రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగిన టీడీపీ.. నేడు బీజేపీ నాయకుల పర్యటనలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ కొత్త నాటకానికి తెరతీసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గురువారం రాజమండ్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కూడా టీడీపీ నేతలు.. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామనే విధంగా కటింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చిన టీడీపీ నేడు నిరసనలకు దిగడంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.