విమాన ప్రయాణమంటే రోజురోజుకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్కు చెందిన విమానం కూలిపోయింది. ఈ విమానంలో 47 మంది ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ ఎయిర్లైన్స్కు చెందిన పీకే-661 విమానం చిత్రాల్ నగరం నుంచి ఇస్తామాబాద్కు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో అబోటాబాద్ సమీపంలో రాడర్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి.