గుంటూరు నుంచి అనంతపురం వరకు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాతలు ఆందోళనలో ఉంటే చంద్రబాబు అమెరికా వెళ్లారు. అక్కడ ఈ పెద్దమనిషి రైతుల గురించి ఉపన్యాసం చేస్తారట. అది సేంద్రీయ వ్యవసాయంపై ప్రసంగం చేస్తారట. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మలను సైతం మోసం చేశారు. చంద్రబాబు ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నారయణ, చైతన్య స్కూళ్లు రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. చదువులకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుంటే ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 30 వేలు మాత్రమే ఇస్తున్నారు.