణ అని చెప్పుకునే ఈయన పక్క రాష్ట్రంలో కోట్లు పెట్టుబడి పెట్టి ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. -
నయీమ్ కేసులో మంత్రాంగం!
- సీనియర్ మంత్రిని రంగంలోకి దించిన ‘నయీమ్ ఖాకీలు’ - ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని వారికి మంత్రి హామీ సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తదుపరి చర్యల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. నయీమ్తో లింకులపై మౌఖిక విచారణ, క్రిమినల్ కేసుల నుంచి బయటపడేందుకు ఓ రిటైర్డ్ డీజీపీ ద్వారా ఒత్తిడి తేవాలనుకున్నా అది బెడిసికొట్టడంతో తాజాగా కులంకార్డును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో సామాజికవర్గపరంగా కేవలం తమను మాత్రమే టార్గెట్ చేసి మిగతా అధికారులను మైనర్ పనిష్మెంట్లతో సరిపెట్టి కాపాడారని ఆరోపిస్తూ ఓ సీనియర్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమను గట్టెక్కించాలని ఆరుగురు అధికారులు మంత్రిని కలసి వేడుకున్నట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీయే టార్గెట్... ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ ఇప్పటివరకు తమ వర్గం అధికారులను ఏ ప్రభుత్వం టార్గెట్ చేయలేదని, చేసేందుకు కూడా ప్రయత్నించలేదని ఆరోపణలెదుర్కుంటున్న అధికారులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో డీజీపీ అనురాగ్ శర్మపైనే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రికి సంబంధిత అధికారులు సూచించారని తెలిసింది. నయీమ్ కేసులో ఎనిమిది నెలల నుంచి చర్యలకు సాహసించని డీజీపీ ఒకేసారి ఇంత మంది అధికారులపై వేటు వేయడం వెనకున్న అసలు నిజాలు బయటకు రావాలని మంత్రి భావిస్తున్నారని తెలిసింది. దీనంతటికీ ప్రధాన కారణంగా ఉన్న డీజీపీ అనురాగ్ శర్మపై నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదు చేయాలని సీనియర్ మంత్రి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఐదుగురిలో ముగ్గురు, విచారణ ఎదుర్కోనున్న మరో ముగ్గురు అధికారులు ఒకే సామాజికవర్గం వారు కావడంతో సీఎం వద్దే తేల్చుకుంటానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
నయీమ్ కేసును లైట్ తీసుకోండి!
-
నయీమ్ కేసును లైట్ తీసుకోండి!
సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ రిటైర్డ్ డీజీపీ ► విచారణ ఎదుర్కొంటున్న వారంతా ఆయన శిష్యులే ► వారం క్రితం సీఎం కార్యాలయానికి వెళ్లిన వైనం ► సాదాసీదా చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి ► ఈ ఒత్తిళ్లను పట్టించుకోని పోలీసు శాఖ ► నయీమ్ డైరీలో 22 పేజీలు మాయంపై సందేహాలు! సాక్షి, హైదరాబాద్ ఆయనో సీనియర్ ఐపీఎస్.. కేంద్ర సర్వీసుల్లో కీలక విభాగాలకు అధిపతిగా పనిచేసిన రాష్ట్ర కేడర్ అధికారి. ఇటీవలే పదవీ విరమణ సైతం పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాలకు చీఫ్గా పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్, నయీమ్తో అంటకాగిన ఖాకీలతో సంబంధాలు అల్లుకున్నాయి. పదమూడేళ్ల కింద కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయిన ఆయన తిరిగి ఇటువైపు కన్నెత్తి చూడలేదు కూడా. కానీ ఆ అధికారి, అదీ పదవీ విరమణ పొందిన తర్వాత నయీమ్ కేసును ప్రభావితం చేసేందుకు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఆ రిటైర్డ్ డీజీపీ రాష్ట్రంలో పనిచేసిన సమయంలో తన శిష్యులుగా ముద్రపడ్డ ఆరుగురు అధికారులు నయీమ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. తమపై చర్యలు తప్పవని గ్రహించిన ఆ అధికారులు.. వెళ్లి రిటైర్డ్ డీజీపీ వద్ద మొరపెట్టుకున్నారు. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వారం క్రితం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రంలో కీలక అధికారిగా ఉంటూ, సీఎంకు నమ్మినబంటు అయిన ఓ సీనియర్ అధికారి వద్దకు నేరుగా వెళ్లి లాబీయింగ్కు ప్రయత్నించినట్లు తెలిసింది. నయీమ్ కేసులో తమ వారిపై ఏవో చిన్న చిన్న చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించగా.. సదరు సీనియర్ అధికారి మాత్రం దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారని సమాచారం. సీఎం వద్ద తనకంత సీన్ లేదని, సిట్ నివేదిక పూర్తి ఆధారాలతో ఉందని ఆ అధికారి స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేకాదు తానేం చెప్పినా సరే.. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు నివేదించినదానినే సీఎం ఆమోదిస్తారని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఎలాగైనా ప్రయత్నం చేసి తమ వారిని రక్షించాలని సదరు రిటైర్డ్ డీజీపీ వేడుకున్నట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. సీఎంకే చెప్పండి! రిటైర్డ్ డీజీపీ ప్రతిపాదనను సంబంధిత సీనియర్ అధికారి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. సస్పెన్షన్, విచారణ జరగకుండా చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఉన్నతాధికారులు సైతం మొహమాటం లేకుండా సమాధానమిచ్చినట్లు సమాచారం. ‘మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి. అంతేగానీ మా వద్ద ఇలాంటి పైరవీలు చేయొద్దు..’అని సూటిగా స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఇటు సీఎంఓ అధికారి, అటు రిటైర్డ్ డీజీపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. నయీమ్ డైరీలో ఆ పేజీలెక్కడ..? తాను చేసిన ప్రతి పని, సెటిల్మెంట్లు, దందాలు, అందించిన నజరానాలు.. ఇలా ప్రతీ అంశాన్ని నయీమ్ తన డైరీలో రాసిపెట్టాడు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అల్కాపురికాలనీలోని అతడి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. డాక్యుమెంట్లు, ఆయుధాలు, నగదు, బంగారం వంటి వాటితో పాటు పలు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డైరీల్లో దాదాపు 22 పేజీలు మాయమవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సోదాలు చేసిన సమయంలోనే పోలీసు అధికారులు ఆ పేజీలను చించేశారా? నయీమే ఆ పేజీలను చింపేసి ఉంటాడా అన్న విషయంలో స్పష్టత లేదు. అయితే నయీమ్ భార్య, సోదరి ఇచ్చిన వాంగ్మూలాల మేరకు.. నయీమ్ తన డైరీల్లో ప్రతీ విషయం రాసుకునే వాడని, ఏ ఒక్క పేజీ కూడా చింపేవాడు కాదని చెప్పినట్టు తెలిసింది. నయీమ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని సాధారణ పనిష్మెంట్లకు గురైన ఓ సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందమే మొదటగా నయీమ్ ఇంట్లో సోదాలు నిర్వహించి డైరీలు, డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ అధికారి నేతృత్వంలోని బృందమే డైరీల్లోని పేజీలు చించేసి ఉంటుందన్న కోణంలో సిట్ విచారణ సాగిస్తోంది. నయీమ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కూడా డిలీట్ కావడం దీనికి ఆధారంగా భావిస్తోంది. సంబంధిత అధికారి, సిబ్బందిని మళ్లీ విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని సిట్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులు! ఇక నయీమ్ కేసును మూసేస్తారన్న భావన నెలకొన్న తరుణంలో ఒక్కసారిగా సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పూర్తి ఆధారాలతో డీజీపీకి నివేదిక అందించగా.. పోలీసు శాఖ చర్యలు కూడా చేపట్టింది. మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతేమిటని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తదుపరి టార్గెట్ రాజకీయ నాయకులే అని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేను ప్రశ్నించామని.. మరో ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. ఈ నలుగురితోపాటు నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్న మరో ఇద్దరు నేతలు కూడా నయీమ్తో చేసిన దందాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపించామని వెల్లడించారు. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తే వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడతామని, చార్జిషీట్లో వారి పేర్లు చేర్చాల్సి ఉంటుందని.. దీనిపై వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
మరికొందరిపైనా వేటు!
నయీమ్తో అంటకాగిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు ► మౌఖిక విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందం ► సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో ఏర్పాటుకు యోచన ► ఆరోపణలు రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు ► క్రిమినల్ కేసుల నమోదు.. ఆపై కటకటాల్లోకి.. ► 16 మంది అధికారులకు చార్జి మెమోలు సాక్షి, హైదరాబాద్: నయీమ్తో కలసి సెటిల్మెంట్లు చేసి.. సస్పెండైన ఐదుగురు పోలీసు అధికారులు, విచారణ ఎదుర్కోనున్న మరో నలుగురు అధికారులపై మౌఖిక విచారణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. నయీమ్తో కలసి వారు సాగించిన భూకబ్జాలు, వసూళ్ల వివరాలను వెలికితీసేందుకు సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. నయీమ్ కేసులో ఆయా అధికారులు మూటగట్టుకున్న ఆస్తులు, బినామీ ఆస్తులను తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణను బట్టి ఈ తొమ్మిది మంది అధికారులను జైలుకు కూడా పంపే అవకాశముందని, సర్వీసు నుంచి తొలగించేందుకు కూడా కార్యాచరణ సిద్ధమైందని పేర్కొంటున్నాయి. వివరణ.. సస్పెన్షన్.. సస్పెండైన అధికారులతో పాటు మరో 16 మంది అధికారులపైనా విచారణ ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఈ 16 మందికి సంబంధించి ఉన్న ఆధారాల ప్రకారం చార్జిమోమోలు జారీచేసినట్టు వెల్లడించారు. ఈ మెమోలకు సరైన వివరణ ఇవ్వకపోతే సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దర్యాప్తు బృందానికి ఆ నలుగురి పేర్లు ప్రస్తుతం నయీమ్ కేసులను విచారిస్తున్న చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు ఈ కేసుల భారం పెరిగిపోయింది. దీంతో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో మౌఖిక విచారణ బృందం ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తున్నట్టు తెలిసింది. నిక్కచ్చిగా వ్యవహరించే, ఒత్తిళ్లకు తలొగ్గని అధికారిని ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులను విచారించేందుకు ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ విభాగం ఐజీగా ఉన్న చారుసిన్హా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న ఐజీ శశిధర్రెడ్డి, కౌంటర్ ఇంటలిజెన్స్ డీఐజీగా ఉన్న రాజేశ్కుమార్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎస్పీ స్థాయి అధికారి సరిపోతారనుకుంటే హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్న సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేరును పోలీసు శాఖ పరిశీలిస్తోంది. ఆ అధికారులపై నిఘా సస్పెండైన ఐదుగురితో పాటు విచారణ ఎదుర్కొనే మరో నలుగురు అధికారులపై పోలీసు శాఖ నిఘా పెంచింది. ఆదేశాలు వెలువడిన దగ్గరి నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, బినామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులెవరినైనా కలిశారా.. నయీమ్ కేసుల్లో ఉన్న నిందితులెవరైనా కలిశారా అన్న అంశాలను పరిశీలించాల్సిందిగా ఇంటలిజెన్స్ విభాగాన్ని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. నయీమ్ దేశ సేవకుడు! సస్పెన్షన్కు గురైన అధికారుల్లో ఓ ఏసీపీ స్థాయి అధికారి బాహాటంగానే నయీమ్ను పొగడడం గమనార్హం. నయీమ్ దేశానికి ఎంతో సేవచేశాడని, అతడిని ఉపయోగించుకుని సీనియర్ ఐపీఎస్లు కోట్లు గడించారని పేర్కొన్నారు. వారిని వదలి తమపై పడితే.. అసలు విషయాలన్నీ బయటపెడతామని వ్యాఖ్యానించారు. నయీమ్ ఎంతో మంది ఉగ్రవాదులను పట్టించాడని.. అతడి పేరు చెప్పుకుని పదవులు పొందిన రిటైర్డ్, ప్రస్తుత ఐపీఎస్లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అలాగైతే ఆయుధాలు పట్టించిన కేసు, సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు వంటి అనేక సంచలన కేసులు తిరగదోడాల్సి వస్తుందన్నారు. అంత ధైర్యం ప్రస్తుతమున్న అధికారులకు లేదని, పోలీసు శాఖ పరువు పోతుందనే.. తమపై వేటు వేసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. -
నయీమ్లానే ఉన్నారు
కృష్ణంరాజు సతీమణి శ్యామల గ్యాంగ్స్టర్ నయీమ్ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖయ్యూం భాయ్’. కట్టా రాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియ, హర్షిత, చలపతిరావు, సుమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో భరత్ పారేపల్లి దర్శకత్వంలో పత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో కట్టా శారద చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు సాగర్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ నాగభూషణం ఆవిష్కరించారు. శ్యామల మాట్లాడుతూ– ‘‘రాంబాబుగారు అచ్చం నయీమ్లానే ఉన్నారు. టీజర్ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, భరత్కి, యూనిట్కి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘భరత్ మంచి టెక్నీషియన్ అయినా రావాల్సినంత పేరు రాలేదు. ‘ఖయ్యూం భాయ్’ ఆయనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం యాక్షన్ నేపథ్యంలో ఉంటుంది. మే రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ చిత్రం చేశా. క్వాలిటీ, ఖర్చు విషయంలో రాజీ పడలేదు’’ అని కట్టా రాంబాబు చెప్పారు. కట్టా శారద, నటుడు బెనర్జీ, నిర్మాత టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
'బండ్ల' మనిషి కాదు... తోడేలు...
హైదరాబాద్: సినీ నటుడు సచిన్ జోషి, నిర్మాత బండ్ల గణేష్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇటీవల సచిన్ జోషి తనను చంపడానికి గ్యాంగ్స్టర్ నయీమ్కు డబ్బు ఇచ్చాడని, నయీమ్ చనిపోవడంతో ప్రాణాలతో బ్రతికి పోయానని బండ్ల గణేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సచిన్ జోషి బండ్ల ఆరోపణలపై స్పందించారు. సచిన్ ముఖ్యపాత్ర పోషించిన చిత్రం వీడెవడు టీజర్ విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సచిన్, బండ్ల ఆరోపణలపై స్పందించారు. "బండ్ల మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న తోడేలు,. ఒరేయ్ పండు సినిమా సమయంలో తినడానికి తిండిలేదన్నాడు. నమ్మించి మోసం చేశాడు. అలాంటి వాడితో కలిసి వ్యాపారం చేశాను. కోర్టులో 18 కేసులు వేశాం, సుమారు 27 కోట్లు ఇవ్వాలి. తీరా అరెస్టు చేసే సమయంలో బండ్ల తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో వదిలేయాల్సి వచ్చింది". కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో ఆరోపణలు చేయడం తగదని సచిన్ విమర్శించారు. -
నయీం కేసు: నేతి విద్యాసాగర్ వాంగ్మూలం
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్టేట్ మెంట్ ను ఆదివారం సిట్ అధికారులు నమోదు చేశారు. భువనగిరి వ్యాపారి నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. సుమారు 3 గంటల పాటు విద్యాసాగర్ ను విచారించినట్టు తెలిసింది. నయీంతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే నయీంతో ఆయన వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు సిట్ దగ్గర ఆధారాలు ఉన్నట్టు సమాచారం. నయీం భార్య ఫర్హానాతో కలిసి విద్యాసాగర్ భూమి కొన్నట్టు సిట్ అధికారులు సాక్ష్యాలు సేకరించినట్టు తెలుస్తోంది. నయీమ్ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్ చేశామని సిట్ చీఫ్ గత నెలలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్పై విచారించామని, 107 మంది పోలీస్ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామని, 18 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు. త్వరలోనే మిగతా కేసుల్లోనూ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
197 కేసులు.. 125 అరెస్ట్లు
‘నయీమ్’ కేసులపై సిట్ చీఫ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్ చేశామని సిట్ చీఫ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్పై విచారించామని, 107 మంది పోలీస్ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామ ని, 18 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు. 14 మంది నయీమ్ అనుచరులపై పీడీ యాక్టులు మోపామని, వారిలో పాశం శ్రీను, సందెలా సుధాకర్, అబ్దుల్ నాసర్, బాచు నాగరాజు, పులి నాగరాజు, సారగడి హరి, కత్తుల జంగయ్య, సామ సంజీవరెడ్డి, తబ్రేజ్, గుమ్మడివాలి శ్రీనివాస్, షేక్ జహంగీర్, షేక్ జానీపాషా, షేక్ అబ్దుల్లా, మహ్మద్ ముబీన్ అలియాస్ కాలా ముబీన్ ఉన్నారన్నారు. త్వరలోనే మిగతా కేసుల్లోనూ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
‘మరో రూపంలో సంక్షోభం’
హైదరాబాద్: తమిళనాడులో బలపడేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కుట్రలు కట్టిపెట్టి, చట్టబద్ధంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నించాలని ఆయన హితవు పలికారు. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షోభం సమసి చట్టబద్ధ పాలన రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. జయలలిత అనారోగ్యం.. ఆమెను సీఎం చూడనివ్వకపోవడం, ఆ తర్వాత కేంద్రం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. సంక్షోభం ఇప్పుడు ముగిసిపోతుందని తాను భావించడం లేదని మరో రూపంలో వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పళనిస్వామి, శశికళ మధ్య సంబంధాలు మళ్లీ సంక్షోభానికి దారితీస్తాయన్నారు. గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు మూసివేయడం బాధాకరమని, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చూసైనా ఈ నిర్ణయం మార్చుకోవాలన్నారు. నయీమ్ గ్యాంగ్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. నయీమ్ కేసులో సీబీఐ విచారణ జరపాలని, అప్పుడే నిజానిజాలు బయట పడతాయని పేర్కొన్నారు. జేఏసీ చేపట్టిన కొలువుల ర్యాలీకి మద్దతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నయీమ్ కేసు మూసివేయడం దారుణమన్నారు. ఈ కేసుతో రాజకీయ నాయకులకు, అధికారులకు సంబంధం లేదనడం అర్ధ రహితమని పేర్కొన్నారు. -
నయీం ఫొటోల కలకలం.. నాయిని కామెంట్
-
ఆ డైరీతో తేలనున్న టీఆర్ఎస్ బాగోతం : చాడ
వరంగల్: నయీం డైరీని బయటపెడితే టీఆర్ఎస్ బాగోతం తెలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. నయీం ఆగడాలపై సీపీఐ ప్రత్యక్ష ఆందోళన దిగుతుందని స్పష్టం చేశారు. వరంగల్లో విలేకరులతో మాట్లాడుతూ... టిపాస్తో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో..ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో, పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలకు నిరాశ కలిగించిదన్నారు. విభజన చట్టంలోని అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. కేంద్రబడ్జెట్ పై సీఎం కేసీఆర్ నోరు విప్పాలని చాడ అన్నారు. అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చేప పిల్లల పంపిణీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నోట్లరద్దుపై కేసీఆర్ భజన మానుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ఒక మేడిపండు అని ఎద్దేవా చేశారు. సీఎం ఇలాకాలో మిషన్ భగీరథ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. -
నయీం ఫొటోల కలకలం.. నాయిని కామెంట్
విశాఖపట్నం: కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ నయీంతో పలువురు పోలీసు అధికారులు కలిసి ఉన్న ఫొటోలు వెలుగుచూడటం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం విశాటపట్నం పర్యటనకు వచ్చిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఈ విషయమై విలేకరులు ప్రశ్నించగా.. ఫొటోల ఆధారంగా నయీం కేసులో చర్యలు తీసుకోలేమని తెలిపారు. దినపత్రికల్లో వచ్చిన ఫొటోలపై తాను స్పందించబోనని పేర్కొన్నారు. సిట్ నివేదిక ఆధారంగానే నయీం కేసులో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెప్పారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి.. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు కోదండరాం అడ్డుపడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో జరుగుతున్న శారదాపీఠం వార్షికోత్సవాలకు తెలంగాణ హోంమంత్రి నాయిని హాజరయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శారదాపీఠం వనదుర్గ హోమాలతోపాటు.. స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో చతుర్వేద సంహిత మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్తోపాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో ఖాకీలపై వేటు!
-
ఖాకీలపై వేటు!
నయీమ్ కేసులో చర్యలకు ప్రభుత్వం ఆదేశం? ♦ అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సస్పెన్షన్ వేటుకు నిర్ణయం ♦ ఆ తర్వాత నోటీసులిచ్చి విచారించనున్న సిట్ ♦ జాబితాలో ముగ్గురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు.. ♦ 9 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలకూ బిగుస్తున్న ఉచ్చు ♦ నయీమ్తో సంబంధాలున్న రిటైర్డ్ అధికారులపైనా చర్యలు ♦ మరిన్ని ఆధారాలు లభించాక క్రిమినల్ కేసుల నమోదు ♦ ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ ఉద్వాసన! సాక్షి, హైదరాబాద్ గ్యాంగ్స్టర్ నయీమ్ కేసులో కీలక చర్యల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. నయీమ్తో అంటకాగిన పోలీసు అధికారులపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొంత మంది నేతలు, పోలీసు అధికారుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందన్న ఆరోపణలకు చెక్పెట్టడంతో పాటు నేరాలు, నేరస్తులపై ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకుంటుందన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాలుగు నెలలుగా సిట్ అధికారులు చేసిన దర్యాప్తు, అధికారుల విచారణకు కూడా లైన్ క్లియరైనట్లు అభిప్రాయపడుతున్నాయి. తొలుత సస్పెన్షన్ వేటు.. నయీమ్తో సంబంధాలు, దావత్లు, దందాలు నడిపించిన ఖాకీలపై తొలుత సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల జాబితా కూడా సీఎం కేసీఆర్కు అందిందని... వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని, సిట్ దర్యాప్తులో బయటపడ్డ ఆధారాలను బట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా పక్కా ఆధారాలున్న అధికారులపై సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలిపాయి. ఆయా అధికారులపై వేటు అనంతరం నోటీసులిచ్చి, పూర్తి వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు సైతం భావిస్తున్నారు. 24 మందిపై నయీమ్ ఎఫెక్ట్..! 2001 నుంచి నయీమ్ ఎన్కౌంటర్లో మరణించే వరకు అతడితో సంబంధాలు కొనసాగించిన అధికారుల జాబితా తయారైంది. అందులో ఎస్సై ర్యాంకు నుంచి నాన్కేడర్ అదనపు ఎస్పీ హోదా ఉన్న అధికారుల వరకు ఉన్నారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 9 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలు సస్పెన్షన్ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఇప్పటికే ఇద్దరు డీఎస్పీలను సిట్ సైబరాబాద్లోని కమిషనరేట్లో విచారించింది. వీరిలో ఒక అధికారి ఇటీవలి బదిలీల్లో సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల డీఎస్పీగా పోస్టింగ్ కూడా పొందారు. ఇక కీలకమైన రెండు విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు అదనపు ఎస్పీలను విచారించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న మరో డీఎస్పీని, భద్రతా విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి ఈ జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సంభాషణల్లో గుట్టు! హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఓ డీఎస్పీ (ఏసీపీ), ట్రాఫిక్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ నయీమ్తో పదేపదే సంభాషణలు సాగించినట్టు సోదాల సందర్భంగా లభించిన ఆడియో సీడీల ద్వారా వెల్లడైనట్లు సమాచారం. ఇక పైఅధికారుల ఒత్తిడితో పాటు ఉడతా భక్తిగా చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసిన ఇన్స్పెక్టర్లు, ఎస్సైలపైనా వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులకు ఉద్వాసన కూడా పలికే అవకాశముందని సమాచారం. నిఘా విభాగంలో పనిచేస్తున్న ఆ ఇద్దరు రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆధారాలుంటే క్రిమినల్ కేసులు నయీమ్తో సంబంధాలున్న 24 మంది పోలీసు అధికారుల్లో 12 మందిని సిట్ పూర్తిస్థాయిలో విచారించించింది. అయితే పక్కాగా ఆధారాలు లభించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే జరిగితే సిట్ జాబితాలో ఉన్నవారిలో సగానికి పైగా జైలుకెళ్లక తప్పదని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ నేతలకు ఝలక్ తప్పదా? ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులకు కూడా నయీమ్ ఎఫెక్ట్ తీవ్రంగానే పడే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. వారిలో ఒక ప్రజాప్రతినిధి నిత్యం నయీమ్తో మాట్లాడటం, సెటిల్మెంట్లలో ‘భాయ్తో లొల్లి వద్దు’అంటూ బెదిరించినట్లుగా రికార్డులు సిట్ బృందాలకు లభించాయి. మరో ప్రజాప్రతినిధి తనకెలాంటి సంబంధంలేదని చెబుతున్నా... నయీమ్తో ఆయన తుక్కుగూడ ఫాంహౌస్లో డ్యాన్స్లు చేసిన వీడియో, గోవా బీచ్లో దిగిన ఫొటోలు పక్కా ఆధారాలుగా నిలవబోతున్నాయి. దీంతో వీరిద్దరిపై అధికార పార్టీ వేటు వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి ముందే ఆదేశాలు నయీమ్తో సంబంధాలున్న పోలీసు అధికారులపై వేటు వేయాలని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ప్రజాసమస్యలపై సభలో చర్చ జరగాల్సి ఉండటం, బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులపై వేటు వేయాలంటూ ఆదేశాలు కూడా వెళ్లాయని.. ఈ మేరకు జాబితాపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారనే చర్చ జరుగుతోంది. -
రాజమహేంద్రవరంలోనూ ఓ ‘నయీం’ ముఠా
తప్పుడు డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల స్థలం రిజిస్ట్రేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థల యజమాని దందాలో భాగస్వాములుగా టీడీపీ నేతలు 20 రోజులుగా అజ్ఞాతంలో నిందితులు ముందస్తు బెయిల్ వచ్చిందనుకుని బయటకు వచ్చిన కొందరు ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి, మరొకరి అరెస్టు సాక్షి, రాజమహేంద్రవరం : చారిత్రక నగరం రాజమహేంద్రవరంలోనూ ఆస్తులను కుతంత్రంతో కబ్జా చేసే నయీం తరహా ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. యజమానికి తెలియకుండా తప్పుడు డాక్యుమెంట్లలో రాజమహేంద్రవరం రంభ, ఊర్వశి, మేనక థియేటర్ కాంప్లెక్స్కు సమీపంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఇంటి పక్కన రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన స్థల యజమాని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దందాలోటీడీపీ నేతలు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నేతలు, నగరంలో వ్యాపార సంఘాల నేతలు భాగస్వాములుగా ఉన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వీరందరిపై సెక్షన్ 420, 120–బి, రెడ్విత్ 34 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉంటున్న బండారు వెంకటరమణ కుటుంబానికి సూరాబత్తుల వీధి ( కూరగాయల మార్కెట్ నుంచి టౌన్హాల్కు వెళ్లేదారి)లో 356 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో 1995 వరకు ఇల్లు ఉంది. పూర్వం ఆ ఇల్లు బ్రహ్మముడి సుబ్బయ్య, ఆయన సతీమణి లక్ష్మమ్మల స్వార్జిత ఆస్తి. వీరి పేరుపై 1904 ఏప్రిల్ 8న రిజిస్టరైన డాక్యుమెంట్ ఉంది. వీరి నలుగురు కుమారులు వరదరాజులనాయుడు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, వీరాస్వామిలకు ఈ ఆస్తిపై 1/4 వంతున హక్కు ఉన్నట్టు సంయుక్త డాక్యుమెంట్ ఉంది. కాగా, వెంకటరమణ తల్లిదండ్రులు బండారు సుబ్బారావు, సత్యవతి 1977కు పూర్వం వారికి వివాహం జరిగినప్పటి నుంచి ఆ ఇంటిలో నివాసం ఉంటూ అద్దెను నలుగురు హక్కుదారులకు చెల్లించేవారు. మూడు వాటాలు కొనుగోలు చేసిన సత్యవతి హక్కుదారుల్లో సత్యనారాయణ సతీమణి సీతాబాయి, వీరాస్వామి కుమారులు సుబ్బయ్య, బాలాజీరావులు, మూడో హక్కుదారుడు కృష్ణమూర్తి తమకున్న 1/4 వాటాలను కలపి 3/4 వాటా ఆస్తిని 1978 జూ¯ŒS 22న రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బండారు వెంకటరమణ తల్లి సరస్వతి పేరుమీద రిజిస్టర్ చేశారు. మిగతా 1/4 వాటాకు హక్కుదారైన వరదరాజులనాయుడు సతీమణి తాయారమ్మ, కుమారులు పార్థసారథి, రామచంద్రన్, ఆదికేశవులనాయుడు, పద్మనాభంలు 1980 ఆగస్ట్ 23న తమ వాటాను కూడా సత్యవతికి విక్రయిస్తామని చెప్పి రూ.1000 అడ్వాన్స తీసుకుని ఒప్పందపత్రం రాయించుకున్నారు. అయితే తదుపరి ఆ పక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచీ ఈ ఇంటికి సంబంధించిన మొత్తం ఆస్తిపన్నును సత్యవతి పేరుమీద నగరపాలక సంస్థకు వెంకటరమణ చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మార్చి వరకు కూడా పన్నులు చెల్లించారు. పలుమార్లు రిజిస్ట్రేషన్ విషయమై వరదరాజులనాయుడు కుమారులను సంప్రదించారు. అయినా ఫలితం లేకపోవడంతో లాయర్ ద్వారా నోటీసులు కూడా పంపారు. 1995లో భవనం శిథిలమైపోవడంతో ఆ ఇంటిని ఖాళీ చేశారు. 2014లో నగరపాలక సంస్థ ఆదేశాల మేరకు దానిని కూల్చివేయించారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ... ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం విలువ రూ.లక్షకు పైగా పలుకుతోంది. 356 గజాల విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుంది. దీంతో 1/4 వాటా హక్కుదారుడైన వరదరాజులనాయుడు కుమారుల్లో ఆదికేశవులనాయుడు, పద్మనాభంల తరఫున పద్మనాభం వియ్యంకుడు పుచ్చకాయల త్రిమూర్తులుతో కలసి పద్మనాభం 2015లో రంగంలోకి రు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరువర్గాలు రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు వద్దకు చేరారు. అందరు కలసి రౌతు నివాసంలో సమావేశమైయ్యారు. 1980లో చేసిన అగ్రిమెంట్ ధర కాకుండా, ప్రస్తుత మార్కెట్ ధర కాకుండా మధ్యస్తంగా రౌతు, ఆకుల నిర్ణయించిన రేటుకు 1/4 వాటాను విక్రయించేందుకు నిర్ణయించగా ఇరు వర్గాలు సమ్మతించాయి. పదిరోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి పద్మనాభం, ఆయన వియ్యంకుడు వెళ్లిపోయారు. కుట్ర ఇలా చేశారు.. పెద్దమనుషులు చెప్పిన రేటుకు ఒప్పుకుని వెళ్లిపోయిన పద్మనాభం, ఆయన వియ్యంకుడు పుచ్చకాయల త్రిమూర్తులు అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేయలేదు. తమ వాటాను ఇతరులకు విక్రయించేందుకు వారు రాజమహేంద్రవరానికి చెందిన లంకా వెంకట అప్పారావు, కె.బ్రహ్మాజీరావు, ధవళ్వేరానికి చెందిన కాంగ్రెస్ నేత దంగుడుబియ్యం నారాయణ, రావులపాలేనికి చెందిన సత్తార్ కలసి మొత్తం ఆస్తిని కాజేసేందుకు తప్పుడు డాక్యుమెంట్ల సృష్టించారు. 2016 అక్టోబర్ 6న వెంకటరమణ తల్లి సత్యవతి పేరుపై ఉన్న మూడు భాగాల ఆస్తితో కలిపి మొత్తం నాలుగువాటాల ఆస్తిని ఆకుల సాయిబాబా, షేక్ మీరాసాహెబ్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావు, తలశెట్ల నాగరాజు, మట్టా నరసింహరాజు, మద్దు శ్రీనివాస్, లంకా వెంకట అప్పారావు, దంగుడుబియ్యం నారాయణ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకు పద్మనాభం కోడలు పుచ్చకాయల త్రిమూర్తులు కుమార్తె బ్రహ్మముడి ప్రభావతి, కె.బ్రహ్మాజీరావు సాక్షి సంతకాలు చేశారు. ఆస్తిలో 1/4 వాటా మాత్రమే పద్మనాభంకు చెందిందని, మిగతా మూడూ వెంకటరమణకు చెందినదని డాక్యుమెంట్లు సృష్టించిన వారికి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికీ తెలుసు. అయినా కుట్రపూరితంగా ఆస్తిని కాజేసేందుకు వ్యూహం పన్నారు. అజ్ఞాతంలో నిందితులు.. జరిగిన వ్యవహారాన్ని తెలుసుకున్న బండారు వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడంతో రిజిస్ట్రేష¯ŒS చేసేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వారు, ఆ ఆస్తి గురించి తెలిసీ కుట్రపూరితంగా రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్న వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. బెయిల్ వచ్చిందనుకుని ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆర్యాపురం బ్యాంకు వెళ్లిన ఆ బ్యాంకు డైరెక్టర్ పోలాకి పరమేశ్వరరావుని, మెయి¯ŒSరోడ్డులో దుకాణంలో ఉన్న ఆకుల సాయిబాబాను ఎస్సై సీహెచ్ రాజశేఖర్ అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మిగతా నిందితులు మాత్రం ఇంకా బయటకు రాలేదు. -
నయీమ్ కేసును సీబీఐకి ఇవ్వండి
శాసనమండలిలో షబ్బీర్ అలీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శుక్రవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ‘నయీమ్ ఎన్కౌంటర్’అంశం చర్చకు వచ్చింది. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసు వివరాలు, పురోగతి సభకు చదివి వినిపించారు. దీనిపై విపక్ష నేత షబ్బీర్ అలీ చర్చకు దిగారు. సిట్ నుంచి కేసును సీబీఐకి ఎందుకు బదిలీ చేయాలో ఆయన మండలి చైర్మన్కు వివరించారు. ‘నయామ్ ఎన్కౌంటర్ను ఎవరూ తప్పుపట్టటం లేదు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో ఏకే 42 ఆయుధం దొరికింది. ఇది మిల్ట్రీ పరిధిలోకి వస్తుంది. నయీం ఇంట్లో దాదాపు రూ.1,000 కోట్ల నగదు బయట పడిందని అంటున్నారు. ఈ డబ్బు హవాలా డబ్బా? మనీ ల్యాండరింగ్దా? అనే విషయం తేలాలి అంటే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్) అధికారులు దర్యాప్తు జరపాలి. నయీమ్ మహిళలను విదేశాలకు ఎగుమతి చేసేవాడని, స్రోబుద్దీన్తో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కన ఇంటర్పోల్ అధికారుల సహాయం అవసరం. నయీమ్ నరహంతక కార్యకలాపాలు నాలుగు ఐదు రాష్ట్రాల్లో విస్తరించినట్టు చెబుతున్నారు. మన పోలీసులకు ఇతర రాష్ట్రాల పోలీసులు సహకరించకపోవచ్చు. ఈ కేసులో ఒక డీజీపీ స్థాయి అధికారికి కూడా సంబంధం ఉందని అంటున్నారు. స్థాయిలో తక్కువగా ఉన్న అధికారి తన అత్యున్నత అధికారిని ఎలా ప్రశ్నిస్తారు? ఇన్ని సమస్యలు ఉన్నందునే కేసును సీబీఐకి అప్పగించాలి’అని షబ్బీర్ అలీ కోరారు. -
‘రాజకీయ అవసరాల కోసమే నయీమ్ కేసు’
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొసాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నయీమ్ కేసులో సంబంధాలు ఉన్న వారిని వదిలి పెట్టేది లేదని సీఎం కేసీఆర్ అన్నారని, కానీ ఇప్పుడు హోమ్ శాఖ కోర్టుకు ఇచ్చిన రిపోర్టు విరుద్ధంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని.. సిట్ విచారణ జరుగుతుందని లీకు ఇచ్చారన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ కు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. నయీమ్ కేసును రాజకీయ అవసరాల కోసం వాడుకున్నట్టుగా ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల బండారం పడుతుందనే ప్రభుత్వం నయీమ్ కేసును నీరు కారుస్తుందని మండిపడ్డారు. కేసును సీబీఐ కు అప్పగిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని జీవన్ రెడ్డి తెలిపారు. -
నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు
-
నయీం కేసు : జైలు అధికారులపై చర్యలు
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం కేసును సీరియస్గా తీసుకున్నామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. నయీం కేసులో అరెస్టైన నిందితులకు రాజభోగాలు కల్పించిన అధికారులపై జైళ్ల శాఖ తాజాగా చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ ఘటనలో వరంగల్ జైలు మాజీ జైలర్ గోపిరెడ్డిని సస్పెన్షన్ చేయగా మరో కొంతమంది అధికారులకు బుధవారం మెమాలు జారీ చేసింది. మెమోలు అందుకున్న వారిలో వరంగల్ రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, మాజీ సూపరింటెండెంట్ న్యూటన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డి.ఎం శ్రీనివాస్, డిప్యూటి జైలర్ సుభాష్ సహా మరో నలుగురు వార్డెన్లు ఉన్నారు. -
నయీం కేసు సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదు
-
నయీం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లు: కేసీఆర్
నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మొత్తం 27 హత్య కేసుల్లో నయీం పాత్రను పోలీసులు గుర్తించారని, మరో 25 కేసుల్లో అతడి ముఠా పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో భాగంగా మూడోరోజు నయీం వ్యవహారంపై చర్చలో ఆయన పాల్గొని ముందుగా ఒక ప్రకటన చేశారు. ఆగస్టు 8వ తేదీన నయీంను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిపారు. నయీం నేరప్రవృత్తిని సీరియస్గా తీసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు కోసం సిట్ను నియమించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 174 కేసులు నమోదయ్యాయని, 741 మంది సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో నయీం ముఠాకు సంబంధించిన స్థావరాలలో పోలీసులు సోదాలు చేశారని తెలిపారు. మొత్తం 2.95 కోట్ల నగదు, 21 కార్లు, 21 తుపాకులు, 26 బైకులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నయీం బంధువుల పేరు మీద ఉన్న దాదాపు 1015 ఎకరాల భూమిని, లక్షా 67వేల చదరపు గజాల విస్తీర్ణం గల ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. నయీం కేసులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశారని, త్వరలో మరో 15 చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. నయీం ముఠా అంతంతో ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారని ఆయన అన్నారు. -
నయీం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 143 కోట్లు
-
తెలంగాణ అసెంబ్లీలో 'నయీం' ప్రకంపనలు?
సోమవారం అసెంబ్లీలో చర్చకు నిర్ణయం వాడీవేడి చర్చ జరిగే అవకాశం హైదరాబాద్: కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్, అనంతర పరిణామాలు తెలంగాణలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంగకాగి.. భూ దందాలు చేసినట్టు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సిట్ చేపడుతున్న దర్యాప్తులోనూ నయీంతో రాజకీయ నాయకులతో సంబంధాలపై పలు ఆధారాలు లభించినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ అసెంబ్లీలో నయీం అంశంపై కీలక చర్చ జరగబోతున్నది. ఈ చర్చ సందర్భంగా నయీంతో సంబంధాల విషయంలో అధికార-ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో సభ దద్దరిల్లే అవకాశముందని భావిస్తున్నారు. -
నయీమ్కు గోకుల్ బ్యాంక్ సొమ్ము?
♦ రూ.3.4 కోట్లు అందించిన మాజీ చైర్మన్ ♦ సీసీఎస్ను ఆశ్రయించిన టీఎస్ ఐటీ విభాగం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ–సేవ, మీ–సేవ కార్యాలయాల ద్వారా వసూలైన ప్రభుత్వ సొమ్ములో రూ.3.4 కోట్లు దుర్వినియోగమయ్యాయి. దాదాపు ఏడాది క్రితం చోటు చేసుకున్న ఈ కుభకోణంపై తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు గతవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఈ గోల్మాల్ వెనుక ‘నయీమ్ కోణం’ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధీనంలో పనిచేస్తున్నాయి. వివిధ రకాల పౌరసేవలకు సంబంధించి ఈ కేంద్రాల్లో వసూలైన మొత్తాలను ఐటీ విభాగం గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లోని తమ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల ఐటీ విభాగం వివిధ కార్యకలాపాలకు సంబంధించి రూ.3 కోట్లకు పైగా చెక్కులు జారీ చేసింది. ఇవన్నీ బౌన్స్ కావడంతో ఆరా తీయగా.. గోల్మాల్ వ్యవహారం బయట పడింది. దీనిపై ఐటీ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి ఐటీ విభాగం–గోకుల్ బ్యాంక్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో నయీమ్ కోణం వెలుగుచూసింది. గతంలో ఈ బ్యాంక్కు చైర్మన్గా వ్యవహరించిన చీమల జగదీష్ యాదవ్ను నయీమ్ 2014లో కిడ్నాప్ చేశాడని, ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రాంతంలో బంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని తేలింది. ఈ నేపథ్యంలోనే జగదీష్ యాదవ్.. బ్యాంక్లోని ఐటీ విభాగానికి చెందిన నగదు నుంచి రూ.3.4 కోట్లు వివిధ దఫాలుగా నయీమ్కు చెల్లించినట్లు ఉత్తరప్రత్యుత్తరాల్లో వివరించినట్లు సమాచారం. తాను బెల్లి లతితకు అనుకూలంగా ఉండడం.. ఆమె హత్యానంతరం అంతిమయాత్రలో పాల్గొనడంతో పాటు నయీమ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తన కిడ్నాప్ జరిగిందని ఈ సందర్భంగా జగదీష్ పేర్కొన్నట్లు తెలిసింది. నయీమ్ బతికున్నంత కాలం ఈ విషయాన్ని బయటపెట్టని జగదీష్.. అతడి ఎన్కౌంటర్ తర్వాత సిట్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ప్రభుత్వం గోకుల్ బ్యాంక్ చైర్మన్ సహా డైరెక్టర్లను ముందే తొలగించడానికి ఈ కుంభకోణమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంక్ కార్యకలాపాలు ప్రత్యేక అధికారి నేతృత్వంలో జరుగుతున్నాయి. ఐటీ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగదీష్ యాదవ్ సహా ఇతర డైరెక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. నగదు ఏమైంది? ఎక్కడకు వెళ్లింది? అనే అంశాలు గుర్తించాల్సి ఉందన్నారు. మాజీ చైర్మన్ జగదీష్ యాదవ్ చెబుతున్న కారణాలు వాస్తవమే అయినప్పటికీ.. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం నేరమేనని ఆయన స్పష్టం చేశారు. 1996లో ఏర్పడిన గోకుల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు జగదీష్ యాదవ్ 2012లో చైర్మన్ అయ్యారు. -
‘ఒక్క ఎన్కౌంటర్తో 100 మంది నయీంలు’
యాదాద్రి భువనగిరి: గ్యాంగ్స్టర్ నయీంను ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ ప్రభుత్వం వంద మంది నయీంలను తయారు చేసిందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు. నయీంతో సంబంధాలు నెరిపిన ముఖ్య నాయకులను అరెస్టు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. భువనగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీం కేసును సీబీఐకి అప్పగించి, నిష్పక్షపాతంగా విచారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హోం మంత్రి నాయిని కేవలం ప్రారంభోత్సవాలు చేయటం వరకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నయీం కేసును నీరుగారిస్తే ఊరుకోబోమని, త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. -
మళ్లీ తెరపైకి వచ్చిన నయీం గ్యాంగ్
-
నయీం గ్యాంగ్తో కుమ్మక్కు: జైలర్పై వేటు
హైదరాబాద్: వరంగల్ కేంద్ర కారాగారంలో పనిచేస్తోన్న మరో అధికారిపై బదిలీ వేటు పడింది. ఇద్దరు ఖైదీల పరారీ ఘటనకు బాధ్యులుగా పలువురు ఉన్నతాధికులు, సిబ్బందిపై సస్పెన్షన్, బదిలీ వేటు పడగా, తాజాగా నయీం గ్యాంగ్తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో జైలర్ గోపి రెడ్డిని బదిలీచేశారు. నయీం గ్యాంగ్కు చెందిన పాశం శ్రీను, సుధాకర్లు ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలుగా ఉన్నారు. ఈ క్రమంలో జైలర్ గోపి రెడ్డి ఖైదీల నుంచి డబ్బులు తీసుకుని వారికి అదనపు సౌకర్యాలు కల్పించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. చివరికి ఆ ఆరోపణలన్నీ నిజమేనని రుజువు కావడంతో జైలర్ గోపి రెడ్డిపై బదిలీ వేటు పడింది. అంతేకాదు, జైలర్ వ్యవహారంపై విచారణ జరపాలని నయీం కేసును విచారిస్తున్న సిట్కు లేఖ రాసినట్లు జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు. నవంబర్ మొదటి వారంలో వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఒక్కొక్కటిగా చోటుచేసుకుంటున్న పరిణామాల్లో ఉన్నతాధికారులతో పాటు జైలులో కింది స్థాయి సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నారు. జైలు సూపరింటెండెట్ న్యూటన్ను బదిలీ చేయగా, ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో ఖైదీలకు సహకరిస్తూ జైలును, జైలు భద్రతను అప్రతిష్టపాలు చేయాలని భావించిన ఇద్దరు వైద్యులపై వేటు వేసింది. మరో వైద్యుడిపై పూర్తి స్థాయి నివేదికకు ఆదేశించింది. ఇప్పుడు జైలర్ను బదిలీ చేశారు. -
నయీం కేసులో ఆయనకు ఏదైనా జరిగితే...
► ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను ఇరికించే కుట్ర ► సీఎం అభ్యర్థిని బాబు కనీసం పట్టించుకోవడంలేదని మండిపాటు ► బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు గౌడ్ తెనాలి : బీసీల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను నయీం కేసులో ఇరికించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయనకు ఏదైనా జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీసీ నేత పేరం శివనాగేశ్వరరావు గౌడ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం స్థానానికి అర్హుడని ఆయన్ను ఎన్నికల్లో పోటీచేయించి, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, కనీసం ఆయన్ను ప్రతిపక్ష నేతగా చేయలేదని గుర్తుకు చేశారు. తాజాగా కృష్ణయ్యను నయీంకేసులో ‘సిట్’ విచారించిందన్నారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్రెడ్డికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు.. విలువలకు కట్టుబడిన ఆర్.కృష్ణయ్య సమస్యను పట్టించుకోవాలన్నారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కల్పనకు తగిన మద్దతును కూడగట్టేందుకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఈ నెల 16న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్ణయించినట్టు చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతును కోరనున్నట్టు తెలిపారు. తద్వారా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కల్పన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వీలుగా తగిన కార్యక్రమాన్ని రూపొందించుకోనున్నామని వివరించారు. దేశంలో 2600 కులాలంటే ఎస్సీలు 16 శాతం, ఎస్టీలు ఏడు శాతం, ఓసీలు ఏడు శాతం ఉన్నట్టు ఆయన గుర్తుచేశారు. జనాభాలో బీసీలు 58 శాతంగా ఉంటే, ఏడు శాతమున్న ఓసీలు 60 శాతం లబ్ధిని పొందుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిశ వెంకటేశ్వరరావు, స్థానిక బీసీ నేతలు పాల్గొన్నారు. -
‘నయీంతో నాకు ఏ లింక్ లేదు’
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, నయీం డ్రైవర్ శామ్యుల్ను సిట్ అధికారులు సోమవారం ప్రశ్నించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ విచారణ కొనసాగింది. కాగా నయీం కేసులో నేడో, రేపో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సిట్ అధికారులు పలువురు రాజకీయ నేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా రవీందర్ రెడ్డి 1995 -1997 వరకూ చౌటుప్పల్ సీఐగా, 1997 -2000 వరకూ భువనగిరి డీఎస్పీగా, 2003-2004 వరకూ నల్లగొండ డీఎస్పీగా పని చేశారు. సిట్ అధికారుల విచారణ అనంతరం రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తాను భువనగిరి డీఎస్పీగా పని చేస్తున్న సమయంలో నయీం అక్కడే జైల్లో ఉన్నాడని, వృత్తిపరంగా రెండుసార్లు అతడిని కలిసినట్లు తెలిపారు. తాను భువనగిరిలో పని చేసిన సమయంలో నయీం గ్యాంగ్ అంటూ ఎవరు లేరని అన్నారు. నయీంతో భూ సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తనకు హైదరాబాద్లో అంగుళం భూమి కూడా లేదని, నిజామాబాద్లో భూములు ఉన్నట్లు తెలిపారు. తనకు తెలిసిన సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపానని, ఇతర పోలీస్ అధికారులు, నేతల గురించి తననేమీ అడగలేదని చెప్పారు. -
‘నయీంతో నాకు ఏ లింక్ లేదు’