ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తానికి జ్వరం వచ్చినా, కామినేని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోగ్య శాఖమంత్రి కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో అని, ఆయనకు బీపీ చూడటం కూడా రాదని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనంతా కమీషన్లు, వాటాలు, కేసులేనని ఆయన ఎద్దేవా చేశారు. వస్తువులకు లోకల్ ట్యాక్స్ల్లా, ఏపీలో లోకేశ్ ట్యాక్స్ల పేరుతో వసూలు చేస్తున్నారంటూ మేరుగ మండిపడ్డారు.
Published Mon, Sep 19 2016 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement