అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. తాజాగా ఈ మూవీ టీజర్ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్ర జీవితంలోని ఏ అంశాలను టీజర్లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్లో కీర్తి సురేష్, సుమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.