గోనెసంచిలో వ్యక్తి మృతదేహం | UnIdentified Deadbody Found in Visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 29 2015 10:47 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM

విశాఖ జిల్లాలోని గోపాలపట్నం మండలం కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement