సొంతగడ్డపై గత టెస్టు సీజన్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా రేపు (బుధవారం) శ్రీలంక గడ్డపై గాలే టెస్టుతో కొత్త సీజన్ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా మంగళవారం కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 'ఆల్ రౌండర్లకు జట్టులో ఎప్పుడూ చోటుంటుంది. అదనపు ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ ఉంటే జట్టుపై ఒత్తిడి తగ్గుతుంది. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు జట్టుకు నిజంగానే ఓ వరం.