Swathi
-
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేసింది. యాంకర్గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
దృశ్యం సినిమాను తలపించిన స్వాతి కేసు
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్ కేసు కాస్త విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ.. ముక్కలై గోనె సంచిలో తేలింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చగా.. డబ్బే అందుకు ప్రధానకారణమని తేలింది.జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం.. స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీరభద్రం భార్యతో స్వాతికి గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పీఎస్లో స్వాతిపై కేసు నమోదైంది. అయితే ఈ విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా.. ఆమె కనిపించడం లేదనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు.. అతని నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో విచారించగా.. స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం నేరం ఒప్పుకున్నాడు. ఈపై ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు. మొత్తం డబ్బు తనకే ఉండాలని.. గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు.. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి నమ్మబలికింది. వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసి వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే ఎంతకీ వాళ్ల నుంచి బదులు లేకపోవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించారు ఆ భార్యభర్తలు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. -
తాను అత్తారింటికి వెళ్లిపోతే అమ్మకు కష్టమని, బిడ్డ షాకింగ్ నిర్ణయం
కాకినాడ క్రైం: కాకినాడలో తల్లీకుమార్తెల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథపురం పెంకేవారి వీధిలో శ్రీదుర్గానివాస్ పేరుతో జీప్లస్ వన్ భవనం ఉంది. దానిలోని కింద అంతస్తులో ఆకాశం సరస్వతి (60), ఆమె కుమార్తె స్వాతి (28) ఉంటున్నారు. సరస్వతి భర్త 16 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వివాహిత అయిన పెద్ద కుమార్తె విశాఖపట్నంలో ఉంటోంది. చిన్న కుమార్తె స్వాతి టైలరింగ్ చేస్తూ సరస్వతిని పోషిస్తోంది. కాగా.. వీరి ఇంటి నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో పైఅంతస్తులో ఉన్నవారు గమనించి ఇంటి యజమాని గుర్రాల శ్రీనివాస్కు చెప్పారు. ఆయన సమాచారంతో సీఐ నాగదుర్గారావు, బృందం అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల సరస్వతి మంచంపై పడి చనిపోయి ఉంది. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. వీరిద్దరూ కలిసి ఉరి వేసుకోగా, బరువుకు చీర తెగిపోయి సరస్వతి మంచంపై ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాగదుర్గారావు తెలిపారు.తల్లికి అనారోగ్యంసరస్వతి కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. స్వాతి ఆమెను కాకినాడ జీజీహెచ్లో చేర్చి వైద్యం చేయించింది. తల్లి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండడంతో స్వాతి మనోవేదనకు గురయ్యేది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఏమైపోతుందోనని బాధపడుతూ ఉండేది. ఈ కారణంతోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పొరుగున ఉన్న మహిళ దుస్తులను కుట్టించుకునేందుకు స్వాతి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లీకుమార్తెలిద్దరూ నవ్వుతూనే మాట్లాడారు. ఆదివారం పాలు వేసే వ్యక్తి వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్తో అటు ఆర్జేగా ఇటు సోషల్మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్స్టాగ్రామ్లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
పటాన్చెరు టౌన్: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రవీందర్ రెడ్డి, పటాన్చెరు సీఐ ప్రవీణ్రెడ్డి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు చెందిన స్వాతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చింది. గతేడాది అక్టోబర్లో భర్త కుమార్ మృతి చెందాడు. వీరికి విష్ణువర్ధన్ (8)అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో స్వాతి ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్తో కలసి ఉంటోంది. మూడు నెలల నుంచి వీరు పాత రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లి వ్యవహార శైలిపై కొడుకు నిలదీసేవాడు. ఈ క్రమంలో 10వ తేదీన తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని కోపం పెంచుకున్న స్వాతి తాగిన మైకంలో కొడుకు గొంతు నులిమి హత్య చేసింది. అనిల్కు తన కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మబలికింది. ఇద్దరూ కలసి మృతదేహాన్ని అదేరోజు రాత్రి పటాన్చెరు మండలం ముత్తంగి సర్వీస్ రహదారి పక్కన పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు పాత రామచంద్రపురానికి చెందిన బాలుడని తేలడంతో పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల భయంతో స్వాతి, అనిల్ శుక్రవారం రాత్రి వారు ఉంటున్న గదిని ఖాళీ చేసేందుకు రాగా పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో కొడుకును తానే హత్య చేసినట్లు విచారణలో స్వాతి ఒప్పుకోవడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
మంచిర్యాల: కొత్త సంవత్సరం సందర్భంగా ప్రార్థనల్లో చర్చికి వెళ్తున్న తల్లీకూతురుపైకి లారీ మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. జాతీయ రహదారి దాటుతుండగా ఇద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వరి చర్చి సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. మందమర్రి సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని నస్పూర్కు చెందిన వేల్పుల నిర్మల(44), వేల్పుల స్వాతి(21) ప్రార్థనల కోసం కాసిపేట సమీపంలోని కల్వరి బయల్దేరారు. చర్చి సమీపంలో రాత్రి వాహనం దిగి రోడ్డు దాటుతుండగా మందమర్రి నుంచి బెల్లంపల్లి వైపునకు వెళ్తున్న బొలేరో వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ చర్చి సమీపంలోనే ఘటన జరుగడంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న వారిని 108లో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుల వద్ద ఉన్న బ్యాగ్లో లభించిన ఆధార్కార్డు ఆధారంగా మృతులు నస్పూర్కు చెందిన వారిగా గుర్తించారు. ఇదిలా ఉండగా ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు సీఐ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవి చదవండి: ఆర్టీసీ బస్సు, డీసీఎం ఘోర రోడ్డు ప్రమాదం! పొగ మంచు, అతివేగమే కారణమా? -
మహిళా కానిస్టేబుల్ మృతి! భర్తే హత్య చేశాడా?
ఖమ్మం: ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్ ఎస్ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్నగర్గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇవి చదవండి: కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా నిర్బంధం -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
చిన్నారిని చిదిమేసిన కారు.. శోకసంద్రంలో తల్లిదండ్రులు..
రాజన్న సిరిసిల్ల: మండలంలోని గాజులపల్లిలో ఆరేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు చిదిమేసింది. ఈ ప్రమాదంలో చుట్టపుచూపుగా వచ్చిన చిన్నారి మృతితో గాజు లపల్లిలో విషాదం నిండింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణానికి చెందిన కొట్టెం పద్మ–రామారావు దంపతుల కూతురు స్వాతి(6)తో కలిసి గాజులపల్లిలో ఉంటున్న సమీప బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓ ప్రముఖుడు తన కారులో సిరిసిల్ల నుంచి మండల కేంద్రానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న స్వాతిని అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తల పగిలిపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్సై రమాకాంత్ అక్కడికి చేరుకొని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం స్వాతి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయాలంటూ కుటుంబీకులు, గ్రామస్తులు సిరిసిల్ల–కామారెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. -
నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి
నటనపై విమర్శలు చేస్తే స్వీకరిస్తా కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పర్సనల్ విషయాలపై ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని హీరోయిన్ స్వాతి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. శుక్రవారం (అక్టోబర్ 6) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్పై దర్శకుడు అసహనం వ్యక్తం చేశారు. ‘మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. కానీ కొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ రాశారు. లైఫ్లో ఎవరైతే ఓపెన్గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటి వాళ్లు దయ చేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా’ అని దర్శకుడు అన్నారు. ఇదే ప్రెస్ మీట్లో స్వాతి మాట్లాడుతూ.. కొంతమంది జర్నలిస్టులు నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చదివి ఎంతగానో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి చాలా కుమిలిపోయా. నా గురించి తెలియని వాళ్లు ఆ వార్తలు చదివి అదే నిజం అనుకుంటారు. చాలా మంది నమ్మారు కూడా. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. ఎందుకంటే అది నా వృత్తి కాబట్టి. దానిపై మీరు(జర్నలిస్టులు)విమర్శకులు చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాస్తే తట్టుకోవడం కష్టంగా ఉంది’అని స్వాతి చెప్పుకొచ్చింది. -
సాయి ధరమ్ తేజ్ మరియు కలర్ స్వాతి క్యూట్ మూమెంట్స్
-
'చనిపోకముందే.. చనిపోయిందని చప్పడంతో'.. ప్రేమికులిద్దరూ తీవ్ర నిర్ణయం..!
మహబూబ్నగర్: మండలంలోని మిరాసిపల్లికి చెందిన స్వాతి(15) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం మోట్లంపల్లికి చెందిన మహేష్(19), స్వాతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి కుటుంబ సభ్యులు మహేష్కు ఫోన్ చేసి స్వాతి చనిపోకముందే చనిపోయిందని, మా అమ్మాయి చావుకు నీవే కారణం నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపుతామని చెదిరించారు. దీంతో మహేష్ తన తండ్రికి విషయాన్ని చెప్పడంతో మాట్లాడుదాము నీవేమి బెంగపెట్టుకోవద్దని సర్దిచెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మహేష్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న స్వాతి ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్వాతి తండ్రి కుర్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కాగా స్వాతి స్థానిక జెడ్పీహెచ్లో 10వ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
సమంత, నిహారిక బాటలో కలర్స్ స్వాతి? విడాకులు తీసుకోబోతోందా ?
-
‘పంచత్రంతం’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్రం నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, నరేశ్ ఆగస్త్య,శివాత్మిక రాజశేఖర్, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు:టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కథ, స్క్రీన్ప్లే: దర్శకత్వం: హర్ష పులిపాక సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి ఎడిటర్:గ్యారీ బి హెచ్ విడుదల తేది: డిసెంబర్ 9 , 202 బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన యాంథాలజీ చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ..కథనం ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి రిటైర్డ్ అయిన వేదవ్యాసమూర్తి(బ్రహ్మానందం)రైటర్గా ఎదగాలనుకుంటాడు. కానీ అతని కూతురు డాక్టర్ రోషిణి(స్వాతి)మాత్రం వయసును గుర్తు చేస్తూ తండ్రిని నిరుత్సాపరుస్తుంది. ఇప్పటి యువతను కథలతో మెప్పించడం సాధ్యం కాదంటూ తండ్రిని ఎగతాళి చేస్తుంది. అయితే వ్యాస్ మాత్రం కూతురి మాటలు పట్టించుకోకుండా స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్కు వెళతాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు.దానికి పంచేంద్రియాలు అని పేరు పెడతాడు. దృశ్యం, రుచి, స్పర్శ, వాసన, వినికిడి అంశాల ఆధారంగా ఈ ఐదు కథలు సాగుతాయి. ఇందులో మొదటి కథ సాగర తీరాన్ని(బీచ్) చూడాలనుకునే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ది. ఇందులో నరేశ్ అగస్త్య, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించారు. విహారి(నరేష్ అగస్త్య) సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా పని చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతాడు.అతని ఒక్కసారి కూడా బీచ్కి వెళ్లలేదు. స్నేహితుల మాటల్లో సాగరతీరం ఎలా ఉంటుందో విని.. ఒక్కసారైనా బీచ్ని చూడాలని తపన పడతాడు. మరి తన కోరిక ఎలా నేరవేరిందనేదే మిగతా స్టోరీ. ఇది కాస్త నెమ్మదిగా, చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. రెండోది చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలను తడిమి చూడాలనుకునే ఓ యువకుడిది. ఈ స్టోరీ లో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్(రాహుల్ విజయ్)కి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. అయితే ఏ అమ్మాయి అతనికి నచ్చదు.చివరకు తల్లి కోసం లేఖ(శివాత్మిక)తో పెళ్లికి ఓకే చెబుతాడు. పెళ్లికి ముందు వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే క్రమంలో ఇష్టమైన ప్రదేశం..చిన్నప్పటి లవ్స్టోరీని షేర్ చేసుకుంటారు. . ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఓకే చేసినప్పుడు అది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా చెప్పగలం? అసలు ఒక అమ్మాయి, అబ్బాయికి ఉండాలిసింది ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక మూడోది మానసిక రోగానికి గురైన ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ది. రామనాథం(సముద్ర ఖని) ఉద్యోగవిరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. మరో పక్షం రోజుల్లో కూతురికి డెలివరీ ఉందనగా..అతనికి ఓ వింతవ్యాధి సోకుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పటికీ అతనికి మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది.తన ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తాడు.అసలు అతనికి మాత్రమే చెడు వాసన ఎందుకు వస్తుంది? ఆ అరుదైన మానసిక వ్యాధి అతనికి ఎలా సోకింది? చివరకు ఆ వ్యాధి నుంచి రామనాథం ఎలా భయటపడ్డాడు అనేదే మిగతా కథ. ఇందులో సముద్రఖని తనదైన నటనతో అదరగొట్టేశాడు. నాలుగో కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులది. కొత్తగా పెళ్లైన దంపతులకు ఊహించని కష్టం వస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారనేదే ఈ కథ సారాంశం. ప్రాణాలు పోయినా సరే విడిపోకుండా కలిసి ఉండే ఓ అనోన్యమైన యవజంట కథ ఇది. కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఈ కథకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది.ఈ స్టోరీ లో దివ్య శ్రీపాద, వికాస్ ఇద్దరు అన్యోన్య దంపతులు గా చక్కగా నటించారు. ఇక ఈ యాంథాలజీలో చివరిది 5వ కథ చాలా స్పూర్తిదాయకమైనది.ఇందులో స్వాతి ప్రధాన పాత్ర పోషించింది. లియా( స్వాతి) ఒక ఎంట్రప్రినర్. ప్రతి రోజు పాడ్ కాస్టింగ్ లో లియా స్టోరీస్ చెప్తుంటుంది. ఆ పాడ్ కాస్ట్ విని లియా ని ఎంతగానో అభిమానించే చిన్నారులు ఉంటారు. ఆ క్రమంలో పాడ్ కాస్టింగ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసి, నెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, రూపా అనే చిన్నారి వల్ల, ఆ పాడ్ కాస్టింగ్ కి మరింత వెయ్యి రేట్లు ప్రాణం పోస్తుంది. అసలు ఆ చిన్నారి ఎవరు? ఏం చేసింది? ఆ పాప ప్రాముఖ్యత ఏంటి? అనేదే మిగతా స్టోరీ. ఇది చాలా ఎమోషనల్గా సాగుతుంది.క్లైమాక్స్ హర్ట్ని టచ్ చేస్తుంది. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’.. మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ సాగదీత గా అనిపిస్తుంది. ‘కెరియర్ అంటే 20ల్లోనే కాదు 60ల్లోనూ మొదలు పెట్టొచ చ్చు’, ‘కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి’, 'వదులుకోవడం ఎంత సేపు? క్షణం పట్టదు' లాంటి డైలాగ్స్ హృదయాలు హత్తుకుంటాయి. బ్రహ్మానందం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ విహారి పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. ఇలాంటి చిత్రాలను నిర్మించాలంటే అభిరుచి ఉండాలి. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను రిచ్గా తెరకెక్కించారు. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేకుండా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’ ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్లు దాటుకుని దుబాయ్లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్ను బట్టి నైట్ టైమ్లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్లో నేను జ్యూరీ మెంబర్గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..
తిరువళ్లూరు (చెన్నై): ప్రియురాలికి కానుక ఇచ్చేందుకు ఓ ప్రియుడు దొంగగా మారాడు. ఏకంగా భార్య, తల్లి బంగారు నగలు చోరీ చేసి, వాటి నుంచి వచ్చిన సొమ్ముతో ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ముత్తునగర్కు చెందిన శేఖర్(40) స్వీట్స్టాల్, ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధల కారణంగా కొద్దిరోజుల క్రితం అతని భార్య మల్లిక పుట్టింటికి వెళ్లింది. బంధువులు రాజీ కుదిర్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉంచిన 300 సవర్ల బంగారు నగలను పరిశీలించగా అవి మాయమయ్యాయి. అలాగే శేఖర్ తల్లికి చెందిన మరో 200 సవర్ల బంగారు నగలు, రెండు బంగారు బిస్కెట్లు కనిపించలేదు. దీనిపై శేఖర్, అతడి సోదరుడిని ఆరాతీయగా తనకు నగలు విషయం అస్సలు తెలియదని చెప్పడంతో బాధితులు పూందమల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగల పనే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బీరువాను పరిశీలించారు. తాళాలు పగలగొట్టకుండా నగలు ఎలా మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి దొంగలే చేతివాటాన్ని ప్రదర్శించి ఉంటారని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. మొదట శేఖర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. విచారణలో కుటుంబ సభ్యులకు చెందిన బంగారు నగలను దొంగతనం చేసి ప్రియురాలు స్వాతికి ఇచ్చినట్లు అంగీకరించాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిఫ్ట్గా ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శేఖర్, ప్రియురాలు వేళచ్చేరికి చెందిన స్వాతిని అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కీలేడీ మల్లిక పుట్టింటికి వెళ్లిన సమయంలో శేఖర్కు స్వాతి పరిచయమైంది. వీరి స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి చెన్నైలోని ప్రైవేటు హాటల్లో తరచూ కలుసుకునే వారు. ఈ క్రమంలో శేఖర్ వద్ద స్వాతి లక్షల్లో డబ్బు స్వాహా చేసింది. ఈ క్రమంలో బంగారు నగలు, కారును గిఫ్ట్గా ఇవ్వాలని స్వాతి కోరడంతో వేరే మార్గం తెలియని శేఖర్ ఇంట్లో నగలను దొంగిలించి కొంత కానుకగా ఇచ్చాడు. కొన్ని నగలు అమ్మి తద్వారా వచ్చిన నగదుతో కారును గిప్ట్గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో నిర్ధారించారు. శేఖర్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్, స్వాతిలను అరెస్టు చేసి వారి నుంచి కారును సీజ్ చేశారు. కాగా స్వాతికి ఇదివరకే పలువురు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం యువతిని విచారణ చేస్తున్నారు. శేఖర్ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. -
హీరోయిన్ పాయల్ ఇలా మారిపోయిందేంటి?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్ రాజ్పుత్ నటించనుంది. ఈ సినిమాలో ఆమె పచ్చళ్ల స్వాత్రి అనే పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా పాయల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించి ఫస్ట్లుక్ పోస్టర్ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్రామ్కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
ఆకట్టుకుంటున్న ‘కన్నుల్లోన...’ సాంగ్
మహేశ్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్ధార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘స్వ’. మను పీవీ దర్శకత్వం వహించారు. జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ సంస్థలో జి.ఎం. సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. కరణం శ్రీ రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కన్నుల్లోన..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. వినోద్ శర్మ, నాదప్రియ పాడారు. జీ.ఎం. సురేష్ మాట్లాడుతూ–‘‘మా చిత్రం ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. ‘కన్నుల్లోన..’ పాట బాగా అలరిస్తోంది. ‘స్వ’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్గా శోభ స్వాతి ప్రమాణం
-
తాళి కట్టేముందు ఆ కన్నడ హీరో కాబోయే భార్యను ఏం అడిగాడంటే!
బెంగళూరు : ప్రతి ఒక్కరి జీవితంలో ఓ లవ్స్టోరీ ఉంటుంది. కన్నడ హీరో రిషి లైఫ్లో కూడా ఓ అందమైన ప్రేమకథా చిత్రం ఉంది. ‘పరేషన్ అలమేలమ్మ’ సినిమతో శాండిల్వుడ్కు పరిచయమైన రిషి 2019లో స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరి లవ్ కహానీ ఎలా మొదలైంది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు వంటి విషయాలను స్వాతి ఇటీవలె షేర్ చేసుకుంది. 'నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లాను. సిటీ కొత్త కదా సరదాగా ఓరోజు థియేటర్కు వెళ్లాం. అక్కడే మొదటిసారిగా రిషిని చూశాను. హీరోగా అతడి మొదటి సినిమా అది. అంత మంది జనాల మధ్య రిషి హైట్, తన స్మైల్ నన్ను ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్లో తనను కలవడానికి వెళ్లా. మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు అని చెబుతుంటే బ్లష్ అయిపోయాడు. అది నన్ను మరింత అట్రాక్ట్ చేసింది. మరుసటి రోజు రిషి ప్రొఫైల్ ఫేస్బుక్లో దొరికొంది. దీంతో మెసేజ్ చేశా. అటువైపు నుంచి రిప్లై రావడంతో ఇద్దరం చాటింగ్ చేసేకునేవాళ్లం ఓ రోజు రిషి కాఫీకి రమ్మని పిలిచాడు. అలా సరదాగా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. ఓ రోజే నేను నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేశా..దీంతో రిషి నేను ఇదే చెప్పాలనుకున్నాను అనడంతో ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాం. అదేరోజు సాయంత్రం ఫోన్లో ఇద్దరం ఐ లవ్యూ చెప్పుకున్నాం. రిషి సినిమాల్లో ఉండటం, నాకు 9-5 జాబ్ కావడంతో వారానికి ఒకసారి కంటే ఎక్కువ కలిసేవాళ్లం కాదు. కానీ ఉన్నంతసేపు చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నా కోసం బుక్స్ గిఫ్ట్గా ఇచ్చి అందులో నువ్వు నా లైఫ్ని మరింత అందంగా మార్చేశావు అంటూ ఎంతో క్యూట్ కొటేషన్స్ రాసి ఇచ్చేవాడు. ఇక నేను కూడా వీలు కుదిరినప్పుడల్లా తనకు సెట్స్లో సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని. ఇక రిషి ఫస్ట్ మూవీ ‘పరేషన్ అలమేలమ్మ’ హిట్ కావడంతో ఇక పెళ్లిచేసుకుందామా అని రిషి అడిగాడు. నేను కూడా ఎస్ చెప్పాను. వెంటనే మా నిశ్చితార్థం జరిగింది. ఇక తమిళ, కన్నడ సంప్రదాయాల ప్రకారం మా పెళ్లి జరిగింది. ఆరోజు తాళి కట్టే ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రిషి అడగడంతో ..ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని నువ్వు అనుకోవట్లేదా అని చెప్పిన వెంటనే తాళి కట్టేశాడు. ఇదే విషయంపై అప్పుడప్పుడూ రిషిని ఏడిపిస్తుంటాను. ఇక పెళ్లి తర్వాత హనీమూన్కు ఎక్కడికీ వెళ్లలేకపోయాం. కరోనా కావడంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక రిషి తన ప్రాజెక్టు గురించి చెబుతూ ఉంటాడు. ఈ ప్యాండమిక్ పూర్తైన వెంటనే ఓ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి' అంటూ తన లవ్స్టోరీ బయటపెట్టింది. ఇక సర్వజనికారిగే సువర్ణవాకాష అనే చిత్రంలో రిషి చివరిసారిగా కనిపించాడు. చదవండి : నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా ?ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు -
స్వాతి అసోసియేట్ ఎడిటర్ మణిచందన కన్నుమూత
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్, ఎడిటర్ వేమూరి బలరాం కుమార్తె మణిచందన (48) సోమవారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొద్దిరోజుల కిందట పరిస్థితి విషమించడంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్వాతి వారపత్రిక నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న మణిచందన భర్త అనిల్కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్కంటాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మణిచందన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. -
సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?
సాక్షి, శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బహిర్భూమి కోసం వెళ్లి శుక్రవారం రాత్రి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నపల్లివూరు గ్రామానికి చెందిన వివాహిత రచ్చ స్వాతి (24) ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉన్న ఉద్దానం ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివాహితతో సన్నిహితంగా ఉన్నట్టు భావిస్తున్న ఉద్దానం రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ఐదారుగురుని కూడా పోలీసులు స్టేషన్కు రప్పించి విచారణ చేపడుతున్నారు. స్వాతి వాడిన సెల్ ఫోన్ మాత్రం లభ్యం కాలేదు. ఫోన్ దొరికి.. కాల్ డేటా పరిశీలిస్తే నిందితులు పట్టుబడే అవకాశం ఉంది. చదవండి: (పెళ్లింట విషాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం) సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కుమార్తె స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కుమారుడు దినేష్తో 2017 ఆగస్టులో వివాహమైంది. వీరికి సుమారు మూడేళ్ల కుమారుడు సమర్పణ్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికని వెళ్లిన స్వాతి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకుంది. గొర్రెలు, ఆవులను మేత కోసం తీసుకొని వెళ్లిన ఆమె అత్తమామలు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటికి చేరగా.. అప్పటికే పొయ్యిపై అన్నం వండుతున్న స్వాతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించి మందలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న కాశీబుగ్గ సీఐ శంకరరావు, ఎస్సై గోవిందరావు అనంతరం బహిర్భూమికి వెళతానని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో మామ అప్పన్న స్థానికులతో కలిసి తోటలో గాలించగా.. రక్తపు మడుగులో స్వాతి కనిపించింది. వెంటనే 108 వాహనంలో రాత్రి 9.30 గంటల సమయంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) సెల్ఫోన్ మాయం స్వాతి తల్లి రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. స్వాతి బహిర్భూమి కోసం వెళ్లిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన స్వాతి బంగారు చెవి దిద్దులు, చెప్పులు, జడ క్లిప్ సేకరించారు. అక్కడకు కాసింత దూరంలో రక్తపు మరకలతో పాటు ఖాళీ క్వార్టర్ మద్యం సీసాను కూడా క్లూస్ టీమ్ సీజ్ చేసి స్థానిక ఎస్సై కూన గోవిందరావుకు అందించారు. అయితే హత్య జరిగిన స్థలంలో ఉండాల్సిన స్వాతి సెల్ఫోన్ మాత్రం కనిపించలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు పోలీసులు కాల్ డేటా సేకరించే పనిలో పడ్డారు. పోలీసులు ఏమన్నారంటే.. శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరకున్న వజ్రపుకొత్తూరు ఎస్సై కూన గోవిందరావు, కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు, క్లూస్ టీం వివరాలు సేకరించారు. క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మామ అప్పన్న ఆడపడుచు, అనుమానితులను విచారించారు. హంతకుల ఆనవాలు దొరకలేదని, డాగ్ స్క్వాడ్ పరిశీలించినా ఫలితం లేకపోయిందని, అత్యాచారం జరిగినట్లు ఆనవాలు కూడా దొరకలేదని తెలిపారు. రిమ్స్లో పోస్టుమార్టం చేపట్టాక పూర్తి నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. కాశీబుగ్గ సీఐ సాకేటి శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ది బిగ్ ఎలిగేషన్
-
తుపాకుల స్వాతికి కేటీఆర్ చేయూత
ఖమ్మం, నేలకొండపల్లి: ఓ ప్రమాదం కారణంగా మహిళకు రెండు చేతులు పని చేయడం లేదు. ఒక కాలు సగం వరకు తీసేశారు. వారి గోడును ఓ ట్రస్టు సభ్యుడు కేటీఆర్కు ట్విటర్లో వివరాలను తెలిపాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను మంజూరు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుపాకుల స్వాతి 9 నెలల కిందట విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమెకు రెండు చేతులు చచ్చుబడ్డాయి. నిరుపేద కుటంబం కావడంతో కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి వెల్ఫేర్ డెవలప్మెంట్ ట్రస్టు సభ్యుడు శ్రావణ్ విషయాన్ని రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్కు ట్విటర్ ద్వారా తెలిపాడు. కేటీఆర్ స్పందించి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు యువకుడికి శుక్రవారం ఫోన్ వచ్చింది. మహిళకు వైద్యం చేయించేందుకు రూ.లక్ష మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో హైదరాబాద్లోని వి.కేర్ వైద్యశాలలో చేర్పించాలని సూచించారు. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన శ్రావణ్ను పలువురు అభినందించారు. స్వాతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్కు చికిత్స కోసం వెళ్లేందుకు బాధిత మహిళకు ఆర్థిక సాయం చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యుడు, స్థానిక ఎమ్మేల్యే కందాల ఉపేందర్రెడ్డిని కలిసి కోరారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశారు. ఆమెకు పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పసుమర్తి శ్రీనివాస్, గండికోట వెంకటలక్ష్మి, వున్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి ఉన్నారు. -
ఆ అకౌంట్ నాది కాదు.. స్వాతి క్లారిటీ
సినీ సెలబ్రిటీల పేరు మీద సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను క్రియేట్ చేయటం అకతాయిలకు సరదాగా మారుతోంది. రోజురోజుకు ఈ ఫేక్ అకౌంట్ల సమస్య సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి ముప్పుగా మారుతోంది. తాజాగా తన పేరుతో ట్విటర్లో నకిలీ ఖాతా చలామని అవుతున్నట్లు గుర్తించి హీరోయిన్ కలర్స్ స్వాతి తీవ్రంగా మండిపడ్డారు. ‘వారం రోజుల తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాను. @swathireddyoffl అనే ట్విటర్ అకౌంట్ నాది కాదు. అసలు నాకు ట్విటర్ ఖాతానే లేదు. అదేవిధంగా నాకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. నా ఫేస్బుక్ అకౌంట్ను 2011లోనే తొలగించాను. నేను ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కలిగి ఉన్నానో తెలియదు. (తండ్రి పాత్రలో నటించడానికి రెడీ: కరణ్) కానీ, ఇలాంటి సందర్భంలో నాకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. నా పేరుతో ట్విటర్లో నకిలీ అకౌంట్ ఉన్నట్లు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు. నకిలీ ప్రొఫైల్స్, ఆర్టికల్స్, సోషల్ మీడియాలో పోస్టులు, నకిలీ సంబంధాలు ఉన్న ఈ కాలంలో ఉండటం కంటే పాత కాలంలోకి వెల్లడమే మంచిది’ అని ఆమె చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. స్వాతి 2018లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె ఏ సినిమాలో నటించలేదు. ఇక కార్తికేయ-2 చిత్రం ద్వారా స్వాతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. View this post on Instagram Checked Instagram today after a week and it’s this, @SwathiReddyOffl Twitter handle is NOT mine. Am NOT on Twitter. I never will be. Am NOT on Facebook. I quit it in 2011. ( I have a page handled by someone else, which is dormant ) And. I don’t know why am still on Instagram. Maybe it provides a voice to say the below. Those of you who brought it to my notice, thank you. This account keeps returning and coming to my notice. ( who are you boss? #Darr ) If you have Twitter and the energy, then please flag it, I have not had much power over what’s written and said about me in the past. I know this shouldn’t matter, it’s not a big deal, am not so relevant also currently blah blah but home girl is just tired of fake. I don’t understand the patience to be a fake me when the real me is not able to be herself completely online. Fake profiles, Fake articles, fake posts, fake relationship standards, fake images, fake positive. Take me back to the 90s where a landline ensured more quality conversations, power cuts because of a drizzle and not a quarantine meant bonding, softy ice cream and egg puffs was standard socialising and Doordarshan was enough stimulation. #Uff #Lol A post shared by Swathi (@swati194) on May 5, 2020 at 3:48am PDT -
స్వాతికి తెలియదు
స్వాతికే కాదు.. సీతకు, శ్వేతకూ తెలియదు. పల్లవికి, ప్రవల్లికకూ తెలియదు. బాధ్యతగా ఆమె పప్పుల్నీ, ఉప్పుల్నీ లెక్కగట్టి మూడు పూటలా ఇంటిని నడిపిస్తున్నప్పుడు.. బాధ్యతగా అతడూ అప్పుల్నీ, తప్పుల్ని ఏరోజు కారోజు ఇంటికి రాగానే చీటీలో రాసి ఆమె చేతిలో పెట్టాలి. నెలకోసారి.. పే స్లిప్ చూపించడం కాదు. గైస్.. ఒక రూపాయి అప్పు చేసేముందు ఆమెకు ఫోన్ చేసి చెప్పండి.. ఫోన్కి పది రూపాయలు అవుతున్నా సరే! ఒక సంతకం పెట్టే ముందు ఆమె అనుమతి తీసుకోండి.. ఆమె కోసం మీరు కొనబోతున్న శ్వేత సౌధపు అగ్రిమెంట్ కాగితాలైనా సరే. ఉదయం ఆఫీస్కి వెళ్లిన నాన్న సాయంత్రం కొత్త కారుతో ఇంటికి వస్తే పిల్లలు వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి ‘హే.. కొత్త కారు’ అని కారులోకి దూకి కూర్చుంటారు. మరీ చిన్నపిల్లలైతే వెళ్లి స్టీరింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ని ‘జుయ్జుయ్’మని తిప్పుతారు. ‘మనదేనా నాన్నా’.. పిల్లలు అడిగే మొదటి ప్రశ్న. ‘ఎక్కడికెళ్దాం నాన్నా’.. రెండో ప్రశ్న. పిల్లల్ని ఎత్తుకుని బుగ్గలపై ముద్దుపెడుతూ భార్య వైపు చూస్తాడు అతడు. ‘మనదే కారు’ అంటూ ఒక ముద్దు. ‘నువ్వు చెప్పు ఎక్కడికెళదామో’ అంటూ ఇంకో ముద్దు. పిల్లలు అడిగినట్లే ఆమెకూ ఒక ప్రశ్న అడగాలని ఉంటుంది. ‘ఎక్కడిదండీ కారు?’ అని. కానీ అడగదు. అడిగితే, కారు ఎలా ఉందో చెప్పకుండా, కారు ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుందేమిటి’ అని భర్త నొచ్చుకుంటాడేమోనని ఆమె భయం. నొచ్చుకుంటాడన్న భయంతో ఆమె అతడిని చాలానే అడగలేదు. పెళ్లయి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఏ నెలలోనూ జీతమెంత అని భర్తను అడగలేదు. జీతంలో కటింగ్స్ ఎన్ని అని అడగలేదు. ఇంట్లోకి ఒకేసారి హైఎండ్ ఏసీ, ఫ్రిజ్, వాషింగ్మిషన్, టీవీ.. ఇంకా రెండుమూడు ‘చిన్న వస్తువుల్ని’ పిల్లల ఆటబొమ్మల్లా భుజాన మోసుకొచ్చిప్పుడు కూడా భుజం మీద నుంచి బరువును దింపిందే తప్ప, దింపాక పెరిగే వాటి బరువు గురించి అతడిని అడగలేదు. ‘ఈఎమ్ఐల్లో తెచ్చా. చిటికెలో అయిపోతాయి’ అని అన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ శాలరీ కన్నా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కువైపోవు కదా’ అని అడగలేదు. అడిగితే అతడు నొచ్చుకుంటాడు. ‘చిన్న వస్తువుల్ని’ ఇంటికి తెచ్చిన కొన్నాళ్లకే ఓరోజు అతడు ఆమె కళ్లకు గంతలు కట్టి కారులో ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లాడు. గంతలు విప్పాక, కళ్లు నులుముకుని చూసి, అప్పుడు మాత్రం అడిగింది, ‘ఎవరిల్లండీ, బాగుంది’ అని! ‘మనదే!’ అనలేదు అతను. ‘నీదే’ అన్నాడు. ‘నీ కోసమే’ అన్నాడు. అతడెప్పుడూ అలాగే మాట్లాడతాడు. మాట్లాడ్డం కాదు, నిజంగానే అతడు చేసేవన్నీ ఆమె కోసమే. చేయాలనుకునేవన్నీ ఆమె కోసమే. ‘ఇప్పుడున్న ఇంటికే అంత అద్దె కడుతున్నాం. ఈ ఇంటికి ఇంకా ఎక్కువ ఉండదా’ అంది.. కొత్త గోడల్ని, కొత్త తలుపుల్ని, కొత్త కిటికీల్ని తడిమి చూస్తూ. పెద్దగా నవ్వి, ఆమె చుట్టూ చేతులు వేసి గాల్లోకి లేపాడు అతడు. ‘ఇది మన సొంతిల్లు. నీ కోసం, పిల్లల కోసం కొన్న ఇల్లు’ అన్నాడు. ‘ఇకనుంచి మనం అద్దె కట్టనక్కర్లేదు’ అన్నాడు. ‘ఆ కట్టేదేదో మన సొంత ఇంటికి కట్టుకుంటే సరిపోతుంది’ అన్నాడు. కట్టుకున్నది సొంతిల్లు అవుతుంది కానీ, నెల నెలా కట్టేది సొంతిల్లు అవుతుందా! ఆ మాటే ఆమె అనబోయింది. అతడు అననివ్వలేదు. ప్రశ్నలు కట్టిపెట్టు అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లో ఆమె భద్రంగా ఉంది. ఇంత భద్రత కొత్తింట్లో ఉంటుందా.. పది వేల అద్దెకు బదులు నెలనెలా కట్టే ఇరవై వేల లోన్ కట్టవలసిన ఇంట్లో?! అతడు సంతోషంలో ఉన్నాడు. తనకొచ్చిన సందేహాలన్నీ భర్తకూ వచ్చి ఉంటాయి. అయినా సంతోషంగా ఉన్నాడూ అంటే.. తను వేరుగా సందేహపడాల్సిందేమీ లేదు. కుడికాలు లోపలికి పెట్టింది. పిల్లలు ‘ఓ.. ఓ..’ అంటూ కొత్తింట్లోని హాల్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, బాత్రూమ్లోకి, బాల్కనీలోకి పరుగులు తీస్తున్నారు. ఎంత పిల్లల్తో పోటీపడి పరుగెత్తలేని కాలమైనా రోజుల్ని, వారాల్ని దాటి నెల దగ్గరికి వచ్చేస్తుంది. నెల తర్వాతి నెలకూ వచ్చేస్తుంది. ‘కాస్త టైట్గా ఉంది గురూ. వచ్చే నెల రెణ్ణెల్ల ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చేస్తా..’ ఆమె వాకిట్లో ముగ్గేస్తోంది. అతడు ఆమెకు వినిపించనంత దూరం వెళ్లి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆఫీస్లోనే కాదు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫోన్లో ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ మాటలే రావాలి. టెకీ అయితే అదేదో జార్గాన్ ఉంటుంది. ఫ్లోచార్టు, డీబగ్, లైఫ్ సైకిల్, టెస్టబుల్ కోడ్.. ఇలాంటి మాటలు రావాలి. డాక్టర్ అయితే రిపోర్ట్స్ అనీ, ఇన్వెస్టిగేషన్ అనీ, మెడికల్ హిస్టరీ అనీ రావాలి. జర్నలిస్ట్ అయితే ప్రెస్మీట్ అని, స్కూప్ అనీ, లీడ్ అనీ ఏవో ఉంటాయి. అవి రావాలి. ఇవేమీ కాకుండా టైట్గా ఉందనీ, ఒకేసారి రెణ్ణెల్లదీ ఇచ్చేస్తాననీ అంటున్నాడంటే.. అదీ ముంగిట్లో ముగ్గు పడే వేళ నుంచే కొత్తగా ‘టైట్ టాక్’ మొదలవుతోందంటే.. ఏనాడూ భార్యాబిడ్డల్తో కలిసి కూర్చుని భోజనం చేసే స్థిమితం కూడా లేని అతడు.. త్వరలోనే త్వరగా ఇంటికి రాబోతున్నాడనే! త్వరగా ఇంటికి వచ్చిన ఆ రాత్రి.. తనని చూసి కేరింతలు కొడుతూ నిద్రమానుకున్న పిల్లలతో కలిసి.. తండ్రీ బిడ్డల్ని చూసి మురిసిపోతున్న భార్యతో కలిసి.. భోజనం చేయబోతున్నాడనే! బయటి నుంచి తను తెచ్చిన ‘ఫుడ్ ఐటమ్స్’ని అందరి భోజనంలో తలా ఇంత చేర్చి పిల్లలకు, భార్యకు తనే మొదటి ముద్ద తినిపించబోతున్నాడనే! హైదరాబాద్లో శనివారం రాత్రి ఇలాగే ఓ కుటుంబం ‘కలిసి భోజనం’ చేసింది! అతడు, ఆమె, ఇద్దరు పిల్లలు. ఆరేళ్లొకరికి. ఏడాదిన్నరొకరికి. టెకీ అతను. చిన్న వయసే. పెద్ద కంపెనీలో పని. పెద్ద జీతం. అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. బిజినెస్ చేసి అప్పు తీర్చాలనుకున్నాడు. బిజినెస్ కోసం మళ్లీ అప్పు చేశాడు. బాగా బతకడం కోసం కాదు ఇవన్నీ. ఇంకా బాగా బతకడం కోసం. చివరికి బతకలేక తనను, కుటుంబాన్ని చంపుకున్నాడు! జీతం అప్పును పుట్టిస్తుంది. అప్పును కట్టలేదు. ఒకట్రెండు వాయిదాలైతే జీతం తీర్చేస్తుంది. అప్పుల్ని, వడ్డీల్ని తీర్చే కెపాసిటీ ఎంత పెద్ద జీతానికైనా ఉండదు. ఆ సంగతి అతడికెవరూ చెప్పలేకపోయారా! ఇంత జరుగుతోందని అతడెవరికైనా చెబితేనే కదా! భార్యకు కూడా చెప్పలేదు. చనిపోతూ తండ్రికి రాసిన ఉత్తరంలో మాత్రం చెప్పాడు. ‘స్వాతికి ఇవేవీ తెలియదు నాన్నా..’ అని చెప్పాడు! స్వాతి అతడి భార్య. అతడు నొచ్చుకుంటాడని అతడిని ఏనాడూ ఎందుకు, ఎలా అని అడగని భార్య.. ‘బతకాలని ఉంది స్వాతీ’ అని ఒక్కమాట అని ఉంటే.. బతకలేనంత కష్టం ఏమొచ్చిందో అడిగి తెలుసుకుని ఉండేది. కష్టమో, నష్టమో కలిసే బతుకుదాం అని ధైర్యం చెప్పి ఉండేది. మాటైనా చెప్పకుండా భార్యనీ పిల్లల్నీ తనతో తీసుకుపోయాడు! l -
స్వాతిరెడ్డి అరెస్ట్, జైలుకు తరలింపు
సాక్షి, నాగర్కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం) అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా, నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి ...కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా కొంతకాలం జైలులో ఉంది. (స్వాతికి జామీను ఉపసంహరణ) 2018 జూలైలో బెయిల్పై వచ్చిన స్వాతి మహబూబ్నగర్ స్టేట్ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్కర్నూల్జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో స్టేట్ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. -
మా ఆయనను మిస్సవుతున్నా.. పిల్లలు జాగ్రత్త
సనత్నగర్: ‘మా వారిని మిస్సవుతున్నాను. ఆయన చాలా మంచివారు. పిల్లలను చక్కగా చూసుకోండి’ అంటూ ఓ గృహిణి పుట్టింటివారికి ఫోన్లో ఎస్ఎంఎస్లు పంపించి అనంతరం బలవన్మరణానికి ఒడిగట్టిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్ కబీర్నగర్లో నివాసం ఉండే రమేష్గౌడ్, స్వాతి (32) దంపతులు. వీరికో కుమారుడు, కూతురు ఉన్నారు. రమేష్గౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూర్ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు స్వాతి.. భర్తను మిస్సవుతున్నాను.. మా ఆయన ఎంతో మంచివాడు. తల్లిదండ్రులు, పిల్లలను బాగా చూసుకోండంటూ పలువురికి ఫోన్లో ఎస్ఎంఎస్లు పంపించింది. మోతీనగర్ సమీపంలో ఉంటున్న సోదరుడికి ఫోన్ చేసి ‘తాను చనిపోతున్నానంటూ చెప్పింది. దీంతో వారు హుటాహుటిన చేరుకుని ఇంటితలుపులను పగులగొట్టి చూడగా ఇంట్లోని ఫ్యాన్కు స్వాతి ఉరేసుకుని కనిపించింది. కొనఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. -
అమ్మాయంటే అలుసా దిశకు అంకితం
‘‘స్టార్ హీరోలు, దర్శకుల దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాను. తొలిసారి నిర్మాతగా మారి సినిమా తీశాను. అనుకోని ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోతే నా భార్యకు తెలియకుండా ఇల్లు అమ్మేసి సినిమా పూర్తి చేశాను’’ అన్నారు నేనే శేఖర్. ఆయన హీరోగా, దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. కార్తీక్ రెడ్డి, స్వాతి, శ్వేత, ఆర్తి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల చేశారు.‘‘ప్రస్తుత సమాజానికి ఎటువంటి కథ అయితే బావుంటుందో తెలిసినవాడు శేఖర్’’ అన్నారు నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్. ‘‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత రామసత్యనారాయణ. ‘‘ఈ సినిమాను దిశకు అంకితం చేస్తున్నా’’ అన్నారు నేనే శేఖర్. -
సీక్వెల్లో
నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ’. లేటెస్ట్గా ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రెడీ కాబోతోంది. మొదటి భాగంలో స్వాతి, నిఖిల్ జంటగా నటించారు. తాజా సీక్వెల్లో అనుపమా పమేశ్వరన్ కూడా నటిస్తారని తెలిసింది. ‘కార్తికేయ 2’ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల నిర్మించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొదటి భాగంలో కనిపించిన స్వాతి ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారట. అనుపమ పాత్ర కొత్త జాయిన్ అవుతుందని తెలిసింది. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, సీక్వెల్ అక్కడి నుంచి ప్రారంభం కానుంది. గతంలో చందు మొండేటి ‘ప్రేమమ్’లో అనుపమ ఓ హీరోయిన్గా నటించారు. -
ఔరా అనిపిస్తున్న ఆడబిడ్డ
ఆకాశంలో సగమంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతర్జాతీయంగా విమానాలు, దేశీయంగా మెట్రో రైళ్లు నడుపుతూ మగవాళ్లకు దీటుగా నిలుస్తున్నారు. మెట్రో నగరాల్లో పురుషులతో పోటీ పడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల మూలంగా బయటికి రాలేక తమలోని ప్రతిభను మరుగున పడేస్తున్నారు. కానీ ఇలాంటి కట్టుబాట్లను తెంచుకుని ఆచారాలను పాటిస్తునే స్వంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న స్వాతిపై ‘సాక్షి’ కథనం. – ఎస్ఎస్తాడ్వాయి నీటి సరఫరా కోసం డ్రైవింగ్ సాక్షి, ములుగు : తన వ్యాపారాన్ని విస్తరించుకునే బాధ్యతను తనే మీద వేసుకుంది స్వాతి. దీని కోసం ఏకంగా ఆటోడ్రైవింగ్ నేర్చుకుంది. ఉదయం వేళ హోటల్ నిర్వాహణకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆటోలో క్యాన్లు వేసుకుని మేడారం చుట్టు పక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లపల్లి, వెంగళరావునగర్, ప్రాజెక్టు నగర్, తాడ్వాయి, కామారం వరకు ఉన్న పల్లెలకు వెళుతూ నీటిని సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం సమయానికల్లా మేడారం చేరుకుని హోటల్ పనుల్లో నిమగ్నమవుతోంది. సాయంత్రం వేళ తిరిగి వాటర్ ప్లాంట్ మెయింటనెన్స్ను చేపడుతోంది. మహిళా సాధికరత, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచే సమ్మక్క సారలమ్మ చెంత స్వాతి ఆటో నడిపిస్తున్న తీరు చూసి ఇక్కడకు వచ్చే భక్తులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు ఔరా అనుకుంటున్నారు. సమస్యలు వస్తే తమ వైపు చూడకుంటా తన కాళ్లపై తాను నిలబడుతూ తన పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు స్వాతి పడుతున్న తపన చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ అంశంపై స్వాతిని ’సాక్షి‘ పలకరించగా ఒకరిపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్ నేర్చుకున్నాని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చెబుతుంది. ఆడవాళ్లు ఏ అంశంలో తక్కువ కాదని, ఏ రంగంలోనైనా రాణించగలరని అంటుంది. అడవుల గుండా ఆటో నడిస్తున్నప్పుడు భయంగా ఉండదా అని ప్రశ్నిస్తే సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఉంటూ భయమెందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ మాటతీరు చూస్తేనే తెలుస్తుంది స్వాతి ఎంత ధైర్యంగా ముందుకెళ్తుందో.. తాగునీటి సరఫరా.. ఉపాధి మేడారం వంటి ఏజెన్సీ ఏరియాల్లో తాగునీటి కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు గమినించింది. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు తనకు ఉపాధి దొరుకుతుందనే అంచనాతో ధైర్యం చేసి దట్టమైన అడవుల మధ్య ఉన్న మేడారంలో వాటర్ ప్లాంటు నెలకొల్పింది. ప్లాంటు నెలకొల్పిన తర్వా త మేడారంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో వారికి కూడా నీటిని అందించాల ని అనుకుంది కానీ సరఫరా చేయడం కష్టంగా మారింది. ఆదివారం, సెలవు రోజులు తప్పితే మేడారం వైపు వచ్చే ఆటోలు తక్కువ. దీంతో మినరల్ వాటర్ను కావాల్సిన వాళ్ల కు సరఫరా చేయడం తలకు మించిన భారమైంది. స్థానికంగా ఉన్న ఆటో వాళ్లను సర్వీస్ అడిగితే రానన్నారు. ఏజెన్సీ పల్లెల్లో తాగునీటికి డిమాండ్ ఉంది, తన దగ్గర వాటర్ ఉం ది, సమస్యల్లా సరఫరా చేయడం. రోజుల తరబడి ఎదు రు చూసినా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రా లేదు. సమస్య ఉన్న చోటనే అవకాశం ఉంటుందనే నానుడిని అనుసరిస్తూ తానే ఆటో డ్రైవింగ్ చేసేందుకు స్వాతి ముందుకొచ్చింది. పది రోజుల వ్యవధిలో డ్రైవింగ్ నేర్చుకుంది. -
స్వాతి సన్సోర్స్కు షాక్
సాక్షి, అనంతపురం : పరిశ్రమ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ భూములు కొట్టేసి.. ఆ స్థలాలను ఇతరులకు లీజుకిచ్చిన ‘స్వాతి సన్సోర్స్’ పరిశ్రమ నిర్వాహకులకు ఏపీఐఐసీ అధికారులు షాక్ ఇచ్చారు. పరిశ్రమ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారని, వాటిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని పరిశ్రమ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. సాక్షి కథనంతో అధికారుల్లో కదలిక స్వాతి సన్సోర్స్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమ పేరుతో ఏపీఐఐసీ నుంచి తీసుకున్న స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవంతులు నిర్మిస్తున్న వైనంపై ‘అవినీతి వెలుగులు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జోనల్ మేనేజర్ గోపీకృష్ణ గురువారం పెనుకొండ సమీపంలోని స్వాతి సన్ సోర్స్ పరిశ్రమను పరిశీలించారు. ఏపీఐఐసీ నుంచి కేవలం ఒక భవన నిర్మాణానికే అనుమతులు తీసుకొని అపార్ట్మెంట్లు ఎలా నిర్మిస్తారని పరిశ్రమ నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తీసుకున్న స్థలాలను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమన్నారు. పరిశ్రమను నెలకొల్పి కార్మికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి.. అక్రమంగా భవంతులను నిర్మించి అద్దెలకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చకూడదో సమాధానం చెప్పాలని నోటీసులను జారీ చేశారు. నిర్వాహకుడి నుంచి జవాబు రాగానే 15 రోజుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. -
నటుడు రిషి, రైటర్ స్వాతిల నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్ : ‘పరేషన్ అలమేలమ్మ’ సినిమా ద్వారా శాండిల్వుడ్కు పరిచయమైన నటుడు రిషి, రైటర్ స్వాతిల నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది. ఇటీవల హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. దీనిపై నటుడు రిషి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ... ‘నన్ను ప్రోత్సహిస్తున్న మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరాడు. నేటికి ఒక మైలు రాయిని దాటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు జోడి దొరికింది. మా నిశ్చితార్థం హైదరాబాద్లో జరిగింది. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’ అంటూ పోస్టు చేశారు. విషయం తెలుసుకున్న కన్నడ చిత్రరంగ ప్రముఖలు రిషి, స్వాతిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘కళ’లో విరిసిన ప్రేమ.. స్వాతి విత్ శ్రీను
సాక్షి,సిటీబ్యూరో: సిరిపురం శ్రీ,నివాస్ (అలియాస్ శ్రీను65) ఆల్ రౌండర్ ఆర్టిస్టు. స్వాతి రింగ్ డ్యాన్సర్. ఓ ఈవెంట్లో కలిసిన ఈ జంట ప్రేమ బాసలు చెప్పుకుని.. తర్వాత పెళ్లిపీటలెక్కి.. ఇప్పుడు ఓ ఇంటివారయ్యారు. వాలంటైన్స్డే సందర్భంగా తమ ప్రేమ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘మా ప్రేమ 2012 మార్చిలో 19న మధురానగర్లో ఓ ఈవెంట్లో చిరురించింది. ఆ ప్రయాణం 2017 జూలై 30 దాకా సాగి ఆ రోజు వివాహంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను. ‘స్వాతి తొలుత నెయిల్ ఆర్ట్ వేసేది. నేను మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ చేసేవాడిని. ముందు నేనే స్వాతికి ప్రపోజ్ చేశాను. తర్వాత ఏవేవో కవిత్వాలు చెప్పే వాడిని. కొన్నాళ్లకు తాను నా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఏడాది తర్వాత ఇద్దరం కలిసి ‘వాట్ ఈజ్ లైఫ్’ అని ప్రశ్న వేసుకున్నాం. జీవితం అంటే ప్రేమ కాదు.. ఒక ఆశయం అని ఇద్దరం అనుకున్నాం. ఇప్పుడు చేసే ఆర్ట్ ఫామ్స్ కాకుండా సరికొత్తగా ఎవరూ చేయనివి చేయాలని నిర్ణయించుకున్నాం. 2014లో స్వాతి ప్రోత్సాహంతో మ్యాజిక్ షో ప్రారంభించాను. తర్వాత ఆ కళను కొత్తగా చేయడం ప్రారంభించాను. స్వాతి ప్రోత్సాహంతోనే డ్రస్ ఛేంజ్, లిల్లీపుట్ యాక్టింగ్ ప్రయత్నించాను. నాతోపాటు తను కూడా కొత్తగా రింగ్ డ్యాన్స్ మొదలు పెట్టింది. ఈ డ్యాన్స్ జిమ్నాస్టిక్స్తో సమానం. చిన్నప్పుడే నేర్చుకోవాలి. 21 ఏళ్ల వయసులో స్వాతి 12 గంటల పాటు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. ఇద్దరం కలిసి చేస్తూండగా 2016లోనే ‘జబర్దస్త్’లో ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది. రాకింగ్ రాకేశ్ టీంలో చేరాను. కొత్త వృత్తిలో కుదుటపడ్డాం కదా అని మా ప్రేమ విషయం ఇద్దరం పెద్దల దృష్టికి తీసుకెళ్లాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు.. వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు. తాను నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వారి పెద్దలకు పరిచయం చేసింది. వారు నా నడవడిక గమనించి ఓకే చెప్పారు. ఏడాది తర్వాత మా ఇంట్లో వారు కూడా ఒప్పుకున్నారు. 2017 జూలై 30న మా ప్రేమ పెద్దల అంగీకారంతో వివాహ బంధంగా మారింది. స్వాతితో కలిసి 16 రకాల కళారూపాలను ప్రదర్శిస్తాను’ అంటూ వివరించాడు శ్రీను. స్వాతి మాట్లాడుతూ.. ‘జీవితంలో ఇద్దరు కలిసి ఎదిగేందుకు ప్రేమ అండగా ఉండాలి. అంతకు మించి ఒక ఆశయం కావాలి. వృత్తిలో ఎదిగేందుకు ఒకరి సలహాలు ఇంకొకరు తీసుకోవాలి. అలాగే మేం కలిసి సాగుతున్నాం. ప్రేమికులకు ఒకటే సలహా.. ఒకరినొకరు అర్థం చేసుకొన్నాకే పెళ్లికి వెళ్లాలి. అత్తామామలు, అమ్మనాన్నలు ఇద్దరు ఒక్కటే అనే భావన ఉండాలి. అప్పుడే కుటుంబ బంధం మరింత బలపడుతుంది’ అంటూ ముగించింది. -
స్క్రీన్ టెస్ట్
కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు... ఏడాదంతా బాగుండాలనే పాజిటివ్ ఫీలింగ్తో 2019 స్టార్ట్ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్ స్పెషల్. 1. సిల్వర్ స్క్రీన్పై మొదటిసారి యన్టీఆర్ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్ ఏ చిత్రం ద్వారా మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా? ఎ) పాతాళ భైరవి బి) గులేబకావళి కథ సి) గుండమ్మకథ డి) పాండవ వనవాసం 2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) మోహన్బాబు సి) నాగార్జున డి) కృష్ణ 3. తెలుగులో మొట్టమొదటి సూపర్స్టార్ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు? ఎ) అంజలీదేవి బి) జమున సి) సావిత్రి డి) భానుమతి 4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా? ఎ) అల్లూరి సీతారామరాజు బి) ఈనాడు సి) తెలుగువీర లేవరా డి) సింహాసనం 5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో తెలుసా? ఎ) రాధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుహాసిని 6. తాను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ బి) సమంత సి) శ్వేతాబసు ప్రసాద్ డి) స్వాతి 7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్’ అశోక్ సి) సత్యం బెల్లంకొండ డి) నందినీరెడ్డి 8. వెంకటేశ్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) నగ్మా బి) ఖుష్బూ సి) సౌందర్య డి) రోజా 9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) సర్వధమన్ బెనర్జీ బి) బాలకృష్ణ సి) సోమయాజులు డి) కృష్ణంరాజు 10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా? ఎ) శోభన్బాబు బి) చంద్రమోహన్ సి) రంగనాథ్ డి) గిరిబాబు 11. రామ్గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవరు? ఎ) ఊర్మిళా మటోండ్కర్ బి) మైరా సరీన్ సి) రాధికా ఆప్టే డి) నిషా కొఠారి 12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ: హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన? ఎ) జగపతిబాబు బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) కమల్హాసన్ 13. సుకుమార్కి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి? ఎ) అశ్వనీదత్ బి) సురేశ్బాబు సి) ‘దిల్’ రాజు డి) అల్లు అరవింద్ 14. అఖిల్ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) విక్రమ్ కె. కుమార్ 15. దేవిశ్రీ ప్రసాద్కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’. ఆ చిత్రాన్ని యం.యస్. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కృష్ణవంశీ సి) ఈవీవీ డి) శ్రీను వైట్ల 16. దర్శకుడు పూరీ జగన్నాథ్ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్ పట్టారో తెలుసా? ఎ) బాచీ బి) బద్రి సి) ఇడియట్ డి) శివమణి 17. నటుడు సుమంత్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) ఆంత్ర మాలి బి) ప్రీతీ జింతా సి) ప్రీతీ జింగ్యాని డి) అంజలా జవేరి 18. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనారనౌత్ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్బాబు బి) నితి¯Œ ∙సి) రానా డి) ప్రభాస్ 19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్బాబు సి) రాజనాల డి) రాజబాబు 20. హీరో రామ్ కెరీర్లో తొలి హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) డి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) డి 19) డి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
ధీశాలి
స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తికి రూపాలెన్నో. ఆ రూపాల్లో స్వాతి గార్గ్ ఒకరు. అగ్ని ప్రమాదం నుంచి తన అపార్ట్మెంట్లోని వారిని చివరి నిమిషం వరకు కాపాడుతూ ఉన్న స్వాతి.. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ శరన్నవరాత్రులు ముగిసేవరకు సాక్షి ‘ఫ్యామిలీ’.. శక్తికి ప్రతీకలైన నేటి మహిళల గురించి రోజుకొక స్వరూపంగా మీకు అందిస్తుంది. ‘‘ధైర్యానికి ప్రతీక అయిన సోదరీ నీ ఆత్మ శాంతించు గాక. ‘ప్రాణాలు పోసే శక్తి, ప్రాణాలను కాపాడే శక్తి మహిళల్లోనే ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాల’ని మన విద్యావిధానం బోధిస్తుంది. ఆ బోధనలకు ప్రతీకగా నిలిచిన నీకు నివాళులు’’.. ఇది దీపక్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్. తన అపార్ట్మెంట్లోని వాళ్లను అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన స్వాతి గార్గ్ను ఉద్దేశించిన పోస్ట్ ఇది. స్వాతి గార్గ్ 32 ఏళ్ల యువతి. ఇంటీరియర్ డిజైనర్. ఢిల్లీ సమీపంలో గుర్గావ్లో నివసించేది మొన్నటి ఆదివారం వరకు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ఆమె నివసిస్తున్న తులిప్ ఆరెంజ్ బహుళ అంతస్తుల భవనంలో నిప్పు రాజుకుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. స్వాతి నివసించే ఐదవ ఫ్లోర్కు పొగలు వ్యాపించడాన్ని గమనించిందామె. వెంటనే తమ ఫ్లోర్లో అన్ని ఇళ్ల తలుపులు బాది వారిని అప్రమత్తం చేసింది. మంటలు చెలరేగుతున్నాయని తెలియగానే ఎవరికి వాళ్లు నేరుగా పైన టెర్రస్ మీదకు పరుగులు తీశారు. స్వాతి మాత్రం మెట్ల దారి నుంచి పరుగెత్తుతూ మిగిలిన ఫ్లోర్లకు వెళ్లి సమాచారమిస్తూ తొమ్మిదవ ఫ్లోర్కి చేరింది. అప్పటికే కారిడార్ మొత్తం పొగతో నిండిపోయింది. ఊపిరాడటం లేదు.ఊపిరితిత్తులు పొగచూరి పోయి ఉక్కిరిబిక్కిరైంది. పదవ ఫ్లోర్ మెట్ల దగ్గరకు వచ్చింది. ఆ మెట్లు ఎక్కితే టెర్రస్ మీదకు చేరుతుంది. ఎలా పడిందో తెలియదు డోర్ లాక్ పడిపోయింది. సహాయం కోసం ఎవరినైనా పిలుద్దామంటే నోరు పెగల్లేదు. మెట్ల దగ్గరే కుప్పకూలిపోయింది స్వాతి. రక్షించేలోపే..! అపార్ట్మెంట్ నుంచి అగ్నిమాపక శాఖకు 2.28 గంటలకు ఫోన్కాల్ వెళ్లింది. మూడు గంటలకు పోలీసులు వచ్చారు. మూడుంపావుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలయ్యాయి.మూడున్నరకంతా అపస్మారక స్థితిలో ఉన్న స్వాతిని గుర్తించారు. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు డాక్టర్లు. స్వాతి అపస్మారక స్థితిలో గుర్తించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అగ్నిమాపక సిబ్బంది చెప్పిన విషయం అపార్ట్మెంట్ వాసులందరినీ కంట నీరు పెట్టించింది. పొగచూరిన గోడల మీద... కారిడార్లో నుంచి బయటపడటానికి దారి కోసం వెతికిందనడానికి చిహ్నంగా ఆమె చేతి వేళ్ల ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. బయటపడే దారి కోసం వెతుకుతూనే అపస్మారక స్థితిలోకి జారిపోయింది స్వాతి. తన ప్రాణాలను రక్షించుకుంటే చాలనుకోకుండా అందరినీ కాపాడాలనే ఆకాంక్షే స్వాతి ప్రాణాలను బలిగొన్నది. ఆమె భర్త గిరీష్ హనీవెల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వాళ్లకు నాలుగేళ్ల కూతురు ఉంది. స్వాతి ఇటీవల ఆమె తల్లిని కూడా తన దగ్గరకు తెచ్చుకుంది. ఆమె ఇప్పుడు కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉంది. – మను -
మరుగున పడిన మరెందరో చిరస్మరమణులు
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటింది పురాణేతిహాసాలైతే, ఆ పురాణాలకు పూసలో దారంలా నిలిచింది పతివ్రతా శిరోమణులే . ఇక్కడ పతివ్రతలనగానే సీత, సావిత్రి, అనసూయ, ద్రౌపది వంటివారే గుర్తుకొస్తారందరికీ. అది తప్పేమీ కాదు కానీ, వారితోబాటు మరెందరో గొప్ప స్త్రీ మూర్తులున్నారు. వారిని గురించి తెలుసుకోవడం, వారిని కూడా స్మరించుకోవడం అవసరమే కదా అనే ఆలోచనతో ప్రముఖ కథారచయిత, సీనియర్ పాత్రికేయులు డా. చింతకింది శ్రీనివాసరావు కొద్దికాలం క్రితం సాక్షిలో వారం వారం ఒక్కో పతివ్రతా శిరోమణిని పాఠకులకు పరిచయం చేశారు. ఇటీవల ఆయా వ్యాసాలను ఏరి కూర్చి, ‘మరువరాని పురాణ మహిళలు’ పేరిట ఒక పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకంలో శకుంతల, లోపాముద్ర, రేణుక, లీలావతి, కౌసల్య, అహల్య, ఊర్మిళ, దమయంతి, కుంతి, మాద్రి వంటి చిరపరిచితులైన స్త్రీ మూర్తులతోబాటు త్రిజట, వినత, దేవయాని, హిడింబ, జాంబవతి, మండోదరి వంటి కొద్దిమందికే తెలిసిన వారు, ఉలూచి, చిత్రాంగద, దశరథుడి దత్త పుత్రిక శాంత, విరాటరాజు భార్య సుధేష్ణ, దుర్యోధనుడి సతీమణి భానుమతి, వేంకటేశ్వర స్వామిని పెంచిన తల్లి వకుళమాత వంటి అతి కొద్దిమందికే తెలిసిన వారి గురించి కూడా ఎంతో లోతైన పరిశీలన, వివరణ కనిపిస్తుంది. అభ్యుదయ మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు అలాంటి వారి గురించి తెలుసుకోవడం, వారి జీవితాలపై అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. మరువరాని పురాణ మహిళలు, పుటలు: 160; వెల రూ. 182, ప్రతులకు: జ్యోతి బుక్ డిపో; ఫోన్ నం. 08916642020, 040 27611188 – పూర్ణిమాస్వాతి -
నిరాడంబరంగా కలర్స్ స్వాతి వివాహం
-
సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్: యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్ స్వాతి, విజయ్
-
స్వాతికి జామీను ఉపసంహరణ
సాక్షి, నాగర్ కర్నూల్: ప్రియుడితో కలసి భర్తను హత్య చే సిన స్వాతి ఉదంతం మరో మలుపు తిరిగింది. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు దానిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. గతేడాది నవంబర్లో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్రెడ్డిని ఆయన భార్య స్వాతి, తన ప్రియుడు రాజేశ్తో కలసి హత్య చేయగా డిసెంబర్లో ఈ విషయం బయటపడింది. అప్పటి నుంచి స్వాతి మహబూబ్నగర్, రాజేశ్ నాగర్కర్నూల్ జైల్లో ఉంటున్నారు. గత నెల 16న స్వాతికి మహబూబ్నగర్ జిల్లా కోర్టులో బెయిల్ లభించగా పూచీకత్తు ఇచ్చే వారెవరూ లేకపోవడంతో ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది. నాగర్కర్నూల్ మునిసిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తితోపాటు మరొకరు ఆమెకు జామీను ఇవ్వగా గత నెల 27న జైలు నుంచి విడుదలైంది. స్వాతిని తీసుకువెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో అధికారులు మహబూబ్నగర్లోని రాష్ట్ర సదనానికి తరలించారు. పోలీసులు శుక్రవారం ఆమెను నాగర్కర్నూల్ కోర్టులో హాజరుపర్చారు. స్వాతికి జామీను ఇచ్చిన ఇద్ద రు న్యాయస్థానం ముందుకు వచ్చి తమ పూచీకత్తును ఉపసంహరించుకుంటున్నామని న్యాయమూర్తికి విన్నవించారు. ఈ అంశంపై కోర్టు 7వ తేదీ వరకు గడువు పెట్టింది. -
హత్య కేసులో బెయిల్పై విడుదలైన స్వాతి
-
స్క్రీన్ టెస్ట్
1. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చెలియా’ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ హైదరాబాదీ అమ్మాయి ఎవరో తెలుసా? ఎ) అదితీ రావు హైదరీ బి) కలర్స్ స్వాతి సి) అంజలి డి) బిందు మాధవి 2. ‘మోసగాడు’ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసారు. శోభన్బాబు హీరోగా నటించారు. అందులో విలన్గా నటించిన ఆర్టిస్ట్ తర్వాతి కాలంలో శ్రీదేవి సరసన హీరోగా నటించారు. ఎవరా హీరో? ఎ) మోహన్బాబు బి) చిరంజీవి సి) రాజేంద్రప్రసాద్ డి) కృష్ణ 3. రజనీకాంత్ నటించిన ‘లింగా’ సినిమాలో హీరోయిన్గా నటించి, మార్కులు కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో కనుక్కోండి? ఎ) సోనాక్షి సిన్హా బి) దీపికా పదుకోన్ సి) ఐశ్వర్యా రాయ్ డి) అమీ జాక్సన్ 4. ‘యాక్షన్ జాక్సన్’ అనే బాలీవుడ్ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అందులో ఓ సాంగ్లో టాలీవుడ్ టాప్ స్టార్ స్టెప్పులేశారు. ఎవరా హీరో? ఎ) ప్రభాస్ బి) వెంకటేశ్ సి) రానా డి) నానీ 5. ‘అనసూయ రామలింగం’ అనే పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తు తెచ్చుకోండి? (చిన్న క్లూ.. ఈ సినిమాలో హీరో నితిన్) ఎ) కాజల్ అగర్వాల్ బి) సమంతా అక్కినేని సి) శ్రుతీహాసన్ డి) అనుపమ పరమేశ్వరన్ 6. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తన కెరీర్లో మొత్తం ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఐదు సినిమాల్లోనూ నటించిన ఒకే ఒక్క ఆర్టిస్ట్ ఎవరో కనుక్కోండి? ఎ) జయసుధ బి) అలీ సి) ప్రభు డి) ప్రకాశ్రాజ్ 7. ‘రేసుగుర్రం’ చిత్రంలో ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటూ ‘కిల్బిల్పాండే’ పాత్రలో కామెడీ పండించిన నటుడెవరో చెప్పండి? ఎ) తనికెళ్ల భరణి బి) బ్రహ్మానందం సి) శ్రీనివాస రెడ్డి డి) పోసాని కృష్ణమురళి 8 రాజీవ్ కనకాల అనగానే ఈ హీరోకు చాలా క్లోజ్ అని అందరూ అనుకుంటారు. ఏ హీరోకు ఈయన క్లోజ్? ఎ) ఎన్టీఆర్ బి) అల్లు అర్జున్ సి) సిద్ధార్థ్ డి) రామ్ చరణ్ 9. 2008లో జరిగిన ‘ఫెమీనా మిస్ ఇండియా’ పోటీల్లో ‘మిస్ ఫ్రెష్ ఫేస్’, ‘మిస్ బ్యూటీఫుల్ స్కిన్’ రెండు అవార్డులను సొంతం చేసుకున్న బ్యూటీ ఎవరో కనుక్కోండి? ఎ) జెనీలియా బి) తాప్సీ సి) యామీ గౌతమ్ డి) చార్మీ 10. ‘పెట్ర తాయ్’ అనే తమిళ సినిమా కోసం సింగర్ ఏ.యం.రాజాతో పాటు అదే సినిమా తెలుగు వెర్షన్ ‘కన్నతల్లి’ కోసం సింగర్ ఘంటసాలతో డ్యూయట్ ద్వారా అరంగేట్రం చేసిన పాపులర్ సింగర్ ఎవరో తెలుసా? ఎ) యస్.జానకి బి) పి. సుశీల సి) జిక్కీ డి) రావు బాలసరస్వతి 11. తెలంగాణలోని యాదగిరి గుట్ట నరసింహ స్వామి టెంపుల్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్ను నియమించింది. ఆయనెవరు? ఎ) తోట తరణి బి) ఆనంద్ సాయి సి) ఏయస్. ప్రకాశ్ డి) చంటి అడ్డాల 12. ‘శంభో శంకర’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ ఎవరో తెలుసా? ఎ) ధన్రాజ్ బి) ‘వెన్నెల’ కిశోర్ సి) సప్తగిరి డి) ‘షకలక’ శంకర్ 13. హీరో నాని నటించిన ‘స్నేహితుడా’ చిత్రంలో హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) కలర్స్ స్వాతి బి) మాధవీ లత సి) వేద డి) మధు శాలిని 14. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్ రావత్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) వీవీ వినాయక్ బి) బోయపాటి శ్రీను సి) పూరి జగన్నాథ్ డి) ఎస్.ఎస్. రాజమౌళి 15 ‘బళ్లారి బావ...’ అంటూ రానాతో కలిసి ఓ స్టార్ హీరో చిందేశారు. ఆయన ఎవరు? ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) నాగచైతన్య డి) అఖిల్ 16. ‘‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ సొసైటీ. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి..’’ అనే డైలాగ్ను రాసిందెవరో తెలుసా? ఎ) కొరటాల శివ బి) అబ్బూరి రవి సి) కోన వెంకట్ డి) అనిల్ రావిపూడి 17. అఖిల్ హీరోగా వస్తున్న మూడో చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) వెంకీ కుడుముల బి) సుధీర్ వర్మ సి) వెంకీ అట్లూరి డి) విక్రమ్ కుమార్ 18. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) చందు మొండేటి బి) సందీప్ రెడ్డి సి) మారుతి డి) మíహీ వి.రాఘవ్ 19. ఈ ఫొటోలోని హీరోయిన్ ఓ తమిళ హీరో భార్య. ఎవరా హీరోయిన్? ఎ) విజయ్ బి) సూర్య సి) అజిత్ డి) ధనుష్ 20. ఈ పక్కనున్న ఫొటోలోని హీరోయిన్ ఎవరో చెప్పండి? ఎ) స్నేహా ఉల్లాల్ బి) కత్రినాకైఫ్ సి) సోహా అలీఖాన్ డి) ఆలియా భట్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) బి 8) ఎ 9) బి 10) బి 11) బి 12) డి 13) బి 14) డి 15) ఎ 16) ఎ17) సి 18) ఎ19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
సాహసాల అలలపై చెరిగిపోని సంతకం..
విశాఖసిటీ: సముద్రమంత సాహసం.. సాటిలేని మనోనిబ్బరం.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం.. అంతకుమించిన నైపుణ్యం.. ఇవన్నీ ఉన్నాయంటే.. ఆ అమ్మాయి కచ్చితంగా పాతర్లపల్లి స్వాతి అవుతుంది. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన ఆ అద్భుత వనిత తప్పనిసరిగా స్వాతి అవుతుంది. కేవలం ఓ తెరచాప పడవలో ఐదు మహాసముద్రాలను అధిగమించి, భారత నౌకాదళ చరిత్రలోనే సాటిలేని అధ్యాయాన్ని లిఖించిన ఆ యువతి తప్పనిసరిగా మన విశాఖకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ స్వాతి అవుతుంది. ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో ప్రయాణించిన ఆరుగురు మహిళల బృందంలో ఒకరైన స్వాతి, నావికా సాగర్ పరిక్రమ పూర్తిచేసిన నేపథ్యంలో.. తన అనుభవాలను, భావోద్వేగాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. సాక్షి: విజయవంతమైన సాహస యాత్రలో భాగస్వాములైనందుకు అభినందనలు. తరిణి విజయం గురించి మీరెలా ఫీలవుతున్నారు.? స్వాతి: థాంక్యూ. భారత నౌకాదళ చరిత్రలో ఇదో పెద్ద విజయం. పూర్తిగా మహిళలు సాధించిన ఈ విజయాన్ని వారికి, మా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. 193 రోజుల పాటు ఐదు మహాసముద్రాల మీదుగా 21,600 వేల నాటికల్ మైళ్లు సాగిన నావికా సాగర పరిక్రమ నిజంగా నా జీవితంలో అతిగొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. సాక్షి: మీ విజయంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంది.? స్వాతి: ఇది ముమ్మాటికీ నాన్న కల. అమ్మ శ్రమ. ముగ్గురు కూతుళ్లను పెంచేందుకు రోజుకు 16 గంటలకు పైగా కష్టపడుతూ మా జీవితానికి ఓ మంచి భవిష్యత్తునిచ్చింది నా తల్లిదండ్రులే. సాగర పరిక్రమకు వెళ్తానని చెప్పినప్పుడు నాన్న కొంచెం ఆలోచించినా.. అమ్మ మాత్రం ధైర్యం చెప్పింది. విజయం సాధించి వెనక్కు వస్తావని వెన్నుతట్టి ప్రోత్సహించింది. వారిచ్చిన స్ఫూర్తితోనే ముందడుగు వేశాను. సాక్షి: నౌకాదళంలోకి రావాలన్నది మీ ఆశయమా? దాన్ని ఎలా సాధించారు? స్వాతి: ముందు నేను ఇండియన్ నేవీలోకి రావాలని అనుకోలేదు. మా నాన్న పాతర్లపల్లి ఆదినారాయణ ఇక్కడి ఇండస్ట్రియల్ క్యాంటీన్లో హెడ్కుక్. అమ్మ రాణి సెయిలింగ్ క్లబ్లో హెల్పర్గా పనిచేశారు. నాన్న పనిచేసే చోటుకు నేవీ అధికారులు వచ్చే వాళ్లు. వారిని చూసి తనకు అబ్బాయి పుడితే నేవీలో చేర్పించాలని అనుకున్నారు. అయితే.. ముందు ఇద్దరూ అమ్మాయిలే పుట్టారు. మూడో బిడ్డయిన నేను కూడా అమ్మాయినే. అయినా.. నాన్న నేవీ ఆశలు వదులుకోలేదు. ఇద్దరు అక్కల కంటే చురుగ్గా నేను ఉండటంతో నన్ను ఆ దిశగా నడిపించారు. అందరిలాగానే నేనూ బీటెక్లో చేరుదామని అనుకున్నాను. నాన్న మాత్రం బీఎస్సీలో చేరితే.. నీలైఫ్ బావుంటుందని చెప్పడంతో సరే అన్నాను. నాన్న మార్గదర్శిగా నిలవడంతో నేనీ స్థాయిలో ఉన్నాను. సాక్షి: సెయిలింగ్లో మీకెలా అవకాశాలొచ్చాయి.? ఆ రంగంలో మీ అనుభవం ఏమిటి? స్వాతి: చిన్నప్పటినుంచి ఎన్సీసీ క్యాడెట్గా శిక్షణ పొందాను. సెయిలింగ్ నేర్చుకున్నాను. నవంబర్ 2011లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా నేవీలో ఉద్యోగం సాధించాను. 2013లో వైజాగ్ వచ్చాను. ఐఎన్ఎస్ డేగాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా పనిచేస్తున్న సమయంలో కేప్ టూ రియో పోటీల గురించి ఇండియన్ నేవీకి ఆహ్వానం అందింది. ప్రతి మూడేళ్లకోసారి దక్షిణాఫ్రికా నిర్వహించే ఈ ట్రాన్స్ అట్లాంటిక్ క్రాస్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాను. సుమారు నెల రోజుల పాటు సముద్రంలో సాగే ఈ పోటీలో తరిణిలో ఉన్న లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి, లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమాల్తో కలిసి ప్రయాణం చేశాను. లాంగ్ సెయిలింగ్ బోట్లో ప్రయాణం చేసిన మొదటి భారతీయ (నేవీ) అమ్మాయిలుగా చరిత్ర సృష్టించాం. నేవీ ఉమెన్ ఆఫీసర్లు కూడా సుదీర్ఘ కాలం సెయిలింగ్ చెయ్యగలరని నేవీకి విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత వచ్చిన అవకాశమే ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం. సాక్షి: ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం ఎలా ప్రారంభించారు.? నౌక గురించి మీ అవగాహన ఏమిటి? ఆరుగురు అమ్మాయిల బృందాన్ని ఎలా ఎంపిక చేశారు.? స్వాతి: నావికా సాగర పరిక్రమలో పాల్గొనాలనుకుంటున్నారా? అని నేవీ నుండి ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొని ఓకే చెప్పాను. జమాల్, వర్తికా, నేను ముగ్గురం కోర్టీం గా వ్యవహరించాం. ఆ తర్వాత పాయల్, విజయ, ఐశ్వర్య వచ్చారు. ఆరుగురుం కలిసి పలు ప్రాంతాలకు సెయిలింగ్కు వెళ్లేవాళ్లం. పకడ్బందీగా ట్రైనింగ్ ఇచ్చారు. ఐఎన్ఎస్వీ తరిణి నిర్మాణంలో మాకూ భాగస్వామ్యం ఉంది. ప్రతి పార్ట్ని ఎలా తయారు చేశారో, ఏది ఎక్కడ, ఎందుకు అమర్చారో నిర్మాణ దశలో తెలుసుకున్నాం. షిప్యార్డ్కు వెళ్లి ప్రతి పార్ట్ ఫిట్ చేసినప్పుడు చూసి నేర్చుకున్నాం. అందుకే.. తరిణి ప్రయాణంలో నౌకలో ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించుకోగలిగాం. సాక్షి: పసిఫిక్లో తుపాను ఎదురైనప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి? స్వాతి: 800 నాటికల్ మైల్స్ దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో వెస్ట్ ఆఫ్ సౌత్ అమెరికా వద్ద తుపాను ప్రారంభమైంది. దాదాపు 20 గంటల పాటు చిక్కుకున్నాం. 6 నుంచి 7 గంటల పాటు బీభత్సమే. అయితే అప్పుడు మాకు భయం వేయలేదు. ఎందుకంటే భయపడేందుకు కూడా టైం దొరకలేదు. బోట్ను ఎలా కంట్రోల్ చెయ్యాలోనని తీవ్రంగా శ్రమించాం. నిద్రపోయే సమయం లేదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు రాత్రి భోజనం చేసేంత వరకూ నీరు కూడా తాగలేదంటే పరిస్థితిని ఊహించుకోండి. యుద్ధం చేసినంత కష్టంగా సాగిందా ప్రయాణం. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులెదురైనా ఇంజిన్ను వినియోగించకూడదు. ప్రయాణం మొత్తం తెరచాపల కదలికల ద్వారా మాత్రమే చేశాం. పెద్ద పెద్ద అలలు వచ్చి మా నౌకు ఢీకొట్టేవి. లాభం లేదనుకొని అలల వైపుగా మా దిశను మార్చేసేవాళ్లం. దీనివల్ల వేరే మార్గంలోకి వెళ్లాల్సి రావడంతో మా ప్రయాణ దూరం పెరిగిపోయింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతున్నాయి. సాక్షి: ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన గ్రేట్ కేప్స్ను అధిగమించిన సమయంలో మీ అనుభూతి ఏమిటి? స్వాతి: అదో అద్భుత అనుభవం. గ్రేట్ కేప్స్ దాటుతున్న సమయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయన్న ఆతృత, ఆసక్తి మాలో ఉండేది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బోట్ను సురక్షితంగా ఉంచాలని కెప్టెన్ ఆదేశించారు. మూడు కేప్స్ను దాటిన తర్వాత చాలా ఆనందపడ్డాం. ప్రపంచంలో సముద్ర మార్గంలో అన్నిటికంటే క్లిష్టమైన ప్రాంతాలను అధిగమించాం. ఇలా చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సాక్షి: ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణంతో మీరు నేర్చుకున్నదేమిటి? స్వాతి: తరిణి ప్రయాణంలో కష్టాలను ఎలా అధిగమించాలో నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటినుంచి పారిపోకుండా ఎదుర్కోవడం నేర్చుకున్నాను. మొత్తమ్మీద ఈ నౌక నన్ను ఆల్రౌండర్ చేసింది. ఇతర నౌకలతో సమాచార అనుసంధానం ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాను, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్, మెడికల్ అసిస్టెంట్, ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి ఇలా ఎన్నో విషయాల్ని నౌక నేర్పింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్ వైట్తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. హోళీ, దీపావళి, న్యూఇయర్.. ఇలా ప్రతి వేడుకనీ నౌకలో చేసుకోవడం కొత్త అనుభూతినిచ్చింది. దాదాపు 8 నెలల పాటు స్నానం చెయ్యకుండా ప్రయాణం చేశాం. కేవలం ఫేషియల్ వైట్తోనే శరీరాన్ని శుభ్రం చేసుకువాళ్లం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సాక్షి: యాత్రకు సంబంధించి మీరు మరిచిపోలేని జ్ఞాపకం ఏమిటి? స్వాతి: 2017 నవంబర్లో గోవాలో ఐఎన్ఎస్వీ తరిణి ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఎలాంటి సెటప్ ఉందో.. 2018 మే 21న తిరిగి గోవా చేరుకున్నప్పుడు అదే తరహా ఏర్పాట్లు చేశారు. చాలా ఆశ్చర్యం వేసింది. రక్షణ శాఖమంత్రి, ప్లాగ్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, వేదిక, బోర్డులు.. ఇలా ఏ ఒక్కటీ మారలేదు. అది చూసి.. ఇప్పటి వరకూ జరిగింది కలా..? ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామా..? అని అనిపించింది. అప్పటి వరకూ పడిన కష్టాన్ని అమ్మా నాన్నని చూసిన తర్వాత పూర్తిగా మర్చిపోయాను. నాన్న కళ్లల్లో ఆనందం చూసినప్పుడు ప్రపంచంలో అతి పెద్ద రికార్డు సాధించినంత గర్వంగా ఫీలయ్యాను. అమ్మాయి తలచుకుంటే అవలీలగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని మా తరిణి బృందం నిరూపించింది. సాక్షి: రకరకాల వాతావరణాన్ని ఎలా తట్టుకోగలిగారు? స్వాతి: ఒక్కో చోట ఒక్కోలా ఉష్ణోగ్రతలు మారుతూ ఉండేవి. దాదాపు సబ్ జీరో, మైనస్ ఉష్ణోగ్రతలే ప్రతి చోటా ఎదురయ్యాయి. దాదాపు 12 వేల కిలోమీటర్లు సున్న డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల మధ్య ప్రయాణం సాగించాం. విపరీతమైన చలి, హీటర్ లేదు, ఫ్యాన్లేదు. అయినా ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ఇది సాహస యాత్ర. అన్ని సౌకర్యాలున్నప్పుడు అది సాహసం ఎందుకవుతుంది. అందుకే.. వాటిని ఎదుర్కొన్నాం. చలిని తట్టుకునేందుకు 7 నుంచి ఎనిమిది డ్రెస్లు ఒకేసారి వేసుకునేవాళ్లం. అలల తీవ్రతను రాత్రి పూట గుర్తించేందుకు నైట్ విజన్ కళ్లజోళ్లు వినియోగించేవాళ్లం. పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణం సాగించినప్పుడు 45 రోజుల పాటు ఒక్క నౌక కూడా కనిపించలేదు. ఒంటరి జీవుల్లా ప్రయాణం సాగించాం. -
ఎవరికో భయపడి టైటిల్ మార్చొద్దు
తమిళసినిమా: ఎవరికో భయపడి చిత్ర పేర్లను మార్చకండి అంటూ నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అన్నారు. జయ శుభశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్కే.సుబ్బయ్య నిర్మించిన చిత్రం నుంగంబాక్కమ్. ఇది సమీపకాలంలో స్వాతి అనే యువతి హత్య ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. దీనికి కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎస్డీ.రమేశ్ సెల్వన్ నిర్వహించారు. ఇందులో శంకర్ సీఐగా అజ్మల్ నటించారు.ఆయిరా, మనో ముఖ్య పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో ఏ.వెంకటేశ్ న్యాయవాదిగా బెంజ్క్లబ్ శక్తి సెంగోట్టై మరో ఇన్స్పెక్టర్గా నటించారు. జోన్స్ ఆనంద్ ఛాయాగ్రహణం, శ్యామ్ డీ.రాజ్ సంగీతాన్ని అందించారు. చిత్ర ట్రైలల్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న విశాల్ ట్రైలర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ ముందు స్వాతి కొలై వళక్కు పేరుతో జరిపిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొన్నానన్నారు. ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రానికి అందుకు తగ్గ టైటిల్ పెట్టడమే న్యాయం అని పేర్కొన్నారు. అలాంటిది ఎందుకు ఈ చిత్రానికి నుంగంబాక్కమ్ అని పేరు మార్చారు ఎవరైనా చెప్పారా? లేక మరెవరి ఒత్తిడి కారణంగానో టైటిల్ మార్చారా అని ప్రశ్నించారు. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలకు టైటిల్ను ఎవరికో భయపడి మార్చాల్సిన అవసరం లేదని విశాల్ పేర్కొన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుందని, తనకు అలాంటి ఆసక్తి ఉందని అన్నారు. తాను ఇరుంబుతిరై చిత్రంలో రెండు సన్నివేశాలను తొలగించిన సంఘటనను ఎదుర్కొన్నానని, డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డు వంటి సన్నివేశాల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. నుంగంబాక్కమ్ చిత్రానికి తన వంతు సహాయంగా మంచి విడుదల తేదీని కేటాయిస్తానని విశాల్ పేర్కొన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఎస్ఏ.చంద్రశేఖర్, గీతరచయిత స్నేహన్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
హుజూరాబాద్లో విషాదం
హుజూరాబాద్: పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదని హైదరాబాద్లో ఓ తల్లి కూతురుతో సహా ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా హుజూరాబాద్లో విషాదం నెలకొంది. మంగళవారం పట్టణంలో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్కు చెంది న రిటైర్డు ఉపాధ్యాయుడు సత్యనారాయణ తన కూతు రు స్వాతి(31)ని ఇదే పట్టణానికి చెందిన మేనల్లుడైన ప్రదీప్కుమార్కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశాడు. వీరు హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పీజేఆర్ఎస్క్లైవ్లోని సాయి పెరల్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ప్రదీప్కుమార్ సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా, స్వాతి హౌస్వైఫ్గా ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు అరుష్రాం(5), కుమార్తె శ్వాని(తొమ్మిది నెలలు) ఉన్నారు. మేనరికంతో సంపూర్ణ ఎదుగుదల లేని పిల్ల లు జన్మించారని స్వాతి ఎప్పుడూ మనోవేదనకు గురయ్యేది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయేది. మానసికంగా కుంగిపోయిన స్వాతి ఈ నెల22న వారు నివాసం ఉంటున్న భవనంపై నుంచి కుమార్తెను తోసేసి, తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఇద్దరి మృతదేహాలను హుజూరాబాద్ తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
తల్లడిల్లిన తల్లిగుండె
బిడ్డల అనారోగ్యంతో కలత చెందిన కన్న తల్లి.. ఓ పాపతో సహా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చందానగర్లో సోమవారం చోటు చేసుకుంది. తల్లి స్వాతితో పాటు తొమ్మిది నెలల పాప శాన్వీ కూడా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. చందానగర్: పుట్టిన ఇద్దరు చిన్నారులు తరచూ ఆనారోగ్యానికి గురవుతుండడంతో కలత చెందిన ఓ తల్లి తొమ్మిది నెలల చిన్నారితో సహా భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వేణుకుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, హుజురాబాద్కు చెందిన ప్రదీప్కుమార్, స్వాతి (30) దంపతులు. సాప్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ కుటుంబంతో సమా చందానగర్ కేఎస్ఆర్ ఎన్క్లేవ్లోని సాయిపెరల్ రెసిడెన్సీలో ఉంటున్నాడు. సాయిపెరల్ రెసిడెన్సీ ,తల్లీబిడ్డల మృతదేహాలు వీరికి కుమారుడు అరుశురాం(5), శాన్వీ (9 నెలలు) ఉన్నారు. చిన్నారులిద్దరూ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్వాతి మానసికంగా బాధపడుతుండేది. అరుశురాం అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. సోమవారం ఉదయం స్వాతి, చిన్నారి శాన్విని తీసుకొని తమ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన స్థానికులు బాధితులను మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
భార్య భర్త మధ్యలో ప్రియుడు!
-
మద్యంలో సైనెడ్ కలిపి భార్య ఘాతుకం
-
ప్రేమగా మందిచ్చి భార్య ఘాతుకం
సాక్షి, గుంటూరు : వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న సంఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. మొన్న స్వాతి, నిన్న జ్యోతి సంఘటనలు సంచలనంగా మారగా తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది. ఎవరికి అనుమానం రాకుండా మద్యంలో సైనెడ్ కలిపి తాగించింది. అనుమానం రాకుండా ఆత్మహత్య చిత్రించింది. అందుకుగాను అతడి డెడ్బాడీని తీసుకెళ్లి పునుగుపాడువద్ద ఉన్న కాలువలో పడేసింది. ఈ సంఘటన గత నెల డిసెంబర్ (2017) 19న చోటుచేసుకుంది. అయితే, తల్లిదండ్రుల అనుమానం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవిద్య అతడి ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం గొట్టిపాటి వీరయ్య చౌదరి, గుంజి బాలరాజు, పూజల చౌడయ్య అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టగా శ్రీవిద్య మాత్రం పరారీలో ఉంది. -
స్వాతి నుంచి ప్రాణహాని ఉంది..!
నాగర్కర్నూల్ క్రైం: నాగర్కర్నూల్లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను కలిశారు. స్వాతి నుంచి వారి పిల్లలు వర్షిణి, దర్శిత్రెడ్డిలకు కూడా ప్రాణహాని ఉందన్నారు. సుధాకర్రెడ్డి హత్యతో తాము వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్ వైద్య ఖర్చులు పెట్టించడంతో ఆర్థికంగా చితికిపోయామని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. -
అనుమతి లేని బోటులో రాష్ట్రపతి సతీమణి, కుమార్తె
భవానీపురం/సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): పవిత్ర సంగమం వద్ద ఇటీవల పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో కృష్ణా నదిలో ప్రైవేట్ సంస్థలకు చెందిన బోట్లన్నింటినీ నిలిపివేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతిని బుధవారం పున్నమిఘాట్ నుంచి భవానీ ద్వీపానికి అనుమతి లేని ప్రైవేట్ బోటులో తీసుకురావడం గమనార్హం. మూసివేసిన చాంపియన్ యాచ్ట్ క్లబ్కు చెందిన బోటులో వీరిని తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ బోటులో రాష్ట్రపతి భార్య, కుమార్తెను ఎండలో కూర్చోబెట్టారు. తిరుగు ప్రయాణంలో పర్యాటక శాఖకు చెందిన బోధిసిరి పడవలో తీసుకొచ్చారు. భవానీ ద్వీపానికి వెళ్లేటప్పుడు కూడా ఇదే బోటులో తీసుకెళితే బాగుండేది కదా అని సవితా కోవింద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్రపతి సతీమణి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో సూర్యకుమారి, ట్రస్టు బోర్డు చైర్మన్ గౌరంగబాబు, పాలక మండలి సభ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. సవితాకోవింద్, స్వాతి అమ్మవారికి సహస్ర నామార్చన చేయించుకున్నారు. అనంతరం వారు భవానీ ద్వీపం చేరుకున్నారు. పున్నమిఘాట్ వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో వారు కృష్ణానదిలో విహరించారు. అంతకు ముందు స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 36వ జాతీయ గులాబీల ప్రదర్శనను, గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన ధింసా నృత్యాన్ని తిలకించారు. భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంగళగిరి పట్టు చీరల స్టాల్ను సందర్శించి వాటి నాణ్యత ప్రమాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేపాక్షి స్టాల్ను సందర్శించి కొండపల్లి బొమ్మలను కొనుగోలు చేసి వాటి విశేషాలను తెలుసుకున్నారు. బందరు మిఠాయి స్టాల్ వద్ద బందరు లడ్డూ రుచులను ఆస్వాదించారు. ప్లోటింగ్ పౌంటేయిన్, మ్యూజికల్ లేజర్ షోను తిలకించారు. త్రుటిలో తప్పిన ప్రమాదం: అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రాజగోపురం నుంచి నడుస్తున్న సవితా కోవింద్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజగోపురం లోపలకు ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ ర్యాంప్ వద్ద సవితా కోవింద్ అదుపు తప్పి జారిపోగా, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆమెను పట్టుకున్నారు. ఆమె వెంట ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
బెయిల్కు ప్రయత్నించం
సాక్షి, నాగర్కర్నూల్: సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి నాగర్కర్నూల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా.. రాజేశ్ను జైలుకు తరలించారు. కాగా, స్వాతి, రాజేశ్లకు బెయిల్ కోసం తాము ప్రయత్నించబోమని ఇరు కుటుం బాలు ప్రకటించాయి. కట్టుకున్నోడిని హతమార్చి.. అటు కన్నవారికి తలవంపులు తెచ్చిన స్వాతికి మరణశిక్ష పడాలని సుధాకర్రెడ్డి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. స్వాతి తల్లిదండ్రులు కూడా బెయిల్ కోసం తాము ప్రయత్నించమని తేల్చి చెప్పారు. ఇదిలాఉండగా.. సుధాకర్రెడ్డి తల్లికి స్వాతి తండ్రి సొంత సోదరుడు. మేనమామ కూతురినే సుధాకర్రెడ్డి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య మొన్నటి వరకు సత్సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం అవి పటాపంచలయ్యాయి. సుధాకర్, స్వాతి పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. వారిని తీసుకుపోయేందుకు సుధాకర్రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించకపోగా.. తమ కుమారుడి వయసు వచ్చాక మనవడిని తీసుకువెళ్తామని వారు చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు రాజేశ్ను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. స్వాతి ప్రోద్బలంతోనే సుధాకర్రెడ్డిని హత్య చేశారని చెప్పారు. మూడు నెలల క్రితమే సుధాకర్ రెడ్డిపై స్వాతి హత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు. స్వాతి కోసమే కాల్చుకున్నా.. స్వాతితో కలసి బతికేందుకే తన ముఖంపై పెట్రోల్ వేసుకుని కాల్చుకున్నానని, ఇది ఎంతో కష్టమైనా ఆమె కోసం భరించానని రాజేశ్ చెప్పుకొచ్చాడు. సుధాకర్తో శత్రుత్వం లేదని.. స్వాతి కోసమే అతడిని హత్య చేసేందుకు అంగీకరించినట్లు చెప్పాడు. ఎంత ఖర్చయినా తనకు బాగుచేయిస్తానని స్వాతి చెప్పిందని, పిల్లలను తమతోనే ఉంచుకుని మిగతా జీవితాన్ని ఎక్కడికైనా దూరంగా వెళ్లి గడపాలని భావించినట్లు వివరించాడు. -
పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హతమార్చారు
-
ముఖం సరిగా కాలలేదని స్టౌపై పెట్టాడు..
నాగర్ కర్నూల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పోలీసులు.. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... పథకం ప్రకారమే సుధాకర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసులో రాజేశ్ ఏ1, స్వాతిని ఏ2గా చేర్చినట్లు తెలిపారు. ‘నలుగురు వ్యక్తులు వచ్చి సుధాకర్ రెడ్డిపై యాసిడ్ దాడి చేశారని కుటుంబ సభ్యులకు స్వాతి చెప్పింది. ఆ వెంటనే మహబూబ్నగర్కు అక్కడ నుంచి హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఇద్దరు కలిసి సుధాకర్రెడ్డి ఇంట్లో హత్య చేసి అటవీ ప్రాంతంలో కాల్చేశారు. తన తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులుగా నిద్ర పట్టడం లేదని రాజేశ్ తన స్నేహితుడు నరేష్ను కోరాడు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి పడుకున్న సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చితలపై మోది ఇద్దరు కలిసి హతమార్చారు. ఆ తర్వాత ఇంటికొచ్చాక రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. కానీ ...అనుకున్న మేరకు కాలకపోవడంతో ముఖాన్ని స్టౌపై పెట్టాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో రాజేశ్ను చేర్చించిన వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లను స్వాతి కోరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదని కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో ఆ విషయాన్ని వారు మా దృష్టికి తెచ్చారు. మేం స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే హత్య విషయం తేలింది. స్వాతికి, రాజేశ్కు రెండేళ్లుగా సంబంధం ఉంది. కానీ ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియదు. అయితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని స్వాతిని రాజేశ్ అడిగాడు. కానీ పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రానని స్వాతి చెప్పింది. ఇద్దరం కలిసి ఉండాలంటే సుధాకర్ రెడ్డిని హత్య చేసి ఆ స్థానంలో నువ్వు రావాలని స్వాతి ఈ సందర్భంగా రాజేశ్కు చెప్పింది. దాంతో ఇద్దరు ఆలోచించి ప్లాన్ చేశారు’ అని తెలిపారు. అలాగే సుధాకర్ రెడ్డి శవాన్ని కాల్చిన సంఘటనా స్థలం నుంచి సిరెంజ్, ఐరన్ రాడ్, చున్నీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో విచారణ జరపాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్ మాట్లాడుతూ...‘మేమిద్దం కలిసే సుధాకర్ రెడ్డిని హత్య చేశాం. సుధాకర్ రెడ్డి తనను కొడుతున్నాడని, పట్టించుకోవడం లేదని స్వాతి తరచు నాకు చెప్పేది. హత్యకు పథకం పన్నాక ఒకసారి ఆలోచించమని స్వాతిని కోరా. హ్యాపీగా ఉండాలంటే ప్లాన్ను అమలు చేయాల్సిందేనని స్వాతి చెప్పింది.’ అని తెలిపాడు. కాగా ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతిని శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 29వ వరకూ రిమాండ్ పొడిగించింది. నాగర్ కర్నూల్లో సివిల్ కాంట్రాక్టర్సుధాకర్ రెడ్డిని భార్య స్వాతి హత్య చేసిన విషయం తెలిసిందే. -
స్వాతి ప్రోత్సాహంతోనే హత్య
సాక్షి, నాగర్కర్నూల్/నాగర్కర్నూల్ క్రైం: కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డితో తనకు పరిచయంగానీ, శత్రుత్వంగానీ ఏమీ లేదని హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేశ్ చెప్పాడు. కేవలం అతని భార్య స్వాతి ప్రోత్సాహంతోనే తాను హత్య చేసినట్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన సుధాకర్రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాజేశ్ను గురువారం నాగర్కర్నూల్ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ కేసులో స్వాతిని రెండు రోజుల క్రితం రిమాండ్కు పంపిన విషయం విదితమే. రాజేశ్ను పోలీసులు రోజంతా విచారించారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం. పారిపోదామంటే.. స్వాతికి సుధాకర్ రెడ్డి అంటే ఇష్టం లేదని, ఆమె ఒత్తిడి, ప్రోద్బలంతోనే పథకం ప్రకారం అతడిని హతమార్చామని రాజేశ్ హైదరాబాద్లో మీడియా తో చెప్పాడు. పోలీసుల విచారణలో రాజేశ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మూడు నెలల క్రితం ఎక్కడికైనా పారిపోదామని స్వాతిని రాజేశ్ కోరగా పిల్లలు, తల్లిదండ్రులను వదిలి రాలేనని చెప్పింది. గత నెల 26న స్వాతి, రాజేశ్ కలసి తిరగడాన్ని సుధాకర్రెడ్డి చూశాక వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అదేరోజు రాత్రి సుధాకర్రెడ్డిని చంపాలని స్వాతి పథకం పన్నింది. దీంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేసింది. 27న తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తలపై రాడ్తో బాది హత్య చేశారు. రాజేశ్ను డ్రైవర్గా ఇంటి యజమానికి స్వాతి పరిచయం చేసింది. తాము ఈ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలన్న దానిపై చర్చించారు. సుధాకర్రెడ్డి స్థానంలో రాజేశ్ ఉండేలా స్వాతి ప్లాస్టిక్ సర్జరీ ఆలోచన చెప్పగా.. ముఖానికి కొన్ని రసాయనాలు పూసుకుని స్వాతి చున్నీపై పెట్రోల్ వేసుకుని రాజేశ్ ముఖాన్ని కాల్చుకున్నాడు. మరో కారు అద్దెకు తీసుకుని హైదరాబాద్ వెళ్లారు. అదే సమయంలో సుధాకర్రెడ్డిపై యాసిడ్ దాడి జరిగిందని స్వాతి బంధువులకు ఫోన్లో తెలిపింది. కాగా, హత్య కేసులో రాజేశ్ వాడిన రాడ్ను, మత్తు ఇంజక్షన్ల సిరంజీలను, రాజేశ్ తల వెంట్రుకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మత్తు ఇంజక్షన్ సరఫరా చేసినట్లుగా భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్ను శుక్రవారం రిమాండ్కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాతి.. ఖైదీ నంబర్ 687 మహబూబ్నగర్ క్రైం: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డి హత్య కేసులో నిందితురాలైన ఆయన భార్య స్వాతికి జైలులో అధికారులు 687 నంబర్ కేటాయించారు. 13 మంది ఖైదీలతో పాటు లాకప్లో ఆమెను ఉంచారు. జైలులో ఎలాంటి ఆందోళన లేకుండా గడిపినట్లు సమాచారం. ఉదయం పూట యోగా చేసిన స్వాతి.. అనంతరం జైలులోని నిరక్షరాస్యులకు అక్షరాలు దిద్దించినట్లు తెలిసింది. -
స్వాతి చెప్పినట్లే చేశా...: రాజేశ్
సాక్షి, హైదరాబాద్ : నాగర్ కర్నూల్ సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజేశ్ గురువారం పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించాడు. సుధాకర్ రెడ్డి భార్య స్వాతి తనకు అన్నవిధాలా ఆర్థిక సాయం చేసిందని అతడు తెలిపాడు. స్వాతి ఇచ్చిన డబ్బులతోనే డ్రెస్లను కొనుక్కునేవాడినని చెప్పాడు. అంతేకాకుండా స్వాతి టీవీ సీరియల్స్ బాగా చూస్తుందని, చాలాసార్లు తనకు ఆ స్టోరీలు చెప్పేదని వివరించాడు. ఇక సుధాకర్ రెడ్డి హత్య విషయంలో స్వాతి చెప్పినట్లే చేశానని రాజేశ్ పోలీసుల విచారణలో తెలిపారు. కాగా హైదరాబాద్లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్వాతి .. ఖైదీ నెంబర్ 678 పథకం ప్రకారమే కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతి ప్రస్తుతం పాలమూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. అయితే ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోగా, తోటి ఖైదీలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతికి జైలు అధికారులు 678 ఖైదీ నెంబర్ను కేటాయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పూర్తి చేసిన ఆమె... తోటి ఖైదీలతో పాటు జైలులో గడ్డి కోసింది. కాగా స్వాతి వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నదని పోలీసుల విచారణలో బయటపడింది. నర్సింగ్ శిక్షణ పొందిన స్వాతి ఆ సమయంలో పలువురితో చనువుగా మెలిగేదని తెలుస్తోంది. జల్సాలకు ఎక్కువగా అలవాటు పడ్డ స్వాతిని తన పద్ధతి మార్చుకోవాలని భర్త తరచు చెబుతూ వచ్చేవాడని సమాచారం. అయితే మూడు నెలల నుంచే సుధాకర్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు స్వాతి, ఆమె ప్రియుడు రాజేశ్ పథకం రచిస్తూ వచ్చారని, గతనెల 27న అందుకు మంచి అవకాశం దొరకడంతో పని ముగించినట్లు పోలీసులు తెలిపారు. కట్టుకున్న భర్త, కన్నబిడ్డలను కాదనుకుని ప్రియుడితో గడపాలన్న తపనతో స్వాతి ...సుధాకర్రెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చడంపై నాగర్ కర్నూల్లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. -
సుధాకర్రెడ్డిపై నాకేం పగలేదు
-
స్వాతి కుట్రతో రెండు కుటుంబాల క్షోభ
-
గుట్టు విప్పిన మటన్సూప్!
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్కు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డి హత్య కేసులో రోజుకో కోణం వెలు గు చూస్తోంది. భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసి ప్రియుడు రాజేశ్ను ఆ స్థానంలో పెట్టాలని స్వాతి పన్నిన పథకం ఎలా బయట పడిందన్న విష యం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. మటన్సూప్ వల్లే ఈ కేసు గుట్టు రట్టయిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో స్వాతి ప్రియుడు రాజేశ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కాలిన గాయాలతో చికిత్స పొం దుతున్న వారికి ఆస్పత్రిలో మటన్ సూప్ ఇస్తుంటారు. చికిత్స పొందుతున్న రాజేశ్కు వైద్యులు మటన్సూప్ తాగించేందుకు యత్నించారు. కానీ తాను శాఖాహారినని మటన్ సూప్ తాగేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాస్తవంగా సుధాకర్రెడ్డికి మాంసాహారం ఇష్టం కాగా.. ఇప్పుడు వద్దన డం ఏమిటని వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడే వారికి అనుమానమొచ్చింది. చికిత్స పొందుతోంది సుధాకర్రెడ్డి కాదని, మరొకరన్న సంగతి క్రమంగా వారిలో బలపడుతూ వచ్చింది. రాజేశ్ ముఖానికి ఉన్న ముసుగు తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే స్వాతి వారిని అడ్డుకునేదని, ‘ఆయన మాట్లాడలేకపోతున్నారని..ఏదైనా ఉంటే రాసి చూపిస్తాడం టూ’ పెన్ను, పేపర్ ఇచ్చి రాజేశ్తో సమాధానం ఇప్పించేది. ఇలా పదిరోజుల పాటు స్వాతి, రాజేశ్ తమ బండారం బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి సుధాకర్రెడ్డి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం.. రంగప్రవేశం చేసిన పోలీసులు గోప్యంగా ఆరా తీశారు. సుధాకర్ రెడ్డి ఆధార్ కార్డుకు రాజేశ్ వేలిముద్రలకు సరిపోలక పోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఎంతైనా భరిస్తానన్న స్వాతి ముఖం కాలిన రాజేశ్కు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎవరూ గుర్తుపట్టకుండా తయారు చేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడనని ఆస్పత్రి వర్గాలతో స్వాతి అన్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పినా.. సర్జరీ చేసేందుకు డబ్బు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని అన్నట్లుగా చెబుతున్నారు. రాజేశ్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్తను చంపిన కేసు నుంచి బయటపడటంతోపాటు ప్రియుడితో కాపురం చేసేందుకు స్వాతి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కొడుకు పుట్టిన రోజునే.. సుధాకర్రెడ్డి ఆరేళ్ల కుమారుడు దర్శిత్రెడ్డి ఏడో పుట్టిన రోజు నవంబర్ 27న జరగాల్సి ఉంది. అంతకు ముందురోజు సుధాకర్రెడ్డి కొడుకు పుట్టిన రోజు ఏర్పాట్లలో భాగంగా కొత్త బట్టలు కొన్నాడని స్నేహితులకు తెలిపారు. 27న ఉదయాన్నే సుధాకర్ రెడ్డిని హత్య చేశారు. పోలీసుల అదుపులో రాజేశ్! ప్రధాన నిందితుడైన రాజేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమ వారం అర్ధరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకు న్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం రాజేశ్ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయి బిల్లు చెల్లించేదెవరు? హైదరాబాద్: హైదరాబాద్ కంచన్బాగ్లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో 18 రోజుల పాటు రాజేశ్కు జరిగిన చికిత్సకు యాజమాన్యం రూ.4 లక్షలు బిల్లు వేయగా.. ఇందులో సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులు (తమ కుమారుడే అనుకొని) రూ.2.10 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.1.90 లక్షల బిల్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకా యి ఎవరు చెలిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఓ వైపు హత్య, కుట్ర కేసుల్లో స్వాతి అరెస్టయి రిమాండ్కు వెళ్లగా... మరోవైపు రాజేశ్ కుటుంబసభ్యులెవరూ ఇప్పటి వరకు ముందుకు రాకపోవడంతో బిల్లు ఎవరు చెల్లిస్తారో తెలియక పరిస్థితి అయోమయంగా మారింది. -
సుధాకర్ రెడ్డి హత్య కోణంలో కొత్త ట్విస్ట్
-
యాసిడ్ దాడి కేసును ఛేదించిన పోలీసులు
-
సీరియల్ ప్రభావంతో.. స్వాతి స్కెచ్
సాక్షి, నాగర్కర్నూల్: ఆమె.. భర్తతో ఏడు అడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంది. సమాజం ఎగ‘తాళి’ చేసేలా ప్రియుడితో కలిసి పథకం ప్రకారం కట్టుకున్నోడిని హతమార్చింది. భార్యాభర్తల ఆత్మీయబంధాన్ని మంటగలిపింది. సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిన ఈ హత్యోదంతం నిజంగానే ‘సీరియల్’ను తలపించింది. నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాలను నాగర్కర్నూల్ జిల్లా ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆరోజు ఏం జరిగిందంటే..! గతనెల 27న నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన సుధాకర్రెడ్డి అనే కాంట్రాక్టర్పై యాసిడ్ దాడి జరిగిందని అతని సోదరుడు సురేందర్రెడ్డి 28న ఉదయం 11గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అన్న, వదిన స్వాతి పట్టణంలోని రవితేజ కళాశాల పక్కన ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటున్నారని అందులో పేర్కొన్నాడు. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన సుధాకర్రెడ్డి భార్యను ఇంట్లో ఉంచి కాంట్రాక్ట్ పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో ఆమె టీవీ సీరియళ్లు ఎక్కువగా చూసేది. దీనికితోడు ఒంటరిగా ఉండే స్వాతికి రాజేష్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో సుధాకర్రెడ్డికి వీరి వ్యవహారం తెలియడంతో భార్య స్వాతిని 26న నిలదీయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇరువురూ తోసుకోవడంతో సుధాకర్రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు రాత్రి 12గంటల ప్రాంతంలో సుధాకర్రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికివచ్చాడు. అప్పటికే రాజేష్తో కలిసి సుధాకర్రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆరోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేష్ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి నిద్రిస్తున్న సుధాకర్రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో అతను అరవకుండా నోట్లో బట్టలు కుక్కింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇనుప రాడ్తో సుధాకర్రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడే మరణించాడు. వెంటనే దుప్పట్లో సుధాకర్రెడ్డి శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి, రాజేష్ బయలుదేరారు. ఉదయం ఏడు గంటలకల్లా నవాబ్పేట వద్దనున్న అటవీ ప్రాంతానికి చేరుకుని రోడ్డుకు వంద మీటర్ల దూరంలో శవాన్ని విసిరేశారు. వెంట తీసుకెళ్లిన పెట్రోల్తో సుధాకర్రెడ్డి శవాన్ని తగులబెట్టి అక్కడి నుంచి మహబూబ్నగర్కు చేరుకున్నారు. అక్కడ అప్పటి వరకు వాడిన కారును మెకానిక్ షెడ్డులో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. వెలుగులోకి ఇలా.. 27వ తేదీ నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి సుధాకర్రెడ్డిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారని, దీంతో తమ వదిన స్వాతి సుధాకర్రెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్కు హుటాహుటిన తీసుకెళ్తున్నట్లు తనకు తెలిపిందని సురేందర్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. జిల్లా కేంద్రంలోని అన్ని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. తమ దర్యాప్తు కొనసాగుతుండగానే ఈనెల 9న ఫిర్యాదుదారు మంద సురేందర్రెడ్డి, అతని తల్లి సుమతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సుధాకర్రెడ్డి కాదని, స్వాతి ప్రియుడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. స్వాతితో పాటు ముఖం కాలి చికిత్స పొందుతున్న స్వాతి ప్రియుడు రాజేష్ను విచారించడంతో వారు పథకం ప్రకారమే సుధాకర్రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో స్వాతిని అదుపులోకి తీసుకుని సుధాకర్రెడ్డి శవాన్ని తగలబెట్టిన నవాబ్పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అడవి ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో గుర్తుపట్టకుండా కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించింది. వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని పోలీసులు తెలిపారు. టీవీ సీరియల్ ప్రభావమే.. తరచూ టీవీ సీరియళ్లు చూసే స్వాతికి ప్రియుడిని భర్త స్థానంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనతో అతనికి సుధాకర్రెడ్డిలా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలన్న ఆలోచన వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ఓ నిర్జలప్రదేశంలో రాజేష్ తన ముఖానికి ఓ టవల్ కట్టుకుని దానిపై పెట్రోల్ పోసుకుని పెద్దగా గాయాలు కాకూడదని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ముఖం నల్లగా మారడంతో ఇక ఎవరూ గుర్తుపట్టరని, ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఆ తర్వాత స్వాతి అతను ఉన్న ప్రదేశానికి ఓ ప్రైవేట్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లి హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువులు, పోలీసులకు చికిత్స పొందుతున్నది సుధాకర్రెడ్డే అని వారంరోజులకు పైగా స్వాతి అందరిని నమ్మిస్తూ వచ్చింది. వైద్యులు కాలిన గాయాలు నయం అయ్యాయని, డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో సుధాకర్రెడ్డి సోదరుడు, తల్లి ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి వరకు ముఖం చూపించకుండా జాగ్రత్తపడ్డ రాజేష్ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి ఉన్న ముసుగు తీయాల్సి వచ్చింది. దీంతో అతను సుధాకర్రెడ్డి కాదని మంద సురేందర్రెడ్డి, తల్లి సుమతమ్మ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బండారం బయటపడింది. -
ఇలాంటి ట్విస్ట్ నా సర్వీసులో చూడలేదు : అడిషనల్ ఎస్పీ
నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి..యాసిడ్ దాడిగా చిత్రీకరించిన స్వాతిని పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితురాలు మంద స్వాతిని కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ట్విస్ట్ను తమ సర్వీసులో చూడలేదని నాగర్ కర్నూలు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మినారాయణలు పేర్కొన్నారు. మొదట నిందుతురాలు స్వాతిని మీడియాకు చూపకపోవడంతో మీడియా ప్రతినిధులు తమకు చూపెట్టాలని పట్టుబట్టడంతో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో రాజేష్ను ఏ1గాను, స్వాతిని ఏ2గానూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
భర్త..ప్రియుడు..క్రైమ్ థ్రిల్లర్
-
సీరియల్ చూసే స్కెచ్ వేశా!
సాక్షి, నాగర్కర్నూల్: సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య స్వాతిని అరెస్టు చేశారు. ‘మనసు మమత’టీవీ సీరియల్ ప్రభావంతో ఈ హత్యకు పథక రచన చేసినట్లు నిందితురాలు స్వాతి వెల్లడించినట్లు నాగర్కర్నూల్ ఏఎస్పీ జోగుల చెన్నయ్య చెప్పారు. ఆదివారం డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావుతో కలసి ఆయన కేసు వివరాలను మీడియాకు వివరించారు. ప్రియుడితో కలసి హత్య ప్రియుడు రాజేశ్తో ఉన్న వివాహేతర సంబంధంపై గత నెల 26న భర్త సుధాకర్రెడ్డి నిలదీశాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ తోసుకోవడంతో సుధాకర్రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సుధాకర్రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే రాజేశ్తో కలసి సుధాకర్రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆ రోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేశ్ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి.. నిద్రిస్తున్న సుధాకర్రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. నోట్లో అతను అరవకుండా బట్టలు కుక్కింది. ఆ తర్వాత ప్రియుడితో కలసి ఇనుప రాడ్తో సుధాకర్రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే శవాన్ని దుప్పట్లో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని నవాబ్పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్డుకు వంద మీటర్ల దూరం అడవిలో శవాన్ని పడేసి.. వెంట తీసుకెళ్లిన పెట్రోల్తో తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్నగర్కు చేరుకున్నారు. తాము తీసుకెళ్లిన వాహనాన్ని మెకానిక్ షెడ్లో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. ప్రియుడు రాజేశ్, స్వాతిలను అదుపులోకి తీసుకొని విచారించగా.. పథకం ప్రకారమే తాము సుధాకర్రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఘటన స్థలంలో కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించిందని, వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజేశ్, ఏ2 నిందితురాలిగా స్వాతిని చేర్చినట్లు వివరించారు. -
విజయవాడ టు లండన్ బాబులు
‘‘సినిమాల్లో నటించడం వల్ల ఇందులోని ఇబ్బందులు తెలిశాయి. ఇప్పుడు సినిమాపై మరింత గౌరవం పెరిగింది’’ అన్నారు రక్షిత్. చిన్నికృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్ పతాకంపై రూపొందిన సినిమా ‘లండన్ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్ కట్టళై’కు రీమేక్ ఇది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ– ‘‘విజయవాడలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. నాన్న వరప్రసాదరావుగారి ద్వారా మారుతిగారు తెలుసు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి ఉందా? అని నన్ను అడిగారాయన. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మారుతిగారిని కలిశాను. ఈ సినిమాను తెరకెక్కించే ప్రక్రియలో భాగంగానే నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఓ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకులు విదేశాలకు వెళ్లి ఎక్కవ డబ్బులు సంపాదించాలనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేశారన్న కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందించారు. నేను గాంధీ అనే రోల్ చేశాను. రిపోర్టర్ సూర్యకాంతంగా స్వాతి నటించారు. స్వాతి వంటి సీనియర్ నటితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మా ఇద్దరి మధ్య లవ్ సీన్స్ ఉన్నాయి. స్వాతి నటన సినిమాకు ప్లస్. ఈ సినిమాతో ఫస్ట్ సక్సెస్ అందుకుంటానన్న నమ్మకం ఉంది. భవిష్యత్లో నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. ఆడియన్స్ను ఎట్రాక్ట్ చేసే కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. డ్యాన్స్, డైలాగ్ డిక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. నా నెక్ట్స్ మూవీ మారుతిగారితోనే ఉంటుంది’’ అన్నారు. -
బాబు లండన్ వెళతాడా?
‘‘ఆండవన్ కట్టలై’ అనే తమిళ సినిమాను ‘లండన్ బాబులు’గా రీమేక్ చేశాం. చాలా రోజుల క్రితమే సినిమా పూర్తయ్యింది. అయితే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. నవంబర్ 10న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాత మారుతి. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి నిర్మించిన సినిమా ‘లండన్ బాబులు’. మారుతి మాట్లాడుతూ– ‘‘చక్కని వినోదంతో రూపొందిన సినిమా ఇది. చూసిన వారందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా నచ్చి, ఓ ప్రముఖ టీవీ వారు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్నారు. అన్ని వర్గాలవారూ చూసేలా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘సినిమాలకు దూరంగా వైజాగ్లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ సినిమా. అతడు లండన్ వెళతాడా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. నవంబర్ 4న ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: కె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్. -
కట్టుకున్న వాడే చంపేశాడు
వరంగల్ క్రైం: మరో ఎన్నారై పెళ్లి కూతురు వివాహమై ఏడాది పూర్తి కాకముందే విగత జీవిగా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో లలిత రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తిరుమలగిరి స్వామినాథం, భారతిల కుమార్తె స్వాతి(27) లండన్లో హత్యకు గురైన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వరంగల్ ఎల్ఐసీ–2లో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న తిరుమలగిరి స్వామినా«థం, భారతిలకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తీక్, కూతురు స్వాతి. హన్మకొండ మచిలీబజార్కు చెందిన శ్రీపతి శ్రీనివాస్, విజయల కుమారుడు శ్రీపతి రాజేశ్తో 2016 నవంబర్ 4న స్వాతికి వివాహం జరిగింది. రాజేశ్ సింగపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో రెండు నెలల పాటు దంపతులు సింగపూర్లో ఉన్నారు. ఆ తర్వాత రాజేశ్కు లండన్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. లండన్లోనే ఉంటున్న రాజేశ్ అక్క స్వాతి, బావ రాజు దగ్గరలోనే ఓ ఇల్లు తీసుకొని 2017 మే 2న స్వాతిని లండన్కు తీసుకువెళ్లాడు. అదనపు కట్నం కోసం.. రాజేశ్కు కట్నకానుకల కింద సుమారు రూ. 30 లక్షల వరకు ఇచ్చినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తాను సింగపూర్లో ఉద్యోగం చేయడం వల్ల రూ. 30 లక్షలే కట్నం వచ్చిందని.. అప్పుడే లండన్లో ఉద్యోగం చేస్తే ఎక్కువ కట్నం వచ్చేదని రాజేశ్ పలుమార్లు స్వాతితో చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు. మరింత కట్నం తీసుకురావాలని స్వాతిని వేధింపులకు గురి చేసేవాడని.. అతడికి అత్త విజయ, ఆడబిడ్డ స్వాతి తోడయ్యారన్నారు. ఇండియన్ ఎంబసీలో ఫిర్యాదు... స్వాతిని అల్లుడు అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసినట్లు ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఇండియన్ ఎంబసీలో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మృతదేహం తొందరగా హైదరాబాద్కు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకో వాలని వారు కోరారు. కాగా, స్వాతి మరణ వార్త తెలుసుకున్న బంధువులు స్వామినాథం ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చారు. మచిలీబజార్లోని రాజేశ్ ఇంటి వద్ద స్వాతి బంధువులు ఆందోళన చేశారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో తలుపులు పగులకొట్టేం దుకు ప్రయత్నించారు. అత్తమామలు పరారీ.. ఇరవై రోజులుగా స్వాతి నుంచి ఫోన్లు రావడం లేదని ఆమె తల్లిదం డ్రులు చెప్పారు. చివరగా ఈనెల 2న ఫోన్ చేసి వేధింపులు భరించలేకపోతు న్నానంటూ కన్నీళ్లు పెట్టుకుందన్నారు. బుధవారం ఉదయం రాజేశ్ బావ రాజు ఫోన్ చేసి స్వాతి కనబడటం లేద ని, లండన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు చెప్పినట్లు స్వామినాథం వెల్ల డించారు. రాజేశ్ తల్లిదండ్రులుంటున్న మచిలీబజార్లోని ఇంటికి కుటుంబస భ్యులను పంపించగా తాళం వేసి ఉం దని.. వారు ముందుగానే పరారయ్యా రని రోదించారు. బుధవారం సాయం త్రం రాజు ఫోన్ చేసి.. స్వాతి కెంట్ సముద్రం ఒడ్డున పడిపోయిందని, ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోయాయని, చికిత్స జరుగుతుందని చెప్పినట్లు వివ రించారు. రాత్రి 10.30కి చనిపోయిం దని చెప్పినట్లు విలపించాడు. -
లండన్లో స్వాతి అనుమానాస్పద మృతి!
సాక్షి, వరంగల్: జిల్లా హన్మకొండకు చెందిన ఓ నవ వధువు లండన్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని ఏకశిలా పార్క్ సమీపంలో నివాసముంటున్న తిరుమలగిరి స్వామినాథం, భారతి దంపతుల కుమార్తె స్వాతికి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న నగర వాసి శ్రీపతి రాజేష్తో 2016 నవంబర్లో వివాహమైంది. అనంతరం రాజేష్కు లండన్లో అంతకన్నా పెద్ద ఉద్యోగం రావడంతో అక్కడికి మారిపోయారు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. ఉన్నట్లుండి బుధవారం రాత్రి స్వాతి చనిపోయిందంటూ వారి కుటుంబ సభ్యులకు రాజేష్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అయితే రాజేష్, అతని కుటుంబ సభ్యులు తమ కూతురిని హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ రాజేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. -
లండన్లో స్వాతి అనుమానాస్పద మృతి!
-
సర్ప్రైజ్ పార్టీల అడ్డా ‘ఈవైబ్’!
రాకేశ్.. తన భార్య పుట్టిన రోజుకు పీవీఆర్ థియేటర్లో ఓ షో మొత్తం బుక్ చేసి.. సర్ప్రైజ్ చేశాడు! గౌరవ్.. పెళ్లి ప్రపోజల్ను డ్రోన్ కెమెరాలో చిత్రించి తన ప్రేయసికి పంపించాడు! కావ్య.. తన కజిన్ పెళ్లి రోజు బహుమతిగా విమానంలో సొంత డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్ను అందించింది! ...సాధారణంగా మనం ఇలాంటి సీన్లను సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య చూస్తుంటాం. కానీ, ఇప్పుడు మీరూ ఇలాంటి సర్ప్రైజ్ అనుభవాలను పొందొచ్చు. అదీ హైదరాబాద్లోనే! భాగ్యనగరికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు స్వాతి, ఆంజనేయులు రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థ ‘ఈవైబ్.ఇన్’ సేవలు ఇలాంటివే మరి. కంపెనీ ప్రారంభం, వినూత్న సేవల గురించి సంస్థ కో–ఫౌండర్ స్వాతి భావనక మాటల్లోనే.. మా కంపెనీ ప్రారంభానికి పునాది వేసింది మా ప్రేమ వివాహమే. ఎలాగంటే.. ఆంజనేయులు రెడ్డి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక.. బెంగళూరులోని గేమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ నోల్స్కేప్లో చేరాడు. నేనూ అమెరికాలో కంప్యూటర్ సైన్స్ పూర్తయ్యాక.. అదే నోల్స్కేప్లో జాయిన్ అయ్యా. అక్కడ పరిచయమైన ఇద్దరి స్నేహం.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామనుకున్నాం. పుట్టి పెరిగిన హైదరాబాద్లో, అదీ తల్లిదండ్రుల సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రయాణ టికెట్లు, షాపింగూ పూర్తి చేసేశాం. పెళ్లి ఏర్పాట్లకు అవసరమైన హాల్, డెకరేషన్, ఫొటోగ్రాఫర్, ఫుడ్ వంటి వాటికోసం ఆన్లైన్లో వెతికాం. కానీ, లాభం లేకుండా పోయింది. అరే!! సినిమా టికెట్లు, ఫోన్ల వంటివి ఆన్లైన్లో కొనుక్కునే వీలున్న ఈ రోజుల్లో వివాహానికి, పార్టీలకు అవసరమైన సేవలను బుకింగ్ చేసుకునే వీలు లేదా? అనిపించింది. అక్కడి నుంచే ఈవైబ్.ఇన్ కంపెనీకి ఆలోచన పడింది. ఇంకేముంది!! కాసింత సర్వే చేసి చేతిలోని రూ.5 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా ఫిబ్రవరి 2014లో ఈవైబ్.ఇన్ను ప్రారంభించాం. ‘వైబ్’ అంటే అనుభవం అని, ‘ఈ’ అంటే ఎలక్ట్రానిక్ అని అర్థం. మొత్తంగా చూస్తే ఎలక్ట్రానిక్ రూపంలో అనుభవాలను పంచుకోవటమే మా కంపెనీ పేరుకు అర్థం. 5 వేలకు పైగా ఆప్షన్లు.. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో సేవలందిస్తున్నాం. వివాహం, పుట్టిన రోజు, పెళ్లి రోజు, గృహ ప్రవేశాలు, వీకెండ్ పార్టీలు, ప్రమోషన్స్ వంటి ప్రత్యేక సందర్భాల్లో పార్టీ ఏర్పాట్లుంటాయి. ఎంటర్టైన్మెంట్, డెకరేషన్, ఫుడ్, గిఫ్ట్స్, ఫొటోగ్రఫీ, టెంట్ వంటి 8 విభాగాల్లో 5 వేలకు పైగా ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఆయా విభాగాల్లో 1,000 మంది వెండర్స్తో ఒప్పందం చేసుకున్నాం. ధరలు సేవలను బట్టి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకున్నాయి. ప్రతి లావాదేవీ మీద వెండర్ పార్టనర్స్ నుంచి 13–15 శాతం కమీషన్ తీసుకుంటాం. నెలకు 400 ఆర్డర్లు; 25 లక్షల వ్యాపారం.. ప్రతి రోజు వెయ్యి మంది విజిటర్స్ వెబ్సైట్ను సంప్రతిస్తుంటారు. నెలకు 400 ఈవెంట్స్ ఆర్డర్లొస్తున్నాయి. ఇప్పటివరకు 6 వేల పార్టీలను నిర్వహించాం. ఎక్కువగా డెకరేషన్, ఎంటర్టైన్మెంట్ విభాగాల సంబంధించిన సేవలను ఎంచుకుంటున్నారు. నెలకు రూ.25 లక్షల గ్రాస్ మర్చండేజ్ వ్యాల్యూ (జీఎంవీ) చేస్తున్నాం. ఇందులో మా కమీషన్ రూ.4 లక్షల వరకూ ఉంటుంది. గతేడాది రూ.1.8 కోట్ల వ్యాపారాన్ని చేశాం. ఏడాది కాలంలో వ్యాపారాన్ని, పార్టనర్స్ను ఐదింతలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 8 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా సంస్థలో 12 మంది ఉద్యోగులున్నారు. మరో 2 నెలల్లో వీరి సంఖ్యను 25కు చేర్చనున్నాం. 3 నెలల్లో ముంబై, ఢిల్లీ, పుణె నగరాలకు విస్తరిస్తున్నాం. ఆయా నగరాల్లో స్థానిక డెకరేటర్లు, హోటళ్లు, ఫొటోగ్రాఫర్ల వంటి పార్టనర్స్తో ఒప్పందం చేసుకుంటున్నాం. ‘‘గతంలో హైదరాబాద్ ఏంజిల్స్, కామన్ఫ్లోర్ ఫౌండర్లు మా కంపెనీలో రూ.75 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టారు. మరో 8 నెలల్లో రూ.6 కోట్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాం. పలువురు వెంచర్ క్యాపిటలిస్ట్లతో (వీసీ) చర్చలు జరుపుతున్నాం’’ అని స్వాతి వివరించారు. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
పాస్పోర్ట్ తిప్పలు!
‘‘జీవితాన్ని సినిమా పెద్దగా చూపిస్తే, టీవీ చిన్నగా చూపెడుతుంది. కానీ, జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటకం మాత్రమే. ఈ టీజర్, సాంగ్ చూస్తుంటే నాకు నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి. నిర్మాతగా మారుతిగారు నాకు ఇన్స్పిరేషన్. కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఆడితేనే కొత్త వారు ఇండస్ట్రీకి రావడానికి ఆసక్తి చూపిస్తారు’’ అని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్ స్టూడియో సమర్పణలో దర్శకుడు మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. కె. సంగీతం అందించిన ఈ సినిమాలోని తొలి పాటను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరీష్ శంకర్, స్పెషల్ టీజర్ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ– ‘‘పాస్పోర్ట్ కోసం పడే తిప్పల్ని ఈ చిత్రంలో చెప్పాం. స్వాతిలో మంచి రైటర్, డైరక్టర్ కూడా ఉన్నారు. తనకి కథ నచ్చి, చేస్తాననగానే హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రెగ్యులర్గా ఉండదు. నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, ఈ చిత్రం బాగా నచ్చడంతో పేరు వేసుకున్నా’’ అన్నారు. ‘‘లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ చిత్రం’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, ఎ.వి.ఎస్. ప్రకాశ్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్. -
నరేష్ శవాన్ని కాల్చిన చోటుకి నిందితులు..
ఆత్మకూరు(యాదాద్రిభువనగిరి): యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లిలో జరిగిన నరేష్ హత్య కేసులో నిందితులను ఎల్బీనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భువనగిరి జైలు నుంచి నిందితులైన శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డిలను నరేష్ ను చంపి కాల్చివేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు. ముందు జాగ్రత్తగా మీడియాను దగ్గరకు రానివ్వకుండా చేసిన పోలీసులు.. శవాన్ని కాల్చిన చోట మట్టిని సేకరించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని క్లూస్ టీం బృందం నిందితుల నుంచి వివరాలు రాబట్టింది. కులాంతర వివాహం కారణంగా చోటు చేసుకున్న ఈ హత్య కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
ఒక ప్రేమ..రెండు నిండు ప్రాణాలు
-
నరేశ్ వెంట ఉన్నది ఎవరు ..?
⇔ దర్యాప్తు ముమ్మరం ⇔ కొనసాగుతున్న పోలీసుల విచారణ ⇔ ఆచూకీ లభిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి.. సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేశ్ హత్య జరిగిన రోజు ఆయన వెంట ఉన్న మరో యువకుడి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మే2వ తేదీన ముంబాయి నుంచి స్వాతితో కలిసి వచ్చిన నరేశ్ భువనగిరి బస్టాండ్లో భార్యను ఆమె తండ్రి తుమ్మల శ్రీనివాస్రెడ్డికి అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి శ్రీనివాస్రెడ్డి తన కూతురు తీసుకుని స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేశ్ మోటార్ వాహనంపై లింగరాజుపల్లికి వెళ్లాడు. శ్రీనివాస్రెడ్డి ఇంటి సమీపంలో నరేశ్, మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్పై కనిపించాడు. దీంతో వీరిని గుర్తించిన శ్రీనివాస్రెడ్డి తన పొలంలోకి తీసుకుపోయారు. రాత్రి సుమారు 10.30గంటల సమయంలో అక్కడ మాట్లాడుతుండగానే వెనుక నుంచి తలపై రాడ్తో గట్టిగా కొట్టడంతో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నరేశ్ను తగులబెట్టిన శ్రీనివాస్రెడ్డి బూడిదను, అస్థికలను తీసుకువెళ్లి మూసిలో కలిపారు. అయితే నరేశ్ వెంట వాహనంపై ఉన్న మరో యువకుడు ఎవరని పోలీసులు విచారణ ప్రారంభించారు. అతని ఆచూకీ తెలిస్తే ఈకేసు మరింత పురోగతి సాధిస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు స్వాతి ఆత్మహత్యకు ముందు తీసిన వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. మరుగుదొడ్డిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సెల్ఫీ వీడియో తీసిందని ప్రచారం జరిగింది. అయితే సెల్ఫీ కాదని, అది వీడియోగా పోలీసులు భావిస్తున్నా. ఆ సెల్ఫీని స్వాతి స్వయంగా తీసిందా, లేక మరొకరి సమక్షంలో తీసిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆత్మహత్యకు ముందే మరొకరి ద్వారా సెల్ఫోన్లో వీడియో తీసినట్లు సమాచారం. వీటి గుట్టు విప్పడం ద్వారా ఈకేసులో మరింత పురోగతి సాధించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా నరేశ్, స్వాతి మరణం వెనుక మరిన్ని విషయాలను బయటపెట్టేందుకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. -
గతంలోనూ హత్యల చరిత్రేనా?
-
గతంలోనూ హత్యల చరిత్రేనా?
నరేష్ హత్య కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అతడిని చంపిన శ్రీనివాసరెడ్డికి 20 ఏళ్ల వయసు నుంచే నేర చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన ముందు నుంచే రౌడీషీటర్లతో తిరిగేవాడని అంటున్నారు. గతంలో 1992 సంవత్సరంలో ఒక పొలం వివాదంలో శ్రీనివాసరెడ్డి సొంత అన్న హత్యకు గురయ్యారు. ఆ తర్వాత అతడి తల్లిదండ్రులు సైతం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. అప్పట్లో ఈ మూడు హత్యల విషయంలోనూ ఈయనపై అనుమానాలు తలెత్తాయి గానీ, ఆధారాలు ఏమీ లేకపోవడంతో రుజువు కాలేదు. ఇప్పుడు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ అనుమానాస్పద మృతి, నరేష్ హత్య కేసులలో కూడా దాదాపు ఇలాగే జరిగేది. అయితే కోర్టు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఆలస్యంగానైనా స్పందించి విచారణ వేగవంతం చేయడంతో మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చింది. హత్య జరిగిన తీరు మొత్తం బట్టబయలైంది. స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే ఆమె భర్త నరేష్ను దారుణంగా చంపి, టైర్లతో తగలబెట్టిన శ్రీనివాసరెడ్డి.. అతడి అస్థికలను మూసీనదిలో కలిపేశాడు. దాంతో అసలు ఆధారాలన్నవి దొరకడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే పోలీసులు చుట్టుపక్కల విచారించడంతో పాటు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా హత్య లాంటి నేరాలు చేస్తే ఎక్కడో ఒకచోట ఆధారాలు వదలకుండా ఉండారు. కానీ శ్రీనివాసరెడ్డి మాత్రం పక్కాగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా చేసి చివరకు అస్థికలను కూడా మూసీనదిలో కలిపేయడంతో.. స్వయంగా ఆయన చెబితే తప్ప హత్య జరిగిందన్న విషయం కూడా బయటకు వచ్చేది కాదు. -
స్వాతి అంటే చాలా ఇష్టం