భగ్గుమంటున్న దేశ రాజధాని | Two Buses Set On Fire By Protesters In South Delhi | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న దేశ రాజధాని

Published Sun, Dec 15 2019 6:34 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (డీటీసీ)కు చెందిన రెండు బస్సులను దగ్ధం చేశారు. భరత్‌ నగర్‌లో డీటీసీ బస్‌కు ఆందోళనకారులు నిప్పంటించగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. మరోవైపు ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుంటుండగా ఓ ఫైరింజన్‌ను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డగించి ధ్వంసం చేశారని ఢిల్లీ ఫైర్‌ సర్వీసు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement