కచ్చలూరు బోట్ ప్రమాద ఘటనలో ఫైర్ సిబ్బంది అందించిన సేవలు గొప్పవని హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సుర్యాబాగ్లోని మోడల్ ఫైర్ స్టేషన్ను హోంమంత్రి సుచరిత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అగ్నిమాపకశాఖను మరింత పటిష్టం చేసి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని సుచరిత పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు.