జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిర్ణయించుకున్న శశికళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోయెస్ గార్డెన్స్ నుంచి బయల్దేరిన ఆమె.. ముందుగా మెరీనా బీచ్లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి, అక్కడ ప్రదక్షిణలు చేసి, మూడుసార్లు సమాధికి మొక్కి మరీ అక్కడి నుంచి బెంగళూరు బయల్దేరారు. అయితే సాధారణంగా ఆ సమయంలో ఎవరైనా నమస్కారం మాత్రమే పెడతారు. కానీ శశికళ మాత్రం అరచేత్తో సమాధి మీద కొట్టినట్లు చేశారు.