శికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కారుపై బాంబు దాడి జరిగింది. ఆదివారం ఉదయం ఆయన ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనంపై పెట్రోల్ బాంబుతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తోపాటు మరో నలుగురు గాయపడ్డారు. దాడి సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కగజమ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.