‘‘నయీమ్ 1986లో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పట్నుంచే నా వద్దకు వచ్చేవాడు. విద్యార్థి సంఘాలతో కలసి చేసే ఉద్యమాలకు నేను నాయకత్వం వహించేవాడిని. అప్పట్నుంచే నయీమ్ నాకు శిష్యుడయ్యాడు. నన్ను గురువుగా భావించేవాడు. కానీ ఆ తర్వాత కార్యక్రమాలకు నాకు సంబంధం లేదు. గుడికి పోయే వాళ్లు ఎవరు, ఏంటని చూడనట్టే.. సమస్యలపై నా దగ్గరికి వచ్చే వాళ్లను కూడా నేను వ్యక్తిగత విషయాలు అడగను’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గ్యాంగ్స్టర్గా నయీమ్ చేసే దందాలు, సెటిల్మెంట్లు, ఇతర నేరాలతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం తనను ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.