తిరుపతి నగరాన్ని మద్యపాన రహిత నగరంగా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని డీఆర్ మహల్ జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ మహాధర్నాకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు.