ఎడతెరిపిలేకుండా సాగిన నినాదాల నడుమ లోక్సభ రేపటికి వాయిదాపడింది. దీంతో కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానికి సంబంధించి వైఎస్సార్సీపీ మరోమారు నోటీసులు ఇవ్వనుంది. సోమవారం సభ ప్రారంభమైన మరుక్షణమే టీఆర్ఎస్, ఏఐడీఎంకేలు తమ తమ డిమాండ్లతో హోరెత్తించాయి. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంటపాటు సభను వాయిదావేశారు. తిరిగి 12 గంటలకు సమావేశాలు పునఃప్రారంభమైనా.. నినాదాల జోరు తగ్గలేదు. స్పీకర్ పలుమార్లు అభ్యర్థించినా సభ్యులు శాంతించలేదు.