ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి సోమవారం కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ను కలిశారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించొద్దని, ఇతర కాలేజీల్లో విద్యార్థులను రీలొకేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.