నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేసిన రాహుల్‌ | Rahul Gandhi Mimics PM Modi in MP election Rally | Sakshi
Sakshi News home page

నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేసిన రాహుల్‌

Oct 17 2018 9:34 AM | Updated on Mar 21 2024 6:45 PM

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రచార హోరు పెంచారు. భారీ బహిరంగ సభల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోరేనాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. మోదీ హవాభావాలతో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా..! నన్ను ప్రధాన మంత్రి అని పిలవకండి. వాచ్‌మెన్‌ అని పిలవండి’ అంటూ తీయగా మాట్లాడి నరేంద్ర మోదీ ప్రజల్ని మభ్యపెడతాడని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement