విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు, నాయకుడు లక్ష్మీపతి రాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీరాజును మాణిక్యాల, విష్ణుకుమార్, వీర్రాజు, పురంధేశ్వరిలు సముదాయించారు. ఇదిలాఉంటే, సమావేశం ప్రారంభమైన అరగంటకే మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాంగణం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇంతకీలకమైన భేటీలో పాల్గొనకుండా పోవటమేమిటని కొందరు నాయకులు వాపోయారు.