రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్ సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కోణంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజేశ్ను మటన్ సూప్ అడ్డంగా పట్టించింది. కాగా యాసిడ్ దాడి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది తమ కుమారుడు సుధాకర్ రెడ్డి కాదని మొదటి నుండే అతని కుటుంబసభ్యులు అనుమానిస్తూ వచ్చారు.