కీకీ ఛాలెంజ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తున్న అంశం. రన్నింగ్లో ఉన్న కారు నుంచి రోడ్డుపై దిగి డ్యాన్స్ చేసి, తిరిగి అదే కారులోకి దూకి మరికొందరికి ఛాలెంజ్ విసరటం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇది ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా. కొందరు మాత్రం దాన్ని వీడలేకపోతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఇద్దరు యువ రైతులు కూడా తమ వంతుగా ఈ ఛాలెంజ్లో పాలు పంచుకున్నారు. పోలం దున్నుతూ చేసిన ఈ ఛాలెంజ్.. హిల్లేరియస్గా ఉండటమే కాదు. వాట్సాప్ గ్రూప్ల్లో తెగ మారుమోగిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంది కూడా.