సీబీఐ నూతన డైరెక్టర్గా ఇటీవల నియమితులైన 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ పోలీస్ మాజీ చీఫ్ శుక్లాను శనివారం నూతన సీబీఐ డైరెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్గా శుక్లా రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.