Motion of No Confidence
-
మేయర్..ఫిబ్రవరి ఫియర్?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్(BRS Party) నుంచి కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎంపికైన (GadwalVijayalakshmi)గద్వాల్ విజయలక్ష్మిని.. అలాగే డిప్యూటీ మేయరైన శ్రీలతా శోభన్రెడ్డిని పదవుల నుంచి తప్పించేందుకు ఆ పార్టీ వ్యూహం పన్నుతోందా? అంటే కాదనలేని పరిస్థితి నెలకొంది. బల్దియాలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన విజయలక్ష్మి, శ్రీలతలకు అప్పటి ప్రభుత్వ ఆశీస్సులతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కాయి. అప్పట్లో ఎంఐఎం బీఆర్ఎస్కు అండగా నిలిచింది. ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీ వల్ల అధికారం దక్కించుకున్న వారు పార్టీపై విశ్వాసం చూపలేదనే తలంపుతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. తమ పార్టీ వల్లే పదవులు పొందిన వారు, పార్టీ మారినా రాజీనామా చేయకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతుండటాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమకు దక్కని యోగం.. వారికి దక్కడంపై అంతర్గతంగా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోకి వారి రాకతో తమ ప్రాధాన్యం తగ్గిపోయిందనే తలంపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా వారిని ఆ పదవుల నుంచి తప్పించాలనే యోచనలో పలువురు కార్పొరేటర్లున్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలు 2020 డిసెంబర్లో జరిగినప్పటికీ, మేయర్, డిప్యూటీ మేయర్లు 2021 ఫిబ్రవరి 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో వారి నాలుగేళ్ల కాలం పూర్తవుతున్నందున, అది ముగియగానే అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే.. నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) సగం మంది నిర్ణీత ప్రొఫార్మాలో తీర్మానం చేసి సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్కు అందజేయాలి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్అఫీíÙయో సభ్యులు వెరసీ.. మొత్తం 196 మంది ఉన్నారు. వీరిలో సగం అంటే 98 మంది సభ్యుల సంతకాలు అవసరం. బీఆర్ఎస్కు ప్రస్తుతం 42 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫీషియో సభ్యులు వెరసీ.. 71 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాసం పెట్టాలంటే మరో 27 మంది సభ్యులు అవసరం. గతంలోవలే ఎంఐఎం పొత్తు ఉంటే సాధ్యమయ్యేదే కానీ ప్రస్తుతం అది కాంగ్రెస్కు మద్దతుగా ఉండటం తెలిసిందే. ఎంఐఎం లేదా బీజేపీతో కలిస్తేనే అవిశ్వాసం పెట్టేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం ఆచరించనుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని, ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో, ఎప్పుడు ఉపసంహరించుకుంటుందో చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏం జరిగేందుకైనా ఆస్కారం ఉందంటున్నారు. అందుకు రాజకీయాల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని వారు ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ కురీ్చకి గండం పొంచి ఉందని అంటున్నారు. డిప్యూటీ మేయర్కు సైతం అదే వర్తిస్తుందంటున్నారు. పార్టీలు మారారు ఇలా.. ⇒ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తొలుత రెండు సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ, లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్గౌడ్ మృతితో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి ముగ్గురయ్యారు. తర్వాత పరిణామాలతో బీజేపీ నుంచి ముగ్గురు, బీఆర్ఎస్ నుంచి 18 మంది చేరడంతో ఆ పార్టీ బలం 24కు పెరిగింది. ⇒ ఎంఐఎం 44 స్థానాల్లో గెలవగా ఒకరు మరణించారు. ఇద్దరు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం 41 మంది ఉన్నారు. ⇒ బీజేపీ 48 స్థానాల్లో గెలవగా ఆదిలోనే ఒకరు మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో ఓటమితో 47 మంది అయ్యారు. అనంతరం గుడిమల్కాపూర్ కార్పొరేటర్ మృతి చెందడం, కొందరు పార్టీలు మారడంతో ప్రస్తుత బలం 39గా ఉంది. ⇒ బీఆర్ఎస్ వారు 56 సీట్లలో గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు పార్టీలో చేరడంతో బలం 60కి పెరిగినప్పటికీ.. అనంతరం 18 మంది కాంగ్రెస్లోకి వెళ్లడంతో ప్రస్తుతం 42 మంది ఉన్నారు. -
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్పై రెండో ఓటింగ్ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
అధ్యక్షుడు ముయిజ్జుపై అవిశ్వాసం
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ) సిద్ధమవుతోంది. ఎండీపీకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించింది. పార్లమెంట్లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు. -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్ట్రస్పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమిలి జరగాలంటే...
సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో మరోసారి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. దేశంలో తరచూ ఎన్నికల వల్ల అభి వృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతోందని, వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజా ధనం వృథా అవుతోందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని నివారించేందుకు రాష్ట్రాలు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే డిమాండ్ కొన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాలకూ కాకపోయినా అతితక్కువ గడువు మాత్రమే ఉన్న 12 రాష్ట్రాల అసెంబ్లీలతో కలిపి లోక్సభకూ ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, లోక్సభ నిబంధనలు, ఫిరాయింపుల నిరోధక చట్టం వంటి వాటికి కేంద్రం యుద్ధప్రాతిపదికన సవరణలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులు... చట్టసభలు నిర్ణీత ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటేనే జమిలి ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అవిశ్వాస తీర్మానాలతో ప్రభుత్వాలు పడిపోయినప్పుడు, హంగ్ ఏర్పడి ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తినప్పుడు, అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసినప్పుడు సాధారణ ఎన్నికలతో కాకుండా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని సూచనలు చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణల ఆవశ్యకత ఏర్పడుతుంది. అవి ఏమిటంటే... - ఆర్టికల్ 83, 172 (1): లోక్సభ కాలావధి ఐదేళ్లు అని రాజ్యాంగంలోని 83 (2) క్లాజ్ చెబు తోంది. అసెంబ్లీల పదవీకాలం మొదటిసారి సమావేశమైనప్పటి నుంచి ఐదేళ్లు అని ఆర్టికల్ 172 (1) సూచిస్తోంది. ఈ రెండింటికీ కాలా వధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. - ఆర్టికల్ 85, 174: లోక్సభ రద్దు, వాయిదా, సుప్తచేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలావధి కంటే ముందే ఏదైనా సభ రద్దయితే మిగిలిన సమయానికి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో ఏర్పడిన సభ 2020లోనే రద్దు అయితే మిగిలిన కాలానికి అంటే 2024 వరకూ అసెంబ్లీ ఉండేలా ఎన్నికలు జరుగుతాయన్నమాట. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటుకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది. - రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలాన్ని కుదించాలన్నా, పొడిగించాలన్నా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొత్త క్లాజులు చేర్చాలి. కుదింపు/పొడిగింపు ఎంతకాలం అనే దానిపై పరిమితి ఉండరాదు. - అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం చూపుతూ విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టాలి. రెండింటికీ ఒకేసారి ఓటింగ్ జరగాలి. తద్వారా చట్ట సభలు ముందస్తుగా రద్దయ్యే అవకాశాలు తగ్గుతాయి. - సాధారణ ఎన్నికలకు కొంచెం సమయం మాత్రమే ఉన్నప్పుడు ఏవైనా చట్ట సభలు రద్దయితే రాష్ట్రపతి పాలన విధించాలి. తాను నియమించుకున్న మంత్రుల ద్వారా పాలన సాగించే అధికారం రాష్ట్రపతికి ఉండాలి. అసెంబ్లీలకు సంబంధించి ఈ పనిని గవర్నర్ చేసేలా చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. - హంగ్ ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోయినా, ఏదైనా ప్రభుత్వం రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకున్నా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. అయితే కాలపరిమితి ఐదేళ్లు ఉండదు. మిగిలిన సమయానికి మాత్రమే కొత్త సభ మనుగడలో ఉంటుంది. - ఆర్టికల్ 356: దీని ప్రకారం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఆరు నెలల వరకూ మాత్రమే విధించ వచ్చు. పొడిగించాల్సి వస్తే మళ్లీ రాష్ట్రపతి ఆమో దం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో మూడేళ్లపాటు రాష్ట్రపతి పాలన కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. ఐదేళ్ల అవధి మధ్యలో ఏదైనా అసెంబ్లీలో రాష్ట్రపతి పాలన విధించి మూడేళ్ల రాష్ట్రపతి పాలన ముగిశాక కూడా సాధారణ ఎన్నికలకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలన్న అంశాన్ని కూడా నిర్వచించి ఈ ఆర్టికల్లో చేర్చాల్సి ఉంటుంది. ఇదీ జమిలి చరిత్ర... 1952లో లోక్సభ తొలి సార్వత్రిక ఎన్నికలతోపాటు దాదాపు అన్ని రాష్ట్రాల (ఒకటి రెండు మినహాయింపులతో) అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 దాకా ఈ పరిస్థితే కొనసాగింది. 1967లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడగా అంతర్గత కుమ్ములాటలు లేదా కేంద్రమే రాష్ట్రపతి పాలన విధించడంతో ఆ తర్వాత కొన్ని అసెంబ్లీలు రద్దయ్యాయి. 1971లో ఏడాది ముందుగానే అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ లోక్సభ ఎన్నికలకు వెళ్లడంతో జమిలి ఎన్నికల శకం ముగిసింది. 1999లో జస్టిస్ బీపీ జీవన్రెడ్డి సారథ్యంలోని లా కమిషన్ తన నివేదికలో ఎన్నికల సం స్కరణలపై పలు సూచనలు చేసింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసి ంది. 2014 సెప్టెంబర్లో సుదర్శన్ నాచియప్పన్ చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది. 2015 డిసెంబర్లో ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ 2016 సెప్టెంబర్లో తొలిసారిగా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. వాస్తవ దృష్టితో చూస్తే పార్లమెంటుతోపాటు 29 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ అభిప్రాయపడ్డాయి. 2019లో ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలంటే అస్సాం, కేరళ, తమిళనాడు అసెంబ్లీల కాలపరిమితిని రెండేళ్లు తగ్గించాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెం బ్లీల పదవీకాలాన్ని దాదాపు మూడేళ్లు కుదించాలి. ఈ త్యాగాలకు అక్కడి అధికార పార్టీలు అంగీ కరించే అవకాశం లేనందున మధ్యేమార్గాన్ని అనుసరించాలని నాచియప్పన్ కమిటీ, నీతి ఆయోగ్ సూచిం చాయి. కొన్ని రాష్ట్రాలను 2019 ఏప్రిల్–మేలలో (మొదటి దశ) జరిగే లోక్సభ సాధారణ ఎన్నికలతో కలిపితే... మిగతా వాటిని 2021 అక్టోబర్–నవంబర్లలో (రెండో దశ) కలిపి ఎన్నికలు నిర్వ హించాలనేది సూచన. ఈ విధంగా దేశంలో ఐదేళ్లలో రెండుసార్లే ఎన్నికలు జరుగుతాయి. 2019 మే తర్వాత రెండున్నర ఏళ్లకు 2021 నవంబర్లో మళ్లీ ఎన్నికలుంటాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ కొన్ని సవరణలు చేస్తేగానీ జమిలి ఎన్నికలు సాధ్యం కాదన్నది న్యాయ కమిషన్ ముసాయిదా చెబుతున్న విషయం. పదవ షెడ్యూల్లోని ఈ అంశంలో పార్టీలు జారీ చేసే విప్లు సభ్యులు అతిక్రమించకూడదని ఈ షెడ్యూల్ చెబుతుంది. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు విప్లు జారీ చేయకుండా చేస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభమవుతుంది. తద్వారా ఆ ప్రభుత్వం ఐదేళ్లు నడిచేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే విప్ల జారీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించాల్సి ఉంటుంది. చట్ట సవరణ పద్ధతులు... జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసేందుకు నిర్దిష్ట పద్ధతి ఉంటుంది. చేయాల్సిన మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. మార్పుల ముసాయిదాను కేంద్ర కేబినెట్ పరిశీలించి ఆమోదించాలి. చట్టాలు, నిబంధనల మార్పు కోరుతూ ఓ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ మార్పులన్నీ చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. ఇవన్నీ జరిగాయనుకున్నా మార్పులు, చేర్పుల కారణంగా రాజ్యాంగం తాలూకూ మౌలిక స్వభావానికి విఘాతం కలిగిందని ఎవరైనా సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉండటం కొసమెరుపు! ప్రజాప్రాతినిధ్య చట్టం... జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంట్లోని సెక్షన్ 14 లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు సంబందించినది. ఇందులోని రెండవ క్లాజ్ ప్రకారం లోక్సభ కాలావధి ముగిసేందుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్కు అధికారం లేదు. లోక్సభ నిర్ణీత కాలావధి ముగిశాక లేదా రద్దయినప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. అసెంబ్లీ, లోక్సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈ క్లాజ్ను సరి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏకకాల ఎన్నికలకు సంబంధించిన నిర్వచనాన్ని చేర్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుకూల వాదన... - ఏటా ఏదో ఒక ఎన్నికలు (పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఉండటం మంచిది కాదు. గత 30 ఏళ్లలో ఏ ఒక్క ఏడాదీ ఎన్నికలు లేకుండా గడవలేదు. సగటున తీసుకున్నా ఏటా 5 లేదా 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఎన్నికల ప్రవర్తనా నియామవళి కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకాలు, పనులను చేపట్టే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గత మూడేళ్లలో చూస్తే 2014లో ఏడు నెలలు, 2015లో మూడు నెలలకుపైగా, 2016లో రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. - జమిలి ఎన్నికల వల్ల ప్రజాధనం ఆదా అవుతుంది. 2014 లోక్సభ ఎన్నికల నిర్వహణకు రూ. 3,780 కోట్లు ఖర్చయింది. జమిలి ఎన్నికలు పెడితే రూ. 4,500 కోట్లు సరిపోతాయని ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. - ఎన్నికల నిర్వహణ కోసం భారీగా పారామిలటరీ, పోలీసులమోహరింపుతో శాంతిభద్రతల పర్యవేక్షణలో లోపం ఏర్పడుతుంది. - తరచూ ఎన్నికలు జరిగితే కుల, మత, ప్రాంతీయ భావాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతికూల వాదన... - ఏకకాలంలో ఎన్నికలు వస్తే భారత్లో 77 శాతం ఓటర్లు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీకి ఓటేస్తారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. - లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు వేర్వేరు ఎజెండాలపై జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ఓటరు తీర్పు ఉంటుంది. జమిలి ఎన్నికలైతే జాతీయాంశాలు ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించి రాష్ట్రాలకున్న ప్రత్యేక సమస్యలు మరుగునపడతాయి. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకే పరిమితమై ఓటరు తీర్పునిచ్చే అవకాశాన్ని జమిలి ఎన్నికలు తగ్గిస్తాయి. - మనది సమాఖ్య వ్యవస్థ. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ నినాదంగా బాగానే ఉన్నా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. లోక్సభతోపాటే ఎన్నికలు జరిగేలా రాష్ట్రాలను బలవంతంగా ఒప్పించినట్లే అవుతుందని, ఇది రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని మరింత పెంచినట్లవుతుందనేది నిపుణుల ఆందోళన. జమిలిపై పార్టీల వైఖరి ఏమిటి? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తోపాటు, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తదితర పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరపాలన్న కేంద్రంలోని అధికార బీజేపీ ఆలోచనతో ఏకీభవించడం లేదని ఇటీవల జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్) సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మరోవైపు తాము జమిలి ఎన్నికలకు సిద్ధమేనంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకే ప్రకటించాయి. జమిలి ఎన్నికలకు జేడీ(యూ) పాక్షిక మద్దతు తెలిపినప్పటికీ ఆర్టికల్ 356 ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసింది. -
‘ఫలవంతం’ అర్ధమేమిటి?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 17 రోజులపాటు కొనసాగి శుక్రవారం ముగిశాయి. ఈసారి సమావేశాలు ఫలవంతమయ్యాయని అటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇటు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి వరకూ ఎజెండా ప్రకారం సమావేశాలు సాగితే, అవాంతరాల బారిన పడకపోతే అవి ఫలవంతమైనట్టే. సభాధ్యక్షులు గనుక వారికి ఆ దృష్టి ఉండటం సహజం. అయితే చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలు దీంతోపాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తాము ఏ పార్టీ తరఫున గెలిపించామో అదే పార్టీలో తమ ప్రతినిధి కొనసాగుతున్నారా లేదా అన్నది అందులో కీలకమైనది. ఎందుకంటే ఒక పార్టీ విధానాలు నచ్చి ఆ పార్టీ తరఫున బరిలో నిల్చున్నవారిని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విధానాలనే ఆ ప్రతినిధులు పార్లమెంటులో ప్రతిబింబించాలని వారు కోరుకుంటారు. కనుక ఫిరాయించిన చట్టసభల సభ్యులు ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధులయ్యే అర్హత కోల్పోతారు. అందువల్ల అలాంటివారు ఆ పార్టీ ద్వారా లభించిన పదవిని వదులుకుని ప్రజా తీర్పును కోరుతూ మళ్లీ బరిలో నిలబడవలసిందే. వారికి ఆ మాదిరి విలువలు లేని పక్షంలో సభాధ్యక్షులుగా ఉన్నవారు చట్టప్రకారం వ్యవహరించి వారిని బయటకు సాగనంపాలి. అనర్హత వేటు వేయాలి. అప్పుడు మాత్రమే చట్టసభల సమావేశాలు ఫలవంతమైనట్టు. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించినట్టు. అందుకు భిన్నంగా ఎవరైనా సభలో కూర్చుంటే ఆ సమావేశాలు అర్ధరహితమవుతాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఆ దుస్థితి ఏర్పడకుండా కాపాడాల్సినవారు సభాధ్యక్షులే. విపక్షాల ర్యాలీకి హాజరయ్యారన్న ఏకైక కారణంతో ఫిర్యాదు వచ్చిన వెంటనే రాజ్యసభలో శరద్యాదవ్, అలీ అన్వర్లపై వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారు. అనర్హత విషయంలో రెండు సభల్లోనూ ఇలా వేర్వేరు ప్రమాణాలు పాటించడం ఆశ్చర్యకరం. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున తొమ్మిదిమంది ఎన్నికయ్యారు. వారిలో నలుగురు పార్టీ ఫిరాయించారు. ఇదంతా బహిరంగమే. ముగ్గురు టీడీపీ కండువాలు కప్పుకుంటే, ఒకరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చట్టాన్ని గౌరవించి వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికి 13 సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ సుమిత్రా మహాజన్కు వినతి పత్రాలిచ్చింది. లోక్సభ పదవీకాలం మరి కొన్ని నెలల్లో ముగియబోతున్నా ఆ విషయం తేలలేదు. ఆ నలుగురు ఎంపీలు వేరే పార్టీల పంచన చేరారో లేదో తేల్చడమనేది అంత జటిలమైన విషయమా? ఆ నలుగురికీ నోటీసులు జారీ చేస్తే వచ్చి వారంతట వారే సంజాయిషీ ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేయవచ్చునో ఆమెకు తెలియదా? గత బడ్జెట్ సమావేశాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పలుమార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినా సభ సజావుగా సాగడం లేదన్న కారణంతో వాటిపై నిర్ణయం తీసుకోలేదు. చిత్రంగా వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమె ఆమోదించటం, ఆ మర్నాడే ప్రభుత్వం చర్చకు సిద్ధపడటం జరిగిపోయాయి. ఇందులో మతలబు ఏమిటన్న సంగతలా ఉంచి ఆ అవిశ్వాసం నోటీసుపై జరిగిన చర్చలో ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకకు మాట్లాడే అవకాశం ఎలా ఇచ్చారు? ఏదైనా అంశంపై చర్చ జరిగినప్పుడు దానిపై మాట్లాడేందుకు పార్టీలకు సమయం కేటాయిస్తారు. తమ పార్టీ తరఫున ఎవరెవరు, ఎన్ని నిమిషాల చొప్పున మాట్లాడాలో సంబంధిత పార్టీ విప్ నిర్ణయిస్తారు. వారి పేర్లను సభాధ్యక్షులకు అందజేస్తారు. దాని ప్రకారమే ఆ పార్టీ సభ్యులు మాట్లాడతారు. మరి బుట్టా రేణుక ఏ పార్టీ తరఫున అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడినట్టు? ఈ సమావేశాలకు ముందు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించమని కోరడానికి సుమిత్రా మహాజన్ను కలిశారు. అప్పుడు మరోసారి ఫిరాయింపుల విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా గత నెల 10న ఆమె వివిధ పార్టీలకు లేఖ రాస్తూ మన పార్లమెంటు, ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితోక్తులు పలికారు. మరి ఫిరాయింపుదార్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయడమేకాక, వారిలో ఒకరికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం ఏ ఆదర్శాలకు దోహదపడుతుందో ఆమె ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి సమావేశాల ఎజెండా పూర్తికావడం ఒక్కటే గీటురాయా? ఇతరత్రా అంశాలేవీ పరిగణనలోకి రావా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా ఫిరాయింపుదార్ల సంగతి తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. పార్లమెంటు అత్యున్నతమైనది కనుక కనీసం అక్కడి నిర్ణయాలైనా రాష్ట్రాల చట్టసభలకు ఆదర్శనీయంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఈసారి సమావేశాల్లో 21 బిల్లులు, సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ చట్టం సవరణ బిల్లు, మనుషుల అక్రమ తరలింపు నిరోధక బిల్లు, వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి బిల్లు వగైరాలు ఇందులో ఉన్నాయి. ప్రవాస భారతీయులు(ఎన్నారైలు) తమ ప్రతినిధి ద్వారా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలు కల్పించే బిల్లు కూడా ముఖ్యమైనది. విదేశాల్లో మూడు కోట్లకుపైగా ఎన్నారైలు ఉన్నారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎండగడతామని, దాన్ని సాధించుకొస్తామని చెప్పిన టీడీపీ దారుణంగా విఫలమైంది. హోదాపై తాము అందరినీ కూడగట్టామని చెప్పుకున్నా, చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్గాంధీతో సహా ఏ ఒక్కరూ ఆ విషయమై మాట్లాడకపోవడం టీడీపీని నగుబాటుపాలు చేసింది. బహుశా ఆ పార్టీ పార్లమెంటు ముందు వేయించిన పగటి వేషాలతో హోదా అంశాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఏదేమైనా పార్లమెంటు సమావేశాలు మున్ముందు మరింత అర్ధవంతంగా సాగాలని అందరూ ఆశిస్తారు. -
టీఆర్ఎస్లో ఉత్కంఠ.. నేడే అవిశ్వాసం
సాక్షి, సిరిసిల్ల : అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేతల మధ్య అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల రాజన్న జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమపై నేడు (మంగళవారం) అవిశ్వాస బలనిరుపణ పరీక్ష ప్రవేశపెట్టనున్నారు. గతకొంత కాలంగా సిరిసిల్ల జిల్లా నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా తొమ్మిది సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో దీనిపై కొంత ఉత్కఠం నెలకొంది. బల నిరుపణ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. కాగా ఉమ్మడి కరీంనగర్లోనే మరికొందరి టీఆర్ఎస్ నేతలకు అవిశ్వాస సెగ తగులుతోంది. హుజూరాబాద్ ఎంపీపీ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతా రావు సతీమణి వొడితెల సరోజినిదేవిపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా హుజూరా బాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్ (బ్రహ్మచారి)పై ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్కు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. -
నెగ్గిన అవిశ్వాసం..
సాక్షి, పెద్దపల్లి: అధికార పార్టీకి చెందిన రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం గోదావరిఖనిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్లపై సొంత పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహా 37 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. మరో ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎంపీ బాల్క సుమన్, మేయర్ లక్ష్మీనారాయణ సహా 15 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. 37 మంది సభ్యు లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల అధికారి, జేసీ వనజాదేవి ప్రకటించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులను కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించిన 13 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు పలకడం గమనార్హం. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సోమారపు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అధిష్టానం దిగి వచ్చేటట్లు చేసి మేయర్ను పదవి నుంచి దించేశారు. సోమారపు, మేయర్ నడుమ గతేడాది నుంచి విభేదాలు తీవ్రమయ్యాయి. మేయర్కు ఎంపీ సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరిగింది. వర్గపోరు ముదురు పాకాన పడటంతో గత నెల 6న మేయర్, డిప్యూటీ మేయర్లపై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీలతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని మేయర్లందరూ కలసి సీఎం కేసీఆర్కు మొర పెట్టుకొన్నారు. దీంతో అవిశ్వాసాన్ని ఆపేయాలని సత్యనారాయణకు మం త్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అధిష్టానంపై కినుక వహించిన సోమారపు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సం చలనం సృష్టించారు. అధిష్టానం దిగివచ్చి అవిశ్వాసంపై ఎమ్మెల్యేకే తుది అధికారాన్ని కట్టబెట్టడంతో అలకవీడి, మేయర్ను అవిశ్వాసంలో ఓడించి పంతం నెగ్గించుకొన్నారు. పార్టీ విప్ను ధిక్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే వర్గానికి జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
-
అవిశ్వాస తీర్మానంలో మరో మలుపు
కృష్ణా : గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. గతనెల 28న జరగాల్సిన అవిశ్వాసం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. బలం లేదని గ్రహించి అవిశ్వాస తీర్మానం వాయిదాకు టీడీపీ ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టుకి వెళ్లింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వెలువడే వరకు వైస్ చైర్మన్ మీద ఎటువంటి బలనిరూపణ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి గుడివాడ ఆర్డీఓకు ఉత్తర్వులు అందాయి. -
అవిశ్వాసానికి థాంక్యూ..!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆ తీర్మానం వల్ల ప్రతిపక్షాల అజ్ఞానాన్ని, అవగాహన లేమిని బట్టబయలు చేయగలిగామన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘వారు (విపక్షాలు) తెచ్చిన తీర్మానం వారి రాజకీయ అపరిపక్వతను, అపరిణతిని, అవగాహన లేమి, విషయ పరిజ్ఞాన లేమి మొదలైనవాటినే బయటపెట్టింది’ అని మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. తీర్మానంపై చర్చలో హోంమంత్రి రాజ్నాథ్ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. ఆ ప్రసంగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలను కోరారు. అవిశ్వాస తీర్మానం గురించి భేటీలో పాల్గొన్న బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు గడ్కరీ, సుష్మా స్వరాజ్ తదితరులు కూడా మాట్లాడారని కేంద్రమంత్రి అనంత్కుమార్ మీడియాకు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ పక్షం మెజారిటీ కోల్పోయినప్పుడు అవిశ్వాస తీర్మానం పెడ్తారని, కానీ ఈ సందర్భంలో అలాంటి పరిస్థితేమీ లేదని వారు విమర్శించారన్నారు. ఐడియాలివ్వండి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను సూచించాల్సిందిగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నా ఆగస్ట్ 15 ప్రసంగంలో ఏ అంశాలుంటే బావుంటుంది? మీ ఆలోచనలు, ఐడియాలను నరేంద్ర మోదీ యాప్లో ప్రత్యేకంగా రూపొందించిన ఒక ఫోరమ్లో నాతో పంచుకోండి. మీ సూచ నల కోసం ఎదురు చూస్తుంటా’ అని మోదీ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కోసం పౌరుల సూచనలు కోరే సంప్రదాయాన్ని మూడేళ్లుగా మోదీ పాటిస్తున్నారు. మైగవ్.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా సూచనలు పంపించవచ్చు. ఇప్పటికే ఆ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన పలు సూచలను ప్రజలు చేశారు. -
అసంబద్ధ వ్యాఖ్యల బాబుదే ‘యూటర్న్’
తెలుగుదేశం పార్టీ మోదీ ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన పిదప ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో జాతీయస్థాయి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చిందో తెలుపుతూ మాట్లాడిన సందర్భంలో కొన్ని అసందర్భ విషయాల గురించి అతిగా మాట్లాడటం తెలంగాణవాదులమైన మా బోటి వాళ్లను తీవ్ర మనస్తాపం కలి గించింది. బాబు వినిపించిన మాటలనే రాజ్యసభలో ఆ పార్టీ సభ్యులు తిరిగి వినిపించారు. అసహనం పేరుకుపోయిన వ్యక్తుల నుంచే ఇలాంటి అసందర్భ అనుచిత వాక్యాలు రావటం సహజం. అసలు మొత్తంగా వీళ్లు లేవనెత్తుతున్న ఆ అసందర్భ విషయాలు ఏమిటో పరిశీ లిద్దాం. 1.హైదరాబాద్ నా మానసిక పుత్రిక దానికి నేనే రూపమిచ్చా. 2. మోదీ, కేసీఆర్ల కన్నముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఇద్దరు ప్రధాన మంత్రులను చేయడంలో నాదే కీలకపాత్ర. 3.మాది మెజారిటీ మైనార్టీలకు చెందిన విషయం కాదు మెజార్టీ మొరాలిటికి సంబంధించిన విషయం 4.యూటర్న్ తీసుకున్నది ఎవరు? ముందుగా హైదరాబాద్ నా మానసిక పుత్రిక, దానికి నేను రూపమిచ్చా అనే దాన్ని పరిశీలిద్దాం. హైదరాబాద్ అభివృద్ధి వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి పుట్టక ముందే ఇక్కడ అన్ని వసతులు, కీలక సంస్థలు నిజాంల కాలంలోనే నెలకొల్పారు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా తానే అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను ఒప్పించి ఇక్కడ ఐ.టి. అభివృద్ధికి కృషిచేసినట్లు చెప్పుకున్నారు. కానీ ఒక్క ఐటీ పరిశ్రమ ఇక్కడికి వస్తే పది నిజాంల కాలంలో వెలసిన పరిశ్రమలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయనే నెపంతో మూసివేసిన ఘనత మీ పాలనలోనిదే. ఆ విధంగా మూతబడ్డ పరిశ్రమలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నవి. హైదరాబాదుకు మీరిచ్చిన రూపం ఇదేనా? ‘‘మీ కంటే నేనే సీనియర్ను. మోదీ, కేసీఆర్లకన్న ముందే నేను సీఎంని అయ్యా’! అనే మాటల్లో వ్యక్తికి ఉండే అహంకారం, అసహనం తప్ప మరేమీ కనిపిం చటం లేదు. మీరు మోదీ, కేసీఆర్ల కన్న ముందే సీఎం అయిన్రు. కాని ఎట్ల అయిన్రు అన్నది ప్రశ్న. కుట్రజేసి మీ మామను గద్దెదించి గద్దెనెక్కిన వైనం ఎవరికి తెలువదని? రాజకీయాల్లో మీకున్న అనుభవమల్లా ఇదేనా? పైగా మీరు సీఎం అయినా, మోదీ ప్రధాని అయినా అది మీవల్ల కాదు, ప్రజల వల్ల. ప్రజలే మీ ఇద్దరి కన్న గొప్ప. ప్రజలు తలచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడలు బండ్లయితవి. బండ్లు ఓడలయితవి అని మర్చిపోవద్దు. నైతిక విలువలను ఇతరులకు చెప్పేవాళ్లు కొంతలో కొంతైన తమ నిత్యజీవితంలో ఆచరించడం మంచిది. రాజకీయాలలో ఏ నైతిక నియమాలను పాటించి మీరు సీఎం అయ్యిన్రు. 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను మీ పార్టీలో చేర్చుకోవడమే కాక వారిలో నలుగురికి మంత్రి పదవులను కట్టబెట్టడం నైతికమా? మొదట స్పెషల్ హోదాను కాదని స్పెషల్ కేటగిరీకి ఒప్పుకున్నారు. మళ్లీ ఇప్పుడు స్పెషల్ హోదా కోరుతున్నది ఏ నైతిక విలువల ప్రకారం? తాను మొరాలిటి పక్షాన మెజారిటీపై పోరాడుతున్నానని తనది ధర్మపోరాటమని, ఈ పోరాటంలో తనతో అందరూ కలిసిరావాలని కోరడం జరిగింది. మొదటి నుంచి ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న వారిది ధర్మపోరాటం కాదట. కాని తన ఒక్కనిదే ధర్మపోరాటం అనడం ఆశ్చర్యకరం. తనతో కలసి వచ్చే వాళ్లు నీతిమంతులు, ధర్మకర్తలట. తనతో కలసిరాని వాళ్ళు అవినీతి పరులు, అధర్మకర్తలట. ఇక చివరగా వీరంటున్న యూటర్న్ గురించి చర్చిద్దాం. రాజకీయపార్టీలు తమ అవసరాన్ని ఇతర పార్టీలతో కలిసి జతకడుతూ ఉంటాయి. కానీ బాబులాగా యూటర్న్ మాత్రం తీసుకోవు. యూటర్న్ రాజకీయాలకు శ్రీకారం పడ్డది చంద్రబాబు ద్వారానే. గత ఎన్నికలలో ఎన్డీయేతో కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటమి కట్టి పోటీ చేసి గెలిచి కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి తీరా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి కాంగ్రెస్ మద్దతుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం యూటర్న్ రాజ కీయం కాదా? నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ప్రధాన కారకుడు బాబు, అతని యూటర్న్ అనైతిక రాజకీయాలు. తన తప్పుల్ని సరిదిద్దుకోకుండా తప్పులన్నింటిని ఇతరులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే అతను కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చింది. ఓ రాష్ట్ర సీఎంగా ఉంటూ ప్రజలను పోరాటానికి రమ్మని పిలుపునివ్వటం బాధ్యతారాహిత్యమే. గత నాలుగేళ్లుగా ఏపీ సమస్యలపైనా దాని అభివృద్ధి పట్ల దృష్టి సారించక ఈ రోజు మేల్కొని పోరాటానికి పిలుపునివ్వటం, ప్రజ లను తనతో కలిసి రావాల్సిందిగా కోరటం విచారకరం. బాబు ఇప్పటికైనా అనవసరమైన రాద్ధాంతాల జోలికి పోకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారిస్తారని ఆశిద్దాం. ప్రొ‘‘ జి.లక్ష్మణ్, వ్యాసకర్త అధ్యాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ మొబైల్ : 98491 36104 -
మరోసారి బయటపడ్డ టీడీపీ కుట్ర: నాని
సాక్షి, గుడివాడ(కృష్ణా జిల్లా): తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు మరోసారి బహిరంగంగా బట్టబయలయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలనుకున్న అధికారి పార్టీ కుటిల యత్నాలు విఫలమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ తవ్వుకున్న గోతిలో ఆపార్టీయే పడిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది కౌన్సిలర్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బలం పెరిగిందనుకొని వైస్ చైర్మన్పై అవిశ్వాసం ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. శనివారం అవిశ్వాసంపై చర్చ జరగాల్సివుండగా ఇద్దరు కౌన్సిలర్లు కనిపించడం లేదని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవిశ్వాసంపై చర్చలో టీడీపీని ఫిరాయింపులపై ఎండగట్టాలని అనుకున్నామని వివరించారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే టీడీపీలోని గ్రూపులు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ డ్రామాలు ఆడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. -
ఫలించిన టీడీపీ కుట్ర రాజకీయం
సాక్షి, కృష్ణా : గుడివాడ మున్సిపాలిటీలో టీడీపీ కుట్ర రాజకీయం ఫలించింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం రేపటికి వాయిదా పడింది. శనివారం వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ అడపా బాబ్జీపై అవిశ్వాస తీర్మానం బెడిసికొట్టడంతో రేపటికి వాయిదా పడేలా టీడీపీ కుట్రలు రచించింది. కౌన్సిల్లో బలం లేకపోయిన ఇటీవల వైఎస్సార్ సీపీ నుంచి చేరిన ఛైర్మన్, కౌన్సిలర్లపై నమ్మకంతో టీడీపీ అడపా బాబ్జీపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వ్యతిరేకించారు. అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కావాలని ఫిరాయింపు కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్చాఫ్ చేయగా కౌన్సిలర్లు కనిపించటం లేదని వారి కుటుంబసభ్యులతో గుడివాడ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఇరువురు కౌన్సిలర్లు కనపడటం లేదనే ఫిర్యాదు రావటంతో ఈ రోజు జరగాల్సిన అవిశ్వాసం ఓటింగ్ సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. -
మోదీనే ట్రాప్లో పడ్డారు.. చంద్రబాబు ఎదురుదాడి!
సాక్షి, కొవ్వూరు : అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక టీడీపీ అధినాయకత్వం సతమతమవుతోంది. ప్రత్యేక హోదా వద్దంటూ తొలుత ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. ఆ తర్వాత మాట మార్చి యూటర్న్ తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన వైఎస్సార్సీపీ ట్రాప్లో పడ్డారని ప్రధాని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. తాజాగా చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ట్రాప్లో తాను పడలేదని, ప్రధాని మోదీనే ట్రాప్లో పడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉండి తెలుగువాడి సత్తా చూపిస్తామని చెప్పిన చంద్రబాబు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేయరని అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మొదటినుంచి అవకతవక వైఖరిని అవలంబించారు. ఆయన హోదా కాదని ప్యాకేజీకి స్వాగతించడమే కాక.. ఈ విషయంలో ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఒకవైపు ప్రత్యేక హోదాను ఖూనీ చేసేవిధంగా ప్రవర్తించినా.. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం మొక్కవోని పట్టుదలతో, నిరంతర పోరాటాలతో హోదా ఆకాంక్షను ఆయన సజీవంగా నిలిపారు. అలుపెరగని పోరాటాలతో ఇటు చంద్రబాబు ప్రభుత్వంపై, అటు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మొదట ప్యాకేజీ కోసం పాకులాడిన చంద్రబాబును.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన యూటర్న్ రాజకీయాలను తెరపైకి తెచ్చి.. ఇటీవల హోదా నినాదం ఎత్తుకొని ఆర్భాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ట్రాప్లో తాను పడ్డానని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక.. కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏకంగా మోదీని ట్రాప్లో పడ్డారని ఆయన ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
విశ్వసనీయత లేని అవిశ్వాసం
ఆ ముచ్చట కూడా తీరిపోయింది. కేంద్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనుకున్నట్లుగానే వీగిపోయింది. ఇంతకూ ఏమి ఆశించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉన్నది. అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేది ముందే తెలిసిన విషయం. ఇక విభజన అంశాలలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని అన్ని అంశాల మీద నిర్ద్వంద్వంగా చెప్పకనే చెప్పింది. అవిశ్వాసం వల్ల భయపడి వారి విధానంలో మార్పు వస్తుందని ఆశించే అవకాశం లేదు. ఇక ఎటు వచ్చి అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించగలిగిన ఒకే ఒక్క లక్ష్యం ప్రజల ముందు విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టటం. ఈ అంశం మిగిలిన రాష్ట్రాలకు ప్రధానమైన అంశం కాదు కనుక దీనిపై చర్చ కనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజలు స్పందించే అవకాశం ఎటు లేదు. ఇక మన రాష్ట్రంలో ప్రజలు స్పందించడానికి ఈ అవిశ్వాసం ఒక్కటే మార్గం కానక్కర్లేదు. పైపెచ్చు కేంద్రాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా నిలదీయటానికి తెలుగుదేశం పార్టీకి కొన్ని సహజమైన పరిమితులు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఇంతకుముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించడం, దానికి చట్టబద్ధత కావాలని కోరడం, కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ప్యాకేజీ కింద నిధులు పొందే సమయంలో తీసుకోవాల్సిన తదనంతర చర్యలు ఆపేసి రాష్ట్ర ప్రభుత్వం హోదా బాటపట్టింది. ఈ అంశంపై జరిగే చర్చలో కేంద్రాన్ని టీడీపీ నిలదీసే బదులు తెలుగుదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీసే అవకాశాలు జాస్తి. అటువంటి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో పోయి అవిశ్వాస తీర్మానం పెట్టడం సమస్యలు కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. రెండో ముఖ్యాంశం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంతో కొంతలో కొంత సఖ్యత నిలుపుకుంటూ నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత వారి పైన ఉన్నది. ప్రతిపక్షాల లాగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే వెసులుబాటు అధికారంలో ఉన్న పక్షానికి ఉండకపోవచ్చు. ప్యాకేజి ద్వారా ఎస్పీవీ పెట్టుకుంటే నిధులు వస్తాయంటే మేముపెట్టుకోము మాకు హోదా కావాలని భీష్మించే అవకాశం ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకి ఉండదు. ఇక అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చను పరిశీలిస్తే.. టీడీపీ ఎంపీలు తప్ప మిగిలిన పార్టీల తరఫున మాట్లాడిన సభ్యులెవరికీ విభజన సమస్యలు, ప్రత్యేకహోదా ప్రధానాంశాలు కాకుండా పోయాయి. అందువలన చాలావరకు అవిశ్వాస తీర్మానం సాధారణ రాజకీయ పరిస్థితులపై చర్చకే పరిమితం కావడం జరిగింది. మరి అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతు అడిగినప్పుడు టీడీపీ ఎంపీలు తమ తీర్మానానికి మద్దతు మాత్రమే అడిగారా లేక వారు ప్రసంగించేటప్పుడు విభజన అంశాల గురించి మాట్లాడవలసిందిగా అభ్యర్థించారా? ఆవిధంగా అభ్యర్థించి ఉంటే తప్పకుండా విభజన అంశాల ప్రస్తావన మిగిలిన పార్టీల సభ్యుల ప్రసంగాల్లో కూడా ప్రధానంగా వినిపించి ఉండేది. ఏపీ విభజన చట్టం చర్చించే సమయంలో దానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడిన టీఎంసీ పార్లమెంటు సభ్యులు సౌమిత్రి రాయ్ ఈసారి మాత్రం పెద్దగా స్పందించలేదు. ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా తీసుకు పోవటంలో టీపీపీ పూర్తిగా విఫలమైందని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శన చాలు. ఈ అవిశ్వాస తీర్మానం మోదీకి రాజకీయంగా విస్తృత అంశాలపై స్పందించటానికి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చిందే కానీ రాష్ట్ర విభజన అంశాలు కానీ ప్రత్యేకహోదా అంశం కాని కేంద్ర బిందువుగా చర్చజరిగే అవకాశం కల్పించలేదు. చర్చ ముగించే ముందు వచ్చిన అవకాశాన్ని కేశినేని సరిగా వినియోగించుకోలేదు. ప్రభుత్వం నుంచి వివరణ హామీ కోసం నిర్దిష్ట అంశాలను లేవనెత్తి ఉండాల్సింది. మొత్తం అవిశ్వాస తీర్మానం పై జరిగిన చర్చలో ఒక ప్రధానాంశాన్ని టిఆర్ఎస్ ఎంపీ వినోద్ లేవనెత్తారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి? పరిశ్రమ రాయితీలు హోదాలో భాగమా? అన్నారు. నా దృష్టిలో దీనిమీద ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అది గమనించలేకపోవడం మన అవగాహనా రాహిత్యంగా కనిపిస్తూ ఉన్నది. - ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
‘లోఫర్లే అలా చేస్తారు’
పనాజి : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, అనంతరం తన సీట్లో కూర్చుని కన్నుగీటడం వంటి చర్యల ద్వారా రాహుల్ సభా మర్యాదను మంటగలిపారని బీజేపీ నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా గోవా బీజేపీ అధికార ప్రతినిధి దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత ప్రజల సమస్యలను, కష్టాలను అర్థం చేసుకోలేని వ్యక్తే ఇలా ప్రవర్తిస్తారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కొలువుదీరిన పవిత్రమైన ఆలయం(పార్లమెంటు)లో రాహుల్ చేసిన పనులు చాలా అవమానకర రీతిలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల్లో, రోడ్లపై అమ్మాయిలను ఏడిపించే లోఫర్లే ఇలా కన్నుగీటుతారని, రాహుల్ కూడా సభలో ఓ లోఫర్ లాగే వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ కుటుంబం చేతుల్లో తోలుబొమ్మల్లా మారిన కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లు చెప్పినట్టల్లా ఆడుతున్నారని విమర్శించారు. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్.. బీజేపీ, మిత్ర పక్షాల చేతిలో తోలుబొమ్మగా మారడం వల్లే రాష్ట్రంలో ఫిష్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేత చోదంకర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే దత్తప్రసాద్ నాయక్ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. -
రక్తికట్టని ‘అవిశ్వాస’ నాటకం
నిజానికి చంద్రబాబు లోక్సభలో ప్రవేశపెట్టించింది ‘విశ్వాస’ ప్రకటనేగాని ‘అవిశ్వాస’ తీర్మానం కాదని మెడమీద తలలున్న ప్రతి ఒక్కరికీ తెలుసు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలో పయనించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సరిపెట్టుకోవాలని చంద్రబాబు అప్పట్లో సరేనన్నారు. ‘దొరారి అభిప్రాయమే నా అభిప్రాయం’ అనే రీతిలో ఆయన సరిపెట్టుకుని రకరకాల వంకలూ, డొంకలూ పట్టుకుని తిరుగుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే బీజేపీ సర్కారుపై ఎదురుదాడి చేసినట్టు ఆయన కొత్త నాటకం మొదలెట్టారు. (గత వారం జమిలి ఎన్ని కలపై కుదేలైన బీజేపీ భ్రమలు వ్యాసానికి కొనసాగింపే ఈ గ్రంథ సమీక్షా వ్యాసం. గత నాలుగేళ్ల ఎన్డీఏ పాలనలో ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఘటిల్లిన పరిణామాలను సమీక్షిస్తూ మీడియా హౌస్ ప్రచురించిన బృహత్ గ్రంథం ‘‘డిస్ట్రాయింగ్ ఇండి యా’’ను ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇటీవల ఆవి ష్కరించారు. మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వాస్తవానికి ‘విశ్వాస ప్రకటన’ మాత్రమే. ఈ పూర్వరం గంలో ఈ పుస్తకంపై సమీక్షా రచన ఇది.) 2014 పార్లమెంటు ఎన్నికల్లో దేశప్రజలు బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పును దేశంలోని ప్రతిపక్షాలు బేఖాతరు చేస్తున్నాయి. నాకు వ్యతిరేకంగా ఎన్ని ప్రతి పక్షాలు ఏకమైనా ఆ మేరకు బీజేపీ ‘కమలం’ వికసి స్తూనే ఉంటుంది. నేను అవినీతిని, ఆశ్రితపక్షపాతాన్ని ఎదుర్కొంటున్నందునే బీజేపీ సంకీర్ణానికి వ్యతిరే కంగా ప్రతిపక్షాలు ఐక్యం కాలేకపోతున్నాయి. ఈ పరి స్థితుల్లో కాంగ్రెస్ కేంద్రంగా ఐక్యసంఘటన ఏర్పడడం ఏపీ సీఎం చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడానికి ఆ ప్రభు త్వానికి వ్యతిరేకంగా లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయినా ప్రజలు నాపైన విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రతిపక్షాల ప్రయత్నం వృధా అయింది. – అవిశ్వాస తీర్మానం వీగిపోయిన మరుసటి రోజు యూపీలోని సహారన్పూర్ సభలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన నిజానికి తెలుగుదేశం నేత చంద్రబాబు లోక్సభలో ప్రవేశపెట్టించింది ‘విశ్వాస’ ప్రకటనేగాని ‘అవిశ్వాస’ తీర్మానం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు! ఎన్డీఏ సర్కా రుకు ఏ రూపంలోనూ మద్దతు తెలపకుండా ఏపీలో బలమైన ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగాన ముందుకు దూసుకు వస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ పాలనలో జగన్పై బనాయించిన కేసులను బీజేపీ హయాంలోనూ తేల్చకుండా సాగదీస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ బాబు మాటే ఈ విషయంలో చెలామణి అవుతున్నట్టు కనిపిస్తోంది. చివరికి, సీబీఐ ప్రత్యేక కోర్టులు సైతం, ‘మీ ఆరోపణలకు, కేసుల విచారణకు ఆదీ, అంతాలు లేకుండా పోయిన సాక్ష్యా లకు ముగింపు ఎప్పుడు?’ అని సీబీఐని ప్రశ్నిం చాల్సి వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జగన్ బహిర్గతం చేయడమే ఈ పార్టీలను ఏకం చేస్తోంది. ఈ రెండు పార్టీల కుట్ర ఫలితంగానే కాంగ్రెస్ నుంచి జగన్ బయటికొచ్చి ప్రభంజనమై అవతరించారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేక పోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ పెట్టిన కేసులు ముందుకు సాగకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. మరో వైపు అలాంటి కేసులే తనపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చినా ఆయన అన్యమార్గాల ద్వారా తప్పించుకుంటు న్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన వల్ల ఏపీ ప్రజల భవి ష్యత్తు దృష్ట్యా ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ సైతం కాంగ్రెస్ బాటలో పయనించింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సరిపెట్టుకోవాలని అంటే చంద్రబాబు అప్పట్లో సరేనన్నారు. ‘దొరారి అభిప్రా యమే నా అభిప్రాయం’ అనే రీతిలో రకరకాల వంకలూ, డొంకలూ పట్టుకుని తిరుగుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయంలో భాగంగానే బీజేపీ సర్కా రుపై ఎదురుదాడి చేసినట్టు ఆయన కొత్త నాటకం మొదలెట్టారు. అందుకు ప్రతిగా, ‘బాబు కోరిందే (ప్యాకేజీ) ఇవ్వడానికి మేం అంగీకరించాం,’ అని మోదీ చెప్పారు. ఎన్డీఏ సర్కారు నుంచి బయటి కొచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వ కమిటీల్లో తెలుగు దేశం ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ‘మాతో చంద్ర బాబు స్నేహం అలాగే ఉంది. ఇంకా కొనసాగు తుంది’ అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రకటించడం బీజేపీ, టీడీపీ మధ్య ఓ కొత్త మ్యాచ్ ఫిక్సింగ్ క్రీడగా మారింది. భ్రష్టుపట్టించిన బీజేపీ పాలనపై కొత్త పుస్తకం! సరిగ్గా ఈ వాతావరణం మధ్యనే గత నాలుగేళ్ల పాలనా కాలంలో జరిగిన ప్రజావ్యతిరేక, విషాదకర పరిణామాలను ఏకరువు పెడుతూ ‘భారతదేశాన్ని భ్రష్టుపట్టించిన నాలుగేళ్ల బీజేపీ పాలన’ అనే మకు టంతో దిల్లీకి చెందిన మీడియా హౌస్ సంస్థ ప్రచు రించిన పుస్తకాన్ని ‘మోదీ రిపోర్ట్కార్డ్ డాట్కామ్’ అనే వెబ్సైట్లో ఓ రిపోర్ట్గా వెల్లడించింది. నేడు దేశంలో మత ప్రాతిపదికపై సాగుతున్న అరాచకాలు, హత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, పెట్రోలు, డీజిల్ ధరలు, ఇంకా పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు, రైతులు సహా సాధారణ ప్రజలు పడిన పాట్లు వంటి అనేక సమస్యలపై ‘డిస్మాంట్లింగ్ ఇండియా ఇన్ ఫోర్ ఇయర్స్’ అనే ఈ పుస్తకంలో వివరించారు. ఈ గ్రంథ రచనలో పాతిక మందికి పైగా ప్రసిద్ధ పరిశోధకులు, చరిత్రకారులు, ఆర్థిక వేత్తలు, జర్నలిస్టులు సహా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు పాల్గొన్నారు. మోదీ రిపోర్ట్ కార్డ్ (2018) లోని కొన్ని అంశాలు క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తు న్నాను. దేశంలో 2014లో 3.41 శాతం ఉన్న నిరు ద్యోగం 2018కి 6.23 శాతానికి పెరిగింది. నాలు గేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలన్న హామీ 2017దాకా 8.23 లక్షలకే పరిమితమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు 2018లో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.68.86 ఉండగా, తర్వాత క్రూడాయిల్ ధర తగ్గినాగాని 2018 కల్లా రూ.81. 92కి చేరింది. నోట్ల రద్దు ఫలితంగా 2017 జన వరి–ఏప్రిల్ మధ్య 15 లక్షల ఉద్యోగాలు పోయాయి. పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్లకైన ఖర్చు ఫలితంగా దేశ స్థూల జాతీయోత్పత్తుల విలువ 7.93 నుంచి 6.50 శాతానికి పడిపోయింది. అవినీతి విషయానికి వస్తే, బ్యాంకుల మోసాల సంఖ్య రూ. 12,787 నుంచి అదే కాలంలో రూ. 17,789 కోట్లకు చేరింది. అదే సమ యంలో ఇండియాను మొత్తం ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా అమెరికాకు చెందిన ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. ఎన్నో రాష్ట్రాల్లో అవినీతిపై విచారణకు అవసరమైన లోక్పాల్ను ఇంతవరకు నియమించ లేదు. దళితులపై ఎన్నో రెట్లు పెరిగిన దాడులు దళితులపై దేశవ్యాప్తంగా జరిగిన దాడులకు సంబం ధించి 2008లో 33 వేల కేసులు నమోదుకాగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 746 శాతం, గత పదేళ్లలో 1,160 శాతం పెరిగిపోయాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకటించింది. ఇక రైతాంగ సంక్షోభం వల్ల వ్యవసాయరంగ అభివృద్ధి రేటు 2010–2014 మధ్య 5.2 శాతం నమోదు కాగా 2014–18 మధ్య అది 2.4 శాతానికి దిగజారిపో యింది. 2014–2016 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులు 36,420 మంది కాగా, 2017–18 మధ్య అంచనాలు ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సి ఉంది. గత నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం మూసేసిన ప్రభుత్వ పాఠశాలలు 2 లక్షలు. పాఠశాల పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పాఠాల్ని, చరిత్రను తిరిగి రాసే పనికి శ్రీకారం చుట్టారు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాల మెరుగుదల విషయంలోను, పరిస్థితి లోనూ మార్పేమీ లేదు. ఇక మోదీ హయాంలో దేశ న్యాయ వ్యవస్థ నిర్వహణలో భారీ సంక్షోభం నెల కొంది. ఎన్కౌంటర్ మరణాల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాత్రపై విచారణ జరుపుతున్న క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీహెచ్ లోయా ఆకస్మిక మరణంపై విచారణ ఆకస్మికంగా నిలిచిపో యింది. చివరికి ఈ పరిణామం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను పార్లమెంట్ అభిశం సించాలన్న డిమాండ్కు దారితీసింది. ఆధార్ కార్డు ఉనికి కాస్తా జాతీయ స్థాయిలో చర్చకు, అభిశంస నకూ పాత్రమైంది. ఈ నాలుగేళ్లలోనూ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఇతర సంక్షేమ వ్యవస్థల నిర్వహ ణకు నిధులు తరిగిపోయాయి. ప్రజల సంక్షేమంపై ఏదీ శ్రద్ధ? గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు తగ్గిపోయాయి లేదా పక్కదారులు పట్టాయని రిపోర్టు కార్డు వివరించింది. ఆరోగ్య సంరక్షణ విష యంలో ఇరుగుపొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్లతో పోల్చితే ఇండియా స్థానం ఈ నాలుగేళ్లలోనే 195 దేశాల్లో 145వ స్థానానికి పడి పోయింది. మోదీ ప్రారంభించి, ఆచరణలో అసలు అమలు కాకుండా ఉన్న పెక్కు పథకాలు కాంగ్రెస్ ప్రారంభించినవే కాగా, వాటికే కేవలం పేర్లు మార్చ డమే జరిగిందని రిపోర్ట్ కార్డు వివరించింది. పర్యా వరణ రక్షణ పథకాల అమలులోనూ ప్రపంచంలోని 180 దేశాల్లో మనం 177వ అథమ స్థానంలోకి ఈ నాలుగేళ్లలోనే చేరుకున్నాం. అలాగే గత నాలుగేళ్ల లోనే దేశంలో జరిగిన మత ఘర్షణలు 2020. అందులో (2014 నుంచి 2018 దాకా) హతులైన వారి సంఖ్య 389 కాగా, గాయ పడినవారు 8,890 మంది. ఇవన్నీ ఈ నాలుగేళ్లలోనే ఏడు రాష్ట్రాలకు వ్యాపించాయి. అంతేగాదు, ఈ నాలుగేళ్లలోనే బీజేపీ హయాంలో జరిగిన మత ఘర్షణల్లో, విద్వేష ప్రచార ఘట్టాలలో జరిగిన వేధింపులు, హత్యాకాండ నేరా లకు సంబంధించిన కేసుల్లో శిక్షలు పడిన పార్టీ నేర గాళ్లకు మద్దతుగా పరామర్శించడానికి వెళ్లినందుకు బీజేపీ మంత్రి జయంత్ సిన్హాను కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మందికి పైగా మాజీ సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్/ఐపీఎస్/దౌత్యాధికారులు/ప్రధాన కార్యద ర్శులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది చివరి మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్ని కల్లో హిందువులను భయ భ్రాంతుల్ని చేసే అనేక పద్ధతుల్లో అబద్ధపు వార్తలతో ‘నకిలీ వార్తల కర్మా గారం’ (ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ) నడుస్తోందని కూడా వార్తలు పొక్కుతున్నట్టు కూడా ‘వైర్’ లాంటి మాధ్య మాలు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా అటు పాల కులు, ఇటు ప్రసార మాధ్యమాలు, రాజకీయ పక్షాలు, వాటి అనుయాయులూ జాగరూకులై ఉండా లన్నది మాధ్యమాల ఆరోగ్యకరమైన సందేశం! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
ప్రహసనంగా ముగిసిన అవిశ్వాసం!
పార్లమెంటులో ఏమీ సాధించే అవకాశం లేకపోయినా గొప్పలకు పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్లయింది. దేశం ముందు, రాష్ట్ర ప్రజల ముందు బీజేపీని అభాసుపాలు చేయాలనుకున్న టీడీపీకీ, చంద్రబాబుకీ ఎదురుదెబ్బలు మిగిలాయనడంలో సందేహం లేదు. తమ వెంట కొత్తగా వచ్చేవారెవరూ లేరని దేశప్రజలకు పార్లమెంట్ సాక్షిగా తెలియజేసినట్లయిందనడానికి నిదర్శనం అవిశ్వాసానికి అనుకూలంగా వచ్చిన కేవలం 126 మంది మద్దతే. అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ముందు, పార్లమెంటులో స్పీకర్ సుమిత్రా మహాజన్ అవి శ్వాసంపై చర్చకు అనుమతించిన తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర వారి మిత్రపక్షాల పెద్దలు మాట్లాడిన మాటలు కోటలు దాటాయి. కానీ వారిమాటలకు తగినట్లుగా కూడా వారు సిద్ధం కాకపోవడం స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ కూడా తన ప్రసంగంలో వారి తీరును ఎద్దేవా చేశారు. భూకంపం సృష్టిస్తాం అన్నారు.. ఏదీ భూకంపం? అవిశ్వా సంపై చర్చలో మాట్లాడడానికి కనీసం ముందస్తుగా సిద్ధమై రాలేదు అని మోదీ ఎత్తిపొడిచారు. ఇక టీడీపీ తరఫున అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన గల్లా జయదేవ్ మాటల్లో కూడా కొత్తదనం కనిపించలేదు. ముందుగా నిర్ణయించిన సమ యం కన్నా రెట్టింపుకుపైగా సమయాన్ని స్పీకర్ అనుమతించినా ప్రయోజనం లేకపోయింది. మోదీని వ్యక్తిగతంగానూ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే పార్లమెంటులో టీడీపీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినట్లయింద. కేంద్రంపై టీడీపీ విమర్శలన్నీ తెలుగు ప్రజలు నిత్యం అరిగిపోయిన రికార్డుల్లా వింటున్నవే కావడం గమనార్హం. అందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వైఖరిని ట్వీట్లతో తూర్పారబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ నేతలు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడ్డారని విమర్శించారు. ఇక రాష్ట్రానికే చెందిన బీజేపీ సభ్యుడు హరిబాబు తెలుగుదేశం వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. నిబంధనల ప్రకారం టీడీపీ ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్–ఎస్పీవీ–ని ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. అందుకే కేంద్రం ఏపీకి మరింత సహాయం చేయలేకపోతోందని ఎత్తిచూపారు. చర్చను కొనసాగిస్తూ జయదేవ్ మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ టీడీపీ సహించలేకపోతున్నట్లు అనిపించింది. అందుకే పార్లమెంటులో టీఆరెస్ సభ్యులు గల్లా జయదేవ్ మాట్లాడే సమయంలో తీవ్ర నిరసన తెలిపారు. కేంద్రం తెలంగాణకు పూర్తిగా న్యాయం చేస్తూ, ఆంధ్రకు అన్యాయం చేస్తోందనటం సబబు కాదు. తమకు కావలసింది అడగడంలో తప్పు లేదు కానీ, తెలం గాణ విషయంలో టీడీపీ అక్కసు వెళ్లగక్కడం సమంజసం కాదు. తెలంగాణ విషయాన్ని లేవనెత్తడం ద్వారా టీడీపీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందన్న విషయాన్ని కూడా సుదీర్ఘ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఎలా మరిచిపోయారు. అందుకే ప్రతి విషయంలోనూ తెలంగాణతో తెలుగుదేశం పార్టీ పేచీ పెట్టుకుంటూ సమస్యల్లో చిక్కుకుంటోందని ప్రధాని మోదీయే పార్లమెంటులో వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లయింది. మొత్తం మీద పార్లమెంటులో తెలుగుదేశం, కాంగ్రెస్ మిత్రపార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోగా, కొండను తవ్వినా ఏమీ సాధించలేకపోయినట్లుగా విపక్షాల పరిస్థితి మారింది. సభలో తగిన సంఖ్యా బలం లేకుండా, సరైన ముందస్తు సంసిద్ధత లేకుండా ఏ పార్టీ ఇలాంటి సాహసం చేసినా నవ్వులపాలవుతాయని అవిశ్వాసం తీర్మానం సందర్భంగా రుజువయ్యింది. ఇప్పటికైనా తెలుగుదేశం, కాంగ్రెస్ మిత్రపక్షాలు బీజేపీ ప్రభుత్వంతో తలపడటంలో గుణపాఠం నేర్చుకోవలిసిన అవసరం ఎంతయినా ఉంది వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ, రాఘవ ఫౌండేషన్, హైదరాబాద్ ఎస్.ఎస్. వరయోగి -
మీరలా ఎలా..? ట్విటర్లో మోదీకి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ.. ట్విటర్లో అభిమానులు, కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో వైవిధ్యం ప్రదర్శిస్తారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం అంటే ఒకింత ఆందోళనకు గురి కావాల్సిందిపోయి మోదీ లోక్సభలో దర్జాగా నవ్వులు చిందిస్తూ కనిపించారు. మెజారిటీ ఉంది కాబట్టి అలా చేశారని అందరికీ తెలుసు. అదే అంశంపై ఒక అభిమాని ట్విటర్లో మోదీని ప్రశ్నించారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా మీరెప్పుడూ నవ్వుతూ కనిపిస్తారెలా..? అని అడిగారు. దానికి మోదీ.. ‘పాయింట్ పట్టేశావ్’అంటూ సరదా సమాధానం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన మరో వ్యక్తి.. అవిశ్వాస తీర్మానంపై అర్ధరాత్రి 12 దాకా చర్చ కొనసాగింది కదా..! మళ్లీ ఉదయమే షాజహాన్పూర్ ర్యాలీలో పాల్గొనడానికి ఎలా రాగలిగారు. 67 ఏళ్ల వయసులో ఇలా ఉండడం నిజంగా అద్భుతం అంటూ ప్రశంసించారు. ‘125 కోట్ల మీ ఆశిస్సులు ఉన్నాయి కాబట్టే ఇంత హుషారుగా ఉన్నాన’ని ప్రధాని రీట్వీట్ చేశారు. కాగా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించిన సంగతి తెలిసిందే. Point taken. :) https://t.co/xtFMxxO8M6 — Narendra Modi (@narendramodi) 22 July 2018 The blessings of 125 crore Indians give me great strength. All my time is for the nation. https://t.co/NRHuduHyuw — Narendra Modi (@narendramodi) 22 July 2018 -
‘బాబు అవినీతి కాంగ్రెస్కు కనిపించదా’
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిధులుగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు తన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవటానికే కేంద్రంపై అవిశ్వాసం పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి కాంగ్రెస్ ఎందుకు సహకరించిందో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని, మోదీ బలమైన నాయకుడు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ అవినీతి బయట పెట్టినందుకే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదన్నారు. చంద్రబాబు కోరిక మేరకే ప్యాకేజీ ఇచ్చారని, చంద్రబాబు ప్రత్యేకహోదా అడగలేదని తెలిపారు. ప్యాకేజీ కింద చంద్రబాబు మోదీని 5 వేల కోట్లు అడిగారని, మోదీ మాత్రం 16,500కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు. రాష్ట్రంలో జన్మభూమి బ్రోకర్ల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దని మాట్లాడిన క్లిప్పింగ్స్ను బీజేపీ నేతలు స్ర్కీన్ మీద ప్రదర్శించారు. ప్యాకేజీ ఇచ్చినందుకు వెంకయ్యనాయుడిని రాష్ట్రమంతా తిప్పి టీడీపీ నాయకులు సన్మానాలు చేశారని గుర్తుచేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకే అసెంబ్లీలో మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ చంద్రబాబు తీర్మానం చేశారని తెలిపారు. ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటనను అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించి స్వాగతించిన విషయాలను కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. -
‘టీడీపీ డ్రామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: హోదాపై బాబు మోసం, ఎన్డీఏ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24న (మంగళవారం) రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజద్ బాషా కోరారు. పార్టీ నేత సురేష్ బాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ది జరుగుతదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాటాల వల్లే హోదా అంశం సజీవంగా ఉందని అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమేనని స్పష్టంచేశారు. పార్లమెంట్లో టీడీపీ ఆడిన డ్రామాలన్నీ ప్రజలు గమనించారని వివరించారు. నిన్నటి వరకు ప్యాకేజీ అన్న బాబు నేడు హోదా అంటూ బోర్డు తిప్పేశారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని అంజద్ బాషా మండిపడ్డారు. -
‘బాబు అసమర్థతే కారణం’
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో అవిశ్వాసం, తదితర అంశాలపై స్పందిచారు. వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టారని, నాలుగేళ్లుగా టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఇప్పటివరకు 30 దేశాలు తిరిగాడని.. కానీ అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎద్దేవ చేశారు. బీజేపీతో టీడీపీ లాలూచీ నిజం కాదా? బీజేపీ తప్పులను గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును చేపట్టారే తప్పా ఎలాంటి మంచి ఉద్దేశంతో కాదని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్కే కాదు.. ఆంధ్రులకూ బాబు వెన్నుపోటు!
సాక్షి, హైదరాబాద్ : పత్ర్యేక హోదా రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటమిని చూడాలని వెంకన్నకు మొక్కానని, చంద్రబాబు పతనం కోసం కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. మెట్టు మెట్టుకి చంద్రబాబు ఓడిపోవాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు జీవితమంతా కపటం, నాటకం, దగా మోసాలేనని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చలో ఏపీకీ హోదా ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా అని, టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై ఎవరైనా కలిసొచ్చారా అని ప్రశ్నించారు. దివంగత నేత ఎన్టీఆర్ జెండాను చంద్రబాబు దొంగతనం చేశాడని మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే చెప్పారని మోత్కుపల్లి గుర్తు చేశారు. బాబు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ఆయన ఎన్టీఆర్కే కాదు.. ఆంధ్రులకు వెన్నుపోటు పోడిచారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చాలా సార్లు హోదాపై బాబును ప్రశ్నించారని, హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అవినీతి కప్పిపుచ్చుకోవడానికే.. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన అవినీతిని, దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు. బాబు మోసాలపై అందరూ తిరగబడాలని, ప్రజల కోసం రాజకీయాలు చేయడం లేదని, తన కోసం, తన కుటుంబం కోసం రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. మోసగాడు, అబద్దాల కోరు చంద్రబాబును అడుగడుగునా నిలదీయాలన్నారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అని ఆ జాతినే అవమానించారని, అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. కేంద్రం ప్యాకేజీ ఇస్తే అసెంబ్లీ సాక్షిగా బాబు ధన్యవాదాలు చెప్పారని గుర్తు చేశారు. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వెన్నపోటు పొడవడంలో, మోసాలు చేయడంలో ఆయనను మించిన సీనియర్ లేరని తెలిపారు. కులాలరహితంగా ఏకమై చంద్రబాబుపై పోరాటం చేయాలని, తగిన గుణపాఠం చెప్పాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. -
వంచనపై తిరుగుబాటే 24న బంద్: భూమన
సాక్షి, హైదరాబాద్ : వంచనపై తిరుగుబాటులో భాగమే మంగళవారం బంద్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సారైనా బంద్లో పాల్గొంటున్న ప్రజలను భయపెట్టకుండా వారికి ఆటంకం కలిగించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ఏపీ విభజన చట్టం హామీలను ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ఎవరికి వారు వారి ప్రయోజనాల గురించే మాట్లాడారు తప్పా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఎవరైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారు? అవిశ్వాసం వీగిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎందుకెళ్లారని, బీజేపీకి కృతజ్ఞతలు చెప్పడానికా? లేక కొత్త పొత్తుల కోసమా? అని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్రం ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాద తీర్మానం చేయలేదా అని నిలదీశారు. హోదాపై చంద్రబాబు తీసుకున్నది యూటర్నా? లేక రైట్ టర్నా? ఏ టర్న్ అని ప్రజలు ప్రశిస్తున్నారని చెప్పారు. గతంలోప్యాకేజీనే మంచిదని సీఎంవో పుస్తకాలు కూడా ప్రచురించిందని గుర్తు చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి వాదననే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో చదివారన్నారు. టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బయట పెట్టారని తెలిపారు. సాక్షాత్తు ప్రధానే టీడీపీ వైఎస్సార్ సీపీ ట్రాప్లో పండిందన్నారంటే అర్థం ఏంటనీ, చంద్రబాబు బీజేపీ మిత్రుడు కాబట్టే ప్రధాని అలా చెప్పారని భూమన పేర్కొన్నారు. ‘క’ గుణితమని కేకేను కలిస్తే ఎలా? అవిశ్వాసంలో పక్క రాష్ట్రాలను చంద్రబాబు మేనేజ్ చేయలేకపోయారన్నారు. మద్దతు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కాకుండా ‘క’ గుణితమని కేకేను కలిస్తే ఇలానే ఉంటుందని సెటైర్ వేశారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారన్నారు. గతంలో వైఎస్సార్ సీపీ పిలుపునిస్తే పట్టించుకోలేదని, ఇప్పుడు కంటి తుడుపు చర్యగా అవిశ్వాసం పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మీ పాలనపై మీరే అవిశ్వాసం పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. చంద్రబాబు నైజాన్ని ఖండిస్తూ 24న వైఎస్ జగన్ పిలుపునిచ్చిన బంద్ను విజయవంతం చేయాలని భూమన ప్రజలను కోరారు. చదవండి: 24న ఏపీ బంద్ -
బాబు గుట్టు రట్టు చేసిన మోదీ
-
అవిశ్వాసంతో చులకనయ్యామే
-
మోదీ ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ/ముంబై: దేశ ప్రజల్లో ప్రేమ, కరుణ పెంపొందించడం ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. తమ వాదనే సరైందని నమ్మకం కలిగించేందుకు ప్రధాని∙మోదీ ప్రజల మనసుల్లో విద్వేషం, భయం, ఆగ్రహాన్ని పాదుకొల్పుతున్నారని ఆరోపించారు. విద్వేషం బదులు ప్రజల్లో ప్రేమ, కరుణ ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని చెప్పేందుకు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని ఆయన శనివారం ట్వీటర్లో పేర్కొన్నారు. -
అవిశ్వాసంతో చులకనయ్యామే..!
సాక్షి, అమరావతి: కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం వల్ల లబ్ధి రాకపోగా ప్రజల్లో మరింత చులకనయ్యామని టీడీపీ నాయకులు మధనపడుతున్నారు. తాజా పరిణామాలన్నీ జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబు, టీడీపీ పరువు తీశాయనే ఆందోళన టీడీపీ శ్రేణులందరిలోనూ కనిపిస్తోంది. ప్రత్యేక హోదా, అవిశ్వాసం సహా పలు అంశాల్లో యూటర్న్లు తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు ఎంత చెప్పినా అనుకూల మీడియా ద్వారా మేనేజ్ చేశామని, కానీ స్వయంగా ప్రధానమంత్రే పార్లమెంట్లో చంద్రబాబు యూటర్న్పై మాట్లాడటంతో గాలి మొత్తం పోయిందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాము కేంద్రంపై పోరాడుతున్నామని, ధర్మ పోరాటం చేస్తున్నామని కొద్దినెలల నుంచి రాష్ట్రంలో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నేరుగా ప్రధానే వాస్తవాలు బయటపెట్టడంతో ఇకపై ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అంగీకారంతోనే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, ప్యాకేజీ ప్రకటించినందుకు ఆర్థిక మంత్రి జైట్లీని చంద్రబాబు సత్కరించారని మోదీయే చెప్పడం తమను తీవ్ర ఇరకాటంలోకి నెట్టిందని వారు భావిస్తున్నారు. కొత్త విషయం ఏం చెప్పారు..? టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా పోరాటంలో మొదటి నుంచి చెప్పిన విషయాలనే చెప్పడంతో కొత్తగా పార్లమెంటులో ఏం చెప్పారనే దానికి టీడీపీ నాయకుల వద్ద సమాధానం లేకుండాపోయింది. జయదేవ్ చెప్పిన విషయాలను వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పినప్పుడు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించడం వంటివన్నీ ఇప్పుడు అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరిణితి చెందిన నేతగా ప్రధాని మోదీ పేర్కొనడాన్ని కూడా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు ప్రతి దానికి గొడవలు పడేవారని, తమ జోక్యంతో కేసీఆర్ పరిణితి చూపించినా చంద్రబాబు మాత్రం మారలేదని చెప్పడం ద్వారా మోదీ, బాబు అసలు స్వరూపాన్ని బయటపెట్టినట్లయిందని, ఇది తీవ్ర అవమానకరమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అర్ధరాత్రి 12 గంటలకు మీడియా సమావేశం పెట్టి మరీ మోదీపై ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. మోదీ మాటల ముందు బాబు చెప్పేవన్నీ ఇప్పుడు జనాలు పట్టించుకోరని టీడీపీ నేతలు అంచనావేస్తున్నారు. చంద్రబాబు వెంటనే ఢిల్లీ వెళ్లినా తమ అధినేత ఏమీ చేయలేకపోయారని, అది ఇంకా మైనస్గా మారిందని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాతో బెంబేలు.. ఒకపక్క పరువు పోయి కుంగిపోతున్న టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో జరుగుతున్న దాడితో బెంబేలెత్తిపోతున్నారు. జయదేవ్ ప్రసంగం, మోదీ చెప్పిన అంశాలకు సంబంధించి సెటైర్లు, జోకులు, విమర్శలతో చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా శనివారం ఆందోళనలు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చినా దానికి టీడీపీ క్యాడర్ పెద్దగా స్పందించలేదు. అక్కడక్కడా కొందరు బయటకు వచ్చి కొద్దిసేపు హడావుడి చేసినా ఇతరులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా పరువు పోగొట్టుకోవడమెందుకనే అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి సెల్ఫ్గోల్ చేసుకున్నామని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా
ముంబై: ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు. -
ఓటు వేయకుండా ఎందుకు పారిపోయారు: షబ్బీర్ అలీ
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పారిపోయారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. శని వారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్న కేంద్రా నికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని, మోదీ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఇంటి ముందు లడాయి.. ఇంటి వెనుక దోస్తీ: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీల వైఖరి ఇంటి ముందు లడాయి.. ఇంటి వెనుక దోస్తీలాగా ఉందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు రాజకీయ మైలేజీ కోసమే ప్రయత్నించారు తప్ప విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఇసుమంత కూడా ప్రయత్నించలేదని ఆరోపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగమంతా సెల్ఫ్ డబ్బాలాగా సాగిందన్నారు. తల్లిని చంపి బిడ్డను కాపాడే విధంగా రాష్ట్ర విభజన చేశారనడం , రాష్ట్ర విభజనను పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో పోల్చడం సరైంది కాదన్నారు. లోక్సభలో రాహుల్గాంధీ పరిణతి చెందిన రాజకీయ నాయకుడి తరహాలో వ్యవహరించారన్నారు. -
టీఆర్ఎస్, బీజేపీల బంధం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రయోజనం కలిగేందుకు లోక్సభలో లభించిన మంచి అవకాశాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న బంధం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బట్టబయలైందన్నారు. శనివారం గాంధీభవన్లో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రసూల్ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్రెడ్డి, యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ హక్కుల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ప్రసంగం పేలవంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని లోక్సభలో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీల గురించి కేంద్రంపై పోరాడటంలో విఫలమైన టీఆర్ఎస్, ‘మీ హృదయంలో ప్రేమ ఉంటే చాలు’ అంటూ మోదీనుద్దేశించి వ్యాఖ్యానించడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు సీఎంగా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్, కవితలిద్దరూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని గతంలో మాట్లాడారని, మరిప్పుడు అదే విషయంలో కేం ద్రంపై పెట్టిన అవిశ్వాసం తీర్మానానికి ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఆ రిజర్వేషన్ల ఫైలు ఏం చేశారని కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోయారని ఉత్తమ్ నిలదీశారు. కేసీఆర్ మోదీ ఏజెంటు... తెలంగాణ ప్రయోజనం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అవిశ్వాసం విషయంలో ఎందుకు తటస్థంగా ఉన్నారని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ మాట్లాడితే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. జాతీయ సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడితే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చేవని, అప్పుడు రాష్ట్రానికి అప్పులు తగ్గేవని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, హైకోర్టు విభజన లాంటి హామీలు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉండేందుకు టీఆర్ఎస్, బీజేపీలే కారణమని విమర్శించారు. అవిశ్వాసం సమయంలో వీరి నిజస్వరూపం బయటపడిందని, మోదీ ఏజెంట్ కేసీఆర్ అని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, టీఆర్ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. రాహుల్ ప్రసంగం అద్భుతం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అద్భుతంగా మాట్లాడాని, ఆయన ప్రసంగం చరిత్ర లో నిలిచిపోతుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
వాళ్ల ఐకమత్యం మాకు మహాబలం
షాజహాన్పూర్: ప్రతిపక్షాల ఐకమత్యం తమకే లాభం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే కౌగిలింతతో సరిపుచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో శనివారం జరిగిన రైతు ర్యాలీలో మోదీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల ఐక్యత, అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ వచ్చి హఠాత్తుగా తనని కౌగిలించుకోవడం తదితర విషయాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాసం పేరిట కాలక్షేపం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘దేశంలో ఇప్పుడు ఒక్కటే దళ్(రాజకీయ పార్టీని ఉద్దేశించి) లేదు. ఎన్నో దళ్లు కలవడం వల్ల ఏర్పడే దల్దల్(బురద) ‘కమలం’ వికసించడానికే దోహదపడుతుంది’ అని మోదీ చమత్కరించారు. ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే వారు బదులివ్వలేదు. కౌగిలింతతో సరిపెట్టారు’ అని రాహుల్నుద్దేశించి అన్నారు. ప్రధాని పీఠంపైనే కళ్లన్నీ.. పేదలు, యువతను విస్మరిస్తూ ప్రతిపక్షాలన్నీ ప్రధాని పీఠం కోసం పాకులాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. ‘లోక్సభలో శుక్రవారం జరిగిన చర్చను చూశారా? తప్పెవరిదో తెలిసిందా? ప్రతిపక్షాలు దేశం, పేదల గురించి ఆలోచించడం లేదు. ప్రధాని కుర్చీపైనే వాళ్ల కళ్లన్నీ ఉన్నాయి. అవినీతితో పోరాడుతూ దేశం, ప్రజల కోసం పనిచేయడమేనా నా నేరం? ప్రతిపక్షాల కుతంత్రాలు నాకు తెలుసు. సైకిలు(సమాజ్వాదీ పార్టీ), ఏనుగు(బీఎస్పీ)తో జతకట్టినా వారిని గెలవనీయం. భారత ప్రజాస్వామ్యంలో 125 కోట్ల మంది ఓటు ద్వారా ఇచ్చిన తీర్పే శిరోధార్యమని, దానికి వ్యతిరేకంగా వెళ్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ వారు నన్ను పదవి నుంచి తొలగించాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ మండిపడ్డారు. నాటి ప్రధాని రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఆనాడు రూపాయి ప్రయోజనంలో పేదలకు కేవలం 15 పైసలే చేరాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పూర్తి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తోందని చెప్పారు. ఆ చీకట్లకు బాధ్యులెవరు.? ఎన్డీయే నాలుగేళ్ల పాలనకాలంలోని సంక్షేమ కార్యక్రమాలను పేర్కొంటూ..తాము 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా, కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా కొన్ని గ్రామాలు చీకట్లోనే ఉన్నాయంటే దానికి కారణమెవరని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్న మోదీ..సాగును లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. ఈ డిసెంబర్ నుంచి మొలాసిస్, చెరకు రసం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు మిల్లులకు అనుమతి ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. చెరకు కనీస ధరను క్వింటాలుకు రూ.20 పెంచామని తెలిపారు. -
రాహుల్ ఆలింగనం వెనుక సందేశం ఇదే!
మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. కర్ణాటకలో తన జూనియర్ భాగస్వామి అయిన జేడీఎస్కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్ తన పార్టీ సంప్రదాయానికి, ఆధిపత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షిణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చ అనేక ప్రశ్న లకు జవాబిచ్చింది. 2019 ఎన్నికలను ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్య క్షుడు రాహుల్గాంధీ మధ్య పోరుగా బీజేపీ చిత్రించడాన్ని ప్రతిపక్షాలు అనుమతిస్తాయా లేక రాష్ట్రానికో తీరున కాషాయపక్షంతో అవి తలపడ తాయా? రాహుల్ను చూసి బీజేపీ భయపడాలా? ఆయనను పాలకపక్ష మెప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. మోదీతో తలపడే పట్టుదల, దూకుడు తనకున్నాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ వ్యతిరేక పోరు తన నాయకత్వంలోనే సాగుతుందని రాహుల్ చెప్పకనే చెప్పారు. ‘పెద్దలు’ గంభీర ప్రసంగాలతో నీతులు చెప్పే రాజకీయ ప్రపంచంలో రాహుల్ తన అనూహ్య ప్రవర్తనతో కొంత పప్పూలా కనపడడం వల్ల నష్టమేమీ లేదు. భారత ఓటర్లలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువతకు సీనియర్ నేతల నీతిబోధలు విసుగుపుట్టిస్తాయి. కాబట్టి రాహుల్ పోకడ వారికి బాగానే ఉంటుంది. ఇప్పటి వరకూ తనను సవాలు చేసే నేత లేకుండా ముందుకు పోతున్న మోదీకి పోటీగా రాజకీయ గోదాలో రాహు ల్ను ప్రత్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్ కోరుకున్నది సరిగ్గా ఇదే. సభలో రాహుల్ ప్రదర్శించిన దూకుడు, స్పష్టత చూసి కాంగ్రెస్ వాదులే ఆశ్చర్యపోయారు. ప్రధానిపై పదునైన విమర్శలతో, మధ్యమధ్యలో పాలకపక్ష నేతలను ‘డరో మత్’ (భయపడకండి) అంటూ తనకంటే అన్ని విధాల బలవంతుడైన తన ప్రత్యర్థితో తలపడడం ద్వారా రాహుల్ చాలా పెద్ద ‘రిస్క్’ తీసుకున్నారు. శ్రోతలను ఉర్రూతలూగించే వాగ్ధాటి, అతి ఆడంబరంగా కనిపించే ఆలింగనాల విషయంలో ఆరితేరిన మోదీతో పోటీకి దిగడం రాహుల్ ధైర్యానికి అద్దంపట్టింది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షి ణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యాసదృశమే. రాజకీయాలను కుస్తీ, ద్వంద్వయుద్ధం వంటి ఆయుధాలు అవసరం లేని క్రీడగా భావిస్తే.. మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇందులో బాగా ఆరితేరారనేది అందరికీ తెలిసిన సత్యం. రాహుల్ వంటి ప్రతిపక్ష నేతలు ఈ క్రీడల్లో ఇంకా విద్యార్థులేనని చెప్పాల్సి ఉంటుంది. లోక్సభలో చర్చ సందర్భంగా ప్రసంగంతో మీడి యాలో ప్రధాన శీర్షికలతో ప్రచారం సంపాదించాలంటే కీలక సందర్భం కోసం నాయకులు పోరాటయోధుల మాదిరిగా ఎదురు చూస్తారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, అనూహ్య ఆలింగ నంతో మోదీతో ప్రత్యక్షంగా తలపడడం ద్వారా రాహుల్ తన 14 ఏళ్ల రాజకీయ జీవితంలో అతి పెద్ద సాహసం చేశారు. ఈ ప్రత్యక్ష పోరులో మోదీని ‘నాకౌట్’ చేయలేకపోయినా రాహుల్ కొన్ని పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగారు. కానీ, పార్లమెంటరీ చర్చల్లో మెరుపులు మెరిపించి కొన్ని ‘పాయింట్లు’ సాధించడం వల్ల రాజకీయ వాస్తవాలు మారవు. రాహుల్ ఎంత గొంతు చించు కుని మాట్లాడి, మోదీని కౌగిలించుకున్నా లోక్సభలో అవిశ్వాస తీర్మానం 325– 125 ఓట్ల తేడాతో వీగిపోయింది. మోదీకి జనం విశ్వసించదగిన పోటీదారుగా ఎదగాలంటే రాహుల్ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇంతవరకూ ఆయన ఏ రాష్ట్ర ఎన్నిక ల్లోనూ కాంగ్రెస్ను గెలిపించింది లేదు. ఆయన పార్టీ ఒకటిన్నర రాష్ట్రాల్లో (కర్ణాటకలో సగం) పరిపాలన సాగిస్తోంది. అవసరమై నన్ని నిధులు లేక కాంగ్రెస్ అల్లాడుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికి ఆయన పార్టీ నేతలు, వారి కుటుం బసభ్యులు ‘అవినీతి’ ఆరోపణలపై వేసిన కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులున్నాయి. 2019 ఎన్నికల్లో పోటీచేయడం అంటే కాంగ్రెస్ తన మొదటి ఇన్నింగ్స్ సీట్ల లోటుతో (అంటే లోక్సభలో మెజారిటీకి అవసర మైన 270కి పైగా సీట్ల నుంచి ఇప్పటి 44 తీసేస్తే వచ్చే సంఖ్య 230) రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ లోటు భర్తీ కావడానికి కాంగ్రెస్కు అనుకూలంగా ఎలాంటి ‘ప్రభం జనం’ కనిపించడం లేదు. ఈ లెక్కన రాహుల్ రాజకీయ క్షేత్రంలో నిజంగా ఎదిగారా? అనేది ప్రధానాంశం కాదు. ఆయన ఇంకా ఎదగలేదు. గమ్యం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం పరుగులు తీయాల్సి ఉంది. ఆయన కేవలం నేతగా అవతరిం చారు. టీవీ చానళ్ల మాటల్లో చెప్పాలంటే ఆయన ఇప్పటి పరిస్థితు లకు తగినట్టు పైకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. రాజకీయాలు, ప్రజాసేవపై ఆయనకున్న అంకితభావం, దృష్టిపై గతంలో అను మానాలుండేవి. తరచూ దేశం నుంచి అదృశ్యమౌతూ విదేశాల్లో చక్కగా గడపడానికి పోవడం వంటి చర్యలతో ఆధారపడదగిన నేత కాదనే ఇమేజ్ని ఆయనే సృష్టించుకున్నారు. ఆయనకు ఈ విషయం చెప్పే ధైర్యం పార్టీ నేతలకు లేదు. కానీ, కాంగ్రెస్ చుక్కాని లేని నావలా మారిందని, తమ నాయకుడు నిజంగా పూర్తి కాలం పనిచేసే అధ్యక్షుడు కాదనే దిగులుతో కుమిలిపోయే వారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు రాహుల్పై ఇలాంటి అభిప్రాయాలు తొలగించడానికి ఎంతవరకు తోడ్పడతాయో? రాహుల్ తన తల్లి సోనియా కంటే చాలా భిన్నమైన శైలిగల నాయకుడినని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకూ ఏబీ వాజ్ పేయి తర్వాతి బీజేపీని సోనియా, ఆమె పార్టీ ద్వేషంతో, ధిక్కా రంతో చూస్తూనే ఉన్నాయి. మోదీని అంటరాని నేతగా పరిగణిస్తు న్నాయి. సహజంగానే రాజకీయ పోరుకు ముందుకు దూకే స్వభావమున్న మోదీ కాంగ్రెస్ ధోరణిని తనకు అనుకూలంగా మార్చు కున్నారు. పదేళ్ల క్రితం మోదీని ‘మృత్య్ కా సౌదాగర్’ (మృత్యు బేహారి–మరణాలతో వ్యాపారం చేసే నేత) అని సోనియా వర్ణిం చారు. మోదీ అదే దారిలో ఈ తల్లీకొడుకులను జెర్సీ ఆవు, దూడ అంటూ అభివర్ణించారు. ఇప్పుడేమో మోదీ దగ్గరకు పోయి కౌగ లించుకున్న రాహుల్ ప్రధానిని ప్రేమిస్తున్నానని చెప్పారు. కానీ, రాజకీయాల్లో వ్యంగ్యం అనేది ప్రత్యర్థిని అంటరానివాడిగా చూడటం కన్నా తక్కువ బాధకలిగిస్తుంది. అలాగే, కర్ణాటకలో తన జూనియర్ భాగస్వామి అయిన జేడీఎస్కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్ తన పార్టీ సంప్రదాయానికి, ఆధి పత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో!
శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్ రిహార్సల్స్. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వంపైన మొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తీరూ, ఓటింగ్ జరిగిన సరళీ ఉపయోగపడతాయి. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్ట డంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉద్దేశం ఏమైనా, తీర్మానాన్ని వెంటనే అను మతించి వెనువెంటనే చర్చ, ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంలో ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఏమైనా దేశప్రజలకు ఏ పార్టీ ‘జుమ్లా’ ఆట ఆడుతున్నదో, ఎవరి కపట నాటకం ఎటువంటిదో, ఎవరు నిజాయితీగా ప్రజల తరఫున నిలిచి పోరాడుతున్నారో తెలిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం పైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చి అనుమతి లభించక విసిగి వేసారి పదవులకు రాజీనామా చేసిన అయిదుగురు వైఎస్ఆర్ సీపీ లోక్సభ సభ్యులను ఎద్దేవా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? పైగా, టీడీపీ నోటీసు ఇచ్చిన వెంటనే దానిని అనుమతించడంలో ఎన్డీఏ సర్కార్ ఎత్తుగడ ఏమిటి? అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని తెలుసుననీ, ప్రత్యేకహోదాపైన చర్చ జర గాలనే ఉద్దేశంతోనే తీర్మానం పెట్టామనీ సుజనాచౌదరి అన్నారు. అమిత్ షా నోట ‘జుమ్లా’ ‘జుమ్లా’ అనే మాటను వర్తమాన రాజకీయాలలో మొదట ప్రయోగించిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ‘జుమ్లా’ అంటే ఉత్తిమాట, నీటిమీద రాత, మాట వరుసకు అన్న మాట అని రూఢి అయింది. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగంలో చేసిన మాటను ‘చునావీ జుమ్లా’ (ఎన్నికల ప్రచారంలో మాటవరుసకి అన్న మాట)గా అమిత్ షా అభివర్ణించి ఆ మాటను పట్టుకొని వేళ్ళాడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచీ ‘జుమ్లా’ అనే మాట భారత రాజకీయాలలో తరచుగా విని పిస్తున్నది. సర్జికల్ స్ట్రయిక్స్ను కూడా జుమ్లా స్ట్రయిక్స్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అభివర్ణించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. ‘జుమ్లా స్ట్రయిక్ నంబర్ ఏక్, జుమ్లా స్ట్రయిక్ నంబర్ దో...’ అంటూ రాహుల్గాంధీ ప్రధాని మోదీపైన బాణాలు సంధించి, ప్రసంగం ముగి సిన తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని పక్కనున్న సభ్యుడివైపు చూసి నవ్వుతూ కన్నుగీటడంతో మోదీపై తన దాడి యావత్తూ ‘జుమ్లా స్ట్రయికే’నని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వా లంటూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రాహుల్కీ, మోదీకి మధ్య సంవాదంగా సాగిందే తప్ప ప్రత్యేకహోదా ఊసు లేదు. చర్చను ప్రారంభిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ తన ఇంగ్లీషు ప్రసంగపాఠాన్ని బాగా చదివారు. రామ్మోహన్నాయుడు హిందీలో, ఇంగ్లిష్లో ఆశువుగా మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ పార్లమెంటేరియన్లకూ మంచి అవకాశం లభించడం తప్పిస్తే అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఒరి గింది ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబే అమరావతి మీడియా గోష్ఠిలో స్వయంగా అంగీకరించారు. పనిగట్టుకుని శనివారం ఇదే మాట చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా గోష్ఠి నిర్వహించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానాన్ని బలపర్చుతున్నట్టు జయదేవ్ చాలా పార్టీల పేర్లు చదివారు. ఆ పార్టీలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి ఉంటే 126 మాత్రమే పడేవి కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడేవికావు. జయదేవ్ చదివిన పార్టీల జాబితా సైతం ‘జుమ్లా’నే అనుకోవాలి. 12 గంటల చర్చ తర్వాత ఏమి సాధించారంటే కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేక పోయారని చెప్పు కోవాలి. తక్కిన పార్టీ నాయకులు ఎవ్వరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిం చలేదు. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యం. ప్రాంతీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలోని రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ వల్లనే అవిశ్వాసం అపహాస్యం పాలయింది. అన వసరంగా సెల్ఫ్గోల్ కొట్టుకున్నామంటూ ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. ‘మా నాయకుడి చక్రానికి తుప్పు పట్టింది. చక్రం తిరగడం లేదు. పాచిక పారడం లేదు’ అని ఒక సీనియర్ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని స్వయంగా నరేంద్రమోదీనే లోక్ సభ సాక్షిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికే ఆ పార్టీ యూ–టర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీని విమ ర్శించడం ప్రారంభించిందని కూడా చెప్పారు. ఈ రెండు అంశాలకే ప్రధాని పరి మితమైనారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీపైన ఎంతోకొంత విమర్శ చేయకపోతే బాగుండదు కనుక ఈ రెండు మాటలూ అన్నారు. చంద్రబాబుపైన మోదీకి ఆగ్రహం లేదు. ఉంటే ఆయనకు తెలిసిన సమస్త సమాచారాన్ని విని యోగించుకొని ధ్వజమెత్తేవారు. ఓటుకు కోట్ల కేసు సంగతి ప్రధానికి జ్ఞాపకం లేకపోలేదు. పట్టిసీమలో అక్రమాల గురించి సమాచారం ఉంది. సింగపూర్ సంగ తులూ తెలుసు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి వ్యవహారాలు తెలుసుకోవడం కష్టం కాదు. టీడీపీ అధ్యక్షుడిని చులకన చేయడం ప్రధానికి ఇష్టం లేదు. చంద్రబాబును మోదీ ప్రత్యర్థిగా చూడటం లేదు. వైఎస్ఆర్సీపీ పట్ల తన వైఖరిని ప్రధాని దాచుకోలేదు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా ఉద్య మిస్తున్న వైఎస్ఆర్సీపీ ‘ఉచ్చు’లో పడవద్దంటూ తాను చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ హెచ్చరించినట్టు ప్రధాని లోక్సభలో అన్నారు. 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ రాజ్యసభలో చేసిన ప్రత్యేకహోదా వాగ్దానం అమలు చేయాలంటూ డిమాండ్ చేయడాన్ని, దానికి అనుకూలంగా ప్రజాభిప్రా యాన్ని ప్రోది చేయడాన్ని ‘ఉచ్చు’గా అభివర్ణించడంలో ప్రధాని అసహనం స్పష్టం అవుతోంది. టీడీపీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చి ఏళ్ళూపూళ్ళూ గడిచినా ప్రధాని కానీ, లోక్సభ స్పీకర్ కానీ స్పందించలేదు. 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను టీడీపీ కొనుగోలు చేసినా, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టినా ప్రధాని ఆక్షేపించలేదు. మొత్తం మీద టీడీపీ పట్ల ఆపేక్ష, వైఎస్ఆర్సీపీ పట్ల ఉపేక్ష స్పష్టంగా కనిపి స్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తే, చంద్రబాబు ఇతర విష యాలపైన దృష్టి పెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా మిత్రుడిని ఎత్తిపొడవడమే కానీ గాయపరచాలనే సంకల్పం లేదు. అంతకుముందు దేశీయాంగ మంత్రి రాజ్నాథ్సింగ్ బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఎంతబలమైనదో నొక్కి వక్కాణిం చారు. ‘చంద్రబాబు నాయుడితో మాకు బలమైన అనుబంధం గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఆ బంధాన్ని తెంచడం ఎవ్వరివల్లా కాదు,’ అంటూ ఆయన ఉద్ఘాటించారు. వాస్తవానికి రాజ్నాథ్సింగ్కి మర్మం తెలియదు. ఆయన తన మనసులో ఉన్నమాట నిస్సంకోచంగా చెబుతారు. ప్రత్యేకహోదా నిజంగా సాధించాలని అనుకుంటే మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి సత్యాగ్రహం చేయడం రాజమార్గం. రాజకీయ పోరాటాలలో రాజీనామాను ఆయుధంగా వినియోగించే ఆనవాయితీ మనకు ఉన్నది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపైన ఒత్తిడి పెంచకపోగా రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలను తప్పుపట్టడం కేవలం అదరగండపు రాజకీయం. తాను లాలూచీ పడుతూ ఎదుటివారు లాలూచీ పడుతున్నట్టు ఆరోపించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకత. వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును అనుమతించకపోవడంలో, టీడీపీ నోటీసును వెంటనే అనుమతించడంలోనూ బీజేపీ, టీడీపీ లాలూచీ స్పష్టంగా కనిపిస్తున్నది. జయదేవ్ ప్రసంగంలో కొత్త అంశం ఏముంది? అవిశ్వాసతీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ ఏమైనా కొత్త విషయం చెప్పారా? నాలుగేళ్ళుగా ధర్నాలలోనూ, బంద్లలోనూ, రాస్తారోకోలలోనూ, యువభేరి సభలలోనూ, శాసనసభ సమావేశాలలోనూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పిన అంశాలనే జయదేవ్ లోక్సభలో చదివి విని పించారు. 14వ ఆర్థిక కమిషన్ ప్రత్యేకహోదాను వద్దనలేదంటూ ఆర్థిక కమిషన్ సభ్యుడు రాసిన లేఖను జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించినప్పుడు అధికార పక్షం అహంకారంతో పెడచెవిన పెట్టింది. ప్రత్యేకహోదా మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కార్ను కోరుతూ శాసనసభ రెండోసారి తీర్మానం చేసినప్పుడే ప్రతిపక్ష నాయకుడు కేంద్రానికి ఒక నెల రోజులు గడువు ఇవ్వాలనీ, గడువులోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమం బాట పట్టాలనీ, అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడాలనీ, టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగాలనీ ఉద్ఘా టించారు. 2017 మే నెలలో ప్రధానిని కలుసుకున్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వా లంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సంవత్సరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు అదే రోజు పొద్దుపోయిన తర్వాత అమరావతితో మీడియా గోష్ఠి నిర్వహించి చంద్ర బాబు నాయుడు ప్యాకేజీని ఆహ్వానించారు. అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికీ, ఆర్థికమంత్రికీ శాలువలు కప్పి సన్మానించారు. ప్రధానికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాధించిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే జగన్ మోహన్రెడ్డి ప్యాకేజీని తిరస్కరించమంటూ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సలహా పాటించకపోగా అడ్డంగా వాదించారు. ప్రత్యేకహోదా సంజీ విని కాదనీ, పదేళ్ళ కిందట ఆ హోదా లభించిన రాష్ట్రాలలో అభివృద్ధి ఏమీ జరగలేదనీ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనదనీ, అది ఆంధ్రుల శ్వాస అనీ ప్రజలలో బలంగా నాటుకున్న తర్వాత బీజేపీతో మంతనాలు జరిపి ‘జుమ్లా’ తిరుగుబాటుకు తెరదీశారు. బీజేపీ–టీడీపీ అవగాహనలో భాగంగానే ఎన్డీఏ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ ఉంటారు కానీ జాతీయ నాయకత్వంతో టీడీపీ అధినేతకి సత్సంబంధాలే ఉంటాయి. ముఖ్యమంత్రికీ, ప్రధానికీ చేసిన విజ్ఞప్తుల వల్ల ఫలితం లేకపోవడం, ధర్నాలలో, రాస్తారోకోలలో, బంద్లలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, వామపక్షాలూ, ఇతర సంస్థల కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జైళ్ళలో పెట్టడం, లాఠీచార్జీలు చేయించడంతో విసిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీ నామాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిరసన వెలిబుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారనీ, పార్లమెంటు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ భవన్కు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారనీ వైఎస్ జగన్ మే 31న పాదయాత్రలోనే ప్రకటించారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరశనదీక్ష చేస్తే కేంద్రం దిగివస్తుందని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత అనేకసార్లు అదే ఉద్బోధ చేశారు. శనివారంనాడు కూడా ఆ మాటే అన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (జూలై 24న) రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ ఏమి చేసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలపాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కానీ, ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. తర్వాత అరుణ్ జైట్లీతో సమాలోచనలు జరిపి హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించడమే గొప్ప రాజకీయ విజయంగా చాటుకున్నారు. ప్రత్యేక హోదా అవసరం ప్రజలు గ్రహించారని తెలుసుకొని బీజేపీతో విభేదించినట్టూ, తిరుగుబాటు చేసినట్టూ ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాను అమలు చేయకపోవడంలో బీజేపీ, టీడీపీల జమిలి మోసం ఉన్నదని ప్రజలు గ్రహించారు. నాలుగేళ్ళుగా అంటకాగుతూ వీరు సాగించిన నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాసతీర్మానం పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చాటుకుంటుంది. అది వీగిపోయింది కనుక ఇకమీదట హోదా ప్రస్తావన తీసుకొని రావద్దంటూ బీజేపీ వాదిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదు. ఏదేమైనా అవిశ్వాస తీర్మానంతో ఒక్క విషయం మాత్రం నిగ్గు తేలింది. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లు బీజేపీకి మద్ద తుగా నిలుస్తాయని జాతీయ చానళ్ళలో వివిధ పార్టీల ప్రవక్తలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. కె. రామచంద్రమూర్తి -
రాహుల్ లెక్కల్లో తప్పెంతా?
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడాదికి కేవలం నాలుగు లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పించిగలిగిందని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం ప్రతి 24 గంటలకు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుండగా, భారత్ ప్రతి 24 గంటలకు 400లకు మించి ఉద్యోగాలు కల్పించలేక పోతోందంటూ విమర్శించారు. రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలని, చూపేవన్నీ తప్పుడు లెక్కలని బీజేపీ నాయకులు విమర్శించారు. అయితే వారెవరూ తమ విమర్శలను నిరూపించలేకపోయారు. ఎందుకంటే వారి వద్ద ఎలాంటి లెక్కలు లేవు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయే విభాగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్క తేల్చాల్సిందిగా లోక్సభ సమావేశాలు ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెల్సింది. ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్’ 2017 ఇయర్ బుక్, వివిధ ప్రభుత్వ పారిశ్రామిక సంస్థల అప్డేట్స్, ఫ్యాక్టరీ ఎంప్లాయిమెంట్ డాటా, ‘ఫాప్స్ అండ్ కమర్షియల్ ఎంప్లాయీమెంట్ ఫిగర్స్’ను పాత్రికేయులు క్షుణ్నంగా పరిశీలించగా ఆశ్చర్యంగా 2014 సంవత్సరం నుంచి ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. భారత కార్మిక శాఖ మాత్రం 2016 నుంచి ప్రతి మూడు నెలలకోసారి దేశంలోని ఉపాధి అవకాశాలపై సర్వే జరిపినట్లు ఉంది. 2018, మార్చి 12న భారత కార్మిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2016–2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో 77 వేల ఉద్యోగాలు పెరగ్గా, మూడవ త్రైమాసికంలో 32 వేల ఉద్యోగాలు పెరిగాయి. నాలుగవ త్రైమాసికంలో 1.22 లక్షలు, ఐదవ త్రైమాసికంలో 1.85 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. ఉద్యోగాలు నాలుగైదు త్రైమాసికంలో పెరగడానికి గల కారణాలేమిటో వివరించలేదు. రోజుకు 1,139 ఉద్యోగాలు కల్పించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. ఈ లెక్కలు నిజమనుకుంటే రాహుల్ చెప్పిన రోజుకు 400 ఉద్యోగాల లెక్క తప్పు. ఇక చైనా రోజుకు 50 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. రోజుకు 37,013 చొప్పున, ఏడాదికి 1.10 కోటి ఉద్యోగాలను కల్పించాలన్నది 2017 సంవత్సరానికి చైనా లక్ష్యంగా పెట్టుకోగా 1.35 కోట్ల ఉద్యోగాలు కొత్తగా కల్పించినట్లు చైనా మానవ వనరులు, సామాజిక భద్రతా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే రోజుకు దాదాపు 38 వేల ఉద్యోగాలను కల్పించినట్లే. రాహుల్ కాస్త అతిశయోక్తిగా చెప్పినప్పటికీ ఉద్యోగాల కల్పనలో చైనా మనకన్నా అందనంత దూరానుంది. అందుకే చైనాలో నిరుద్యోగం 3.9 శాతం కాగా, భారత్లో 7.1 శాతంగా ఉంది. -
‘కౌగిలింత కాదు.. అదొక రకం షాక్’
సాక్షి, ముంబై : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పనులు చర్చనీయంగా మారాయి. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకుని మరీ షేక్ హ్యాండ్ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం.. వంటి చర్యలతో రాహుల్ గాంధీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితో సహా సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రాహుల్ చేసిన పనిని తప్పుబట్టారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ విషయమై రాహుల్ను మందలించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం రాహుల్ చర్యను తనకు అనుకూలంగా మార్చుకుంది. లోక్సభలో రాహుల్ మోదీకి ఇచ్చింది కౌగిలింత కాదని.. ఆయనకదో గట్టి షాక్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రాహులే అసలైన విజేత.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాసం తీర్మానంలో మోదీ నెగ్గినప్పటికీ అసలైన విజేత మాత్రం రాహులేనని సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ఉటంకిస్తూ.. ఓడిపోయిప్పటికీ తమ అద్భుత ప్రదర్శన ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న క్రొయేషియా జట్టు లాగే.. రాహుల్ కూడా తన ప్రసంగం, చర్యలతో ప్రజలను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో జరిగిన సంఘటనల ద్వారా రాహుల్ నిజమైన రాజకీయ నాయకుడినని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ చర్యలను డ్రామా అంటూ విమర్శిస్తున్న వారంతా ప్రతీ రాజకీయ నాయకుడు డ్రామాలాడుతారన్న విషయాన్ని గుర్తిస్తే బాగుంటుందని హితవు పలికారు. కాగా శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చలో పాల్గొనకుండా శివసేన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఏపీ, తెలంగాణల మధ్య చిచ్చు పెట్టే యత్నం’
సాక్షి, న్యూఢిల్లీ : పక్క రాష్ట్రం(తెలంగాణ) మద్ధతు కూడా కూడగట్టలేకపోయిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఏపీ, తెలంగాణాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రత్యేక హోదాపై పదే పదే వైఖరి మార్చుకుంటున్న చంద్రబాబుకు ప్రతీ విషయంలోనూ యూటర్న్ తీసుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన ఆరోపించారు. జనాలను మభ్యపెట్టి, మోసం చేయాలని చూస్తున్న చంద్రబాబు ప్రయత్నాలేవీ సఫలం కావన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి టీడీపీ మాటలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని.. అసెంబ్లీలో మహానాడులో ప్రత్యేక ప్యాకేజీని కొనియాడారని గుర్తు చేశారు. ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని, మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. టిడిపి ఇచ్చిన ఆరువందల హామీల అమలుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటమార్చారని చిన్నపిల్లలకు కూడా అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ అసమర్థుడు..’ రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యమని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం చేకూర్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అసమర్థుడని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. కేవలం మోదీపై విద్వేషంతోనే విపక్షాలు ఒక్కటయ్యాయని విమర్శించారు. -
‘టీడీపీలో తిరుగుబాటు’
సాక్షి, తిరుపతి: లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ తగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును టీడీపీ నాయకులు బజారుకు ఈడ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ మైత్రీ బంధానికి లోకసభ వేదికగా నిలిచిందన్నారు. త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్తో తమ పార్టీ కలిసి పనిచేయడం టీడీపీలోని సీనియర్ నాయకులకు ఇష్టం లేదని, అలాంటి వారందరూ తిరుగుబాటు చేయాడానికి సిద్ధమౌతున్నారని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో గల్లా జయదేవ్ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మోదీని నిందించాలనే టీడీపీ కుట్ర బెడిసికోట్టిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకను కప్పిపుచ్చుకోవడానికి తమపై బురదచల్లాలని చూశారని మాధవ్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. తెలుగుజాతికి తలవంపులు తెచ్చేలా టీడీపీ ఎంపీలు లోక్సభలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ గొప్పలకు పోతున్న చంద్రబాబు!
అవిశ్వాస తీర్మాణంపై శుక్రవారం లోక్సభలో చర్చ జరిగినా.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమదైన శైలిలో మాట్లాడి అసలు విషయాన్ని ప్రస్తావించకుండా సభను రక్తి కట్టించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాద రాజకీయాన్ని, ఇష్టమొచ్చినట్లుగా ఆయన తీసుకున్న యూటర్న్లను పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టేశారు. దీంతో కంగుతున్న చంద్రబాబు ప్రస్తుతం నష్ట నివారణ చర్యలకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ డ్రామాలు అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా మరోసారి తేటతెల్లమైన విషయం తెలిసిందే. అయినా కూడా లోక్సభలో తాము ప్రత్యేక హోదా కోసం పోరాడామంటూ గొప్పలు చెప్పుకునే యత్నాలు మళ్లీ మొదలుపెట్టే పనిలో టీడీపీ నేతలు బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ‘హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారు, అనంతరం ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆపై ఎన్నికల సమయం వచ్చేసరికి యూటర్న్ తీసుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందని’అవిశ్వాసంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఏపీ సీఎం నిజ స్వరూపాన్ని బయటపెట్టగా వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. ఏపీకి తాము ఎన్నో చేయాలని చూసినా బీజేపీ వల్లే అది సాధ్యపడటం లేదన్న తరహాలో చంద్రబాబు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నేనే ఎక్కడా యూటర్న్ తీసుకోలేదు. ప్రధాని మోదీనే ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారు. మోదీ మమ్మల్ని అవమానించారు. గతంలో ప్రధాని అయ్యేందుకు అవకాశం వచ్చినా వదులుకున్నాను. అభివృద్ధి ఎలా చేయాలో నాకు తెలుసు. గత నాలుగేళ్లు మోదీతో కలిసి పనిచేశాను. ఇప్పుడు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నా. ఆయన నాకు మిత్రుడు కాదు.. శత్రువు కాదు. నా శ్రేయోభిలాషి ఎంతమాత్రం కాదు. అవిశ్వాస తీర్మానంపై మోదీ వద్ద సమాధానం లేదని తెలుసు. కేవలం 1500 కోట్ల రూపాయలతో రాజధాని కాదుకదా.. ఎలక్ట్రికల్ కేబుల్ పనులు కూడా చేయలేం. విభజన చట్టం అమలు చేస్తామని గతంలో మోదీ హామీ ఇచ్చారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ను విమర్శించడం సరికాదు, ముందు మీరేం చేశారో చెప్పండి. ఏపీకి ఇచ్చిన హామీల అమలు బాధ్యత ప్రధానికి లేదా’ అని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు. నాకు అన్నీ తెలుసు అందరి కంటే రాజకీయాలు నాకే ఎక్కువ తెలుసు. నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన ఘనత నాదే. జాతీయస్థాయిలో చక్రం తిప్పాం. భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయాలి. కడప స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించే ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మా ఎంపీలు రాజీనామా చేస్తే మన గొంతుక వినిపించడం ఎలా సాధ్యమవుతుంది. అసలే బీజేపీని నమ్మే పరిస్థితులు లేవని చంద్రబాబు అన్నారు. -
రాహుల్ కౌగిలింత : అమూల్ కూడా వదిలిపెట్టలేదు..
న్యూఢిల్లీ : కౌగిలింత... కన్ను కొట్టడం.. వంటి సరదా సన్నివేశాలతో సీరియస్గా జరిగే పార్లమెంట్లో సైతం నవ్వులు పూశాయి. లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా...సీరియస్గా అప్పడి వరకు విమర్శలు ఎక్కు పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఒక్కసారిగా ప్రధాని దగ్గరకు వెళ్లి కౌగలించుకోవడం, ఆ తర్వాత వచ్చి కన్ను గీటడం హాట్టాఫిక్గా మారింది. లోక్సభలో నిన్న జరిగిన ఈ డ్రామాటిక్ సీన్లపై ఇప్పటికీ ట్విటర్ మారుమోగిపోతోంది. న్యూస్పేపర్లు సైతం రాహుల్ కౌగిలింత సీన్ను ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. ఇలా అనూహ్యమైన పరిణామాలు జరిగినప్పుడు డయిరీ కో-ఆపరేటివ్ అమూల్ ఏమైనా చూస్తూ ఊరుకుంటోందా? తాను కూడా నాలుగు సెటైర్లు వేసి, నెటిజన్లను మరింత మురిపిస్తూ ఉంటోంది. ఇదే విధంగా నిన్న లోక్సభలో జరిగిన రాహుల్ గాంధీ కౌగిలింత సీన్పై కూడా ఓ సెటైరికల్ ఫీచర్ను వేసింది. రాహుల్, మోదీని కౌగిలించుకోవడాన్ని ఉట్టంకిస్తూ.. ‘ఆలింగనంగా ఉందా లేదా ఇబ్బంది కరంగా ఉందా’ అంటూ ఓ పిక్చర్ను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఆ పిక్చర్లోనే రాహుల్ గాంధీ కన్ను కొట్టడాన్ని కూడా స్కెచ్ చేసింది. నిన్న జరిగిన సెషన్లో ప్రధానిని కౌగలించుకోవడంతో పాటు రాహుల్ కన్ను గీటడం కూడా దేశమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేసింది. కాగ, 126:325 తేడాతో అవిశ్వాసం వీగిన సంగతి తెలిసిందే. కరెంట్ టాఫిక్స్తో అమూల్ విడుదల చేస్తున్న ఈ క్రియేటివ్ పిక్చర్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సెటైరికల్ పిక్చర్ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది. చాలా మంది నెటిజన్లు అమూల్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘కరెంట్ హాట్టాపిక్స్తో వ్యంగ్యమైన పిక్చర్స్ను రూపొందించడంలో అమూల్ నీవు చాలా బెస్ట్’ అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. అందుకే అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా అంటూ మరో యూజర్ పేర్కొంది. ప్రతేడాది భలే ఐడియా వస్తుంది అంటూ అమూల్పై నెటిజన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. #Amul Topical: Hugs in Parliament.... pic.twitter.com/dNurd7XDaX — Amul.coop (@Amul_Coop) July 20, 2018 Wow ! awesome sense of humour you guys have to. — KANISHKA (@Kanishk94486037) July 20, 2018 Amul, the original meme makers since 1967. Super idea every week. 😂😂 — #WhatNext (@ThisNMore) July 21, 2018 And thats why Amul is the Taste of India!!! 😀😀😀👏👏👏👍👍👍 — Renu Bhagwat-Gadgil (@RenuGadgil) July 20, 2018 You amul guys are the best .... Always making something sarcastic memes on current hot topics ...🤣😛😉 — Viswam jr 🇮🇳😎 (@EshwarViswam) July 20, 2018 -
‘చంద్రబాబు మోసాలు తేటతెల్లం’
సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ, రాజ్నాథ్లు తేటతెల్లం చేశారని వైఎస్సార్సీపీ నేతలు సురేష్బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు. విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్కే సాధ్యం.. విభజన హామీలు సాధించడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు. -
‘చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది?’
సాక్షి, విజయవాడ : లోక్సభలో జరిగిన అవిశ్వాసం చర్చపై వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. అంతేకాక సీఎం చంద్రబాబు తీరును కూడా ఆయన దుయ్యబట్టారు. తనకు 40ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకోవడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఆ అనుభవం ఇప్పుడు ఏమైందని వెల్లంపల్లి ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. హోదాను వదిలేసి చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని పార్లమెంట్లో స్వయనా ప్రధాని మోదీనే చెప్పారు. అయినా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారని వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీనే పోరాడుతుందన్నారు. ఏపీ బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకి పవన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే.. పవన్ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు నిన్న ప్రెస్మీట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చంద్రబాబుగారూ మీకు ఇదే నా బదులు...’ అంటూ పవన్ ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు(జనసేన) వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? అసలు నా ట్వీట్ల ఉద్దేశం ఏంటంటే... బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని అంతేదారుణంగా దెబ్బకొట్టిందని. ప్రజలను మోసం చేశారు. వంచించారు.. ...మరి ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా.. అవకాశవాదులుగా.. ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు’ అని పవన్ పేర్కొన్నారు లోపల కాళ్లు మొక్కుతారు... ‘నిన్న ప్రధాన మంత్రి మోదీగారి కాళ్లకి మీ టీడీపీ ఎంపీలు పాధాభివందనం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. అదే సభలో ఓవైపు మీ ఎంపీలు బీజేపీని తిడతారు. ఇంకోవైపు బీజేపీ కాళ్లకు మొక్కుతారు. దీన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్గారు మిమల్ని ఇంకా మిత్రులుగా చూస్తున్నారు అని అంటారు. దీనిని బట్టి ‘మీరు చేస్తున్నది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్ముతామో మీరే చెప్పండి?’ అని చంద్రబాబును ఉద్దేశించి పవన్ ట్వీట్లు చేశారు. రేపు మళ్లీ మీ అవసరాల కోసం.. వైఖరి మార్చుకోరన్న గ్యారెంటీ ఏంటీ?.. అని పవన్ ఏకీపడేశారు. గల్లాపై సెటైర్... ఎంపీ గల్లా జయదేవ్పై పవన్ సెటైర్లు పేల్చారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఫోటోను ఉంచారు. గజిని చిత్రంలో హీరోలాగా టీడీపీ వాళ్లకి Convenient Memory loss Syndrome రోజు రోజుకీ పెరిగిపోతోంది. In case If TDP has memory loss.. pic.twitter.com/Kxf3peoetp — Pawan Kalyan (@PawanKalyan) 21 July 2018 -
అవిశ్వాసంలో బీజేపీకి మిత్రపక్షం ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందికర పరిణామం ఎదుర్కొంది. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను బహిష్కరించింది. సభలో జరిగిన ఓటింగ్లోనూ పాల్గొనలేదు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ బీజేపీతో శివసేన అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకునే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై వేచిచూసి ధోరణిలో ఉన్నామని, బీజేపీతో బ్రేకప్ విషయంలో తామేమీ ఆందోళన చెందడం లేదని శివసేన వర్గాలు అంటున్నాయి. నిజానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభకు తమ ఎంపీలందరూ హాజరుకావాలని శివసేన లోక్సభ పక్ష నేత ఆనంద్రావు అద్సుల్ విప్ కూడా జారీచేశారు. బీజేపీ నేతల బుజ్జగింపులతో ఆయన విప్ జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే, శుక్రవారం ఉదయానికి శివసేన అధినాయకత్వం వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతల తీరుతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీతో శివసేన గతకొంతకాలంగా ఘర్షణపూరితమైన వైఖరిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్సభకు దూరంగా ఉన్న శివసేన మరోవైపు.. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. లోక్సభలో మోదీ సర్కారు అవిశ్వాస తీర్మానంలో నెగ్గినా.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే లోక్సభకు తాము గైర్హాజరయ్యాయమని శివసేన నేతలు చెప్తుండగా.. శివసేన అధికార పత్రిక సామ్నా బీజేపీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడింది. ‘జంతువులను కాపాడుతూ.. మనుషులను చంపే కసాయిలు నేడు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న వారిలో కనీసం దయా, జాలి లేకుండాపోయాయి. ఎలాగైనా గెలుస్తూ.. అధికారంలో కొనసాగడమే ప్రజాస్వామ్యం కాదు. మెజారిటీ శాశ్వతం కాదు. ప్రజలే సుప్రీం’ అని సామ్నా పేర్కొంది. -
‘బెస్ట్ యాక్టర్.. బెస్ట్ డ్రామా!’
సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ సర్కారుతో నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు. కానీ, ఇప్పుడు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో ఎంపీ గల్లా జయదేవ్ బాగా మాట్లాడారంటూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళం వినిపించారంటూ ట్వీట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు.. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని మరిచిపోయారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. హోదా మాటెత్తితే అరెస్టులు చేస్తానంటూ గతంలో హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని తప్పుబడుతూ ‘బెస్ట్ యాక్టింగ్... బెస్ట్ యాక్టర్ చంద్రబాబు... బెస్ట్ డ్రామా’ అని ట్వీటర్లో పోస్టింగులు పెట్టారు. ‘ప్యాకేజీ ముద్దు... హోదా వద్ద’న్న బాబు మాటలను గుర్తు చేశారు. టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం సంగతి తేల్చడం సరే.. మీరిచ్చిన హామీల సంగతేంటని కొందరు సీఎంను ప్రశ్నించారు. ట్వీటర్, ఫేస్బుక్, గూగుల్లో ఇలాంటి కామెంట్స్ వైరల్గా మారాయి. చంద్రబాబు ట్విట్టర్లో పోస్టింగ్ పెట్టిన 4 గంటల్లోనే 232 మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. గల్లా జయదేవ్, నారా లోకేష్ ట్వీట్లకూ ఇదే రీతిలో వ్యతిరేకత వచ్చింది. -
బాబు యూటర్న్ను బయటపెట్టిన ప్రధాని మోదీ
-
లోక్సభలో అనూహ్య పరిణామం
-
ఏపీకి హోదా ఊసెత్తని కాంగ్రెస్
-
ప్యాకేజీ కావాలని బాబే అడిగారు
-
సభా మర్యాదలు పాటించాలి
న్యూఢిల్లీ: మోదీని కౌగిలించుకున్నందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ రాహుల్ను మందలించారు. సభ్యులంతా సభా మర్యాదలు పాటించాలని ఆమె కోరారు. రాహుల్ ఎవరిని కౌగిలించుకున్నా తానేమీ వ్యతిరేకిని కాననీ, అయితే సభలో మర్యాదతో నడచుకోవాలని ఆమె కోరారు. తనకెవరూ శత్రువు కాదనీ, రాహుల్ తన కొడుకులాంటి వాడని ఆమె పేర్కొన్నారు. ఆయన మోదీని కౌగిలించుకోవడం తనకు ఓ డ్రామాలా అనిపించిందన్నారు. హోదాపై మాట లేదు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదు. గంటకుపైగా ప్రసంగించినా ఎక్కడా ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి చిన్న మాట కూడా ఎత్తలేదు. కేవలం గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ తీరును ఆయన వివరించారని చెప్పి ముగించారు. లోక్సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిచ్చిన అన్ని హామీలనూ బీజేపీ సమ్మతించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం, ఆర్థిక లోటు భర్తీ హామీలను అమలు చేసేందుకు బీజేపీ అంగీకరించిందని అన్నారు. ఏపీకిచ్చిన హామీలను 2016లో మాజీ ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో తిరిగి ప్రస్తావించారన్నారు. -
2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదు
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్విలాశ్ పాశ్వాన్ తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2024 లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం కావడానికి గల కారణాలపై రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మోదీ చెప్పలేదు. కోర్టు తీర్పుకోసం వేచి ఉండాలనే చెప్పారు. దేశంలో 18,000 గ్రామాలను నిర్ణీత గడువులోగా విద్యుదీకరణ చేశాం. అలాగే గడువులోపలే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తిచేశాం. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీసెస్ను కేంద్రం తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తోంది. ఈ మాట పార్లమెంటులో చెప్పాను కాబట్టి సరిపోయింది కానీ బయట చెప్పిఉంటే కోర్టు ధిక్కారం అయ్యేది. కోలీజియం వ్యవస్థలో సైతం పారదర్శకత లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భర్తీలాగే జడ్జీల నియామకంలోనూ పారదర్శకత రావాలి’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. -
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని టీఆర్ఎస్ విమర్శించింది. లోక్సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడారు. ‘నాలుగేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. వాటిని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తొలి కేబినెట్ సమావేశంలో పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపింది. ఈ మండలాలను మళ్లీ తెలంగాణలో కలిపేలా కేంద్రం విభజన చట్టాన్ని సవరించాలి. 7 ముంపు మండలాల్లో భాగమైన 500 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీకే ఇవ్వడంతో మా రాష్ట్రంలోవిద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకొనేదాకా ఏపీ విద్యుత్ సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా అమలు కాలేదు. మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం. ముంపు మండలాలను కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని బాబు పలు సందర్భాల్లో మీడియా సాక్షిగా అన్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నిధులివ్వాలి ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి ఖర్చును భరిస్తామని విభజన చట్టంలో పేర్కొన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టును విస్మరించిందన్నారు. మాకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలి. బాబు వల్లే హైకోర్టు ఆలస్యం ‘హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే వెంటనే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అప్పటి కేంద్ర న్యాయ మంత్రి స్పష్టం చేశారు. కానీ ఏపీ ఇప్పటికీ ముందుకు రాలేదు. సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్న ఏపీ, హైకోర్టును ఎందుకు నిర్మించుకోలేకపోతోందో చెప్పాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసింది. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. గల్లా వ్యాఖ్యలపై సభలో దుమారం ఆంధ్రప్రదేశ్ను అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గల్లా తన ప్రసంగంలో రాష్ట్ర విభజన అప్రజాస్వామికం అనండంపై టీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. గల్లా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆమోదంతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికమెలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం చంద్రబాబు కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ‘అప్రజాస్వామికం, అశాస్త్రీయం’ అనే మాటలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. -
హోదాపై కేంద్రం అసత్యాలు
సాక్షి, న్యూఢిల్లీ: 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందంటూ కేంద్రం అసత్యాలు చెబుతోందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇచ్చిన హామీని విస్మరించిన వ్యక్తి ఎన్నటికీ మనిషి కాలేడని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మహేశ్బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమాను ప్రస్తావించారు. ‘విభజన పాపంలో బీజేపీకి సగం వాటా ఉంది. నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా? ప్రత్యేక హోదా ఐదు కాదు..పదేళ్లు ఇస్తామంటూ తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. ఢిల్లీని మించిన రాజధానిని ఆంధ్రప్రదేశ్కు నిర్మిస్తామని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని నాడు మోదీ మాటిచ్చారు. చివరికి అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు మాత్రం ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు రూ.3,000 కోట్లు, ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఖర్చు పెడతారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.58 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూ.6 వేల కోట్లే ఇచ్చారు’ అని అన్నారు. ‘మోసగాడు’ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా.. ప్రధాని మోదీ మోసగాడు అంటూ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రధానిని మోసగాడు అనడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శివప్రసాద్ వ్యాఖ్యలను రక్షణ మంత్రి సీతారామన్ ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. సమీక్షించనేలేదు: రామ్మోహన్ విభజన చట్టం అమలుపై కేంద్రం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీలో విలాసవంతమైన కార్యాలయాన్ని కట్టుకున్న బీజేపీ నాలుగేళ్లు అయినా ఏపీలో కేంద్ర సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. చట్టంలో హోదా లేదంటున్న బీజేపీ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో ఎలా కలిపారో అలా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. -
టీడీపీ ‘కాగడాల ప్రదర్శన’ హడావుడి
ప్రదేశం: బందరు రోడ్డు బెంజిసర్కిల్ ప్రాంతం సమయం: సాయంత్రం 5 గంటల సమయం విషయం: ఒక్కసారిగా పోలీసులు రోడ్డు పైకి వచ్చి ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం: సీఎం చంద్రబాబునాయుడు కాగడా ప్రదర్శనలో పాల్గొంటున్నారంటూ హడావుడి ఫలితం: ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు ముగిసిన సమయం: రాత్రి 8.15 సాక్షి, విజయవాడ: పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుండడంతో టీడీపీ అధినేత హైడ్రామాకు తెరతీశారు. రాష్ట్ర ఎంపీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కాగడా ప్రదర్శనలు చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. విజయవాడలో నిత్యం రద్దీగా ఉండి భారీ వాహనాలు రాకపోకలు సాగించే బెంజి సర్కిల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ప్రకటించారు. క్షణాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ముగియడంతో ఇళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్న బెంజి సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు కాగడా ప్రదర్శన నిర్వహిస్తారని తెలిసి డీవీ మ్యానర్ నుంచి బెంజి సర్కిల్ వరకు ట్రాఫిక్ను అనుమతించలేదు. అలాగే నిర్మలా కాన్వెంట్ నుంచి బెంజి సర్కిల్కు, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజి సర్కిల్కు, స్క్రూ బ్రిడ్జి నుంచి బెంజిసర్కిల్కు వాహనాలను అనుమతించలేదు. సందుల్లోకి, గొందుల్లోకి ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో నగర వాసులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. జాతీయ రహదారిపై కి.మీ మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఎటు వైపు నుంచి ఎటువైపు వెళ్లాలో తెలియక జనాలు చికాకు పడ్డారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గైర్హాజరు: పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం పూర్తి కాలేదంటూ సీఎం చంద్రబాబు కాగడా ప్రదర్శనకు గైర్హాజరయ్యారు. దీంతో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడేప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకూమారి, జిల్లా చైర్మన్ గద్దె అనూరాధ, ప్రత్యేక హోదా జేఏసీ ప్రతినిధి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు. ఎస్పీవీ ఏర్పాటు చేయండి.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు. -
జగన్ మాటే.. జయదేవ్ నోట
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసగిస్తున్న వైనాన్ని మూడేళ్ల క్రితం అసెంబ్లీలో ఎలుగెత్తిన సందర్భంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలనే శుక్రవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొనటం గమనార్హం. జయదేవ్ మాట్లాడిన విషయాలను గమనిస్తే ముందు నుంచి హోదా విషయంలో మడమతిప్పని వైఎస్సార్ సీపీ వైఖరినే అనుసరించినట్లైంది. అలాగే చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాకు 14 ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డు వచ్చాయని మోదీ చెప్పడం సరికాదన్నారు. హోదా రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదు.. 2015 సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి హోదా సాధించుకోవడంలో టీడీపీ సర్కారు మెతక వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ఇదే సమయంలో కేంద్రం చేస్తున్న మోసాన్ని కూడా ప్రస్తావించారు. ‘ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అసలు ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు..’ అని వైఎస్ జగన్ అసెంబ్లీలో ఆధారాలతో సహా వివరించారు. ‘ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సూచించలేదని కమిషన్ సభ్యులు అభిజిత్సేన్ లేఖ రాశారు. మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు’ అని మూడేళ్ల క్రితమే వైఎస్ జగన్ శాసనసభ దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదాకు మించి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందంటూ సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని జగన్ అప్పట్లోనే తప్పుబట్టారు. మూడేళ్ల క్రితం నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అవే అంశాలను ఇప్పుడు పార్లమెంట్లో టీడీపీ ఎంపీ జయదేవ్, మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించడం విశేషం. -
‘రాఫెల్’లో రాహుల్కు ఝలక్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పంద వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మల తిప్పికొట్టారు. ఆ ఒప్పందం రహస్య సమాచార పరిధిలోకే వస్తుందని, రాఫెల్ ఒప్పంద వివరాలను బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. రహస్య సమాచార పరిరక్షణకు సంబంధించి ఫ్రాన్స్, భారత్ల మధ్య ఒక ఒప్పందం 2008లోనే కుదిరిందని గుర్తు చేశారు. రాఫెల్ ఒప్పందం ఆ పరిధిలోకే వస్తుందన్నారు. ‘ఇది గోప్యతా ఒప్పందం. సున్నిత సమాచారాన్ని పరిరక్షించాల్సి ఉంది. రాహుల్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ, భారత చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్ మాట్లాడుతూ ఒప్పంద వాణిజ్య విషయాలు బహిర్గతం చేయకూడదని అన్నారు. రాహుల్ చెప్పినదంతా అబద్ధం’ అని నిర్మల తిప్పికొట్టారు. రాఫెల్ ఒప్పందంలో అసలు గోప్యతా నిబంధనలే లేవన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం రాహుల్ ఆరోపణలపై స్పందించింది. రాఫెల్ విమానాల కొనుగోలు వివరాలను బహిర్గతం చేయడానికి తమకేం అభ్యంతరం లేదని మేక్రన్ తనకు చెప్పారని లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఫ్రెంచ్ ప్రభుత్వం తప్పుబట్టింది. ‘2008లో చేసుకున్న భద్రతా ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉండాల్సిందే. రక్షణ రంగంపై ప్రభావం చూపే అంశాలను రహస్యంగా ఉంచాలన్న నిబంధన ఆ ఒప్పందంలో ఉంది’ అని పేర్కొంది. సున్నితమైన అంశాలతో కూడిన ఒప్పందం వివరాలను భారత్, ఫ్రాన్స్లలో ఎక్కడా బహిర్గతం చేయొద్దని 2018 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతిని కూడా ఫ్రాన్స్ ఆ ప్రకటనలో గుర్తుచేసింది. బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రాహుల్ పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఆరోపించింది. రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రక్షణమంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ లోక్సభలో రాహుల్ ఆరోపించడంతో బీజేపీ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పార్లమెంట్లో రాహుల్ పిల్లాడిలా ప్రవర్తించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాహుల్ అపరిపక్వతతో పిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎదగకపోవటం దురదృష్టకరం. సభలో సభ్యుడిపై ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా స్పీకర్కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోపణలకు సమర్ధనగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఆయన నిరాధార ఆరోపణలు చేశారు’ అని అన్నారు. అనంతరం బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి రాహుల్పై సభాహక్కుల నోటీసు ఇచ్చారు. రాఫెల్ ఒప్పందం నేపథ్యం ఫ్రెంచి కంపెనీ డసాల్ట్ నుంచి 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ 2016 సెప్టెంబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. గత యూపీఏ ప్రభుత్వం 126 విమానాలను కొనుగోలు చేయాలనుకున్నా, తరువాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ సంఖ్యను 36కు తగ్గించింది. ఈ ఒప్పందం కింద డసాల్డ్.. భారత్కు చెందిన డీఆర్డీఓ, హెచ్ఏఎల్ తదితర సంస్థలతో విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందాన్ని ‘రాఫెల్ డీల్’గా పేర్కొంటున్నారు. యూపీఏ సమయంలో కుదిరిన దాని కన్నా ఒక్కో విమానం ధర మూడు రెట్లు ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఒప్పందం వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది. -
అవిశ్వాసం: తెలుగుదేశంలో అంతర్మథనం!
సాక్షి, అమరావతి: బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో అవిశ్వాస తీర్మానం పెట్టి లబ్ధి పొందాలని చూస్తే మొత్తానికి మునిగి పోయామని, పరువు పోగొట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతోంది. అవిశ్వాసం వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా ఇన్నాళ్లూ దాచిన రహస్యాలన్నీ పార్లమెంట్ సాక్షిగా బట్టబయలయ్యాయని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ‘‘అవిశ్వాసానికి వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నాం.. చంద్రబాబు అమరావతి నుంచే చక్రం తిప్పుతున్నారు. తన అనుభవంతో విపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివిధ పార్టీలతో కలిసి కేంద్రాన్ని ఎండగడతాం.. ప్రధాని మోదీని నిలదీస్తాం’’ అంటూ హడావుడి చేసినా అదేమీ జరగలేదని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. పార్లమెంట్లో ఇతర పార్టీల నుంచి మద్దతు లభించకపోగా, బీజేపీ వైఖరితో పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డామనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. లోక్సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చ తీరు మనకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని, చివర్లో జరిగిన పరిణామాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. మోదీ వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లినా తమకు మిత్రుడేనని, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయనతో స్నేహం ఉంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పడం ద్వారా టీడీపీ–బీజేపీ లోపాయికారీ వ్యవహారాలను తేటతెల్లం చేశాయని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లు అధికారంలో కొనసాగి, రాజకీయ లాభం కోసం బీజేపీ నుంచి విడిపోయినా రహస్యంగా ఆ పార్టీతో చంద్రబాబు అనుబంధం కొనసాగిస్తున్నారనే అనుమానాలు మొదటి నుంచే వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగంతో తమ అధినేత బండారం మొత్తం బయటపడినట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని, ఏపీలో సమస్యలు పరిష్కారం కాలేదని సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పడం తమకు ఇబ్బందికరమేనని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. లోక్సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు తమ పార్టీకి మద్దతు ఇవ్వకపోగా, ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించకపోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు వ్యూహం ఫలించలేదనే విషయం స్పష్టమవుతోందంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లిద్దాం.. తాజా పరిణామాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు కూడా మదన పడుతున్నట్లు సమాచారం. ఉదయం నుంచి పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆయన మంత్రులతో మాట్లాడుతూనే తన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ వాదనను లోక్సభలో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయామని, అనుకున్న మైలేజీ రాలేదని అంటున్నట్లు సమాచారం. మోదీ నేరుగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతారని తాను ఊహించలేదని ఆయన వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ మాట్లాడిన తర్వాత నష్ట నివారణ కోసం అర్ధరాత్రి 12 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు మాకు మిత్రుడే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ బంధం బలమైనదని లోక్సభ సాక్షిగా మరోసారి నిరూపితమైంది. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చినా ఈ రోజుకీ ఆయన మా మిత్రుడే. ఇకపై కూడా మా మిత్రుడిగానే కొనసాగుతారు. మా బంధం తెగిపోయేదికాదు’ అని శుక్రవారం లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కేటాయించిన నిధులు, సాయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన సమస్యలేంటో మాకు తెలుసు. ఏపీ అభివృద్ధికి ఎంత సాయం అవసరమో అంతా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విభజన చట్టాన్ని ఇప్పటికే చాలా వరకు అమలు చేశాం. నూతన రాజధాని నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చాం. గుంటూరు, విజయవాడకు అదనంగా రూ. వెయ్యి కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,764 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,050 కోట్లు ఇచ్చాం. అవసరమైతే ఇంకా ఇస్తాం. రిసోర్స్ గ్యాప్ భర్తీకి రూ.3, 979 కోట్లు విడుదల చేశాం. 2015–20 కాలానికి ఆర్థిక లోటును రూ. 22,113 కోట్లతో భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇందుకోసం 2015–18 మధ్య కాలంలో రూ. 15,959 కోట్లు విడుదల చేశాం. ఇవి కాకుండా ఏపీకి అదనంగా సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, అమరావతి చుట్టూ వంద కిలోమిటర్లు రింగురోడ్డు, ఎయిమ్స్, అగ్రికల్చర్ వర్సిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేశాం. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు అనుమతులిచ్చాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా ఏపీకి 2015–20 కాలానికి కేంద్రం నుంచి రూ. 2,06,910 కోట్లు మంజూరు కానున్నాయి. 2016 సెప్టెంబర్లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ.8,140 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు అనుమతించాం. టీడీపీ ఇక ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి ఇప్పటి వరకు మంజూరు చేసిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివద్ధి చేయడంపై దృష్టి సారించాలి’ అని సూచించారు. సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి ఘటనల నివారణకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, కానీ రాష్ట్రాలే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరుగుతున్న వరస మూకహత్యలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిచ్చారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లే అతిపెద్ద మూకహత్యా ఘటనలని, ఇందిరా గాంధీ హత్యానంతర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని, సిక్కు వర్గానికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన ప్రతిపక్షాల్లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని హేళన చేశారు.‘ఎవరిపై మీరు అవిశ్వాసం ప్రకటించారు? ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది కుటుంబాలు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాయి. కానీ ప్రతిపక్షాల్లోనే ఒకరిని మరొకరు విశ్వసించే పరిస్థితి లేదు. తమ నాయకుడు, విధానాల గురించి వాళ్లకే స్పష్టత లేదు’ అని అన్నారు. -
కప్పిపుచ్చుకునేందుకే బాబు యూటర్న్
2014 ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య ప్రతిసారీ సమస్యలు వస్తుండేవి. కొన్నిసార్లు గవర్నర్, కొన్నిసార్లు హోంమంత్రి, నేను కూర్చొని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేసేవాళ్లం. కేసీఆర్ కొంత మెచ్యూరిటీ చూపించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఏపీలో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అంగీకారంతోనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు కూడా తెలిపారు. కానీ, ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్ తీసుకున్నారు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘వాజ్పేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు, గొడవలు లేవు. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. మూడు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే, యూపీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా సభ ఆర్డర్లో లేకపోయినా పార్లమెంట్ తలుపులు మూసి రెండు రాష్ట్రాలుగా విభజన చేసింది. గల్లా జయదేవ్ చెప్పినట్టు నేను ఆనాడు చెప్పా. తెలుగు మా తల్లి.. తెలుగు స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాలని ఆనాడే అన్నాను. కాంగ్రెస్ పార్టీ బిడ్డను రక్షించి, తల్లిని చంపేసింది. మనం ఇద్దరినీ రక్షించుకోవాలని చెప్పా. తెలుగు స్ఫూర్తిని రక్షించాలి. ఇప్పటికీ నేను ఇదే నమ్ముతాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రం పోతే మరో రాష్ట్రంలో మనుగడ సాధించవచ్చని అనుకుంది. కానీ, ఆ పార్టీకి రెండూ దక్కలేదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైనవారు. కాంగ్రెస్ గతంలో భారత్–పాకిస్తాన్ను విడదీసింది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేదు. అలాగే ఏపీ, తెలంగాణను విభజించింది. ఆ రాష్ట్రాల సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 2014 ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య ప్రతిసారి సమస్యలు వస్తుండేవి. కొన్నిసార్లు గవర్నర్, కొన్నిసార్లు హోంమంత్రి, నేను కూర్చొని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కారించేందకు కృషి చేసేవాళ్లం. కేసీఆర్ కొంత మెచ్యూరిటీ చూపించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఏపీలో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్డీయే ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఇప్పటికీ మేం దానికి కట్టుబడి ఉన్నాం. ఏపీ ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నా... 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాం. అందుకే ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సభ్యుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బాగుందని అన్నారు. 2016 సెప్టెంబర్లో ప్యాకేజీ ప్రకటించాం. అది కూడా చంద్రబాబు అంగీకారంతోనే. ఈ ప్యాకేజీపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తూ తీర్మానం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ, చివరికి చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగే ముందు నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకుంటున్నారని చెప్పాను. ఈ వ్యూహంలో చిక్కుకుంటే మనుగడ సాధించలేరని కూడా తెలిపాను. ఈ పరిణామాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి, రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిందంతా చేస్తాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘‘ఒక రాష్ట్రానికి రాయితీలు ఇస్తే మరో రాష్ట్రంపై ప్రభావం పడుతుంది. ఇలా ఇస్తే రాష్ట్రాల మధ్య అసమానత ఏర్పడుతుందని మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఇదే సభలో అన్నారు. ఇది చాలా పెద్ద అంశమని పేర్కొన్నారు. మీరు కేవలం ఆర్బిట్రేటర్ మాత్రమేనని మొయిలీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విశ్వాసం కల్పిస్తున్నాను. కేంద్ర సర్కారు ఏపీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఏపీకి అండగా ఉంటాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని కేశినేని నాని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్కు(నాని) లోక్సభలో ప్రధానమంత్రి జవాబు అనంతరం మాట్లాడేందుకు అవకాశం రాగా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కేంద్రం చేసిన వాదనలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించాల్సి ఉండగా.. కేవలం విమర్శలతో సరిపెట్టారు. దీంతో సభాపతి వెంటనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. -
రాజ్నాథ్ వ్యాఖ్యలతో వారి బంధం సుస్పష్టం: పవన్
సాక్షి, అమరావతి: లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్సింగ్.. ‘ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే’ అంటూ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ – బీజేపీలు ఇంకా కలిసే ఉన్నాయని స్పష్టమవుతోందని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. రెండు పార్టీలూ కలిసి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయనిపిస్తోందని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో హోదా డిమాండ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అత్యంత పేలవమైన, బలహీనమైన వాదనలు వినిపించిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా అంశానికి తూట్లు పొడిచి.. ఇప్పుడు అవిశ్వాసంపై జరిగిన చర్చలో వ్యర్థమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం చేస్తున్న వంచన తెలియడానికే ఇన్నేళ్లు పట్టిందంటే నమ్మాలా.. అని ప్రశ్నించారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మీరు మాత్రం.. ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లలాగా ‘కేంద్రం మోసగించింది’ అంటే జనం నమ్ముతారా.. అని ధ్వజమెత్తారు. హోదా అడిగిన వారిని తిడుతూ.. ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ నాయకులకు సన్మానాలు చేసిన వారికి.. మోసం తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందా.. అని పవన్ విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రతి దశలోనూ బీజేపీ నాయకత్వంతో టీడీపీ కుమ్మక్కై రాజీ పడుతూ వచ్చిందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదా డిమాండ్నే తాకట్టు పెట్టిన టీడీపీ.. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు అన్యాయం చేయవద్దని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. నేడు, రేపు విజయవాడలో పవన్కల్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ శని, ఆదివారాల్లో విజయవాడలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటారని, ఆదివారం రాజధాని ప్రాంత రైతులతో భేటీ అవుతారని తెలిపాయి. -
అవిశ్వాస తీర్మానంపై నేడు స్పందించనున్న జగన్
సాక్షి, అమరావతి: లోక్సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై శనివారం ఉదయం 8.30 గం.కు ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ తెలిపారు. -
‘ఓయ్ పిల్లాడా ! ప్రియా వారియర్ కంటే..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్ హగ్) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్సభలో ఎన్డీఏ సర్కార్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి. ► ‘ఓయ్ పిల్లాడా ! ప్రియా ప్రకాష్ వారియర్ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్ కన్నుగీటారు. మున్నాభాయ్ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్ అవార్డ్ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్ జోషి ట్వీట్ చేశారు. ► ‘ప్రియా వారియర్ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్ సిన్హా పేర్కొన్నారు ► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు. ► అయితే రాహుల్ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్ ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది. ► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు ► ప్రధానిని రాహుల్గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్ స్పాట్ అకౌంట్ ట్వీట్ చేశారు. ► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ మర్యాదను, నిబంధనలను రాహుల్ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్ జై హింద్ ట్విటర్ అకౌంట్ నుంచి పేర్కొన్నారు ► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్. పార్ల మెంట్లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్గా వ్యవహరించు. ప్లీజ్ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్ ట్వీట్ చేశారు. ► ‘వావ్..వావ్ ! ఏమి హగ్ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు. ► ‘న్యూ వైల్డ్ స్టోన్ యాడ్ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్ ట్వీటారు. ► రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు. -
అవిశ్వాసం పెట్టినా ఫలితం లేకుండా పోయింది
సాక్షి, అమరావతి: ‘‘ఎన్డీయే ప్రభుత్వానికి బలం ఉందని తెలుసు. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోదనీ తెలుసు.. కానీ రాష్ట్రానికి న్యాయం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టాం.. అయినా ఫలితం లేకుండా పోయింది’’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అహంకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనడం సరికాదని, అధికారం ఉందనే ధీమాతో ప్రధానే అహంకారంతో మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘‘నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు గొడవలున్నాయని ప్రధాని మాట్లాడారు. ఆయన అలా చెప్పడం కరెక్టు కాదు. ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు లేకుండా నన్ను, కేసీఆర్ను కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పినా ప్రధాని పట్టించుకోలేదు. సమస్యను పరిష్కరించాలని చెబితే ఆ కోణంలో ఆలోచించకుండా రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు’’అని మండిపడ్డారు. ప్రధాని చులకనగా మాట్లాడారు.. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఎంతో ఆసక్తిగా, ఈసారైనా న్యాయం చేస్తారని చూసినా నిరాశే ఎదురైందని చంద్రబాబు అన్నారు. ‘‘ఏపీ అంటే ప్రధాని చులకనగా మాట్లాడారు. నేనేదో యూటర్న్ తీసుకున్నానని చెబుతున్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి, ఆయన్ని గద్దె దించడానికే అవిశ్వాసం పెట్టినామట... అహంకారంతో నో కాన్ఫడెన్స్ పెట్టామట.. అహంకారం నాకు కాదు. ప్రధానికే’’అని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పే ప్రధానమంత్రి నాలుగేళ్లుగా ఒక్కపని కూడా చేయకుండా అన్యాయం చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డువచ్చాయని ప్రధాని చెప్పడం సరికాదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి చవకబారుగా మాట్లాడటం చూసి బాధవేసిందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తానని కనీసం 10 నిమిషాలు ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రధానిని నిలదీశారు. ‘‘ఆ అహంభావం ఎందుకు? అరవై ఏళ్లు కష్టపడ్డాం. న్యాయం చేయమని అడిగాం. అందులో తప్పేముంది? రాష్ట్ర విభజన జరిగినా అందరం కష్టపడి రెండంకెల వృద్ధి రేటు సాధించాం. అయినప్పటికీ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకంటే ఆదాయంలో వెనుకబడి ఉన్నాం.. ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?’’అని సీఎం అన్నారు. న్యాయం చేయాలని 29 పర్యాయాలు ఢిల్లీ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. ప్యాకేజీకి అంగీకరించింది అందుకే.. ప్రత్యేక హోదాకు ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించామని చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని, ఇది ఎంతో అరుదైన విషయమని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, న్యాయం జరిగేవరకూ ఆందోళ నలు చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. శనివారం రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఢిల్లీ వెళ్లి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపి, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేషనల్ మీడియాకు వివరిస్తానని చెప్పారు. -
కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ప్రజలకు కాపలాదారుగా ఉంటానంటూ నాడు అధికారంలోకి వచ్చిన మోదీ నేడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా అనేక అంశాల్లో అవినీతిపరులతో చేతులు కలిపి భాగస్వామిగా మారారని రాహుల్ ఆరోపించారు. మోదీ గిమ్మిక్కులకు, అబద్ధాలకు ప్రజలు బలవుతున్నారన్న రాహుల్.. పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను బీజేపీ అవమానించినా, ‘పప్పు’ అని సంబోధించినా ఆ పార్టీపై, నాయకులపై తనకు ద్వేష భావం లేదనీ, ప్రేమను పంచడమే తన, కాంగ్రెస్ సిద్ధాంతం అని రాహుల్ చెప్పారు. ‘ఆరెస్సెస్, బీజేపీల అగ్రనేతలు కోపం, ద్వేషాలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ నేత, భారతీయుడు, శివుడు, హిందువు’ అనే పదాలకు అర్థాన్ని తెలిపినందుకు వారికి ధన్యవాదాలు’ అని అన్నారు. గంటకు పైగానే ప్రసంగించిన రాహుల్.. అనంతరం మోదీ వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. మోదీ ఒత్తిడి వల్లే ఆమె మాట తప్పారు ఫ్రాన్స్తో భారత్ చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ మాట్లాడుతూ.. ‘మోదీ ఒత్తిడి తెస్తుండటం వల్లే నిర్మలా సీతారామన్ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ ఒప్పందంతో ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తోంది? మోదీ, నిర్మల.. దయచేసి దేశానికి చెప్పండి’ అని రాహుల్ కోరారు. దీంతో సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మల పేర్కొనడంతో కొద్దిసేపు బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. భారత్, ఫ్రాన్స్ల మధ్య రహస్య ఒప్పందం కారణంగా రాఫెల్ యుద్ధ విమానాల ధరలను బయటపెట్టలేమని ఇక్కడ ప్రభుత్వం అంటోందనీ, ఇదే విషయమై ఫ్రాన్స్ అధ్యక్షుడితో తాను మాట్లాడితే అలాంటి రహస్య ఒప్పందాలేవీ లేవని ఆయన తనకు చెప్పినట్లు రాహుల్ తెలిపారు. ‘కొంత మందితో మోదీకి ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ప్రధాని తన ‘మార్కెటింగ్’ కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా ఎవరెవరు ఇస్తున్నారో కూడా అందరికీ తెలుసు. అలా ఇస్తున్న వారిలో ఓ వ్యక్తి చేతికే రాఫెల్ ఒప్పందం వెళ్లింది. వారికి ప్రస్తుతం రూ.35 వేల కోట్ల అప్పు ఉండగా ఈ ఒప్పందం వల్ల రూ. 45 వేల కోట్ల లాభం వస్తోంది’ అని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ నుంచి తప్పించి ఈ ప్రాజెక్టును ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. మీ వాళ్లే ఓడిస్తారు.. ప్రతిపక్షాలవే కాకుండా బీజేపీలోని ఓ వర్గం నేతల ఆవేదనను కూడా తన ప్రసంగం ద్వారా తాను బయటకు తెస్తున్నాననీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ లోని వారు కూడా ప్రయత్నిస్తారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు అధికారం ఉన్నా లేకున్నా ఒకటేననీ, కానీ మోదీ, అమిత్ షా మాత్రం బీజే పీ అధికారంలో లేకపోతే జీర్ణిం చుకోలేరన్నారు. ‘మోదీ నవ్వుతుండటం నేను చూస్తున్నా. అయినా లోలోపల ఆయన గాభరా పడుతున్నారు. ఆయన నా కళ్లలోకి కాకుండా ఎక్కడెక్కడో చూస్తున్నారు’ అని అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తమ నిరసనను మరింత పెంచారు. సూటు వేసుకుంటేనే రుణమాఫీనా? 15–20 మంది బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రూ. 2.5 లక్షల కోట్ల అప్పులను గత నాలుగేళ్లలో మాఫీ చేసిన ప్రభుత్వం, రైతుల రుణాలను మాత్రం రద్దు చేయడం లేదని రాహుల్ విమర్శించారు. రైతులు సూటుబూటు వేసుకోకపోవడమే అందుకు కారణమా అని ప్రశ్నించారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల నగదును జమ చేస్తానని మోదీ ఇచ్చిన హామీ లాగానే తాజాగా పంటలకు మద్దతు ధర కూడా అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. చరిత్రలో తొలిసారిగా, భారత్లో మహిళలకు రక్షణ లేదనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. అవాక్కైన మోదీ రాహుల్ తన ప్రసంగం అనంతరం మోదీ సీటు వద్దకు వెళ్లడంతో ఆయన కాస్త అయోమయానికి గురయ్యారు. లేచి నిలబడాల్సిందిగా రాహుల్ మోదీని కోరినా ఆయన అయోమయంలో ఉండటంతో స్పందించ లేదు. దీంతో మోదీ కూర్చొని ఉండగానే రాహుల్ ఆయనను కౌగిలించుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి మోదీ సహా సభలోని సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అనంతరం తేరుకున్న మోదీ.. అప్పటికే రాహుల్ వెళ్లిపోతుండటంతో ఆయ నను వెనక్కు పిలిచి కరచాలనం చేసి భుజంపై తట్టి కొన్ని మాటలు చెప్పారు. తర్వాత తన సీటు వద్దకు వచ్చిన రాహుల్ ‘ఇదీ హిందుత్వం అంటే’ అని అన్నారు. కూర్చున్నాక పక్కన ఉన్న సహచరుడి వంక చూసి నవ్వుతూ కన్ను కూడా కొట్టారు. -
ఎటో వెళ్లిన అవిశ్వాసం.. స్వీయ అజెండాలకే పరిమితం
సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశమే ప్రధాన అంశంగా మారుతుందని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో నిరీక్షించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని మళ్లీ చట్టసభలోనే సరిదిద్దుతారని ఆశించారు. ఏపీకి జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తెచ్చి న్యాయం జరగాలని కోరుకున్న తెలుగు ప్రజలకు హోదాపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడంతో చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. ఆధిపత్యానికి వేదికగా... కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు వాటి ద్వారా ఏపీకి జీవన్మరణ సమస్య లాంటి హోదా అవసరాన్ని కనీసం ప్రస్తావనకు తేవడంలో ఘోరంగా విఫలం కావడంతో అసలు విషయం మరుగున పడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తన ప్రసంగంలో హోదా అంశానికి ప్రాధాన్యం లేకుండా ఇతర జాతీయ అంశాలు, మోదీపై విమర్శలకే పరిమితమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చివరకు బీజేపీ, కాంగ్రెస్ల రాజకీయ విమర్శలు, ఆధిపత్యానికి వేదికగా మారింది. చివరకు చేతులెత్తేసి..: విభజన హామీలు అమలుకాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోతున్న వైనంపై విపక్షాల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్సభలో తమ వాణి గట్టిగా వినిపిస్తామని, ప్రధాని మోదీని నిలదీస్తామని, కడిగేస్తామని హడావుడి చేసిన టీడీపీ అసలు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను చర్చకు వచ్చేలా చేయలేక చేతులెత్తేసింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాధాన్యంతోపాటు ఏపీ దుస్థితిని పార్లమెంటులో ఆవిష్కరించడంలో టీడీపీ విఫలమైంది. అవిశ్వాసంపై చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని చెప్పలేదని, స్వయంగా ఆర్థిక సంఘం సభ్యులే ఈ విషయాన్ని చెప్పారని, దీనిపై కేంద్రం అసత్యాలు చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇదే అంశాలను మూడేళ్ల క్రితమే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీలోనే స్పష్టం చేయడం గమనార్హం. స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం.. అవిశ్వాసంపై రోజంతా చర్చించినా బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు, జాతీయ రాజకీయాల చుట్టూనే నడిచింది. ప్రధానిపై రాహుల్ వ్యక్తిగత విమర్శలు చేయడం, మోదీ తన ప్రసంగంలో రాహుల్ని వెక్కిరించడం, కాంగ్రెస్ను తూర్పారబట్టడంపైనే ఎక్కువ సమయం గడిచిపోయింది. మోదీ తన ప్రసంగంలో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబే యూటర్న్ తీసుకున్నారని, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి బాబే అంగీకరించారని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన చర్చలో బీజేపీ, కాంగ్రెస్లు స్వీయ రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వగా మిగిలిన పార్టీలు తమ రాష్ట్ర వ్యవహారాలు, ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాయి. ఏ పార్టీ కూడా చర్చలో విభజన హామీలు, ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలు, మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా మాట్లాడింది. రాహుల్గాంధీ ఏపీపై సానుభూతి ఉన్నట్లు ఒక్కమాట చెప్పి మిగిలినవన్నీ తనకు అవసరమైన రాజకీయ అంశాలనే ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే కూడా జాతీయ అంశాలే మాట్లాడి చివర్లో కొసమెరుపుగా నాడు ప్రధాని హోదాలో మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సరిపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఏఐఏడీఎంకే, ఎన్సీపీ తదితర పార్టీలేవీ అసలు టీడీపీని పట్టించుకోలేదు. చివరికి సీపీఎంను సైతం ఏపీ గురించి ప్రస్తావించేలా ఒత్తిడి చేయటంలో టీడీపీ విఫలమైంది. బృందాలను పంపి లేఖలు రాసినా... లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న వారు ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించకపోవడం, మద్దతు ఇవ్వకపోవటానికి టీడీపీ వైఫల్యమే కారణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అవిశ్వాసంతో చంద్రబాబు ఏమీ సాధించలేకపోగా విభజన హామీలు సభలో కనీసం ప్రస్తావనకు వచ్చేలా విపక్షాల మద్దతు కూడగట్టలేకపోయారు. బీజేపీని వ్యతిరేకిస్తూ విపక్షాలు అవిశ్వాసానికి మద్దతు తెలిపినా ఇతర అంశాలను పట్టించుకోలేదు. దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో బృందాలు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు పంపినా ఒనగూరింది శూన్యమే. స్వయంగా చంద్రబాబు పలు పార్టీలకు చెందిన నేతలతో మాట్లాడి లేఖలు రాసినా ఏమీ సాధించలేకపోయారు. చంద్రబాబు సొంత రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయంతోనే విపక్షాలు టీడీపీని పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ సభ్యులు లోక్సభలో ఆందోళన పేరుతో హడావుడి చేసినా రక్తి కట్టించలేకపోయారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అవిశ్వాసం సమయంలో టీడీపీ ఎంపీల విన్యాసాలు, వైఫల్యాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. -
ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు.. ఇకనైనా మారండి
ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో వాడి, వేడి చర్చ జరిగింది. కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. చర్చలో పాల్గొన్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రజా సమస్యలపై తూర్పారపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. చౌకీదార్(కాపలాదారుడు)నని చెప్పుకునే ప్రధాని.. నిజానికి అవినీతి, అక్రమాల్లో భాగీదార్(భాగస్వామి) అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూకదాడులు, మహిళలపై హింస, రాఫెల్ ఒప్పందంలో లొసుగులు సహ పలు అంశాలను లేవనెత్తారు. చివరగా, తనపై బీజేపీకి ఎంత కోపం ఉన్నా.. తనకు మాత్రం వారిపై వీసమెత్తు ద్వేషం కూడా లేదంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అకస్మాత్తుగా ప్రధాని మోదీ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఆ తరువాత తన సీట్లో కూచుని సహచరుడిని చూస్తూ నవ్వుతూ రాహుల్ కన్నుగొట్టారు. విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చర్చకు మోదీ సమాధానమిచ్చారు. రాహుల్ సహా విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో, దీటుగా బదులిచ్చారు. రాహుల్ కౌగిలింతను, కన్నుగీతనూ ప్రస్తావించారు. పనిలోపనిగా, అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ‘యూటర్న్’ పాలసీనీ సభకు తేటతెల్లం చేశారు. మోదీ ప్రసంగం అనంతరం జరిగిన ఓటింగ్లో ప్రభుత్వ పక్షం సునాయాసంగా గెలిచింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. న్యూఢిల్లీ: విపక్షాలపై పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల తీరును ఎండగట్టారు. అవిశ్వాసం పేరుతో నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేని గద్దె దించేందుకు అందరూ ఏకమవుతున్నారని.. వారెన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించబోరన్నారు. ఎవరినైనా గద్దె దించే బాధ్యత 125 కోట్ల ప్రజలదేనన్నారు. 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దేశ ప్రజలనే అవమానించారన్నారు. తమవి ఓటుబ్యాంకు రాజకీయాలు కావన్న ప్రధాని.. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. ప్రధాని పీఠంలో కూర్చోవాలని రాహుల్ అనుకుంటున్నారని.. దీనికి అంత తొందర అవసరం లేదని ఎద్దేవా చేశారు. విపక్షాలకు అవిశ్వాసం అవకాశం ఇకపై ఉండదని.. వీలుంటే 2024లో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీకు నా శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు. డోక్లాం, రాఫెల్ డీల్లపై.. భారత్–చైనాల మధ్య విభేదాలకు కారణమైన డోక్లాం వివాదం నెలకొన్న విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరునూ సభా వేదిక ద్వారా మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆయనకేమైనా సందేహాలుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కానీ చైనా రాయబారితో సమావేశమయ్యారు. ఇది దేశాన్ని అవమానించడం కాదా?’ అని మోదీ ప్రశ్నించారు. చైనా రాయబారితో మాట్లాడి రాహుల్ దేశం పరువుతీశారన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలోనూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దారుణమని ప్రధాని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలియదన్నారు. ‘ప్రజలు మిమ్మల్ని విసుక్కుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మారండి. రాఫెల్ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం. రాజకీయ పార్టీల మధ్య కాదు.. రెండు బాధ్యతగల ప్రభుత్వాల మధ్య జరిగింది. అది కూడా పూర్తి పారదర్శకంగా. మీరు చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేయాల్సి వచ్చింది’ అని మోదీ మండిపడ్డారు. జవాన్లకూ అవమానమేనా? సర్జికల్ స్ట్రైక్స్ ఓ బూటకమని రాహుల్ వ్యాఖ్యానించడంపై ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశ సైన్యాధ్యక్షుడిపై ప్రయోగించే భాష విషయంలో.. సైనికుల త్యాగాలను గుర్తించే విషయంలోనూ అవమానకరంగా మాట్లాడతారా? సర్జికల్ దాడులు అబద్ధమంటారా? ప్రాణాలకు తెగించి సరిహద్దులు కాపాడుతు న్న వారిని గౌరవించడం నేర్చుకోండి’ అని మోదీ ఘాటుగా అన్నారు. ఓటుకు నోటిచ్చి.. అవిశ్వాస తీర్మానం ఇచ్చాక తమ వద్ద సరిపోయేంత సంఖ్య ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొనడాన్ని మోదీ ఎద్దేవా చేశారు. సంఖ్యాబలం లేదన్న విలేకరులపై మీకెవరు చెప్పారంటూ జవాబిచ్చిన అహంకారాన్ని చూడండన్నారు. 1999లోనూ అవిశ్వాస తీర్మానం అనంతరం అవసరమైన బలముందని తప్పుడు లెక్కలు చెప్పి కంగుతిన్నదెవరో ప్రజలు మరిచిపోలేదన్నారు. 1971లో చరణ్ సింగ్కు మద్దతిస్తామని చెప్పి తర్వాత చేయిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. దేవేగౌడ, గుజ్రాల్, ములాయం సింగ్ ఇలా ప్రముఖులందర్నీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఓటుకు నోటు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందని గుర్తుచేశారు. సౌదాగర్ను మాత్రం కాను! ‘చౌకీదార్నని చెప్పుకున్న మోదీ.. అవినీతిలో భాగీదార్ (భాగస్వామి)గా మారిపోయార’న్న రాహుల్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. తను చౌకీదార్నేనని.. రాహుల్ చెప్పినట్లుగా తను భాగీదార్ని కూడానన్నారు. దేశానికి చౌకీదార్గా పనిచేయడంతోపాటు.. దేశం యువత సాధిస్తున్న విజయాల్లో, రైతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడంలో తను భాగీదార్నే అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా సౌదాగర్ (వ్యాపారి) ను మాత్రం కాదన్నారు. తప్పుడు వార్తనలు ప్రచారం చేసి జనాల్లో భయాందోళనలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటేనన్నారు. 2014లో ఆర్థికంగా అస్తవ్యస్తం ‘బీజేపీ అధికారంలోకి రాగానే.. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. లెక్కలు చూస్తుంటే ఒకదాని తర్వాత మరొక ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటకొచ్చాయి. 2008లో మొదలైన కాంగ్రెస్ లూటీ 2014వరకు నిర్విఘ్నంగా సాగింది’ అని మోదీ వెల్లడించారు. 60 ఏళ్ల భారతంలో దేశంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) రూ.18లక్షల కోట్లుంటే.. 2008 నుంచి 2014 మధ్యలో ఈ మొత్తం రూ.52లక్షల కోట్లకు చేరిందనే విషయాన్ని మోదీ బయటపెట్టారు. తమ ప్రభుత్వం ఎన్పీఏలను సమీక్షించడంతోపాటు.. బ్యాంకింగ్ రంగానికి రూ. 2.10 లక్షల కోట్ల మూలధనాన్ని ఇచ్చిందన్నారు. దివాళా చట్టాన్ని, రుణ ఎగవేతదారుల చట్టాన్ని తీసుకొచ్చి అమలుచేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే.. బీజేపీ అధికారంలోకి రాకముందు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మోదీ విమర్శించారు. నాలుగేళ్లలోనే 18వేల గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తయిందన్నారు. పేదలు బ్యాంకు అకౌంట్లు తెరుచుకుని రూ.80వేల కోట్లు దాచుకున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమ పథకాల వల్ల దేశంలో పేదరికం తగ్గుతోందంటూ అంతర్జాతీయ సూచీలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ తో బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చనున్నామన్నారు. భీమ్ యాప్ ద్వారా 41వేల కోట్ల లావాదేవీలు జరిగి.. ప్రజలు దేశవ్యాప్తంగా ఓ సానుకూల మార్పుకు సిద్ధమవుతున్నా.. విపక్షాలకు ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. దేశానికి, ప్రపంచానికి, దేశంలోని సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు, కాగ్, ఎన్నికల సంఘం వంటి ఉన్నత సంస్థలకు తమపై నమ్మకముందన్న మోదీ.. పిడికెడు మందికే తమపై విశ్వాసం లేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ప్రధాని ప్రసంగం పేలవం: రాహుల్ ప్రధాని ప్రసంగం పేలవంగా, బలహీనంగా ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు నుంచి రాహుల్ బయటకు వస్తున్నప్పుడు విలేకరులు ‘మోదీ ప్రసంగం ఎలా ఉంది?’ అని అడగ్గా రాహుల్ ‘బలహీనం’అని చెప్పారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా కూడా మోదీ ప్రసంగం ఎప్పటిలా వాగాడంబరంలా, నిజాలను దాచి ప్రజలను మభ్యపెట్టేలా ఉందన్నారు. కళ్లలోకి చూసే సాహసం చేయలేను ప్రధాని తన కళ్లలోకి చూడలేక పోతున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై మోదీ మాట్లా డుతూ.. ‘మీరు గొప్ప పేరున్న వారు (నామ్దార్). నేను పనివాడిని (కామ్దార్). మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూసేంత సాహసం చేయలేను. సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్ర శేఖర్, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్, ఐకే గుజ్రాల్, ప్రణబ్ ముఖర్జీ, దేవెగౌడ తదితర నేతలంతా మీ కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు యత్నించారు. ఫలితం ఏంటో, వాళ్లకెంతటి అవమానాలు జరిగాయో అందరికీ తెలుసు. శరద్ పవార్ కూడా ఇదే యత్నం చేస్తే ఏం చేశారో తెలియదా? కళ్లలో కళ్లు పెట్టేవారిని ఎలా అవమానించారో.. ఒక కుటుం బం కోసం.. ఏం చేశారో దేశమంతటికీ తెలుసు’ అని అన్నారు. వీగిపోయిన అవిశ్వాసం లోక్సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయింది. అధికార, ప్రతిపక్షాలు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఓటింగ్ సమయంలో టీఆర్ఎస్, బీజేడీ, శివసేన సభ్యులు సభలో లేరు. ఎవరేమన్నారంటే... విభజన చట్టం హామీల్ని నెరవేర్చలేదు: కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్ లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ బాబాసాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా ముందుకు పోతోందని ఆరోపించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏపీ పునర్విభజన చట్టం–2014లో చేర్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు. అలాగే చట్టంలోని ఇతర కీలకమైన హామీల్ని నెరవేర్చలేదు. మోదీ ప్రభుత్వం విభజించు–పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఎప్పుడూ అదానీలు, అంబానీల గురించి మాట్లాడే మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు సంగతేమో కానీ రైతన్నల ఆత్మహత్యలు మాత్రం భారీగా పెరిగాయి. మీకు(మోదీకి) పెద్ద మనసు లేకపోయినా ప్రజాస్వామ్యంపై చాలా పెద్దపెద్ద మాటలు చెబుతారు. విదేశాల్లో మూలుగుతున్న రూ.80 లక్షల కోట్లను తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? మోదీ అధికారం నుంచి దిగిపోతేనే దేశానికి మంచిరోజులు వస్తాయని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు’ అని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి పరాజయమే: టీఎంసీ నియోజకవర్గాల వారీగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీచేస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత సౌగత రాయ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాయ్ లోక్సభలో మాట్లాడుతూ.. ‘అధికార బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రభుత్వంపై ఎన్డీయే కూటమి నుంచి బయటికెళ్లిన మిత్రపక్షం టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, మరో మిత్రపక్షం శివసేన ఈ చర్చల్ని ఏకంగా బహిష్కరించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కమలనాథులు కచ్చితంగా చిత్తుగా ఓడిపోతారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి, బీజేపీ మధ్య ద్వైపాక్షిక పోటీ మాత్రమే ఉండనుంది’ అని విమర్శించారు. తమిళనాడుపై సవతితల్లి ప్రేమ: అన్నాడీఎంకే నిధుల కేటాయింపులో తమిళనాడుపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని చర్చ సందర్భంగా అన్నాడీఎంకే నేత పి.వేణుగోపాల్ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో తమిళనాడు వాటా గణనీయంగా ఉంటోంది. కానీ ఇందుకు ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ నిధులు లభిస్తున్నాయి. జనాభా నియంత్రణతో పాటు ఆర్థిక పురోగతి సాధించిన తమిళనాడును కేంద్రం శిక్షిస్తోంది. నిధుల కేటాయింపు విషయంలో మోదీ ప్రభుత్వం తమిళనాడుపై సవతితల్లి ప్రేమను చూపుతోంది. దేశంలో నదీజలాల వివాదాలను పరిష్కరించకుండా కేంద్రం డ్యామ్ భద్రతా బిల్లును తీసుకురాకూడదు’ అని వేణుగోపాల్ అన్నారు. నల్లధనం డిపాజిట్లు 50% పెరిగాయ్: సీపీఎం లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమయిందని సీపీఎం నేత మొహమ్మద్ సలీం విమర్శించారు. ‘2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కానీ ఒక్క 2017లోనే స్విస్ బ్యాంక్లలో భారతీయుల నల్లధనం 50 శాతం మేర పెరిగింది. అప్పుడు నల్లధనం తెస్తామన్న వాళ్లు ఇప్పుడేమో అదంతా తెల్లధనమేనని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నల్లధనం జమయింది కానీ ఎంతమొత్తం వచ్చిందో మాత్రం ఇంకా తెలియదని ఆర్థికమంత్రి సెలవిస్తారు. గత 70 ఏళ్లలో జరగని దాన్ని నాలుగేళ్లలో చేసి చూపామని బీజేపీ నేతలు ఓసారి అంటారు. మరోవైపు గత 70 ఏళ్లలో దేశం సర్వనాశనమైపోయిందని వాళ్లే చెబుతారు. అంటే గత 70 ఏళ్లలో జరిగిన వినాశనాన్ని బీజేపీ నేతలు నాలుగేళ్లలోనే చేసి చూపారా?’ అని సలీం విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు: ఎస్పీ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు, వ్యాపారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో సంతోషంగా ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు. చివరికి బీజేపీ నేతలు కూడా సంతోషంగా లేరు. తమ రాజకీయ జీవితాలు నాశనమైపోయాయని వాళ్లంతా బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. దేశంలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, నీళ్లు, రవాణా ప్రతిఒక్కటీ ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. కేంద్రం నిర్ణయాలతో నిరుద్యోగ యువతతో పాటు రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు’ అని ములాయం పేర్కొన్నారు. మూకహత్యలపై మోదీ మౌనం: ఎన్సీపీ దేశంలో మైనారిటీలు, దళితుల్ని అల్లరిమూకలు కొట్టిచంపడంపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ విమర్శించారు. ‘దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అమాయకుల్ని అల్లరిమూకలు కొట్టిచంపుతుంటే ప్రధాని మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది’ అని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను వింటున్న సోనియా గాంధీ -
మూడు పార్టీలు : ఎన్ని‘కల’ అవిశ్వాసం..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో శుక్రవారం లోక్ సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో చర్చను రక్తి కట్టించారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై జరిగిన మొత్తం చర్చను లోతుగా విశ్లేషిస్తే... అంతిమంగా సాధించిందేమిటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడా సమాధానం దొరకదు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాజకీయ కోణంలో తమదైన డ్రామాను కొనసాగించాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకూ(ఆఖరి పది నిమిషాల్లో ఓటింగ్ జరిగింది) రోజంతా సాగిన ఈ తతంగం వల్ల సాధించిందేంటో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దని అన్నారని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని లోక్సభలో పేర్కొనడంతో టీడీపీ ఇరకాటంలో పడింది. అవిశ్వాస తీర్మానం చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బీజేపీ సర్కారును విమర్శించారు. దానికి ప్రతిగా ప్రభుత్వం పక్షాన హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, చంద్రబాబు మాకు మిత్రుడేనని, ఇప్పటికీ, ఎప్పటికీ మిత్రుడే, విడిపోయే బంధం కాదన్నారు. ఆ మాటలకు టీడీపీ సభ్యులు ఖండించకపోగా మౌనం పాటించడం గమనార్హం, అలాగే, రాష్ట్రానికి ఏఏ రంగాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించారో హోం మంత్రి చెప్పినప్పుడు కూడా టీడీపీ సభ్యులు మౌనంగా వింటూపోయారు. ఇదిలావుండగా, చంద్రబాబు మా స్నేహితుడే అని రాజ్ నాధ్ చెప్పగా బీజేపీకే చెందిన ఎంపీలు రాకేష్ సింగ్, కంభంపాటి హరిబాబులు మాత్రం, టీడీపీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే చర్చలో టీడీపీ లేవనెత్తిన డిమాండ్లను ప్రస్తావిస్తూ మద్దతు పలికారు. టీడీపీని ఉద్దేశించి ఇటు కాంగ్రెస్ నేతలు, అటు రాజ్ నాధ్ సింగ్ మాట్లాడిన అంశాలపై సభలోనే ఉన్న ఆ పార్టీ సభ్యులు స్పందించకపోవడం గమనార్హం. చర్చను ప్రారంభించినప్పుడు టీడీపీ నేతలు బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించగా, సర్కారు తరఫున మంత్రి టీడీపీ మిత్రపక్షమనే చెప్పడం, పార్టీ తరఫున బీజేపీ ఎంపీలు మాత్రం టీడీపీపై ప్రతివిమర్శలు చేయడం, కాంగ్రెస్- టీడీపీలు కలిసిపోయాయంటూ ఎద్దేవా చేయడం వంటి మాటలతో ఆ మూడు పార్టీల నేతలు పరస్పరం ఒక పథకం ప్రకారం డ్రామాను నడిపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుమీదే చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాస చర్చ సందర్భంగా అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీ జోక్యం చేసుకుని రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామిక చర్యగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇరు పార్టీలు పరస్పరం భాగస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. నాలుగు సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని సాగాయి. మరికొన్ని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రెండు చోట్లా ప్రభుత్వాల నుంచి కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ వైదొలగింది. ఈరోజు లోక్సభలో టీడీపీ లేవనెత్తిన అంశాలన్నీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా అనేక రూపాల్లో చర్చ జరగడం, ప్రజాందోళనలు జరగడం, అసెంబ్లీలో చర్చకు రావడం, సమావేశాలు, నిరసన దీక్షలు ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా వంటి అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి. కీలకమైన ఆ అంశం జీవంతో ఉండటానికి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కారణమన్నది అందరూ అంగీకరించే విషయమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చిన అనేక హామీలు నెరవేరడం లేదని గడిచిన నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధికార టీడీపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. పైపెచ్చు బీజేపీ నిర్ణయాలను అభినందిస్తూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ఆమోదించారు. నాలుగేళ్ల పాటు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ అత్యంత సులభంగా సాధించాల్సిన అంశాలపై విషయాలను కూడా టీడీపీ పట్టించుకోలేదు. పైగా ప్రత్యేక హోదా అవసరమే లేదని చెప్పిన చంద్రబాబే మళ్లీ యూ టర్న్ తీసుకోవడం వంటి చర్యలతో ప్రజల్లో తీవ్ర విమర్శలపాలయ్యారు కూడా. నాలుగేళ్లుగా ప్రజలను మోసపుచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఎత్తుగడలతో ముందుకొచ్చినప్పటికీ అందులోనైనా చిత్తశుద్ధితో వ్యవహరించిందా అంటే అదీ లేదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పార్టీల మద్దతు కూడగడుతామన్న టీడీపీ తీరా సమయానికి చేతులెత్తేసింది. ఏ రాజకీయ పార్టీ కూడా టీడీపీ అవిశ్వాసానికి అనుగుణంగా కాకుండా ఎవరి ప్రాధాన్యతల మేరకు వారన్నట్టు తమ వైఖరులను మాత్రమే ప్రస్తావించారే తప్ప టీడీపీ ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతునివ్వలేకపోవడం ఆ పార్టీ వైఫల్యమే అవుతుంది. మరోవైపు నాలుగేళ్ల పాటు చెప్పిన మాటలకు, చేసిన పనులకు విరుద్ధంగా సభలో భిన్నంగా మాట్లాడి బొర్లా పడింది. పైపెచ్చు రాష్ట్రానికి అన్యాయం చేసిందని ప్రభుత్వం అవిశ్వాసం పెట్టిన టీడీపీ తీరా చర్చ సందర్భంగా ఆ విషయాన్ని మరిచి వ్యవహరించింది. పార్లమెంట్ సాధారణ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కోరినట్టుగా తాము లేవనెత్తిన అంశాలపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని మాత్రమే టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ లు కోరిందే తప్ప ఏ రకంగా ఆ డిమాండ్లను సాధించవచ్చో, ఏ విధంగా సాధిస్తామో చెప్పడంలో విఫలమయ్యారన్న మాట సొంత పార్టీ నుంచే వినిపించింది. మొత్తంమీద అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంత ఆర్భాటం చేసిందో చివరకు ఏమీ సాధించలేక అంతే స్థాయిలో చతికిలపడిందన్న విమర్శను మూటగట్టుకుంది. మాజీ మంత్రి ఎందుకు మౌనం వహించారు లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నోరు మూయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు ద్వారా చంద్రబాబు అనేక పనులు చేయించుకున్నారని, చర్చకు సమాధానం సందర్భంగా అవెక్కడ తెరమీదకు తెస్తారో అన్న అనుమానంతో ఆ మాజీ మంత్రిని మౌనంగా ఉండమని ఆదేశించినట్టు తెలిసింది. బాబు ఆదేశాలతో ఏం చేయలేక అశోకగజపతిరాజు చర్చ ఆసాంతం మౌనముద్ర దాల్చారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, కాకినాడ : లోక్సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై రేపు ఉదయం ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ప్రెస్మీట్ ఉంటుందని వైఎస్సార్సీపీ మీడియా సెల్ తెలిపింది. Keenly following the happenings at the Loksabha #NoConfidenceMotion. I will react on this episode at tomorrow’s 8:30am press conference. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2018 -
జయదేవ్ నోట జగన్ పలుకులు ..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్రం మోసపూరిత వైఖరిని మూడేళ్ల కిందట అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతూ చెప్పిన అంశాలనే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదని, ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాన్ని అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సూచించలేదని పేర్కొంటూ కమిషన్ సభ్యులు అభిజిత్ సేన్ లేఖ రాశారని, మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అసెంబ్లీలో జగన్ తేల్చిచెప్పారు. హోదాను మించి కేంద్రం ప్యాకేజ్ రూపంలో సాయంచేస్తుందని చెబుతూ ప్యాకేజ్ను సీఎం చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుపట్టారు. అయితే లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సరిగ్గా జగన్ ప్రస్తావించిన అంశాలనే గల్లా జయదేవ్ లోక్సభలో వల్లె వేశారు. -
‘ఎంపీ ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీని హరిబాబు ఉక్కిరిబిక్కిరి చేశారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని కంబంపాటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని తనదైన శైలిలో బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు, హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వినతులను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్ ప్లాంట్నుపై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్ ప్లాంట్పై కేంద్రం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. -
హరిబాబు ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
-
‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఎంత వాడి వేడి చర్చ జరిగిందో అంత కంటే ఎక్కువ సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అవి కూడా ఇంతవరకూ ఎన్నడూ ఏ లోక్సభ సమావేశంలో కనిపించని దృశ్యాలు. ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన పని లోక్సభ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదనుకుంటున్నారు జనాలు. అవిశ్వాస తీర్మానంపై చాలా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ గాంధీ చివరలో అనూహ్యంగా సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పక్కన ఉన్న వారిని చూస్తూ కన్నుగీటారు. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే నెటిజన్లు రాహుల్ చేసిన పనిని విమర్శిస్తుండగా తాజాగా వీరి కోవలోకి బాలీవుడ్ జనాలు కూడా వచ్చి చేరారు. రాహుల్ కౌగిలింత ఫలితంగా నేడు ‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’ జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు బాలీవుడ్ నటీనటులు. ‘క్వీన్’ నటుడు రాజ్కుమార్ రావ్ తన ట్విటర్లో ఓపెనింగ్ షాట్ సన్నివేశాన్ని అనుకరిస్తూ ‘ఈ రోజు కౌగిలింతల దినోత్సవం’ అంటూ ప్రకటించారు. రాజ్ కుమార్ ట్వీట్కు స్పందిస్తూ సోనమ్ కపూర్ రెండు హగ్ ఎమోషన్స్ను రీ ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్లను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. Today is official,”Hug day.” 🤗🤗 — Rajkummar Rao (@RajkummarRao) July 20, 2018 🤗 🤗 https://t.co/KLaVs8P8ma — Sonam K Ahuja (@sonamakapoor) July 20, 2018 బీజేపీ రాహుల్ చేసిన పనిని చిన్న పిల్లల చేష్టలా ఉందని విమర్శిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని మాత్రం రాహుల్కు మద్దతు తెలిపారు. విశాల్ దడ్లాని తన ట్విటర్లో ‘రాహుల్ చేసిన పనిని విమర్శించడం కాదు. ఆలింగనం కంటే ముందు అతని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేమంతా దాని కోసం ఎదురు చూస్తోన్నాం’ అంటూ బీజేపీపై మండి పడ్డారు. What's childish about a hug? It was sorta sweet, actually. BJP should accept it with grace & perhaps send some love back, instead of being negative and churlish. Also, it would be more becoming of the govt. to answer each point Rahul made pre-hug. That's what we want to hear. https://t.co/Bl2gM8osPI — VISHAL DADLANI (@VishalDadlani) July 20, 2018 -
ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు
-
పురాణాలతో సరిపెడుతున్న మోదీ సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై లోక్సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మోదీ సర్కార్ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. బీజేపీ తరహాలో తాము నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని వ్యాఖ్యానించారు. తాము ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే పాలక పక్షం పురాణాలు చెబుతూ కాలక్షేపం చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ భావజాలం అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరేకమని, బీజేపీ..మోదీ విభజించి, పాలించు సూత్రాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ఐదేళ్ల పాటు హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, సభలో మన్మోహన్ ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందని ఖర్గే ఆరోపించారు. -
ఎంతైనా లేట్ లేటే అవుతుందీ రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆద్యంతం ఆవేశంతోనే మాట్లాడారు. ఎక్కడా వేడి తగ్గకుండా రాఫెల్ విమానాల రాకెట్ దగ్గరి నుంచి దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై జరుగుతున్న దాడుల వరకు మోదీని నిలదీశారు. హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడడంలో అక్కడక్కడా మాటలు తడబడినా, తలకిందులైనా, సర్దుకొని ముందుకు సాగారు. చివరలో ‘నేనంటే మీకు ద్వేషం. మీ దృష్టిలో నేనొక పప్పూను. కానీ మీరంటే నాకు ద్వేషం లేదు. నేను కాంగ్రెస్ను, నేను అందరినీ ప్రేమిస్తాను’ అంటూ ప్రసంగాన్ని ముగించిన రాహుల్ సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆశ్చర్యచకితుడైన మోదీ, రాహుల్ గాంధీని వెనక్కి పిలిచి అభినందన పూర్వకంగా కరచాలనం చేశారు. ఈ సంఘటనతో అప్పటి వరకు వేడిగా ఉన్న సభా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు అయింది. రాత్రి సభా చర్చకు సమాధానం ఇవ్వనున్న నరేంద్ర మోదీ రాహుల్ విమర్శలను ఎలా తిప్పి కొడతారో చూడాలి! ఈ రోజున తనకు చిక్కిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని తానన్నట్లు విరుచుకుపడిన మోదీ, నిర్మలా సీతారామన్, ఇతర నాయకుల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడంలో మాత్రం చాలా తాత్సారం చేశారు. ‘నేను వరుసలో చివర నిల్చున్న వాడికి అండగా నిలబడతాను. సమాజంలో వెనకబడిన వాడికి, దోపిడీకి, దగాకు, అన్యాయానికి గురైన వాడి పక్కనుంటాను. వారి కులం, మతం, విశ్వాసాలతో నాకు సంబంధం లేదు. బాధ పడుతున్నవాడిని హత్తుకుంటాను, భయాన్ని, ద్వేషాన్ని పారద్రోలుతాను. ప్రాణం ఉన్న వాటన్నింటిని నేను ప్రేమిస్తాను. నేను కాంగ్రెస్ను’ అని ఈ నెల 17వ తేదీన రాహుల్ గాంధీ తనపై వచ్చిన విమర్శలకు బదులుగా ట్వీట్ చేశారు. ‘ది గుడ్ మేన్ ఈజ్ ది ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యాఖ్యాలను ఎవరో సలహాదారులు రాహుల్కు రాసినట్లున్నారు. ఎవరు రాసినా సరే రాహుల్ సకాలంలో స్పందించలేకపోయారు. రాహుల్ గాంధీ, ముస్లిం మేధావులతో ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు. ‘కాంగ్రెస్ ముస్లింల పార్టీ’ అన్నట్లు 12వ తేదీన ‘ఇంక్విలాబ్’ ఉర్దూ పత్రిక వార్తను ప్రచురించింది. దేశంలో జరిగే అల్లర్లకు ఇక నుంచి రాహుల్ గాంధీయే బాధ్యత వహించాలంటూ 13వ తేదీన సీతారామన్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ముస్లిం పురుషుల పక్షమా, ముస్లింల మహిళల పక్షమా? అంటూ 14వ తేదీ నుంచి వరుసగా మోదీ విమర్శిస్తూ వస్తున్నారు. 17వ తేదీన రాహుల్ తాపీగా స్పందించారు. ‘లేట్ బెటర్ ద్యాన్ నెవర్’ అనుకొని ఉండవచ్చేమో. కానీ రాజకీయాల్లో లేట్ చేస్తే ‘లేట్’గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. -
‘రాజ్నాథ్ వ్యాఖ్యలు.. బయటపడిన టీడీపీ డ్రామా’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ-బీజేపీల బంధం మరోసారి బట్టబయలైంది. ఇన్ని రోజులు విడిపోయినట్లు సంకేతాలు ఇచ్చి.. లోపల మాత్రం బలమైన బంధాలు అలానే ఉన్నాయనే విషయం అర్థమౌతుంది. పార్లమెంట్ సమావేశంలో శుక్రవారం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. లోక్సభలో రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం డ్రామా బయటపడింది. దీనిపై హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంతేకాక రాజ్నాథ్ స్టేట్మెంట్పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు రాజ్నాథ్ చేసిన స్టేట్మెంట్ను వింటూ కుర్చున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ బంధంపై మేం చెప్పిందే నిజమైందని వైఎస్సార్సీపీ నేత అన్నారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిధులపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏతో తెగదెంపులు.. టీడీపీ ఆడిన డ్రామా అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. -
నోరు మెదపని టీడీపీ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. నిధులిచ్చామని రాజ్నాథ్ చెబుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని రాజ్నాథ్ గుర్తుచేశారు. చరిత్రలో కర్ణాటక అనుభవ్ మండపం, తంజావూరు చోళుల వ్యవస్థ నుంచి కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, ప్రజాస్వామ్య పునాదులు భారత్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘దేశంలో నాలుగేళ్లుగా ఉగ్రదాడులు జరగకుండా అణచివేశాం. చరిత్రలో అతిపెద్ద మూక దాడులు 1984లో జరిగాయి. కొందరు నేతలు హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో పార్లమెంట్పై దాడి జరిగినప్పుడు తాలిబన్ గుర్తుకురాలేదా..? కౌరవులను చంపిన పాండవులే వారి కర్మకాండలు నిర్వహించారు. అంతటి గొప్ప సంప్రదాయం ఉన్న దేశ మనది. పాకిస్తాన్ ఒక దేశం కాదు.. ఒక దరిద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నిజాయితీ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. నిరుపేద తల్లిగర్భం నుంచి పుట్టిన మోదీలాంటి వ్యక్తే రైతుల నిజమైన బాధను అర్థం చేసుకోగలరని’రాజ్నాథ్ అన్నారు. డైలమాలో కాంగ్రెస్!! మరోవైపు అవిశ్వాసంలో ఓటు వేయాలా.. వద్దా.. అనే దానిపై కాంగ్రెస్ సందిగ్దంలో పడిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసానికి ఓటేయడంపై కాంగ్రెస్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదంటుండగా.. మరికొందరు ఓటింగ్కు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
ప్రియా ప్రకాష్తో పోటీపడిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆయనపై నిప్పులు కురిపించారు. ఆవేశంలో కొన్నిసార్లు తడబడ్డారు కూడా. అప్పుడు మోదీ చిద్విలాసంగా నవ్వుతూ కనిపించారు. తడబాటును సర్దుకుంటూ చివరికంటా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ చివరలో తనకు ఎవరి పట్ల విద్వేషం లేదని, అందరిని ప్రేమిస్తానని చెప్పి సరాసరి మోదీ వద్దకు వెళ్లారు. ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తన సీటులోకి వచ్చి కూర్చున్నారు. ఎలా ఉంది నా ప్రసంగం ? అన్నట్లు పక్కన ఎవరినో చూస్తూ కన్నుగీటారు. ఈ సన్నివేశం సభలో వేడిని తగ్గించి నవ్వులను పూయించగా ట్విట్టేరియన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు.. కొద్దిరోజుల క్రితం అందరిని అలరించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటుతో రాహుల్ కన్నుగీటును కలిపి పోస్ట్ చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది. లోక్సభలో రాహుల్ గాంధీ కన్నుగీటిన వార్త విని ప్రియా ప్రకాష్ వారియర్ హర్షం వ్యక్తం చేశారు. తనకెంతో పేరు తెచ్చిన విన్యాసాన్ని రాహుల్ ప్రదర్శించడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు. జాదు కీ జప్పీ కాపీ కొట్టారా? ఆప్యాయంగా కౌగిలింకుంటే విద్వేషాలు తగ్గుతాయని, శాంతమూర్తులుగా మారతారని మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని భావనను రాహుల్ గాంధీ కాపీ కొట్టారని కొంత మంది వ్యాఖ్యానించారు. మోదీని ఎలుగుబంటి కౌగిలి ఇచ్చిన రాహుల్ గాంధీ ట్విటర్ ట్రెండింగ్లో నిలిచారు. కాగా, మోదీ అనుమతి లేకుండా బలవంతంగా వాటేసుకున్న రాహుల్పై కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. ఇందుకే రాహుల్ను ‘పప్పు’ అంటున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘పప్పు’ హ్యాష్టాగ్ కూడా ట్విటర్ ట్రెండింగ్ కావడం కొసమెరుపు. -
చంద్రబాబు ఎప్పటికీ మాకు మిత్రుడే : రాజ్నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్, కశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు. టీడీపీతో తమ బంధాన్ని రాజ్నాథ్ చెప్పకనే చెప్పారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. ఇప్పటికీ చంద్రబాబుతో మాకు మితృత్వం ఉందని, భవిష్యత్తులో కూడా తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 1,050 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇప్పటివరకూ రెవెన్యూ లోటు కింద 15,959 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మేం ఎప్పుడు అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని చెపన్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచారని రాజ్నాథ్ కొనియాడారు. పెద్ద నోట్లరద్దు వల్ల నష్టం జరిగిందని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. తాత్కాలికంగా ఇబ్బందిపడ్డా దేశ ప్రజలు నోట్లరద్దుకు మద్దతు పలికారని తెలిపారు. యూపీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. అవిశ్వాసం పెట్టిన పార్టీల మధ్యే సఖ్యత లేదని, నేతృత్వం అనే అంశం చర్చకు వస్తే ఏ పార్టీ ఉండదని ఎద్దేవా చేశారు. ఆర్థిక వృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించామని రాజ్నాథ్ అన్నారు. -
‘టీడీపీ తూట్లు పొడిచి.. వ్యర్ధమైన ప్రసంగాలు’
సాక్షి, హైదరాబాద్ : ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. అవిశ్వాసంపై టీడీపీ వాదన బలహీనంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సరైన రీతిలో ప్రస్తావించిలేకపోయారని పవన్ అన్నారు. ‘పార్టీకోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ రాజీ పడిందన్నారు. ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు. ఏపీ ప్రజల మనసును గెలిచే సువర్ణావకాశాన్ని తెలుగుదేశం పార్టీ చేజార్చుకుంది. గతంలో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రత్యేక హోదాను టీడీపీనే గతంలో వ్యతిరేకించింది. ఏపీ ప్రజలు టీడీపీ నాయకులకు ఎలా కనిపిస్తున్నారు. వ్యక్తిగత లాభాల కోసం ‘స్పెషల్ క్యాటగిరి స్టేటస్’కి మూడున్నర సంవత్సరాలుగా తూట్లు పొడిచి ఈ రోజు వ్యర్ధమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏమిటి? దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం వంచన తెలియాటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా ? ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి, ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా.. కేంద్రం చేత మోసగింపపడ్డాం.. అంటే ప్రజలు నమ్ముతారు.. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు? ’ అని పవన్ కల్యాణ్ తన ట్వీటర్ అకౌంట్లో పేర్కొన్నారు. -
రాహుల్ ప్రవర్తనను తప్పుపట్టిన స్పీకర్
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం రాహుల్ గాంధీ సభలో ప్రవర్తించిన తీరును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు. ప్రధానితో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదన్నారు. ప్రధాని స్థానంలో ఎవరున్నా ఆ పదవిని గౌరవించడం ముఖ్యమని, ఇది సభ్యులందరికీ వర్తిస్తుందన్నారు. అధికార, విపక్ష సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఎంతో భవిష్యత్ ఉన్న నేతని, ఆయన తన కొడుకు లాంటి వాడంటూ రాహుల్ తప్పుల్ని ఎత్తిచూపడం తన బాధ్యతని స్పీకర్ అన్నారు. కాగా, విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు స్పీకర్ చురకలు వేశారు. సభలోలేని కొత్త సంప్రదాయాలను సభ్యులకు నేర్పిస్తున్నారని ఆయనపై మండిపడ్డారు. -
మోదీకి కౌగిలింత; రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన నిరాధార ఆరోపణలు, ప్రసంగం అనంతరం ప్రధానిని కౌగిలించుకోవడంపై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. అవిశ్వాసంపై చర్చలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యువత ప్రధానిని ఉపాధి అడిగితే పకోడీ చేసుకోమన్నారంటూ విమర్శించారు. దేశంలో నేడు నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. రాఫెల్ డీల్పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.బక్కచిక్కిన రైతులను విస్మరించి బడా బాబులకు మోదీ సర్కార్ రుణ మాఫీ చేస్తోందని దుయ్యబట్టారు. కొద్దిమంది కుబేరులకే ప్రధాని సన్నిహితంగా ఉంటారని, వారి ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. మోదీ మాయమాటలతో ప్రజలను తీవ్రంగా వంచించారని ఆరోపించారు. -
‘వాళ్ల హనీమూన్ సమయంలో మాకు అన్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, తమ రాష్ట్రానికి సంబంధించిన తొలి ఆర్డినెన్స్నే రాజ్యాంగ విరుద్ధంగా జారీ చేశారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హనీమూన్లో ఉన్న సమయంలో తెలంగాణను అన్యాయం చేశారని’ ఆయన వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నటికీ క్షమించరు. సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ నుంచి బలవంతంగా లాక్కున్నారు. ప్రాజెక్ట్లకు ఆర్థిక పరమైన వనరులు ఏర్పాటు చేయడంలో యూపీఏ విఫలమైందన్నారు. విద్యుత్ సరఫరాలో ఏపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. పోలవరం విషయంలో మేం అడుగుతున్నది కేవలం నీటి పంపకం గురించి మాత్రమే. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాన గిరిజన యూనివర్సిటీ అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదు. కోర్టుల్లో కేసుల ద్వారా ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటోంది. తెలంగాణ ప్రాజెక్ట్లను పోలవరం తరహాలోనే జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాం. తెలంగాణకు 19వేల కోట్ల నిధులను ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. ఏపీలో సచివాలయం, అసెంబ్లీ కట్టినా.. హైకోర్టు విభజనకు ఎందుకు ముందుకు రావడం లేదని’ ఎంపీ వినోద్ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాను లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్ చేశారు. -
రాహుల్ హిందీ ప్రావీణ్యం; ఒక్కసారిగా నవ్వులు
సాక్షి, న్యూఢిల్లీ : ఒక పదం తారుమారైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ రోజు రాహుల్ గాంధీ ప్రసంగం విన్న వారికి అర్ధమవుతుంది. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు మోదీకే కాక సభలోని వారందరికి నవ్వు తెప్పించాయి. తన ప్రసంగంలో భాగంగా రాహుల్ గాంధీ, మోదీని ఉద్దేశిస్తూ ‘ప్రధాని నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారు’ అనే మాటాలను కాస్తా ‘ప్రధాన మంత్రి ఆప్ని ఆంక్ మేరి ఆంక్ మెయినే నహి దాల్ సక్తే’ (ప్రధానమంత్రి తన కళ్లను నా కళ్లలోకి పెట్టడం లేదు) అంటూ వ్యాఖ్యానించాడు. ఇక్కడ రాహుల్ ఉద్దేశం ‘ప్రధానమంత్రి నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని’. ఒక్క పదం తప్పుగా వాడటంతో పూర్తి అర్ధమే మారిపోయింది. అంతేకాక రాహుల్ ప్రసంగిస్తున్నంతసేపు మోదీ చిరునవ్వుతోనే కనిపించారు. అందుకు రాహుల్ ‘మోదీజీ మీరు పైకి నవ్వుతున్నా లోపల ఆందోళన పడుతున్నారు. ఆ విషయం నాకు అర్ధమవుతుంది’ అని అన్నారు. -
‘విశ్వాసం–అవిశ్వాసం’ విశేషాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల లోక్సభకు విశ్వాసం ఉందా, లేదా తెలుసుకోవడానికి రాజ్యాంగ నిబంధనల ప్రకారం విశ్వాసం లేదా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడతారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షం ప్రవేశపెడితే, విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. రెండు తీర్మానాల సందర్భంగా కూడా ప్రభుత్వ సాఫల్య, వైఫల్యాలపై చర్చకు (కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మినహాయిస్తే) అవకాశం లభిస్తుంది. ఈ రెండు తీర్మానాలపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వం ఓడిపోతే ప్రధాన మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన మంత్రే లోక్సభ రద్దుకు సిఫార్సు చేయవచ్చు. సాధారణంగా విశ్వాస తీర్మానంలో ఓడిపోతామని భావించిన సందర్భాల్లోనే ఓటింగ్కు కంటే ముందే ప్రధాని లోక్సభ రద్దుకు సిఫార్సు చేస్తారు. 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు కేంద్ర ప్రభుత్వాలపై గతంలో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 25 సార్లు అవి వీగిపోయాయి. ఒక్కసారి మాత్రం తీర్మానంపై ఓటింగ్కు అవకాశం ఇవ్వకుండా అప్పటి ప్రధాన మంత్రి మురార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దేశంలో మొట్టమొదటి సారిగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాసం వచ్చింది. భారత్–చైనా యుద్ధానంతరం 1963లో ఆయన ప్రభుత్వంపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి ప్రజా సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జేబీ కృపలాని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 285 ఓట్ల మార్జిన్తో నెహ్రూ సభా విశ్వాసాన్ని పొందారు. రాజీÐŒ గాంధీ, అటల్ బిహారీ వాజపేయి చెరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనగా, లాల్ బహదూర్ శాస్త్రీ, పీవీ నర్సింహారావులు మూడేసి సార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ మొత్తం 15 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మురార్జీ దేశాయ్కి కూడా రెండు సార్లు అవిశ్వాస తీర్మానం ఎదురుకాగా, ఒకసారి ఓటింగ్కన్నా ముందే (1979, జూలై 12) తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. చివరి సారి 2003లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకొన్నది అటల్ బిహారి వాజపేయికాగా, 15 ఏళ్ల అనంతరం ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకే అవిశ్వాసం ఎదురయింది. విశ్వాస తీర్మానాల్లో.. దేశంలో ఇప్పటి వరకు విశ్వాస తీర్మానాల సందర్భంగా ఐదుగురు ప్రధాన మంత్రులు రాజీనామా చేయగా, ఏడుసార్లు మాత్రం ప్రధాన మంత్రులు సభా విశ్వాసాన్ని నిరూపించుకో గలిగారు. రెండు సార్లు ప్రధాన మంత్రులు విశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్ జరగక ముందే పదవులకు రాజీనామా చేశారు. 1979లో చరణ్ సింగ్ రాజీనామా చేయగా, 1996లో వాజపేయి రాజీనామా చేశారు. 1979, ఆగస్టు 20వ తేదీన తీర్మానం చర్చకు రావల్సి ఉండగా ముందే చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1996, మే 27,28 తేదీల్లో వాజపేయి విశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అయినప్పటికీ ఓటింగ్ ఎదుర్కోకుండానే ఆయన రాజీనామా చేశారు. 1989లో వీపీ సింగ్, 1990లో చంద్రశేఖర్, 1993లో పీవీ నర్సింహారావు, 1996లో హెచ్డీ దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 1998లో వాజపేయి, 2008లో మన్మోహన్ సింగ్లు సభా విశ్వాసాన్ని పొందారు. వీరిలో ముగ్గురు ఆ తర్వాత జరిగిన విశ్వాస పరీక్షల్లో వీగిపోయి వారి పదవులకు రాజీనామా చేశారు. 1990లో వీపీ సింగ్, 1997లో దేవెగౌడ, 1999లో వాజపేయిలు అలా రాజీనామా చేశారు. చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ సభా విశ్వాసాన్ని పొంది తమ పదవులకు రాజీనామా చేయడం విశేషం. వారి స్థానాల్లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్లు ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. -
లోక్సభలో అనూహ్య ఘటన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లోక్సభలో శుక్రవారం ఊహించని దృశ్యం కంటపడింది. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోదీ సర్కారు తీరును తీవ్రంగా తూర్పాబట్టారు. తనపై రాహుల్ విమర్శలు చేస్తున్నా మోదీ మాత్రం నవ్వుతూ కనిపించారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్థానం వద్దకు చేరుకున్నారు రాహుల్. ఆయనేం చేస్తారని సభలో ఉన్నవారితో పాటు లోక్సభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నవారంతా అనుకుంటుండగా.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. రాహుల్తో మొదట కరచాలనం చేసేందుకు మోదీ సిద్దపడగా ఆయన నిరాకరించారు. తర్వాత రాహుల్ గాంధీ హఠాత్తుగా మోదీని అమాంతం వాటేసుకున్నారు. మోదీతో పాటు ఈ దృశ్యాన్ని చూసినవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడి నుంచి తన స్థానానికి తిరిగి వెళుతున్న రాహుల్ను మరోసారి పిలిచి మోదీ కరచాలనం చేశారు. బాగా మాట్లాడారంటూ మెచ్చుకున్నారు. దీంతో సభలో వాతావరణం తేలికపడింది. రాహుల్ చిలిపి పని తన స్థానంలోకి వెళ్లి కూర్చోగానే రాహుల్ గాంధీ మరో చిలిపి పని చేశారు. మోదీని కౌగిలించుకున్న తర్వాత తన సీటులో కూర్చొన్న ఆయన చిరునవ్వులు చిందిస్తూ తమ పార్టీ సభ్యులను చూసి సరదాగా కన్నుగీటారు. మోదీని వాటేసుకుని ఆయనకు షాక్ ఇచ్చానన్న భావం రాహుల్ ముఖంలో కనపడింది. రాహుల్కు ప్రధాని మోదీకి ఏవిధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి. -
బీజేపీ-కాంగ్రెస్లతో టీడీపీ అ'విశ్వాస' డ్రామా
సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అ'విశ్వాస' బంధం కొనసాగింది. నన్ను ఏం చేయొద్దు.. నేను ఏమీ చేయను అన్న చందంగా కాంగ్రెస్-బీజేపీలతో టీడీపీ బంధం ప్రతిబింబించింది. శుక్రవారం రోజున అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేశినేని నాని బదులుగా గల్లా జయదేవ్ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని చెప్పారు. అయితే రాష్ట్రానికి నిధులు, పరిశ్రమల కోసం రాయితీలు ఇవ్వడంలో దారణంగా విఫలైమందని చెప్పిన గల్లా ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పకపోవడం విశేషం. ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి వేళ స్వాగతించిన తెలుగుదేశం.. హోదా కంటే ప్యాకేజీనే మేలంటూ అరుణ్ జైట్లీకి చేసిన సన్మాన కార్యక్రమం గురించి ప్రస్తావించలేదు. పైగా కేంద్రం నుంచి అందరికంటే ఎక్కువగా సాధించామని, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ఈ విషయంపై కూడా గల్లా నోరు మెదపలేదు. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారని చెప్పిన గల్లా, విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం పూర్తి చేస్తామన్న పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పలేదు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా టీడీపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఏనాడు బీజేపీని ప్రశ్నించలేదు. పైగా అన్నీ సాధించామంటూ జబ్బలు చరుచుకున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు ఉన్న బాబు నాలుగేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం జరిగిదంటూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీపై గల్లా విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ను మాత్రం తెలుగుదేశం పల్లెత్తు మాట అనలేదు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇస్తూ చంద్రబాబు ఇచ్చిన లేఖ విషయాన్ని ప్రస్తావించలేదు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని విన్నానని చెప్పారు. గల్లా ప్రసంగంలో ఆవేదన కనిపించిందంటూ గల్లను వెనుకేసుకొచ్చారు. పైగా 21వ శతాబ్ధంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం అంటూ మొసలి కన్నీరు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ అంతా చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఆర్థిక లోటుతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసి.. ఇప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా పార్లమెంట్లో తెలుగుదేశం వ్యాఖ్యలకు మద్దతుగా రెండు ముక్కలు ప్రసంగించారు. విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని చట్టంలో పొందు పరచకుండా ఏపీ ప్రజల గొంతు కోశారు. ఆనాడు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్లపై సానుకూలతలు పరిశీలించాలంటూ తీర్మానాలు చేసి చేతులు దులుపుకున్నారు. పైగా వచ్చే ప్రభుత్వం వాటిని అమలు చేయాలంటూ ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలను తీర్మానాల పాలు చేశారు. ఏపీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం నేడు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కార్చింది. అనుకున్న ప్రకారం టీడీపీ, కాంగ్రెస్లు భాయ్ భాయ్ అనుకుంటూ కొత్త డ్రామాకు తెరదీశాయి. ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఏమీ అనకపోవడం గమనార్హం. పార్లమెంట్ సాక్షిగా మూడు పార్టీలు ఇలా మరోసారి తెలుగు ప్రజలను వంచన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
‘ఉపాధి అడిగితే పకోడి చేసుకోమన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీని ఉపాధి అడిగితే పకోడి చేసుకోమన్నారంటూ రాహుల్ విమర్శించారు. పార్లమెంట్లో ప్రధాని హామీలకు విలువ ఉండాలన్న రాహుల్.. నేడు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. లోక్సభలో కాంగ్రెస్ తరపున ప్రసంగించిన రాహుల్.. మోదీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ‘భారతీయ యువత ప్రధాని మోదీపై నమ్మకం పెట్టుకుంది. అదే క్రమంలో ఉపాధి అడిగితే పకోడి చేసుకోమని మోదీ సలహా ఇచ్చారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. మేము జీఎస్టీని తెస్తామని అప్పుడే చెప్పాం. కానీ మోదీ వ్యతిరేకించారు. చిన్న తరగతి, మధ్య తరగతి ప్రజలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కార్పోరేట్లు, బడా వ్యక్తులకే మోదీ ప్రధాన్యత ఇస్తున్నారు. దేశానికి సేవకునిగా ఉంటానని మోదీ అన్నారు. ప్రధాని మోదీ గారడీ మాటలతో ప్రజలు మోసపోయారు. పది మంది కుబేరులు కోసం మాత్రమే మోదీ పనిచేస్తారు. పెద్ద పెద్ద వ్యాపారులను మాత్రమే మోదీ కలుస్తారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయి. రఫెల్ ఒప్పందం పత్రాలపై మోదీ జవాబివ్వాలి. రఫెల్ ఒప్పందంపై రక్షణమంత్రి అబద్ధాలు ఆడుతున్నారు’ అని రాహుల్ విమర్శించారు. రాహుల్ ఇంకా ఏమన్నారంటే... *మోదీ మనసులో పేదవాడికి చోటు ఉండదు *అమిత్ షా కుమారుడు ఆస్తుల విలువను 3 నెలల్లో 16వేల రెట్లు పెంచుకుంటే మోదీ నోటి నుంచి ఒక్క మాటరాదు *ప్రధాని ఒత్తిడితోనే మంత్రి నిర్మలా సీతారామన్ రఫెల్ యుద్ధ విమానాల ధరల వివరాలను బహిర్గతం చేయడం లేదు *రఫెల్ ఒప్పందంపై వాస్తవాలను ప్రజల ముందు బయటపెట్టాలి *మోదీ సన్నిహితులకు లబ్ధి చేకూరేలా రఫెల్ కాంట్రాక్టులు ఇచ్చారు *ఒక్క రఫెల్ యుద్ధ విమనాల కాంట్రాక్ట్లోనే రూ. 45 వేల కోట్ల అవినీతి జరిగింది *ప్రధాని నవ్వుతూ కనిపిస్తున్నా లోపల అసహనం ఉంది *ప్రధాని సూటిగా నా కళ్లలోకి చూడలేకపోతున్నారు *కాపలాదారుడు.. భాగస్వామి అని దేశం అర్థం చేసుకుంది *చైనా అధ్యక్షుడితో గుజరాత్లో ఊయలు ఊగితుంటే.. వేల మంది చైనా సైనికులు భారత్లో చొరబడ్డారు *మన సైనికులు ధైర్యంగా చైనా సైనికుల్ని ఎదిరించారు *కోటీశ్వరులకి రుణ మాఫీలు చేస్తున్నారు *రైతుల రుణాలను మాఫీ చేయమంటున్నారు *మోదీ హయాంలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది *మహిళలపై గ్యాంగ్ రేప్లు పెరిగిపోయాయి *దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి *దాడులపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరు *దాడులు చేసిన వారిని కేంద్ర మంత్రి అభినందిస్తారు * మోదీ- అమిత్ షా వ్యవహార శైలితో దేశానికి తీవ్ర నష్టం -
అవిశ్వాసంపై చర్చ: గల్లా ప్రసంగం సాగిందిలా...
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన.. గతంలో కాంగ్రెస్పై చేసిన విమర్శలే ఇప్పుడు బీజేపీపైనా చేయటం విశేషం. ముందుగా భరత్ అనే నేను చిత్ర కథతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించిన.. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్లారు. ‘ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన ఏపీకి తీవ్రమైన లోటు. మోదీ పాలనతో ఏపీ ఇబ్బందులకు గురయ్యింది. లక్షా 3 వేల కోట్ల రుణ భారం ఏపీపై పడింది. మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారు. విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది. ఆంధ్రపదేశ్కు రాజధాని, మౌలిక సదుపాయాలు లేవు’ అని వ్యాఖ్యానించారు. అయితే గల్లాజయ్ దేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. వెంటనే మేడమ్ స్పీకర్ జోక్యం చేసుకోవటంతో ప్రసంగం కొనసాగింది. ... ‘ఎన్నికలకు ముందు మోదీ ఏపీకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండు ముక్కలు చేసిందని మోదీ అన్నారు. నాలుగేళ్లుగా మోదీ ఏదో చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని మోదీ అన్నారు. హోదా ఇస్తానని ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ముడిపెడుతున్నారు. మోదీ మోసం చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నెల్లూరు, విశాఖ, తిరుపతి సభల్లో మోదీ ఇచ్చిన హామీలకు విలువ లేదా?.. ‘ఆర్థిక సంఘం సాకు చూపి ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడం సరికాదు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదు. ఇది దేశాన్ని, ప్రజలను పక్కదారి పట్టించడమేనని భావిస్తున్నాం. ఏపీకి హోదా ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నారు. సభలో ఒక మాట.. బయట ఒక మాట్లాడటం సరికాదు’. మార్చి 15, 2018న హోదా గురించి రాజ్యసభలో మంత్రి అభిజిత్ మాట్లాడారు కూడా. హోదా ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పిన బీజేపీ మొండిచేయి చూపించింది. హోదా కావాలని మేము అడిగితే.. దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు’..‘పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు.. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామన్నారు.. అది నామమాత్రమే. ఏపీ సంబంధించిన విషయాలు ప్రధాని కార్యాలయంలో ఆగిపోయాయి.’ మోదీపై సంచలన వ్యాఖ్యలు... ‘ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీకి నిధులిస్తామన్న కేంద్రం హామీ ఏమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఎన్నో నిధులు రావాలి. ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని మోదీ చెప్పారు. రూ. 1500 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది??.ఇప్పుడు నిధులు లేమితో ఇబ్బందులు వస్తున్నాయి... అయితే మరోసారి టీఆర్ఎంపీలు ప్రసంగానికి అడ్డుపడ్డారు. మళ్లీ స్పీకర్ వారించటంతో ఆయన ప్రసంగం తిరిగి కొనసాగింది. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. -
అవిశ్వాసం: టీడీపీ Vs టీఆర్ఎస్
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ కేశినేని నానికి బదులుగా ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా సభలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. గల్లా జయదేవ్ ప్రసంగంపై టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని అప్రజాస్వామికంగా విభజించారని, తెలంగాణ కొత్త రాష్ట్రం కాదని, ఏపీ మాత్రమే కొత్త రాష్ట్రమని, విభనతో తెలుగు తల్లిని రెండుగా చీల్చారని ఆయన వ్యాఖ్యానించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు గల్లా జయదేవ్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, వ్యక్తిగత ఎజెండాతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సమయం ఇచ్చినప్పుడు మీ వాదన వినిపించండి అని స్పీకర్ సుమిత్ర మహాజన్ సూచించడంతో వెనక్కు తగ్గారు. జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం మరోసారి గల్లా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. -
చర్చ ప్రారంభం.. బీజేడీ ఔట్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఎక్కుపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. భరత్ అనే నేను సినిమాను ప్రస్తావిస్తూ.. అవిశ్వాసం తీర్మాన చర్చను టీడీపీ తరుఫున కేశినేని నానికి బదులు గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఇది ఓ ధర్మ యుద్ధమని, పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజని అభివర్ణించారు. ఇది మెజారిటీకి, మొరాలిటీకి జరిగే యుద్ధమని గల్లా జయదేవ్ అన్నారు. అయితే లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది. విపక్షాలకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం సరిపోదంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న వేళ, బీజేడీ పక్ష నేత తనకు మైక్ కావాలని తీసుకున్నారు. తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని, అవిశ్వాసంతో ఒడిశాకు ఒరిగేదే ఏమీ లేదన్నారు. ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. వీరెవరూ అవిశ్వాసంపై జరిగే ఓటింగ్లో పాల్గొనరని తెలిసింది. మరోవైపు అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ కేటాయించిన సమయం సరిపోదని, మరికొంత సమయం కావాలని విపక్షాలు కోరుతున్నాయి. అయితే లంచ్ సమయంలో కూడా చర్చను కొనసాగిస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొనకుండా ముందే సభ నుంచి వెళ్లిపోయిన బీజేడీపై కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్ అయింది. బీజేపీకి కొమ్ము కాస్తూ సభ నుంచి వెళ్లిపోతారా? అంటూ వ్యాఖ్యానించింది. -
126 : 325 : వీగిన అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ సాగింది. సుదీర్ఘ చర్చ, సమాధానం అనంతరం రాత్రి 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వీస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభను సోమవారానికి వాయిదా వేశారు. విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సమాధానంలో పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చకు నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా మోదీ సమాధానమిచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ఆయన మరోవైపు విపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రసంగం కొనసాగించారు. ప్రధాని ప్రసంగం తర్వాత రైట్ టు రిప్లీ కింద టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆటోమేటిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. వాయిస్ ఓటును పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో బటన్స్ నొక్కడం ద్వారా తెలియజేసే విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత లోక్సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 సభ్యులు మద్దతు పలకగా, 325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అందరికి బీమా, రైతుల్లో భరోసా నింపడానికి కిసాన్ భరోసా వంటి పథకాలను వివరిస్తూ త్వరలోనే ఆయుష్మాన్ భారత్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు చర్చలో పాల్గొన్న సభ్యులు లేవనెత్తిన పలు అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి సమాధానం ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు కొత్త డ్రామా మొదలు పెట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగ సమయంలో చంద్రబాబు తమకు మిత్రుడని అన్నప్పుడు కిమ్మనకుండా ఉండిపోయిన టీడీపీ ఎంపీలు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు డైరెక్షన్లో మరో డ్రామాకు తెరలేపారు. ప్రధాని మోదీ ప్రసంగం చేస్తుండగా పోడియం వద్ద కొద్దిసేపు నిరసన నినాదాలు చేశారు. మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తూ టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను బయటపెట్టారు. ప్యాకేజీ ఒప్పుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని టీడీపీ అంగీకరించిన తర్వాతే ప్యాకేజీ ప్రకటించినట్టు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు సమాధానంగా మాట్లాడుతూ, ఆయన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అంశాలను ప్రస్తావించారు. ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత ప్రకటించామని, ఇప్పుడు టీడీపీయే యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఉచ్చులో పడొద్దని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో కొద్ది రోజుల కిందట తాను చంద్రబాబుతోమాట్లాడినట్టు చెప్పారు. మోదీ తన సుదీర్ఘప్రసంగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరించారు. 14 వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసినప్పుడు టీడీపీ దాన్ని స్వాగతించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని చంద్రబాబు అంగీకరించిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించినట్టు వెల్లడించడంతో టీడీపీ ఎంపీలు ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలో అర్థంకాక న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులను అందరూ సమర్థించారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని, విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ తీర్మానం ద్వారా అందరి నిజస్వరూపాలు బయటపడ్డాయన్నారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారన్న ప్రశ్న అందరినీ తొలుస్తోందన్నారు. నావికుడు లేని పడవలా ప్రతిపక్షాల పయనం సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు దేశంలోని ఏ వ్యవస్థపైనా నమ్మం లేదని, ఆఖరికి ఈవీఎం, రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కూడా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అవినీతిపై బాణం ఎక్కువ పెట్టిన వెంటనే వారికి ఇబ్బంది మొదలైందని ధ్వజమెత్తారు. 2024లో కూడా వారికి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. రాఫెల్ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారు..సర్జికల్ స్ట్రైక్స్ కూడా రాజకీయం చేశారు.. చైనా రాయబారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కలవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్ను ఆదాచేసేందుకు దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశాం..ఇంకా చేస్తున్నామని వివరించారు. అంతకుముందు జరిగిన చర్చలో అన్ని పార్టీల నేతలు ప్రసంగించారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని కేంద్రాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు. మూక దాడులు ఇప్పటివి కావని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్గా చెప్పుకుంటోందన్న రాజ్నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. అంతకు ముందు రాజ్నాథ్ మాట్లాడుతూ.. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చర్చ కొనసాగుతోంది. లోక్ సభలో రాహుల్ ప్రవర్తించిన తీరును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు. మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ తన విమర్శనాస్త్రాలను కొనసాగించారు. తన ప్రసంగం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకెళ్లి ఆయనతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. నేటి ఉదయం తీర్మానంపై మొదట చర్చను టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించగా.. అనంతరం బీజేపీ తరపున జబల్పూర్ ఎంపీ రాకేష్ సింగ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపి శాపగ్రస్థమైందన్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చను కొనసాగిస్తూ, బీజేపీ, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చర్చలు ఎందుకు జరపరు? కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని ఆయన ప్రశ్నించారు. హిందు, ముస్లిం గొడవలతో మనల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నామన్నారు. ‘నేను భారతీయుడిని. ఇదే గడ్డపై పుట్టా. ఇక్కడే చనిపోతా’ అని చెప్పారు. కశ్మీర్పై కేంద్రం వైఖరి ఏంటి? ముస్లింలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కశ్మీర్పై కేంద్రం వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. మూక దాడులు ఇప్పటివి కావని చెప్పారు. కశ్మీర్లో తీవ్రవాదులే కాదు సైనికులు చనిపోతున్నారని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసిన హరిబాబు.. ‘కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ తన జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకండా పోరాడారు. కానీ నిస్సిగ్గుగా నేడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’అని చెప్పిన బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అవిశ్వాసంపై టీడీపీని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండేది కాదు... కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్గా చెప్పుకుంటోందన్న రాజ్నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. ప్రజల సమస్యల గురించి అడిగితే పురాణాలు చెప్పారని ఎద్దేవా చేశారు. బీజేపీ భావజాలం అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరకమన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ విభజించి పాలించు సూత్రాలను పాటిస్తున్నారని మండిపడ్డారు. నోరు మెదపని టీడీపీ ఎంపీలు!.. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది.. లోక్సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్, కశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు. లోక్సభ మళ్లీ ప్రారంభం దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారని, విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సభను సాయంత్రం 4:30 గంటల వరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. అనంతం సభ మళ్లీ ప్రారంభమైంది. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..? - నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ధనవంతులకే కొమ్ము కాస్తోందని సమాద్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ఇచ్చిన హామీ ఏమైందని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ పాలనపై రైతులు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వమూ అన్ని ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్.. కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, మోదీ ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయమే తమకు నచ్చలేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో సరైన సమాచారం లేదన్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. కాగా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాలతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందాలు చేసుకుని 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తూ ముందుకు సాగుతున్నారని’ఎంపీ వినోద్ వివరించారు. ‘రఫెల్’పై వివరణ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రఫెల్ డీల్ ఆరోపణలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘రఫెల్ ఒప్పందం యూపీఏ హయాంలోనే జరిగింది. ఆ సమయంలో ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఒప్పంద వివరాలు బయటపెట్టొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే వెల్లడించటం లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రధాని మాటకు విలువ ఉండాలి... ‘గల్లా స్పీచ్ విన్నాను. 21వ శతాబ్ధంలో అతిపెద్ద రాజకీయ బాధితురాలు ఆంధ్ర ప్రదేశ్. జీఎస్టీ మేం తెస్తామంటే వద్దన్నారు. ఐదు శ్లాబ్ల్లో వాళ్లు(బీజేపీ ప్రభుత్వం) తీసుకొచ్చారు. దేశానికి సేవకుడిగా ఉంటానని మోదీ.. పేదల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. ఆయన కళ్లకు వ్యాపారవేత్తలే కనిపిస్తారు. వారికి లబ్ధి చేకూరేలానే నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగమే నోట్ల రద్దు. కనీసం నా కళ్లలోకి చూసి కూడా మాట్లాడే స్థితిలో మోదీ లేరు(వెంటనే ప్రధాని చిరునవ్వులు చిందించారు)’ అంటూ రాహుల్ ఏకిపడేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసి రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగగా.. సభ పది నిమిషాలు వాయిదా పడింది. టీడీపీ శాపగ్రస్థురాలైంది... అవిశ్వాసానికి వ్యతిరేకంగా అధికార పక్షం తరపున ఎంపీ రాకేష్ సింగ్ చర్చ ప్రారంభించారు. ‘గతంలోనూ చాలాసార్లు అవిశ్వాసం పెట్టారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్తో కలిసి టీడీపీ అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్థురాలైన కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్తో చేతులు కలపడం వల్ల టీడీపీ కూడా శాపగ్రస్థురాలైంది. టీడీపీ మాకు శాపనార్థాలు పెడుతోందా?.. అసలు గల్లా జయదేవ్ పూర్తి ప్రసంగం వింటే అవిశ్వాస తీర్మానం అవసరం లేదనిపిస్తోంది. మోదీ పాలనలో ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. పేద ప్రజల అభ్యున్నతికి బీజేపీ పాటు పడుతోంది.’ అని రాకేష్ సింగ్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా భారత్కు విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ను కొత్త శక్తిగా గుర్తిస్తున్నాయి. ఉజ్వల పథకంతో 8 కోట్ల మంది మహిళలకు లబ్ధి. నెలకు ఒక్క రూపాయితో 2 లక్షల బీమా కవరేజ్. రోజుకు 90 పైసలతో జీవన్ జ్యోతి యోజన పథకం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టలేదు. మోదీని ఎలాగోలా అడ్డుకోవాలనే తపనతోనే అవిశ్వాసం. కొందరి లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దు... గల్లాపై సీతారామన్ ఆగ్రహం.. ప్రసంగం కొనసాగించిన వేళ ప్రధానిని ఉద్దేశించి మోసగాడు అని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సీటులోంచి లేచి టీడీపీ ఎంపీల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను ఆమె కోరారు. మరోవైపు అప్రజాస్వామికంగా తెలుగు రాష్ట్రాలను విభజించారన్న గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పదాన్ని తొలగించాలని కోరగా.. పరిశీలిస్తామని మేడమ్ స్పీకర్ చెప్పటంతో జితేందర్ రెడ్డి శాంతించారు. గల్లా జయదేవ్ ప్రసంగం... సుమారు గంటపాటు ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పాత విషయాలనే చెప్పుకురావటం గమనార్హం. గతంలో కాంగ్రెస్పై చేసిన కామెంట్లనే.. ఇప్పుడు ఆయన బీజేపీపై చేశారు. అయితే రాష్ట్రాన్ని అప్రజాస్వామిక్యంగా విభజించారన్న వ్యాఖ్యపై టీఆర్ఎస్ భగ్గుమంది. ఒకానోక దశలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లే యత్నం చేయగా.. స్పీకర్ వారించటంతో సభ సర్దుమణిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాంగ్రెస్ అభ్యంతరాలు.. ప్రతిపక్షాలకు తక్కువ సమయం ఇవ్వటంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘కాంగ్రెస్కు 38 నిమిషాలే ఇచ్చారు. సభలో ఏం జరగబోతుందోనని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అవసరమైతే అవిశ్వాసంపై చర్చ మూడురోజులపాటు సాగాలి’ అని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. అనంతకుమార్ సెటైర్లు.. వన్డే మ్యాచ్ల కాలంలో టెస్ట్ మ్యాచ్లు ఆడతామనటం సరికాదు అంటూ విపక్షాల అవిశ్వాస చర్చపై బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే సెటైర్లు పేల్చారు. అవిశ్వాసం వీగిపోతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. బీజేడీ వాకౌట్... లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది.ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. ప్రారంభమైన లోక్సభ... సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సాయంత్రం 6గంటల వరకు చర్చ కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. -
టీడీపీపై కోపంతో అన్యాయం చేయకండి : పవన్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీపై ఉన్న కోపంతో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయవద్దని కేంద్రాన్ని జనసేన అధినేత పవన కల్యాణ్ కోరారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన ట్విటర్లో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని... హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలతో కలసి తాను కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. ‘ఏపీ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. పార్లమెంట్కు మించిన వేదిక మరొకటి లేదు.. మా హక్కుల గురించి అర్థం చేసుకోండి. దయచేసి న్యాయం చేయండి. టీడీపీపై ఉన్న కోపంతో ప్రత్యేక హోదాను నిరాకరించకండి. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల తరపున నిలబడాలి’ అని పవన్ వరుస ట్వీట్లు చేశారు. BJP’s anger on TDP leadership shouldn’t be the reason to deny SCS to the people of AP. — Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018 BJP & TDP had wasted a great opportunity given to them by people of AP. They could have truly stood by people instead of this political theatrics,which is causing great deal of public’s valuable time ,money & agony. — Pawan Kalyan (@PawanKalyan) July 20, 2018 -
‘చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా టీడీపీ లేవనెత్తిన ప్రతీ అంశాన్ని తిప్పిగొడతామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకే బీజేపీపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఏపీలో అవినీతి అడ్డగోలుగా జరుగుతోందని జీవీఎల్ మండిపడ్డారు. అనేక అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డుయింగ్లో నంబర్ వన్ అని చెప్పుకున్న బాబు ప్రభుత్వం.. ఈజ్ ఆఫ్ డుయింగ్ కరప్షన్లో నంబర్ వన్ అని చెప్పుకోవాలని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు మాట తప్పడానికి కేవలం తన రాజకీయ ప్రాధాన్యతే కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం చూపిన శ్రద్ధను తాము ప్రజలకు చెప్పుకుంటామని ఈ సందర్భంగా జీవీఎల్ పేర్కొన్నారు. -
అవిశ్వాసం.. అంతా ఓ డ్రామా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రజలను మరోసారి మోసం చేసుందుకు కుట్ర చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం.. అంతా ఓ డ్రామా!. ప్రజలు వాళ్లకి సరైన బుద్ధి చెప్తారు’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ‘లోక్సభలో 13సార్లు వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు రాలేదు. కానీ, టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చారు. వైఎస్సార్ సీపీ సభలో లేదుగనుకే బీజేపీ-టీడీపీలు డ్రామాలాడుతున్నాయి’ అని ఉమ్మారెడ్డి ఆక్షేపించారు. -
చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదు?
సాక్షి, హైదరాబాద్ : దాదాపు పదిహేనేళ్ల తర్వాత పార్లమెంట్లో విశ్వాస పరీక్ష అంశం తెరపైకి రావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవిశ్వాసంపైనే చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఎవరు ఏం మాట్లాడుతారు.. ఏ పార్టీ అవిశ్వాసానికి మద్దతిస్తుంది. తటస్థంగా ఏ పార్టీ ఉంటుందని దేశ ప్రజలందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదని అనే అంశం చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన టీడీపీ అధినాయకుడే ఢిల్లీకి వెళ్లకుండా ముఖం చాటేయడంపై ఆ పార్టీలోనే పలు అనుమానాలకు తావిస్తోంది. తమ అధినేత ఎందుకు ఢిల్లీకి రాలేదని, ఆ పార్టీ ఎంపీలే చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన అవిశ్వాసాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో చక్రం తిప్పే చంద్రబాబు అమరావతికే ఎందుకు పరిమితమయ్యారని.. అవిశ్వాసాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవడంలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గత సెషన్లో పార్లమెంట్ ముందు ఫొటోలకు ఫోజిచ్చి.. హడావుడి చేసిన చంద్రబాబు ఈ సారి సమావేశాలకు కనీసం అటువైపు చూడకపోవడం గమనార్హం. ఢిల్లీకి వెళ్లి పలు పార్టీల మద్దతు కోరాల్సిన సీఎం ఇక్కడే ఉండటం లోపాయికారి ఒప్పందమేనని పలువురి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులతో సీఎం సమావేశం.. మరికొద్దీ సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. అవిశ్వాసం పరిణామాలు, తదుపరి వ్యూహాలపై మంత్రులు, ముఖ్యనేతలతో సీఎం చర్చించనున్నారు. -
విశ్వాస పరీక్ష.. దేశం మొత్తం చూస్తోంది
దాదాపు పదిహేనేళ్ల తర్వాత పార్లమెంట్లో విశ్వాసపరీక్ష అంశం తెరపైకి రావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐక్యత ప్రదర్శించేందుకు విపక్షాలు ఉవ్విళ్లూరుతుంటే.. మెజార్టీ(అంతకు మించే...) ఉందన్న ధీమాలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో కాసేపట్లోనే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలుకానుంది. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో ఓ సందేశం ఉంచారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. అంతరాయం లేని.. నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనే ఆశిస్తున్నా. ప్రజలకు.. రాజ్యాంగ రూపకర్తలకు మనం ఈ ప్రమాణం చేస్తున్నాం. దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తోంది’ అని ప్రధాని.. ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు తీర్మానంపై చర్చ మొదలై సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ సమయాన్ని పొడిగిస్తే మాత్రం రాత్రి 9 గంటలకు వరకు సభ నిర్వహణ ఉండొచ్చు. అన్ని పార్టీల ఫ్లోర్ నేతలు మాట్లాడాక చివర్లో ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఓటింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ చర్చ ఆలస్యం అయితే మాత్రం ఓటింగ్ను సోమవారానికి వాయిదా వేసే అవకాశం ఉంటుంది. (అవిశ్వాస తీర్మానాలు.. ఆసక్తికర అంశాలు) మిశ్రమ స్పంద... అవిశ్వాసంపై తటస్థుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గత కొంతకాలంగా మాటల తుటాలు పేలుస్తున్న శివసేన.. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. మరోవైపు కావేరీ పోరాటానికి ఏ పార్టీ మద్ధతు ఇవ్వలేదన్న కారణంతో అన్నాడీఎంకే.. అవిశ్వాసానికి మద్ధతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. టీఆర్ఎస్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అటు బీజేడీ కూడా తన వ్యూహాన్ని పార్లమెంటులోనే ప్రకటిస్తానని తెలిపింది. ఎవరి ప్లాన్లు వాళ్లవి... వీలైనంత ఎక్కువ మెజార్టీ కోసం స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. భాగస్వామ్య పక్షాలతోపాటు చిన్నా, చితకా పార్టీలతో నేరుగా మాట్లాడుతూ వచ్చారు. అటు విపక్షాలు కూడా.. తమ వ్యూహాలకు పదును పెట్టాయి. అవిశ్వాస పరీక్ష అంకెల గారడీ కాదని.. మోదీ ప్రభుత్వానికి గెలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతున్నప్పటికీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ఈ అవిశ్వాసం పనికొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Today is an important day in our Parliamentary democracy. I am sure my fellow MP colleagues will rise to the occasion and ensure a constructive, comprehensive & disruption free debate. We owe this to the people & the makers of our Constitution. India will be watching us closely. — Narendra Modi (@narendramodi) 20 July 2018 -
నెహ్రూ హయాం నుంచే అవిశ్వాసం
-
గంట కూడా అధికారాన్ని వదులుకోం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారమే లోక్సభ ఎన్నికలు జరుగుతాయని ముందస్తుకు అవకాశమే లేదని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. లోక్సభతో పాటు 13 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల తలెత్తిన గందరగోళానికి తెరదించాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐదేళ్లు అధికారంలో కొనసాగేలా ప్రజలు తీర్పునిచ్చారని, అందుకు కనీసం గంట ముందు కూడా గద్దెదిగబోమని తేల్చిచెప్పాయి. దేశవ్యాప్తంగా 51 శాతం ఓట్లు గెలుచుకోవడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షాల ఐక్యతను చెడగొట్టే ఉద్దేశం లేదని తెలిపాయి. మోదీకి రాహుల్ గాంధీ సరితూగరని, ఆయన్ని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే, అది తమకు లాభమే చేకూరుస్తుందని అన్నాయి. ఇందుకు ఉత్తరప్రదేశ్లోని కైరానా ఉప ఎన్నికల్లో బీజేపీ 47 శాతం ఓట్లు పొందడాన్ని ఉదహరించాయి. 14 కోట్ల మంది కార్యకర్తలతో సైన్యం బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, ఒక్కో బూత్లో 25 మంది చొప్పున మొత్తం 7 లక్షల బూత్లలో కార్యకర్తలను నియమించుకున్నట్లు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని, వారందరి ఫోన్ నంబర్లు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు అధ్యక్షుడు అమిత్ షా వద్ద ఉన్నాయని చెప్పాయి. కార్యకర్తలతో షా తరచూ సమావేశమవుతూ వారిని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారని తెలిపాయి. బీజేపీ ఎంపీలంతా అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనేందుకు అందుబాటులో ఉండేలా గురువారం, శుక్రవారం వారికి భోజనాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని పార్టీ విప్లను ఆదేశించినట్లు వెల్లడించాయి. సభకు హాజరై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసేలా తమ పార్టీ సభ్యులందరికీ విప్ జారీచేశామని, దాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించాయి. -
టీడీపీ అవిశ్వాస తీర్మానం వెనుక కేంద్ర సర్కార్ కనుసైగ!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అమరావతి/న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగినప్పటికీ సొంత ప్రయోజనాల కోసం లోపాయికారీగా సంబంధాలు కొనసాగిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ చేత తొలిరోజైన బుధవారం ఆన్లైన్లో హడావుడిగా నోటీసులు ఇప్పించడం, దానిపై శుక్రవారమే చర్చను చేపట్టనున్నట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించడం యాధృచ్ఛికం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి శ్వాస తీర్మానం నోటీసుకు సంబంధించి బీజేపీ, టీడీపీ ఒక స్పష్టమైన అవగాహనతోనే ముందుకు వెళుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్, వామపక్షాలు జాతీయ స్థాయిలో పలు కీలక అంశాలను లేవనెత్తి, చర్చకు పట్టుబట్టవచ్చని, అవిశ్వాస తీర్మానం నోటీసులు సైతం ఇచ్చే అవకాశం ఉందని ఎన్డీఏ సర్కారు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే తన వైఫల్యాలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, అందుకే చర్చను పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీని బీజేపీ ముందుగానే రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే అంశం చర్చనీయాంశంగా మారితే.. రాష్ట్ర విభజన యూపీఏ హయాంలోనే జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టవచ్చని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ అంశాలు చర్చకు వస్తే... పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, గోరక్షణ పేరుతో కొనసాగుతున్న మూకుమ్మడి దాడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేకపోవడం, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేకపోవడం, బ్యాంకుల్లో కుంభకోణాలు, మహిళలకు భద్రత కరువు తదితర అంశాలపై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో దాడిచేసే అవకాశాలు ఉన్నట్లు ఎన్డీఏ ప్రభుత్వం గ్రహించిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దానికి విరుగుడుగానే టీడీపీని రంగంలోకి దించి, అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పించినట్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు నమ్ముతారా? కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు విషయంలో టీడీపీ అంతర్గతంగా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కారుతో నాలుగేళ్లు అంటకాగి, కేంద్రంలో అధికారం అనుభవించి, ఎన్డీఏ నిర్ణయాలన్నింటినీ సమర్థించి, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అంటే ప్రజలు తమను నమ్ముతారా? అని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇది రాజకీయంగా తమకు తీరని నష్టం కలిగిస్తుందని అనుమానిస్తున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం వద్దని సూచించిన టీడీపీ సీనియర్ ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే తోట నరసింహం, కొనకళ్ల నారాయణరావు లాంటి సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లయిన గల్లా జయదేవ్, కె.రామ్మోహన్ నాయుడులు చర్చలో పాల్గొనాలని ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెర ముందు విమర్శలు.. తెర వెనుక కాళ్ల బేరాలు పార్లమెంట్లో తాము ఏయే అంశాలను లేవనెత్తితే వాటికి ఎన్డీఏ ఏ రీతిన సమాధానం చెపుతుందో తెలియడం లేదని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనలకు వచ్చినప్పుడు వారి ముందు అతి వినయం ప్రదర్శిస్తున్నారని, తద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని పేర్కొంటున్నారు. నాలుగు నెలల కిందటి వరకు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై ప్రశంసల వర్షం కురిపించి, సన్మానాలు చేసిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు సభలో ఎంతవరకు గట్టిగా నిలబడతారనేది చర్చనీయాంశంగా మారింది. నిలకడా? పలాయనమా? చర్చలో టీడీపీ ఏయే అంశాలను ప్రధానంగా లేవనెత్తుతుంది? అనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని కోరి తెచ్చుకోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తానే దక్కించుకోవడం, కేంద్ర నిధులకు వినియోగ పత్రాలు(యూసీ) సరిగ్గా పంపకపోవడం, కడపలో ఉక్కు ప్యాక్టరీ, దుగరాజపట్నం/రామాయపట్నం పోర్టుల ప్రస్తావన తీసుకురాకపోవడం తదితర అంశాలను సభలో బీజేపీ ప్రస్తావించి, అన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా వివరిస్తే అప్పుడు తమ పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన కూడా టీడీపీ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటాయా? లేక కుమ్మక్కు రాజకీయాలతో సభలో చర్చను పక్కదోవ పట్టిస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తారా? లేక పలాయనం చిత్తగిస్తారా? అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. హోదా కోసం వైఎస్సార్సీపీ పోరుబాట ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా వెలుగెత్తి చాటుతోంది. హోదా కోసం అవిశ్రాంతంగా ఉద్యమిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలు పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు హోదా కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే దృఢ సంకల్పం ఉన్న పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అంతా వ్యూహంలో భాగమే.. కేశినేని శ్రీనివాస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఆన్లైన్లోనే అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ నోటీసునే పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీ పేరును సభలో ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. నోటీసు ఇచ్చిన తమ పార్టీ పేరును ఎందుకు విస్మరించారని మల్లిఖార్జున ఖర్గే అడగ్గా స్పీకర్ సున్నితంగా తిరస్కరించారు. దీన్నిబట్టి సీఎం చంద్రబాబు బీజేపీకి అజ్ఙాతమిత్రుడిగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుధవారం నోటీసు ఇవ్వగా, శుక్రవారమే చర్చకు అనుమతి ఇవ్వడం కూడా బీజేపీ, టీడీపీల వ్యూహంలో భాగమేనని అంటున్నారు. సమావేశాల ప్రారంభంలోనే చర్చను ముగించేస్తే ఆ తరువాత సంఖ్యాబలం దృష్ట్యా సభ పూర్తిగా తమ అదుపాజ్ఞల్లో ఉండేలా చూసుకోవచ్చనేది పాలకపక్షం ఎత్తుగడ అని భావిస్తున్నారు. -
విజయంపై కమల ‘విశ్వాసం’
న్యూఢిల్లీ: శుక్రవారం లోక్సభలో జరగనున్న విశ్వాస పరీక్షలో గెలిచితీరుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నందున తమదే విజయమంటోంది. చివరి వరకు పలు విపక్ష పార్టీల విశ్వా సాన్ని కూడా పొందుతామని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ‘అంకెలు స్పష్టంగా ఉన్నాయి. దిగువ సభలో బీజేపీకి సరిపోయేంత మెజారిటీ ఉంది. ఎన్డీయే పక్షాల బలమే 314. పలు కాంగ్రెసేతర పక్షాలు కూడా విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అంకెలతోపాటు.. దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న విపక్షాల వ్యతిరేక రాజకీయాలను గెలిచే నైతిక స్థైర్యం కూడా మాకుంది. దీంతో మేం సభ విశ్వాసాన్ని పొందడం ఖా యం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన టీడీపీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీ పాలన బాలేదంటూ టీడీపీ అవిశ్వాసం పెట్టింది. నాలుగేళ్లపాటు కేంద్ర కేబినెట్లో భాగస్వామిగా ఉన్న పార్టీ ఇప్పుడు ఆ ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టడం ఎంతవరకు సమంజసం’ అని విమర్శించారు. సోనియా లెక్కల్లో వీక్ అవిశ్వాసాన్ని నెగ్గించుకునేందుకు తమ వద్ద సరిపోయేంత బలముందంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ వ్యాఖ్యలు చేసిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ‘లెక్కల్లో వీక్’ అని కేంద్ర మంత్రి అనంత కుమార్ ఎద్దేవా చేశారు. ఏ లెక్క ప్రకారం చూసినా విపక్షాల వద్ద ఉన్న సంఖ్యాబలం తమతో సరిపోదన్నారు. విపక్షాల అండ ఉంది: కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం అంకెల గారడీ కాదని.. ఈ వేదిక ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు ఎత్తిచూపుతామని కాంగ్రెస్ పేర్కొంది. ‘మాకు పెద్ద సంఖ్యలో విపక్షాలు అండగా ఉన్నాయి. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పేర్కొంటూ.. ప్రజల వరకు వాస్తవాలు వెళ్లేలా చేస్తాం. 2019 లోక్సభ ఎన్నికల సమరానికి ఇది ప్రారంభం’ అని పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఢిల్లీలో పేర్కొన్నారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా.. లోక్సభలో ఎన్డీయేకు 314 ఎంపీల మద్దతుంది. దీనికి తోడు ఇతర చిన్న చిన్న పార్టీల మద్దతును కూడా బీజేపీ కూడగడుతోంది. ఎన్డీయేతర పక్షాలైన పీఎంకేతోపాటు స్వాభిమానీ ప„Š లు కూడా ఇప్పటికే ఎన్డీయేకు మద్దతు ప్రకటించాయి. కొంతకాలంగా బీజేపీ అధిష్టానానికి వ్యతిరేక గళం వినిపిస్తున్న పట్నా సాహిబ్ ఎంపీ శతృఘ్న సిన్హా.. విశ్వాస పరీక్షలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తానన్నారు. అటు అన్నాడీఎంకే కూడా అవిశ్వాసానికి మద్దతివ్వకపోవచ్చనే సంకేతాలిచ్చింది. ‘మేం కావేరీ వివాదంపై సభలో ఆందోళన చేస్తున్నప్పుడు ఒక్క విపక్ష పార్టీ కూడా మాకు మద్దతు తెలపలేదు. అలాంటప్పుడు ఏపీ వ్యక్తిగత సమస్యకు మేమేందుకు మద్దతివ్వాలి’ అని తమిళనాడు సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత అన్నాడీఎంకే (37 ఎంపీలు) అతిపెద్ద పార్టీ. 20 మంది ఎంపీలున్న బీజేడీ.. అవిశ్వాసం విషయంలో లోక్సభలోనే తమ నిర్ణయాన్ని తెలుపుతామంది. ఇంకా నిర్ణయించుకోలేదు: శివసేన అవిశ్వాస తీర్మానంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శివసేన ప్రకటించింది. అయితే ఎంపీలంతా ఢిల్లీలోనే ఉండాలని.. అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వారికి సూచించింది. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై శుక్రవారం ఉదయం అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తెలియజేస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. -
నేడే అవిశ్వాసం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో చర్చ జరగనుంది. గత పదిహేనేళ్లలో తొలిసారి జరగనున్న విశ్వాసపరీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీకి అవసరమైనంత మెజారిటీ ఉన్నప్పటికీ.. విపక్షాలు మాత్రం తమ ఐక్యతను ప్రదర్శించేందుకు సరైన వేదికగా భావిస్తున్నాయి. అటు అధికార పార్టీ బీజేపీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. లోక్సభలో విశ్వాసం నెగ్గేందుకు ప్రతి ఒక్క ఓటునూ జాగ్రత్తగా గమనిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటులో జరగనున్న అతిపెద్ద, కీలకమైన చర్చ ఇది కావడంతో విశ్వాస పరీక్ష చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం లోక్సభలో ఏడు గంటలపాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ చర్చ మరింత ఆలస్యమైతే.. ఓటింగ్ సోమవారానికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎవరి లెక్కలు వారివే..! ఈ విశ్వాస పరీక్షలో నెగ్గటం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు.. తమ ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు వచ్చిన సీట్లకన్నా ఎక్కువ బలాన్ని (సంఖ్య) చూపించడం ద్వారా.. నరేంద్ర మోదీపై ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. అందుకే వీలైనంత ఎక్కువ సంఖ్యకోసం స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. భాగస్వామ్య పక్షాలతోపాటు చిన్నా, చితకా పార్టీలతో నేరుగా మాట్లాడుతూ మద్దతు కూడగడుతున్నారు. అటు విపక్షాలు కూడా.. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అవిశ్వాస పరీక్ష అంకెల గారడీ కాదని.. బీజేపీకి గెలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతున్నప్పటికీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే తమ పని అని పేర్కొన్నాయి. తటస్థులు ఎటువైపు?: అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ పార్టీలకు కలిపి 68 సీట్లున్నాయి. ఇది యూపీఏ పక్షాల మొత్తం సభ్యుల సంఖ్యతో సమానం. వీరంతా ఎటువైపుంటారనేదానిపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే, అన్నాడీఎంకే మాత్రం అవిశ్వాసానికి మద్దతుండదని.. గతంలో కావేరీ జలాలకోసం తాము చేసిన ఆందోళనలకు ఎవరి మద్దతూ లేనందున ఈసారి టీడీపీ అవిశ్వాసానికి అండగా నిలవబోమని స్పష్టం చేసింది. అటు, టీఆర్ఎస్ దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ కూటమితో కలిసేందుకు కేసీఆర్ అయిష్టంగానే ఉన్నారు. అటు బీజేడీ కూడా తన వ్యూహాన్ని పార్లమెంటులోనే ప్రకటిస్తానని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్లతో సమదూరాన్ని కొనసాగిస్తామని నవీన్ పట్నాయక్ తెలిపారు. మోదీ వర్సెస్ రాహుల్ విశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ లోక్సభా పక్షనేత మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్నేత జ్యోతిరాదిత్య సింధియాలు మాట్లాడే అవకాశం ఉంది. తన ప్రసంగంలో మోదీ ప్రభుత్వంపైనే రాహుల్ గాంధీ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో మోదీ, రాహుల్ మధ్య జరుగుతున్న ట్వీట్ల వాగ్యుద్ధం నేపథ్యంలో శుక్రవారం కూడా రాహుల్ వాడివేడి విమర్శనాస్త్రాలు సంధించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. బ్యాంకు మోసాలు, వ్యవసాయ సంక్షోభం, కశ్మీర్, మూక దాడులు, నిరుద్యోగం, మహిళల భద్రత తదితర అంశాలపై రాహుల్ ప్రసంగం ఉండనుందని సమాచారం. ఖర్గే, సింధియాలు కూడా ఒక్కో అంశంపై కేంద్రాన్ని టార్గెట్ చేయనున్నారు. శుక్రవారం సభలో ఆనుసరించాల్సిన వ్యూహంపై యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మిగతా కాంగ్రెస్ నేతలతో విస్తృతంగా చర్చించారు. ముచ్చటగా మూడోసారి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ఇది మూడోసారి. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో ఓసారి , 2003లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1999లో జరిగిన విశ్వాస పరీక్షలో అప్పటివరకూ ఎన్డీయే కూటమిలో ఉన్న బీఎస్పీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయడంతో వాజ్పేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ను మళ్లీ కేబినెట్లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు 2003లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా 312, వ్యతిరేకంగా 186 ఓట్లు రావడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ఈ ఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అవిశ్వాస తీర్మానం గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. లోక్సభలో 198వ నిబంధన ప్రకారం సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఇందుకోసం కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. త్రీలైన్ విప్ జారీ నేడు అవిశ్వాస తీర్మానం సందర్భంగా కొన్ని పార్టీలు తమ లోక్సభ సభ్యులకు త్రీలైన్ విప్ను జారీచేశాయి. ఒకవేళ ఏ పార్లమెంటు సభ్యుడయినా ఈ విప్కు అనుగుణంగా ఓటేయకపోతే అతన్ని పార్టీల ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హుడిగా పరిగణిస్తారు. సభ్యులకు జారీచేసే విప్ నోటీసులో విషయ తీవ్రతను బట్టి అందులోని అంశాన్ని మూడుసార్లు అండర్లైన్ చేస్తే దాన్ని త్రీలైన్ విప్గా పరిగణిస్తారు. ఇప్పటివరకూ ప్రధానులపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు ఇందిరాగాంధీ 15 సార్లు లాల్బహదూర్ శాస్త్రి 3 సార్లు పీవీ నరసింహారావు 3 సార్లు మొరార్జీ దేశాయ్ 2 సార్లు వాజ్పేయి 2 సార్లు జవహర్లాల్ నెహ్రూ ఒక సారి సోషలిస్ట్ నేత ఆచార్య కృపలానీ దేశంలోనే తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనా చేతిలో ఘోర పరాజయం అనంతరం నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1963, ఆగస్టులో లోక్సభలో ఆయన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. -
అవిశ్వాసంపై చర్చ : ఏ పార్టీకి ఎంత సమయం..?
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివిధ పార్టీలకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్ సమయం కేటాయించారు. సభలో ఆయా పార్టీల సంఖ్యా బలాన్ని బట్టి ప్రసంగించే సమయాన్ని కేటాయించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపడతారు. చర్చలో బీజేపీకి మూడు గంటల 33 నిమిషాలు, కాంగ్రెస్కు 38 నిమిషాలు, ఏఐఏడీఎంకే 29 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్ 27 నిమిషాలు, బీజేడీ 15 నిమిషాలు, శివసేన 14 నిమిషాలు, టీడీపీ 13 , టీఆర్ఎస్ 9, సీపీఎం 7, ఎస్పీ 6, ఎన్సీపీ 6, ఎల్జేఎస్పీకి 5 నిమిషాల సమయం కేటాయించారు. -
అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందా..?!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలోనే తమ పార్టీ వైఖరి వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సాక్షి టీవీతో మాట్లాడుతూ.. అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు బీజీపీతో పొత్తు కొనసాగించిన టీడీపీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీ.. టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని పేర్కొన్న వినోద్ కుమార్.. ఆ పార్టీ వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు జారీ చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అయితే హైకోర్టు, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ అనుమతి తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. -
అవిశ్వాసం: ఉద్దవ్ థాకరేకు అమిత్ షా ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో పాలక నరేంద్ర మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. బీజేపీతో కేంద్రంలో, మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన పలు సందర్భాల్లో బీజేపీని ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో తాము విడిగా పోటీచేస్తామని శివసేన ప్రకటించింది. అయితే విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రభుత్వానికి బాసటగా నిలవాలని అమిత్ షా ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరేను కోరినట్టు సమాచారం. అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేసే సంఖ్యాబలం బీజేపీకి ఉన్నా మిత్ర పక్షాలను విపక్షానికి సహకరించే పరిస్థితి తీసుకురాకూడదని కమలనాధులు భావిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలా అనే దానిపై పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శివసేన వైఖరి ఏంటో లోక్సభలో శుక్రవారం మాత్రమే అందరికీ తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. -
‘అవిశ్వాసం’పై బీజేపీ పక్కా వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ తదితర పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. సభ సవ్యంగా నడవడం లేదని, గందరగోళ పరిస్థితుల మధ్య అవిశ్వాసాన్ని అనుమతించలేనని అందుకు ఆమె సాకు కూడా చెప్పారు. మళ్లీ ఇప్పుడు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిందే తడవుగా లోక్సభ స్పీకర్ అందుకు అనుమతించారు. ఎందుకు? నాటికి నేటికి మారిన పరిస్థితులు ఏమిటీ? నాడైనా, నేడైనా అవిశ్వాస తీర్మానం కారణంగా మోదీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవు. నాడు తెలుగు దేశం పార్టీ అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇది కొంత పాలకపక్ష బీజేపీకి అసంతృప్తి కలిగించే అంశమే. ప్రతిపక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఎందుకంటే అవి తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే కేంద్రంపై అవిశ్వాసానికి ముందుకు వచ్చాయి. కావేరీ నుంచి తమిళనాడుకు ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేది లేదంటూ కర్ణాటక పాలక, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. సమీపంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అవిశ్వాసాన్ని అనుమతిస్తే పరువు పోగొట్టుకొని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ భయపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేక తడబడాల్సి వస్తుందన్న ఆందోళన. అప్పుడు అవిశ్వాసంపై చర్చకు ప్రాంతీయ పార్టీలే ముందున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. అవిశ్వాసంపై చర్చకు కాంగ్రెస్ పార్టీయే ముందుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి ప్రత్యామ్నాయంగా తన నాయకత్వాన ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలన్న సంకల్పం నుంచి వచ్చింది కాంగ్రెస్కు ఈ చొరవ. అందుకని అవిశ్వాసంపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కొనగలిగితే ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని సగం దెబ్బతీసినట్లే అవుతుందన్నది బీజేపీ వ్యూహం. ఈ విషయాన్ని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని పలువురు బీజేపీ నాయకులు ధ్రువీకరించారు. వారికి తమ నాయకుడు నరేంద్ర మోదీ ప్రసంగం లేదా వాగ్వాద నైపుణ్యంపై ఎంతో నమ్మకం ఉంది. కాంగ్రెస్ ముస్లిం పురుషులను మెప్పించే పార్టీ అనే ప్రచారం, తలాక్కు వ్యతిరేకమంటూ ధ్వజమెత్తడం ద్వారా ఆ పార్టీని సులభంగానే ఎదుర్కోవచ్చని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. లోక్సభ ఆమోదం పొందిన తలాక్ బిల్లు రాజ్యసభలో కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆమోదం పొందని విషయం తెల్సిందే. కశ్మీర్లో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కఠిన వైఖరి కూడా తమకు ఎంతో ఉపయోగ పడుతుందని బీజేపీ భావిస్తోంది. టెర్రరిస్టులను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంతోనే ముఫ్తీ మెహబూబా ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్నామన్న ప్రచారం కూడా తమకు బాగానే ఉపయోగ పడుతుందన్న ఆలోచన. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అవిశ్వాసాన్ని తిరస్కరించి అభాసుపాలవడం కంటే ఆమోదించి ఎదుర్కోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చింది. అవిశ్వాసాన్ని నెగ్గడం ద్వారా ప్రతిపక్షాన్ని దూషించి ప్రజల మన్ననలను పొందవచ్చు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న పై మూడు రాష్ట్రాల ఎన్నికల్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమూ కావచ్చు అన్నది బీజేపీ వ్యూహంలో భాగం. అందుకనే అవిశ్వాసంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ ‘చర్చ నుంచి పారిపోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని చూస్తున్నాం. ప్రతిపక్షాల అబద్ధాలకు అడ్డుకట్ట వేయదల్చుకున్నాం. ఏ ప్రశ్ననైనా ఎదుర్కోవడానికి, దానికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దేశంలో నెలకొన్న అస్తవ్యస్థ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, గోసంరక్షకుల దాడులు, పిల్లల కిడ్నాపర్ల పేరిట అల్లరి మూకల హత్యలు, మహిళలపై అత్యాచారాలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీయవచ్చు. అయితే అందులో ఎంత మేరకు విజయం సాధిస్తుందన్నది ప్రశ్న. -
ఆ విషయం ఆయనకే తెలియదు !
సాక్షి, అనంతపురం : టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరీ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తనతో చంద్రబాబు మాట్లాడారో లేదో.. ఆయనకే తెలియదు అంటూ సుజనా చౌదరీని ఉద్దేశించి మాట్లాడారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను పార్లమెంట్కు వెళ్లటం లేదని స్పష్టం చేశారు. తనతో ఎవరూ చర్చలు జరపలేదన్నారు. తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని తెలిపారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని, మోదీ సర్కార్కు సంపూర్ణ మెజార్టీ ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. అంతకుముందు లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటం ఖాయమంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుజనా చౌదరీ స్పందిస్తూ.. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీలో సీనియర్ నేత అని, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని మీడియా ద్వారానే తాను చూశానని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయనతో తాను మాట్లాడానని చెప్పారు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే పార్లమెంటుకు రాలేకపోయానని తనతో జేసీ చెప్పారని తెలిపారు. పార్టీపై ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే.. అది మాతో చెబితే చర్చించుకుని సరి చేసుకుంటామన్నారు. రేపటి (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ పార్లమెంటుకు హాజరు అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జేసీతో మాట్లాడుతున్నారని సుజనా మీడియాకు తెలిపారు. -
పాపం సోనియాజీ.. మ్యాథ్స్లో పూర్ అనుకుంటా!
సాక్షి, న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు బలనిరూపణకు పావులు కదుపుతున్నాయి. అటు అధికార పార్టీ కూడా అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని ధీమాగా ఉంది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అవిశ్వాసం గెలవడానికి అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని, బీజేపీయేతర శక్తులను కలపుకొని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. సోనియాజీ.. పాపం మ్యాథ్స్లో పూర్ అనుకుంటా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందుగా వారి పార్టీ ఎంపీల సంఖ్య ఎంతో చూసుకోండని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇంటా బయట స్పష్టమైన మద్దతుందని తెలిపారు. శివసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామేనని ఓ ప్రశ్నకి సమాధానంగా తెలిపారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 313 ఉండటంతో అవిశ్వాసంలో తమదే గెలుపని అనంతకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల తర్వాత తొలిసారి అవిశ్వాసంపై చర్చ జరగనుంది. చివరిసారిగా 2003లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభత్వం పెండింగ్లో ఉన్న బిల్లులను వీలైనన్ని ఆమోదించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు 68 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కనీసం 25 బిల్లులకైనా ఆమోద్రముద్ర లభించే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రతిపక్షాలు కూడా మోదీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలనే ఉద్దేశంతో ఉంది. దళితులపై దాడులు, మహిళల రక్షణ, రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందుగానే సంకేతమిచ్చిన విషయం తెలిసిందే. కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని సీఎం పళని స్వామి పేర్కొన్నారు. -
జేసీ మా సీనియర్.. ఈ రోజు కూడా ఆయనతో మాట్లాడా!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవటం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యవహారంపై ఆ పార్టీ మరో ఎంపీ సుజనా చౌదరీ స్పందించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీలో సీనియర్ నేత అని, ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని మీడియా ద్వారానే తాను చూశానని తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయనతో తాను మాట్లాడానని చెప్పారు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేనందునే పార్లమెంటుకు రాలేకపోయానని తనతో జేసీ చెప్పారని తెలిపారు. పార్టీపై ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే.. అది మాతో చెబితే చర్చించుకుని సరి చేసుకుంటామన్నారు. రేపటి (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం చర్చకు జేసీ పార్లమెంటుకు హాజరు అవుతారని భావిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జేసీతో మాట్లాడుతున్నారని సుజనా మీడియాకు తెలిపారు. -
టీడీపీ నిజస్వరూపాన్ని జేసీ బయటపెట్టారు
సాక్షి, విజయవాడ : నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చకునేందుకే టీడీపీ అవిశ్వాసం పెడుతోందని ఆయన మండిపడ్డారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వైవీ సుబ్బారెడ్డి 13సార్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారని, అయినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో తొలిరోజే అవిశ్వాస నోటీస్ను పరిగణలోకి తీసుకోవడం వెనుక ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నాలుగేళ్లు కేంద్రంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారని మల్లాది నిలదీశారు. టీడీపీ నిజస్వరూపాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బయటపెట్టారని చెప్పారు. నాలుగేళ్లుగా విభజన హామీలపై ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. నేడు అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రజల కోసం పోరాడుతున్నామని టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. అవిశ్వాసం పెట్టి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీకి దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మల్లాది విష్ణు సవాల్ విసిరారు. విభజన హామీల సాధనకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. టీడీపీ మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్న కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చిందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి నాటకాలను గమనిస్తున్నారని చెప్పారు. ఏపీకి బీజేపీ, టీడీపీలు చేసిన అన్యాయంలో చంద్రబాబు ప్రాధాన పాత్ర పోషించారని, కానీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. -
‘అప్పుడేమో ఎగతాళి.. ఇప్పుడేమో అవిశ్వాసం’
సాక్షి, న్యూఢిల్లీ : అవిశ్వాసంపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తామే చాంపియన్ అనిపించుకోవాలనే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. బీజేపీ, టీడీపీలు కలిసి లాలుచీ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘టీడీపీ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే తపన తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఎగతాళి చేసిన చంద్రబాబే అవిశ్వాసం పెట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. రాష్ట్ర సమస్యలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపుతారు. వైఎస్ జగన్ వస్తేనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది’ అని వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నేతలు నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
‘అవిశ్వాసం ఏపాటిదో తేల్చేసిన జేసీ’
సాక్షి, అనంతపురం : కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో వీగిపోవటం ఖాయమని స్పష్టం చేశారు. రాజకీయ వాతావరణం బాగాలేదంటూ టీడీపీ వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడంలేదని జేసీ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వల్ల చర్చ మాత్రమే జరుగుతుందన్నారు. విప్ జారీపై.. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగునున్న నేపథ్యంలో టీడీపీ, ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విప్పై జేసీ స్పందిస్తూ.. విప్ జారీ చేసినా పార్లమెంటుకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అవిశ్వాసంపై చర్చలో ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీ ఎంపీలు మాట్లాడతారని పేర్కొన్నారు. నాకంటే ఇంగ్లిష్, హిందీ బాగా మాట్లాడేవారు ఉన్నారని జేసీ వ్యంగ్యంగా స్పందించారు. ఓ వైపు కేంద్రంపై పోరాటం చేస్తున్నామని బీరాలు పలుకుతున్న టీడీపీ.. సొంత పార్టీ ఎంపీ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడింది. ఇతర పార్టీల మద్దతు కూడగడతామంటూ పైకిచెబుతున్నా.. అవిశ్వాసానికి సొంత నేతల మద్దతే టీడీపీకి లేదని జేసీ వ్యవహారం చాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం సిద్ధం
-
టీడీపీ–బీజేపీ లాలూచీ రాజకీయం తేటతెల్లం
-
బీజేపీ–టీడీపీ నాటకాలు
సాక్షి, న్యూఢిల్లీ: తాము 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా అనుమతించని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తీర్మానాన్ని అనుమతించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు ఆరోపించారు. బీజేపీ–టీడీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం ఢిల్లీలో శాసనమండలిలో విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బదులు సీఎం చంద్రబాబు అంగీకారంతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా కేంద్రం చేసే ప్రకటనపై టీడీపీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు అంగీకారంతోనే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో కూడా కేంద్రం ఇదే విషయాన్ని చెబుతుందని అన్నారు. హోదా ఇచ్చే దాకా పోరాటం ఆగదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ పోరాటం ఆపే ప్రసక్తే లేదని మేకపాటి రాజమోహన్రెడ్డి తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన తాము సభలోకి వెళ్లలేం కనుక పార్లమెంట్ ఆవరణలోనే తమ నిరసన తెలుపుతామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మాటెత్తని టీడీపీ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ వల్లే ప్రత్యేక హోదా పోరాటం ఈ స్థాయి దాకా వచ్చిందన్నారు. పార్లమెంట్ ఆవరణలో చేపట్టే నిరసనలో తమతోపాటు పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొంటారని మేకపాటి తెలిపారు. ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు ఒప్పుకున్నారు కాబట్టే ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ప్రకటించామని కేంద్రం చేయనున్న ప్రకటనపై టీడీపీ ఏం సమాధానం చెబుతుందని వైవీ సుబ్బారెడ్డి నిలదీశారు. ప్యాకేజీకి ఒప్పకుని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఊరూరా తిప్పి సన్మానాలు చేసిన విషయం అందరికీ గుర్తుందన్నారు. రాష్ట్ర ప్రజలను వంచించేందుకు బీజేపీతో ఉన్న ఒప్పందం మేరకు ఇప్పుడు అవిశ్వాసం అంటూ టీడీపీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసమే ప్యాకేజీ కమీషన్లు కొల్లగొట్టవచ్చన్న ఉద్దేశంతోనే టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుందని వరప్రసాదరావు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు సాధన కోసం ఎలాంటి ప్రయత్నం చేయని టీడీపీ నేతలు ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని వరప్రసాదరావు మండిపడ్డారు. బాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం ప్రత్యేక హోదా వద్దన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక యూటర్న్ తీసుకున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి చంద్రబాబే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఆ రోజు ప్యాకేజీ వద్దు, హోదానే కావాలని కోరి ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేదన్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పదం ప్రకారం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమోదించారని, అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను ఆహ్వానించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన దగాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారు బాబుకు బుద్ధి చెబుతారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ ఆందోళన పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం ఇటీవలే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, మాజీ ఎంపీలు ఇక్కడ ధర్నా చేయరాదంటూ పార్లమెంట్ భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఏ నిబంధనల ప్రకారం వద్దంటున్నారో చెప్పాలని మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు ప్రశ్నించారు. తాము నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ నిరసన కొనసాగించారు. -
ఎంపీలను సన్నద్ధం చేయండి
సాక్షి, అమరావతి: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు ఎంపీలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించిన తర్వాత ఆయన సచివాలయంలో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. అలాగే ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎంపీలకు అవసరమైన సమాచారం మొత్తం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కూడా మిగతా పార్టీల మద్దతు ఉండేలా చూడాలని ఎంపీలకు సూచించారు. చర్చకు పది గంటల సమయం ఇచ్చే అవకాశం ఉందని, పార్టీ బలాబలాలను బట్టి చర్చా సమయం ఉంటుందన్నారు. చర్చలో ముగ్గురు సభ్యులు మాట్లాడే అవకాశం రావచ్చని, సమయం చాలకపోతే ప్రసంగం లిఖిత ప్రతిని స్పీకర్కు ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలను కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు ముఖ్యమంత్రికి వివరించారు. కాగా ఎంపీలకు సహకరించేందుకు గురువారం ఢిల్లీ వెళ్లాలని ఆర్థిక మంత్రి మంత్రి యనమల రామకృష్ణుడిని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవిశ్వాసంపై చర్చ ముగిసేవరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. రాజధానిలో ప్రైవేటు రంగానికి ప్రత్యేక విధానం సీఆర్డీఏ సమీక్షలో సీఎం రాజధాని నగరం అభివృద్ధి పనుల్లో ప్రైవేటు రంగాన్ని ఎలా భాగస్వాముల్ని చేయాలనే అంశంపై వీలైనన్ని ఆప్షన్లని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో ఆయన రాజధాని పనుల పురోగతిని సమీక్షించారు. వివిధ సంస్థలు, అభివృద్ధిదారుల నుంచి వచ్చిన సూచనలతో ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. అమరావతిలో ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసి నిర్వహించేందుకు మహీంద్రా గ్రూపు ముందుకొచ్చిందని చెప్పారు. రూ.26 వేల కోట్ల మేర రాజధానిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఎలా సమకుర్చుకోవాలన్న అంశంపై సమావేశంలో వివిధ అంశాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక సులభంగా ఉండాలి సంక్షేమ పథకాలకు అర్హతలను బట్టి లబ్ధిదారులను ఎంపిక చేసే విధానం సులభంగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన సంక్షేమ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వంలోని ప్రతి విభాగం కూడా ‘గ్రామదర్శిని’ కార్యక్రమం కోసం తగిన తాజా సమాచారంతో సిద్ధం కావాలని ఆదేశించారు. చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలులో వివాహ ధ్రువీకరణ పత్రం లేనివారికి కూడా కానుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలు, అన్నక్యాంటీన్లు, ఎన్టీఆర్ గృహనిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో ఒక అన్న క్యాంటీన్ నెలకొల్పాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్లను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు. -
పార్లమెంట్లో మహాకుట్ర
విజయవాడ సిటీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నోటీసును ఆమోదించడం వెనుక మహాకుట్ర జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తే అనుమతించని కేంద్రం ఇప్పుడు టీడీపీ ఇచ్చిన నోటీసును ఎందుకు అనుమతించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు–బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని, అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు బుధవారం విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఇచ్చిన నోటీసుకు అనుమతి తెలపడం పార్లమెంట్ సమావేశాల్లో కొత్త ట్విస్ట్ అని చెప్పారు. తమ పార్టీ వరుసగా 13 సార్లు నోటీసులు ఇస్తే ఎందుకు చర్చ జరపలేదని ప్రశ్నించారు. అప్పుడెందుకు హెడ్ కౌంట్ చేయలేదని నిలదీశారు. అవిశ్వాస తీర్మానంపై బాబు ప్రగల్భాలు ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు? వాటి వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టాలి. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరింది. బుధవారం పార్లమెంట్లో చోటుచేసుకున్న సన్నివేశమే అందుకు ఉదాహరణ. పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ సమాధానం చెప్పాలి. దేశం తలదించుకొనేలా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా? ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ వేదికగా పెద్ద డ్రామా ప్రదర్శించాలని టీడీపీ బుధవారం ఓ ప్రణాళిక రూపొందించుకుంది. గతంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా ఎన్ని డ్రామాలు ఆడారో ప్రజలంతా చూశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో అందరికీ తెలుసు. కేంద్రంపై మొట్టమొదట అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుకొచ్చింది వైఎస్సార్సీపీనే. అవిశ్వాస తీర్మానంపై మొదట్లో చంద్రబాబు హేళనగా మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం పెడితే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందా అన్నారు. ఆ తరువాత యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నానని ప్రగల్భాలు పలుకుతున్నారు’’ అని అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబుది దిగజారుడుతనం ‘‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును మొదటి రోజే స్పీకర్ ఆమోదించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది కుట్రలో భాగమేనన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్సీపీ నుంచి చంద్రబాబు కొనుగోలు చేస్తే.. ఆమెను మా పార్టీ ఫ్లోర్ లీడర్గా కేంద్రం గుర్తించడం దారుణం. చంద్రబాబుకు రాజగురువు అయిన ఓ పత్రాకాధిపతితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రహస్యంగా సమావేశమైన తర్వాతే టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్ అనుమతించడంపై అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే. ఆయన తనకు మద్దతు ఇచ్చిన పార్టీలను పుటుక్కున ముంచేస్తాడు. నరేంద్ర మోదీ–చంద్రబాబు జోడి కలిసి రాష్ట్రాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు. మళ్లీ కలిసి మరింత నాశనం చేస్తారు. చంద్రబాబు అటు కాంగ్రెస్తోనైనా, ఇటు బీజేపీతోనైనా కలుస్తానంటున్నారు. రకరకాల బేరసారాలు సాగిస్తూ ప్రజలను మోసం చేయగల దిగజారుడుతనం చంద్రబాబుది’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ‘‘ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తే.. టీడీపీ నేతలు దానిపై తప్పుడు ప్రచారం సాగిస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడైనా తిరుమల కొండపై స్వామివారి ఆలయాన్ని మూసివేశారా? శ్రీవారితో పెట్టుకుంటే అనుభవించక తప్పదు’’ అని అంబటి హెచ్చరించారు. -
అవిశ్వాసంలోనూ అదే బంధం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ, బీజేపీల మధ్య కొనసాగుతున్న స్నేహబంధం ఎంతటి దృఢమైందో మరోసారి తేటతెల్లమైంది. రెండు పార్టీల మధ్య సాగుతున్న లాలూచీ రాజకీయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. విడిపోయామని పైకి చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ–బీజేపీ అంతర్గతంగా సయోధ్య సాగిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా దానిపై చర్చించేందుకు బీజేపీ ముందుకు రాలేదు. సభ ఆర్డర్లో లేదంటూ తప్పించుకుంది. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే కేంద్రంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించారు. శుక్రవారమే దానిపై చర్చ, ఓటింగ్ చేపడతామని ప్రకటించారు. కేంద్రంపై 8 పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా, టీడీపీ నోటీసునే స్పీకర్ స్వీకరించడం గమనార్హం. టీడీపీ, బీజేపీలు పైకి ప్రత్యర్థుల్లా నటిస్తూ, లోపల పరస్పర అవగాహనతో పని చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ పార్టీల సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను బుధవారం లోక్సభలో స్పీకర్ ప్రస్తావించారు. ‘‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణరావు, తోట నర్సింహం, తారిఖ్ అన్వర్, మహ్మద్ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్చంద్రన్, కేసీ వేణుగోపాల్ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాస వ్యక్తపరుస్తూ నోటీసులు అందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ సభ అనుమతిని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు. తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక లేచి నిలుచున్నారు. నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికి పైగా సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నామంటూ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగినప్పటికీ లోపాయికారీ ఒప్పందాలతో పూర్వపు బంధాన్ని యథాతథంగా కొనసాగిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వంగి వంగి నమస్కారాలు పెట్టారు. ప్రధాని ముందు అతి వినయం ప్రదర్శించారు. పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నానంటూ నమ్మబలుకుతున్నారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో సభ్యురాలిగా నియమించారు. బీజేపీ సీనియర్ నేత, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ను చంద్రబాబు మీడియా సలహాదారుగా నియమించుకున్నారు. అలాగే ఇటీవల పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తర్వాత విశాఖపట్నంలో జరిగిన సదస్సులో ఇరువురూ ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. హైదరాబాద్లో ఒకరోజు పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు రాజగురువు అయిన ఓ పత్రికాధిపతితో ఏకాంతంగా భేటీ కావడం గమనార్హం. టీడీపీ–బీజేపీ మధ్య అనుబంధానికి ఇవన్నీ నిదర్శనాలేనని పరిశీలకులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశం లేదట! వైఎస్సార్సీపీ టిక్కెట్పై గెలిచి, టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో అధికార పక్షం ఆహ్వానించడం, అక్కడ నేమ్ప్లేట్ పెట్టడం దేనికి సంకేతమని పరిశీలకులు అంటున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి గట్టిగా నిలదీయడంతో చివరకు ఆమె నేమ్ప్లేట్ను తొలగించక తప్పలేదు. కాగా, తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బుట్టా రేణుకలను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ పదేపదే కోరుతున్నా స్పీకర్ పట్టించుకోవడం లేదు. కానీ, ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను వైఎస్సార్సీపీ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో భాగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బు«ధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పడకొట్టాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పడం మరో కొసమెరుపు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి, అధికార అనుభవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పేరుతో డ్రామాలాడుతోందని రాజకీయ విశ్లేకులు చెబుతున్నారు. ఇరు పార్టీల మధ్య లాలూచీలో భాగంగానే ఈ అవిశ్వాసం అనే నాటకం మొదలైందని అంటున్నారు. స్వలాభం కోసం కేంద్రంతో బాబు కుమ్మక్కు రాష్ట్రానికి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని గత ఎన్నికల ప్రచారంలో డిమాండ్ చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి, అధికారం పంచుకున్నారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదు, ప్రత్యేక ప్యాకేజీయే మేలని ప్రకటించారు. ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా అసెంబ్లీలోనే ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం సైతం చేశారు. కేంద్ర మంత్రులను ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో మళ్లీ హోదా రాగం అందుకున్నారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న వైఎస్సార్సీపీ బాటలోనే చంద్రబాబు నడవక తప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని చెబుతున్న చంద్రబాబు ఇప్పుడు స్వలాభం కోసం అదే కేంద్రంతో కుమ్మక్కయ్యారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ పోరుబాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను కలిసి 50 మందికి పైగా సభ్యుల మద్దతును కూడగట్టింది. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో గొంతెత్తి నినదించారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తంచేశారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని వైఎస్సార్సీపీ ప్రకటించగా తాము మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ మరుసటి రోజే తామే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామంటూ యూటర్న్ తీసుకున్నారు. వైఎస్సార్సీపీ 13 సార్లు నోటీసులు ఇచ్చినా లోక్సభ స్పీకర్ అనుమతించలేదు. ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యమంటూ పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న ఐదుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి, ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం స్పీకర్ వద్ద పట్టుపట్టి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన విన్యాసాలకు లెక్కే లేదు. -
ముందస్తుకు సంకేతమా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి కేంద్రం అంగీకరించడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికలను ముందుకు జరిపే విశేష అధికారం ప్రధానికే ఉన్నా, చివరి నిమిషం లెక్కలను బేరీజు వేసుకుని ఆ దిశగా అడుగేసే అవకాశాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా 7–8 నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోదీ ఆలోచన ఏంటో ఊహించడం కష్టమని, ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఒకరు వెల్లడించారు. మరోవైపు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లతో పాటే లోక్సభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులపై చర్చ తప్ప, ముందస్తు ఎన్నికలపై ఆలోచించడం లేదని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. జాగ్రత్తగా పరిశీలిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్.. ఇటీవల ప్రధాని మోదీ వరుసగా యూపీలో పర్యటించిన సంగతిని విపక్షాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ అన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందా? అని కాంగ్రెస్, లెఫ్ట్లో అంతర్మథనం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం, ప్రచారకర్తకు ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుస్తాయని లెఫ్ట్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీకి తగిన రాజకీయ అస్త్రాలు ఉన్నట్లయితే ఇతర పార్టీలు స్పందించేందుకూ అవకాశం ఇచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘సంపర్క్ కే సమర్థన్’ పేరిట ప్రముఖులతో సమావేశమై ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. సుమారు 100 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి అవకాశం కోల్పోవచ్చని అమిత్ షా పర్యటనల్లో తెలిసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరెస్సెస్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
అవిశ్వాసం ఎందుకు పెట్టారో?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అవిశ్వాస తీర్మానం ఎవరిని అడిగి పెట్టారు? వారెందుకు పెట్టారో, ఏం కారణాలు చెబుతున్నారో చూసి మేం చర్చలో మాట్లాడతాం’’అని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ అన్నారు. బుధవారమిక్కడ ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘వారు అవిశ్వాసం పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా మాకు సంబంధం లేదు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాం’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజు ఉన్న వాతావరణమే ఈ 18 రోజులు ఉండి బిల్లులు ఆమోదం పొందుతాయని అనుకుంటున్నాం. హైకోర్టు విభజన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. హైకోర్టు విభజనకు గతంలోనే కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దాన్ని అమలుకు సభలో కోరతాం. బయ్యారం ఉక్కు కర్మాగారం అంశాన్ని లేవనెత్తుతాం. కాళేశ్వరం ఆపాలని, అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీఎస్ మూడు పేజీల లేఖ రాశారు. వాళ్ల(ఏపీ) ఆలోచనలు, మా ఆలోచనలు వేరు’’ అని అన్నారు. మాకు నచ్చలేదు: సీతారాం నాయక్ ‘‘కాళేశ్వరాన్ని అడ్డుకోవడం ఏపీకి తగదు. ఓవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటూ మరోవైపు అవిశ్వాసానికి మా మద్దతు అడగడం నచ్చలేదు. చర్చలో పాల్గొంటం. కేంద్రం ద్వంద్వ వైఖరిని నిలదీస్తాం’’ అని సీతారాం నాయక్ చెప్పారు. -
తొలిరోజే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో వాతావరణం గందరగోళంగా మారింది. లోక్సభలో విశ్వాస పరీక్ష, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పలు రాజకీయ పక్షాల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. అయితే ఈ గందరగోళంలోనూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. స్పీకర్ క్వశ్చన్ అవర్ను ప్రారంభించగానే తెలుగుదేశం, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సహాపలు పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేశారు. ఎన్డీయే మాజీ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ‘వి వాంట్ జస్టిస్’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఎస్పీ నేతలు కూడా వెల్లోకి దూసుకొచ్చి పలు డిమాండ్లతో నినదిం చారు. కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థలాల్లోనే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు. కొత్త సభ్యుల ప్రమాణం సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభకు చేరుకుని అధికార, విపక్ష సభ్యులందరికీ అభివాదం చేశారు. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కుకాడే యశ్వంత్ రావ్ (ఎన్సీపీ), గవిట్ రాజేంద్ర (బీజేపీ), తోఖేహో (ఎన్డీపీపీ), తబస్సుమ్ బేగమ్ (ఆర్ఎల్డీ) ప్రమాణం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చబోం అటు, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో ఆందోళన నెలకొందని సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని.. ఇందుకోసం సంబంధిత చట్టాలకు సవరణలు జరుపుతున్నామన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకుండే హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోం. ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఈ హక్కులను కాలరాస్తే ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 30 రాష్ట్రాల్లో 24 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు మరో మంత్రి హన్స్రాజ్ గంగారామ్ ఆహిర్ వెల్లడించారు. మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు దేశ తొలి సమగ్ర మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును కేంద్ర మంత్రి మేనకా గాంధీ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నేరాన్ని నిరోధించడంతో పాటు బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. చాకిరి, భిక్షాటన, వివాహాల్ని కూడా దీని పరిధిలో చేర్చారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు కూడా..: ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించే బిల్లును ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. -
హస్తినలో కొత్త డ్రామా!
తెలుగుదేశం ఆధ్వర్యంలో మరోసారి హస్తిన వేదికగా అపవిత్ర రాజకీయ క్రీడ మొదలైంది. విలువల గురించి తరచు లెక్చెర్లిచ్చే బీజేపీ ఇందులో బాహాటంగా భాగస్వామి కావడమే తాజా పరిణామం. గత బడ్జెట్ సమావేశాల రెండో దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినా సభలో ప్రశాంతత లేదన్న సాకుతో వాయిదాలతో కాలక్షేపం చేసిన లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు వెంటనే ఆమోదం తెలపడం... దానిపై శుక్రవారమే చర్చ ఉంటుందని నిర్ణయించడం ఇందుకు తార్కాణం. ఎన్డీఏ సర్కారుపై ఈ నాలుగేళ్లలో మొట్టమొదట అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని వాదిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు గత్యంతరం లేక ఎన్డీఏ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి, వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి తాము కూడా మద్దతిస్తామని ప్రకటించడం... ఆ మర్నాడే గొంతు సవరించుకుని తామే అవిశ్వాసం పెడతామని చెప్పడం... చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ నోటీసు ఇచ్చినప్పుడల్లా ఆ పార్టీ కూడా ఇవ్వడం గత బడ్జెట్ సమావేశాల్లో దేశ ప్రజలంతా చూశారు. ఆ నోటీసులపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని విలువైన బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి దోహదపడాల్సిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. బడ్జెట్ సమావేశాల్లో కేవలం 12 శాతం కాలం మాత్రమే లోక్సభ పనిచేసిందని, 2000 సంవత్సరం తర్వాత ఇదే అతి స్వల్పకాలమని గణాంకాలు చెబుతు న్నాయి. అప్పుడు అంత పట్టుదలగా అవిశ్వాస తీర్మానానికి మోకాలడ్డిన సర్కారుకు ఇప్పుడెందుకు ఆ బాధ్యత గుర్తొచ్చిందో బీజేపీ సంజాయిషీ ఇవ్వాలి. అప్పటికీ, ఇప్పటికీ మారిన పరిస్థితులేమిటి? సభలో వైఎస్సార్ కాంగ్రెస్ లేకపోవడమే కొత్తగా వచ్చిన మార్పు. గత సమావేశాల సమయంలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చే ముందు తాము ప్రత్యేక హోదా కోసం అన్నివిధాలా పోరా డుతామని, ఆఖరికి పదవుల నుంచి వైదొలగి ప్రజల ముందుకెళ్లడానికి కూడా సిద్ధమేనని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. చివరకు అవిశ్వాసంపై చర్చ రాకుండా చేయడంతో ముందు చెప్పినట్టే ఆ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామా చేశారు. నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్న స్పీకర్ను కలిసి వాటిని ఆమోదింపజేసుకున్నారు. ఈ సందర్భాల్లో ఎక్కడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ లేదా ఇతర మంత్రులు వచ్చే సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమని చెప్పలేదు. అంతా గడిచాక ఇప్పుడు తాము కోరుకుంటున్న బిల్లులు సభామోదం పొందా లనో, మరే కారణమో... మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేశాకే ఎన్డీఏ సర్కారు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించింది. తెలుగుదేశం, బీజేపీల మధ్య ఈ విషయంలో లోపాయికారీ అవగాహన ఉన్నదన్న అనుమా నానికి మరో ఉదంతం కూడా తావిచ్చింది. మంగళవారం పార్లమెంటు భవన్లో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఆహ్వానం పంపటం ఈ కుమ్మక్కు రాజకీయానికి ఆనవాలు. ఆమె నిరుడు అక్టోబర్లోనే తెలుగుదేశం పంచన చేరారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని అప్పట్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ స్పీకర్ను కోరింది. అంతకు మూడేళ్లముందు ఫిరాయించిన ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల విషయంలో తాత్సారం చేస్తూ వస్తున్న సుమిత్రా మహాజన్ రేణుకపై చర్య సంగతినీ పక్కనబెట్టారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి కోరడానికి కలిసినప్పుడు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయమై అడిగారు. ఆ తర్వాతనైనా ఆ వ్యవహారాన్ని తేల్చడానికి ఆమెకు వచ్చిన అడ్డంకేమిటో తెలియదు. ఈ నెల 10న వివిధ పార్టీలకు ఆమె లేఖరాస్తూ... ‘మన పార్లమెంటు, మన ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలనేదానిపై ఆత్మవిమర్శ చేసు కోండి’ అని హితోక్తులు పలికారు. నైతికతకు నీళ్లొదిలి, నిస్సిగ్గుగా ఫిరాయించిన ఎంపీలపై నిబం ధనల ప్రకారం అనర్హత వేటు వేయడంలో తాత్సారం చేయడం ఏ ఆదర్శానికి దోహదపడుతుందో ముందుగా ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలి. అఖిలపక్ష సమావేశంలో రేణుక నామఫలకం ఉండ టంపై అభ్యంతరం చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి అనంత కుమార్ ఇచ్చిన జవాబు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెకు సంబంధించిన అనర్హత పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నదని అనంతకుమార్ సంజాయిషీ ఇచ్చారు. అంటే... ఆయనకు పిటిషన్ వచ్చిందని తెలుసు. అది పెండింగ్లో ఉన్నదనీ తెలుసు. అయినా పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రిగా తాను చేయాల్సింది చేయరు. అఖిలపక్షానికి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఆమెను ఆహ్వానిస్తారు! ఏమి తర్కం!! హస్తినలో గుడ్డి దర్బార్ కొనసాగుతున్నదనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా? ప్రత్యేక హోదాకు టీడీపీ, బీజేపీలు రెండూ గండికొట్టి ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తెచ్చాయి. అదే అతి విశిష్టమైనదని బుకాయిస్తూ వచ్చాయి. కానీ నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ విడవకుండా పోరాడిన పర్యవసానంగా ప్రజానీకంలో హోదా అంశం బలంగా నాటుకుపోయింది. ఈ సంగతి పసిగట్టి చివరకు గత్యంతరం లేక టీడీపీ బాణీ మార్చింది. ఈ బాణీలోనూ కుమ్మక్కు రాజకీయాలు ఉండొచ్చునని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే గత సమావేశాల సమయంలో సభ లోపలా, వెలుపలా నాటకాలాడిన టీడీపీ ఎంపీలు ఈసారైనా వాటికి స్వస్తి పలికి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి. అంతకన్నా ముందు గతంలో ప్యాకేజీని ఒప్పుకుని తప్పు చేసినందుకు లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్నేళ్లుగా మోకాలడ్డినందుకు తెలుగుదేశం ప్రత్యేక హోదా సాధించి పాప పరిహారం చేసుకోవాలని ఆ పార్టీ గుర్తించాలి. -
అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు 13 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అనుమతించని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వర్షాకాల సమావేశాల తొలిరోజే.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. శుక్రవారం (జూలై 20న) చర్చతోపాటు ఓటింగ్ జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన అనంతరం సభాపతి పలు అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, బి.శ్రీరాములు, సి.ఎస్.పుట్టరాజు ఇచ్చిన రాజీనామాలు ఆమోదించినట్లు సభకు వెల్లడించారు. అనంతరం వివిధ పార్టీల సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ఇచ్చిన నోటీసులను ప్రస్తావించారు. శుక్రవారం జరిగే చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. విశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించడం గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. ‘కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ రావు, తోట నర్సింహం, తారిఖ్ అన్వర్, మహ్మద్ సలీం, మల్లికార్జున ఖర్గే, ఎన్.కె.ప్రేమ్చంద్రన్, కేసీ వేణుగోపాల్ నుంచి కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తూ నోటీసులందాయి. వీటిని సభ ముందుంచడం నా విధి. వీటిలో కేశినేని శ్రీనివాస్ నోటీసు ముందుగా వచ్చింది. ఆయన సభ అనుమతి కోరాలని అడుగుతున్నాను’ అని పేర్కొన్నారు. వెంటనే కేశినేని లేచి ‘ఈ సభ కేంద్ర మంత్రి మండలిపై అవిశ్వాసం వ్యక్తపరుస్తోందనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతిని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేందుకు మద్దతు ఇచ్చే సభ్యులు లేచి వారి స్థానాల్లో నిలుచోవాలని సభాపతి కోరారు. దీంతో కాంగ్రెస్, సీపీఎం, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్, తృణమూల్, టీడీపీ, ఐయూఎంఎల్, ఆర్జేడీ, ఆర్ఎస్పీ తదితర పార్టీల సభ్యులు లేచి నిలుచున్నారు. ఇందులో ఫిరాయింపు ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక కూడా ఉన్నారు. అధికార బీజేపీ సహా.. శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, అన్నాడీఎంకే సభ్యులు కూర్చున్నారు. మొత్తంగా విపక్షాలకు చెందిన 70 మందికి పైగా సభ్యులు లేచి నిలుచున్నారు. సభాపతి వారిని లెక్కించి నిబంధనల ప్రకారం అవసరమైన (50 మందికి పైగా) సభ్యుల మద్దతు ఉన్నందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. పాలేవో, నీళ్లేవో తేలిపోతాయ్: కేంద్రం ఈనేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ లేచి మాట్లాడారు. ‘విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పాలేవో నీళ్లేవో తెలిసిపోతాయి’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే సభాపతి జీరో అవర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే లేచి మాట్లాడారు. తాను అవిశ్వాస తీర్మానానికి ముందుగానే నోటీసులు ఇచ్చానని, పెద్ద పార్టీ అయినందున తాను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి బదులిస్తూ నోటీసులు ఇచ్చిన అందరి పేర్లు ప్రస్తావించానని, పార్టీ పరిమాణాలతో సంబంధం లేకుండా.. అందరి కంటే ముందుగా ఇచ్చిన వారినే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తానని తెలిపారు. సభ వాయిదా పడి మధ్యాహ్నం 2.10 గంటలకు తిరిగి ప్రారంభమైన అనంతరం.. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ, ఓటింగ్ ఉంటుందని ప్రకటించారు. ఒకవేళ శుక్రవారం నాడు చర్చ ఆలస్యమైతే.. ఓటింగ్ సోమవారం జరిగే అవకాశం ఉంది. మమత మద్దతు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన పార్టీలకు తమ మద్దతుంటుందని తృణమూల్ చీఫ్ మమత బెనర్జీ స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతకు కట్టుబడి ఉన్నందున సంపూర్ణ మద్దతుంటుందని ఆమె కోల్కతాలో పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేకుండా పోయింది అందుకే ఈ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. సభలో బీజేపీకి మద్దతున్నప్పటికీ.. బయట పూర్తి వ్యతిరేకత ఉంది’ అని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా తృణమూల్ ఎంపీలంతా శుక్రవారం సభకు హాజరవ్వాలని.. చర్చ, ఓటింగ్లో పాల్గొనాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. దేనిపైనైనా చర్చకు సిద్ధం: మోదీ న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో.. రాజకీయ పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే పలు అంశాలపై దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం సభ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. విస్తృతమైన అంశాలపై సభలో కూలంకశంగా చర్చ జరిగేలా ఎంపీలు వ్యవహరించాలని.. రాజకీయ పార్టీలు దేశానికి అవసరమైన అంశాలపై సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని తెలిపారు. సభ ప్రశాంతంగా జరిగేందుకు విపక్షాలు సహకరించుకోవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయ పార్టీ సభ్యుడైనా, దేశానికి లాభం చేసే ఏ అంశాన్నైనా సభ దృష్టికి తెస్తే.. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇలాంటి చర్చల ద్వారా ప్రభుత్వానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సూచనలు అందుతాయి’ అని మోదీ పేర్కొన్నారు. అవిశ్వాసం నెగ్గుతుంది: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రాజీవ్ సాతవ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోదీ నెరవేర్చలేకపోయారనీ, ఇది గారడీ ప్రభుత్వమని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయింది. పైపెచ్చు, స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన ధనం 50శాతంపైగా పెరిగింది. యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీ నెరవేరలేదు. అధికారంలోకి వచ్చి 50 నెలలు గడిచినా ఒక్కటీ నెరవేరలేదు. కశ్మీర్ సమస్య రగులుతూనే ఉంది. దళితులపై దాడులు పెచ్చుమీరాయి’ అని విమర్శలు గుప్పించారు. అంతకుముందు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేందుకు సభలో అవసరమైన సంఖ్యాబలం లేదని మీడియా ప్రశ్నించగా.. ‘మాకు బలం లేదని ఎవరన్నారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. శుక్రవారంనాటి అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సభలో ఉండాలంటూ తన సభ్యులకు కాంగ్రెస్ విప్ కూడా జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ, ఓటింగ్కు స్పీకర్ అంగీకరించిన నేపథ్యంలో బుధవారం వరకు అవిశ్వాసానికి అనుకూల, వ్యతిరేక, తటస్థ పార్టీల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అనంత్కుమార్, విజయ్ గోయల్, జితేంద్రసింగ్, మేఘ్వాల్ పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్ -
అవిశ్వాసంపై చర్చ.. ఎంపీ జేసీ డుమ్మా!
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అవిశ్వాసంపై చర్చకు ఒక్క రోజు ముందే అధికార పార్టీలో చీలిక మొదలైంది. పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. ఇవాళ లోక్సభలో జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఎంపీ సుజనా చౌదరి తీరుపై జేసీ అలిగినట్లు తెలుస్తోంది. అంతేకాక అవిశ్వాస తీర్మానానికి జేసీ హాజరుకానంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా శుక్రవారం నాడు లోక్ సభకు జేసీ వెళ్లనంటున్నారట. ఎంపీ జేసీ దివాకర్ బాటలో మరికొందరు టీడీపీ ఎంపీలు నడవనున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
మొదటి నుంచి ఏపీకి మద్ధతుగా ఉన్నాం: టీఆర్ఎస్
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో గత సమావేశాల మాదిరిగా ఈసారి కూడా పార్లమెంటు సమావేశాలు వృధా కాకుండా ఉండేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారని, అలాగే ఆంధ్రప్రదేశ్కు మొదటి నుంచి మద్ధతుగా ఉన్నామని టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీకి నష్టం జరిగిందనే సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఏపీ ప్రభుత్వానికి తగదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి మా మద్ధతు అడగటం మాకు నచ్చలేదని తెలిపారు. అవిశ్వాస తీర్మాన చర్చలో తమ పార్టీ ఎంపీలు పాల్గొంటారని, చర్చలో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని వివరించారు. పార్లమెంటరీ పక్ష నేతలు ఓటింగ్పై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. విభజన చట్టం అమలు, కేంద్రం వైఖరి పట్ల తాము సంతృప్తిగా లేమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు కూడా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ డిమాండ్లను పార్లమెంటులో కేంద్రం ముందు ఉంచుతామని సీతారాం నాయక్ తెలిపారు. -
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం సభలో చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. శుక్రవారం నుంచి సభకు విధిగా హాజరుకావాలని కోరుతూ ఎంపీలకు మూడు లైన్లతో కూడిన విప్ను జారీ చేశారు. కాగా, పార్టీ చీఫ్ విప్గా అనురాగ్ ఠాకూర్ను బుధవారం ఉదయం బీజేపీ నియమించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను తమ ఎంపీలకూ విప్ జారీ చేయాలని బీజేపీ కోరింది. మరోవైపు నరేంద్ర మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాల్లో విధిగా పాల్గొనాలని కోరుతూ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం స్పీకర్ సుమిత్రా మహజన్ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని అంశాలను వెల్లడిస్తామన్నారు. -
‘టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు నిదర్శనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మేం 13 సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆనాడు అనుమతించలేదన్నారు. మేం రాజీనామా చేసిన వెంటనే టీడీపీ అవిశ్వాసం అనుమతించారని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. 50మందికి పైగా సభ్యుల మద్దతున్నా అవిశ్వాసానికి అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ-బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే ఇది జరిగిందని వైవీ ఆరోపించారు. ‘హోదాపై పీఎం మోదీని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? నాలుగేళ్ల పాటు కేంద్ర కేజినెట్లో పాల్గొని.. ఏనాడు హోదా గురించి టీడీపీ నేతలు మాట్లాడలేదు. విభజన హామీలు నెరవేర్చకుండా 5కోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ డ్రామాలో భాగంగానే ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఐదుగురు ఎంపీలు చిత్తశుద్ధితో హోదాకోసం పొరాడాం. ఆమరణ దీక్ష చేశాం, రాజీనామాలు కూడా చేశాం. మేం చేసిన పోరాటాల వల్లే హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది’ అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ చేపడుతామని స్పీకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. టీడీపీ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చర్చలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాజ్యసభలో వచ్చే సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
ఆయన్ను నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదినట్లే
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్సీపీ సీనియర్ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం వైఎస్సా్ర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామకు తెరలేపిందని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ కేంద్రంపై అవిశ్వాసంపై ప్రగల్భాలు పలుకుతోందని దుయ్యబట్టారు. కేంద్రంపై అందరికంటే ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసం పెడితే విమర్శించిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తొలిరోజే టీడీపీ ఆమోదం పొందడం వెనుక కుట్ర లేదా అని అంబటి ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఇది కొత్త ట్విస్ట్ అని.. తమ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చర్చ జరపలేదని, ఎందుకు హెడ్ కౌంట్ చేయలేదని నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారని, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని, దానికి నేడు (బుధవారం) పార్లమెంట్లో జరిగిన సన్నివేశమే ఉదాహరణని అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం తలదించుకొనేలా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా అంటూ రాంబాబు మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా మహాకుట్ర జరిగిందని, బీజేపీ, చంద్రబాబుల మధ్య లాలాచీ కుస్తీ జరిగిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలపై తప్పుడు ప్రచారం చేస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎప్పుడైనా తిరుమల కొండపై స్వామివారి ఆలయం మూసివేశారా అని ప్రశ్నించారు. ఆ తరువాత నిర్ణయం ఎందుకు పునఃసమీక్షించారని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం, పాలకమండలి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండపై ఎదో జరుగుతోందని, స్వామివారితో పెట్టుకుంటే అనుభవించక తప్పదని అంబటి హెచ్చరించారు. -
ఎట్టకేలకు అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ సభలో చదవి వినిపిస్తుండగా.. టీడీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి 50కి పైగా సభ్యుల మద్దతు లభించడంతో పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపకపోవడం గమనార్హం. టీడీపీ ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందస్తుగానే సంకేతమిచ్చారు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా చర్చకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే త్వరలో తేదీ ప్రకటిస్తామని స్పీకర్ తెలిపారు. అయితే ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 పనిదినాల పాటే జరగనుండటంతో రెండు మూడు రోజుల్లో చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మాన నోటిసులిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, చర్చలో అన్ని విషయాలు వెల్లడిస్తామని, పార్లమెంట్ వ్యవహారాల శాక మంత్రి అనంత్కుమార్ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. -
‘గతంలో మోదీ పారిపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి జరిగిన అన్యాయం, అఫిడవిట్ మీద కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్టు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ నిర్ణయాలను వ్యతిరేకించేలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారని, ఈ ధోరణిని కాంగ్రెస్ నిలదీస్తోందన్నారు. అదేవిధంగా సోమవారం జరిగే పార్టీ సమావేశంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేలా చర్చించనున్నట్టు పేర్కొన్నారు. గత సమావేశాల్లో యూపీఏ భాగస్వామ్యాలను ఒప్పించి తీర్మానం పెడితే మోదీ పారిపోయారని గుర్తు చేశారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం సహా అన్నీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కేంద్రాన్ని నిలదీసేలా అధిష్టానాన్ని కోరామన్నారు. కాంగ్రెస్ బలపడుతుందనే డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శలు చేస్తున్నారని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే బాగుండేదన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పెట్టబోయే అవిశ్వాసానికి ఏపీలోని పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని భావిస్తున్నామన్నారు. -
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కౌన్సిలర్లు
సాక్షి, కృష్ణా: గుడివాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ అడపా బాబ్జీపై టీడీపీ కౌన్పిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘంలో మొత్తం 36 మంది కౌన్సిల్ సభ్యులలో వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 16 మంది సభ్యులు గెలుపొందారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. రెండేళ్ల కిందట చైర్మన్ యాలవర్తి శ్రీనివాసరావుతో పాటు 11 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి ఫిరాయింపు అయ్యారు. దీంతో టీడీపీ బలం 28కి పెరిగింది. కౌన్సిలర్లు 28 సభ్యులతో సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీలను కలెక్టర్ లక్ష్మికాంతంకు పంపించారు. కలెక్టర్ దీనిపై ప్రత్యేక సమావేశం కోసం సభ్యలకు నోటీసులు జారీ చేయాలని ఆర్డీఓ చక్రపాణిని ఆదేశించారు. -
రాజకీయాల నుంచి తప్పుకుంటా!
సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల: తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆర్టీసీ చైర్మన్, అధికార పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. నియోజకవర్గంలో ఇమడలేక పోతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నానని అన్నారు. సోమవారం గోదావరిఖనిలోని ఐదో గని గేటు మీటింగ్లో కార్మికుల సమావేశంలో, జగిత్యాల లో విలేకరులతో మాట్లాడారు. రామగుండం మేయర్పై అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన 24 గంటల్లోపు సోమారపు ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ‘‘15 ఏళ్లు రాజకీయంలో ఉన్నా.. అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. కానీ నియోజకవర్గంలో మాత్రం ఇమడ లేకపోతున్నా’’అని సత్యనారాయణ అన్నారు. అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకోవాలని, అదే ఫైనల్ కాబట్టి కొన్ని నిర్ణయాల్లో ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు. మున్సిపల్లో తాను అడుగుపెట్టలేని స్థితి ఉందన్నారు. ఆర్టీసీ అధ్వాన స్థితిలో ఉందని, ఏదో చేయాలనుకున్నా స్థానిక పరిణామాలు మనోవేదనకు గురిచేశాయన్నారు. మేయర్ మార్పును ప్రజలే కోరుతున్నారని చెప్పారు. అవిశ్వాసం అనే పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి చెప్పారని, కానీ కార్పొరేటర్లకు నచ్చజెప్పినా వినడం లేదన్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా.. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు అండగా ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎవరు నిలబడినా గెలుస్తారని, వారికి అండగా ఉంటానని చెప్పారు. తాను రాజ కీయ సన్యాసం తీసుకున్నందున ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతానని సత్యనారాయణ అన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ పదవులకు రాజీనామా చేస్తే అధిష్టానాన్ని ధిక్కరించినట్లవుతుందని, అందుకే రాజీనామా చేయనన్నారు. రాజకీయ సన్యాసమే తీసుకుంటే ఇక రాజీనామాలెందుకని ప్రశ్నించారు. కాగా, తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అవిశ్వాసంపై తగ్గం: టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాగా మేయర్పై పెట్టిన అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదని టీఆర్ఎస్ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. 50 మందికి గాను మేయర్, డిప్యూటి మేయర్లు పోనూ, 48 మంది కార్పొరేటర్లలో 41 మంది అవిశ్వాసానికి మద్దతునిస్తున్నారని పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ తదితరులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
ఎంపీపీ సురేఖపై అవిశ్వాస తీర్మానం
పశ్చిమగోదావరి, పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్డీఓ ఫార్మాట్లో మండలంలోని 18 మంది ఎంపీటీసీలు, ఓ కోఆప్షన్ సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని కొవ్వూరు ఆర్డీఓ వైఎస్వీకేజీఎస్ఎల్ సత్యనారాయణకు గురువారం అందించారు. ఎంపీపీ పదవికి రాజీనామాపై ఇరువర్గాల మధ్య ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. ఎంపీపీ పదవిని అయిదేళ్లలో రెండు భాగాలుగా ఇద్దరు పంచుకోవాలని మొదట్లో నిర్ణయించుకున్నారు. మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖకు, రెండవ భాగంలోని రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతికి కేటాయించాలని అనుకున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 5వ తేదీ 2017 నాటికి పల్లి జూలీ సురేఖకు పదవీ కాలం ముగిసింది. అయితేఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని, ఎన్నికల అనంతరం బలవంతంగా ఒప్పందం చేశారని ఆరోపిస్తూ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేయడానికి ససేమిరా అనడంతో వివాదం ఏర్పడింది. టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నించినా ఆమె రాజీనామా చేయలేదు. దీంతో మండల పరిషత్లోని నిబంధనల ప్రకారం నాలుగేళ్లు దాటితే గాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో ఇప్పటి వరకూ వేచి చూశారు. జూలై 4తో నాలుగేళ్లు ముగిసిన తరుణంలో ఎంపీటీసీలు అందరూ సమావేశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి నిర్ణయించారు. తొలుత అధికార టీడీపీ పక్ష ఎంపీటీసీలతో పాటు, బీజేపీ, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నుంచి సంతకాలు సేకరించారు. అయితే ఆర్డీఓ నేరుగా కొవ్వూరులోనే సంతకాలు పెట్టాలని సూచించడంతో అవిశ్వాస తీర్మానంపై అందుబాటులో ఉన్న 18 మంది ఎంపీటీసీలు గురువారం కొవ్వూరు వెళ్లి ఆర్డీఓకు సంతకాలు చేసిన లేఖను అందించినట్లు తెలిసింది. 15 రోజులలో నోటీసులు జారీ చేసి సమావేశం ఏర్పాటు చేస్తానని ఆర్డీఓ ఎంపీటీసీలకు హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగారు. ఎంపీటీసీల నందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్ బాబు, జడ్పీటీసీ రొంగల రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు వెలిచేటి బాబూ రాజేంద్ర ప్రసాద్లు గట్టి కృషి చేశారని అంటున్నారు. అవిశ్వాస తీర్మానం కారణంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన విభేదాలు ముందుముందు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
టీఆర్ఎస్లోకి మరో ఇద్దరు..
భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ అధికార పార్టీ నుంచి సొంతగూటికి చేరడంతో పాటు 7వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కూడా ఆమె వెంట బీజేపీలో చేరారు. మరుసటి రోజే కౌన్సిలర్ తిరిగి టీ ఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామాలు జరిగిన 24 గంటల్లోనే మరో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిల ర్లు లతశ్రీ, నువ్వుల ప్రసన్న శనివారం టీఆర్ఎస్ భువనగిరి పట్టణ కమిటీ అధ్యక్షుడు గోమారి సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సి పాలిటీలో టీఆర్ఎస్ బలం 16కు చేరింది. కౌన్సిలర్ల సంఖ్య పెంచుకోవడంలో సఫలీకృతం టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుంది. ఈనెల 4న ము న్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసంపెట్టే విషయంపై ఇప్పటికే నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నమూనాపత్రంలో సంతకాలు చేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్షపార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెట్టాలంటే 22 మంది కౌన్సిలర్లు అవసరం. కాగా టీఆర్ఎస్కు ఇప్పటికే 16 మంది కౌ న్సిలర్లు ఉన్నారు. వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలి మినేటి కృష్ణారెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అ¯ ] ుకూలంగా ఉన్నారని చెప్పడంతో వీరికి తోడుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనడంతో ఈ సంఖ్య 24కు చేరుకునే అవకాశం ఉంది.అవిశ్వాసం పె ట్టేందుకు టీఆర్ఎస్ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుందని చెప్పవచ్చు. రాజీనామా.. అవిశ్వాసమా? అవిశ్వాసం పెట్టే వారివైపు కౌన్సిలర్ల సంఖ్య పెరగడం, సొంత పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉండడంతో చైర్పర్సన్ రాజీనామ చేయాలా అవిశ్వా సం ఎదర్కోవాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు తె లిసింది. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పార్టీ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. చైర్పర్సన్ పార్టీ లో చేరిక ప్రస్తుత పరిస్థితులు, మున్ముందు జరిగే పరిణామాలపై చర్చిం చినట్లు సమాచారం. -
‘మోదీ బీసీ కాదు.. బిగ్ క్రిమినల్’
సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో చర్చకు రాకుండా చేసిన కేంద్రప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాసంలో ఓడిపోతామనే చర్చకు రాకుండా చేశారన్నారు. ఎల్కే అద్వానీ లాంటి సీనియర్ నేతలు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయం ప్రధాని మోదీకి పట్టుకుందని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం దుర్మార్గమన్నారు. 5 కోట్ల ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరిచిందని, దేశంలో బీజేపీని ఒంటరి చేస్తామన్నారు. మోదీ బీసీ కాదని.. బిగ్ క్రిమినల్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ మీ అనుబంధ సంస్థా? చంద్రబాబు నాయుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నారని రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు కలియుగ కుంభకర్ణుడన్నారు. నాలుగేళ్లు తమని అవమానించి, కేసులు పెట్టిన చంద్రబాబుకు ఇపుడు అఖిలపక్షం గుర్తొచ్చిందా .. కాంగ్రెస్ ఏమైనా మీ అనుబంధ సంస్థ అనుకుంటున్నారా చంద్రబాబు అని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లేటపుడు అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకువెళ్లలేదన్నారు. దేశ రాజధానిలో హేమాహేమీలను కలిసి వస్తారనుకున్నామని.. కానీ హేమమాలినిని కలిశారని ఎద్దేవా చేశారు. -
ఒక బాబు వంద నాలుకలు
ఏప్రిల్ 29, 2014: మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇచ్చారు. నేను మోదీగారిని కోరుతున్నా. 15 ఏళ్లు ఇవ్వండి. తిరుపతిలో ఎన్డీఏ సభలో చంద్రబాబు ఆగస్టు 25, 2015: ప్రత్యేక హోదా సంజీవని కాదు.. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో మే 17, 2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? మే 18, 2016: హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విన్నవించా. సెప్టెంబర్ 8, 2016: ప్రత్యేక హోదా వీలుకాదు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామని చెబుతుంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం? సెప్టెంబర్ 9, 2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా. సెప్టెంబర్ 10, 2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.. కేంద్రం చెప్పినదానికంటే అదనంగా ఏమొస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదు. సెప్టెంబర్ 15, 2016: హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు. సెప్టెంబర్ 19, 2016: హోదా ప్యాకేజీకి సమానం. అందుకే అంగీకరించాం. సెప్టెంబర్ 26, 2016: హోదా అంటే జైలుకే.. విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్.. అక్టోబర్ 28, 2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు జనవరి 25, 2017: హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఎక్కడుంది? ఏ జీవోలో ఉందో చూపండి. హోదాకు, రాయితీలకు సంబంధం లేదు. ఫిబ్రవరి 3, 2017: హోదా వేస్ట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. ఫిబ్రవరి 15, 2017: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు. మార్చి 15, 2017: సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేక సాయానికి కేంద్రం ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం. మార్చి 16, 2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం. మార్చి 2, 2018: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులు ఉన్నాయని కేంద్రం చెప్పడం వల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించాం. రాజీనామాలొద్దు.. కేంద్రంపై దశలవారీగా పోరాడదాం. (టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం) మార్చి 7, 2018: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ అవమానకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడం లేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం కింద ఇస్తామని అప్పుడు ప్రకటించారు. అవి కూడా సరిగా ఇవ్వలేదు. మార్చి 8, 2018: కేంద్ర మంత్రివర్గం వైదొలుగుతున్నాం. మా మంత్రులు రాజీనామా చేస్తారు. మార్చి 10, 2018: వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వం. మార్చి 15, 2018: వైఎస్సార్సీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం. కొంతమంది కావాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. (అసెంబ్లీలో) మార్చి 16, 2018: మేమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం. వైఎస్సార్సీపీ పెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వం (టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో) మార్చి 24, 2018: హోదా కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలకిచ్చిన రాయితీలు ఇస్తే ఓకే. -
అరుపుల మధ్యే జాతీయ గేయం..
-
‘మేం డ్రామా కంపెనీ నడపటం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరేముందు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబులా తాము డ్రామా కంపెనీ నడపడం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తాము పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. హోదా కోసం ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఘనత వైఎస్సార్ సీపీ దని తెలిపారు. పబ్లిసిటీ, రాజకీయాల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారన్నారు. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని సుబ్బారెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఎన్డీఏ 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు వస్తాయని, ప్రత్యేక హోదా కోసం ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుది పూటకో మాట రాష్ట్రానికి ఎవరు ద్రోహం చేశారో ప్రజల్లోకి తీసుకెళ్తామని మరో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పరిపాలకుడు సరైన పద్దతిలో ఉండాలని హితవు పలికారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకత్వం లేదని, పాలకులే మోసగాళ్లయితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడిగారు. చంద్రబాబు పూటకో మాట మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై 13వ సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చామని, వంద మందికి పైగా ఎంపీలు తమ పోరాటానికి మద్దతు తెలిపారని ఎంపీ వరప్రసాద్ రావు తెలిపారు. ఇప్పటికే స్పీకర్ సుమిత్రా మహాజన్కు కలిసి, చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాడుతోందని, ఇదే విషయం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే బాబు రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు. హోదా విషయంలో ప్రజలు తమని ఆదరిస్తున్నారనే.. చంద్రబాబు మాపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. 600 హామీల్లో ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబా తమకు నీతులు చేప్పేది.. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకుని ఎంపీలతో రాజీనామాలు చేయించి.. తమతో పాటు ఆమరణ దీక్షలో పాల్గొనాలన్నారు. ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు. కలిసికట్టుగా పోరాడాలి.. ప్రత్యేక హోదా సాధించాలన్నారు. బీజేపీ దిగి రావాల్సిందే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. -
పారిపోయిన కేంద్రం; పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెప్పుకున్న ఎన్డీఏ సర్కార్.. చివరికి అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండా పారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం లోక్ సభ ప్రారంభమైన వెంటనే.. సమావేశాల ముగింపునకు సబంధించి స్పీకర్ సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. వెల్లో ఆందోళన చేస్తోన్న అన్నాడీఎంకే ఎంపీలు వెనక్కి వెళితే.. అవిశ్వాస తీర్మానం నోటీసులపై మాట్లాడతానన్న స్పీకర్.. అనూహ్యంగా సభను నిరవదికంగా వాయిదావేశారు. అరుపుల మధ్యే జాతీయ గేయం..: రెండు విడదలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు తెన్నులను స్పీకర్ వివరిస్తున్న తరుణంలో.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. అయినాసరే, స్పీకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అరుపుల మధ్యే జాతీయ గేయం వందేమాతరం ప్రారంభంకావడంతో ఎంపీలు మిన్నకుండిపోయారు. ఆ తర్వాత లోక్సభను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆఖరి రోజు లోక్ సభకు ప్రధాని మోదీ, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. స్పీకర్ అపాయింట్మెంట్: ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి రాజీనామాలు సమర్పించారు. సభ నిరవధిక వాయిదా పడిన అనంతరం స్పీకర్ ఛాంబర్కు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఎంపీలు చెప్పారు. -
రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
-
మహానేత పాదాల వద్ద రాజీనామాలు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్కు బయలుదేరారు.. స్పీకర్ అపాయింట్మెంట్: ప్రత్యేక హోదా కోసం పదవులు త్యజించేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమేరకు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత నేరుగా స్పీకర్ను కలవనున్న ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించిన అనంతరం నేరుగా ఏపీ భవన్కు వెళ్లి ఆమరణ దీక్షలో కూర్చుంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. వైఎస్సీర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు, యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే.. -
బలం నిరూపించుకున్న ప్రధాని
కొలంబో : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు మారుతూనే ఉంటాయి. ఒక్కోసారి అంచనాలు తారుమారవుతాయి. శ్రీలంక ప్రధాని విషయంలో ఇదే జరిగింది. నిన్నటి వరకు సొంత పార్టీ నుంచి, మిత్ర పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న రణిల్ విక్రమసింఘే.. రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అనూహ్య విజయం సాధించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక అసెంబ్లీలో 76 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 122 మంది వ్యతిరేకించారు. 26 మంది సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అవిశ్వాసంలో నెగ్గాలంటే ప్రతిపక్షానికి కనీసం 96 నుంచి 101 ఓట్లు అవసరమైన నేపథ్యంలో కేవలం 76 ఓట్లే అనుకూలంగా రావడంతో ప్రధాని విక్రమసింఘే సునాయాసంగా విజయం సాధించారు. సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రధాని.. పార్టీలో సంస్కరణలు చేపడతానని, యువతకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈవిధంగా ఆయన అవిశ్వాసం నుంచి తప్పించుకోగలిగారు. ముందుంది అసలు సవాలు.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పటికీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాని ముందున్న అతిపెద్ద సవాలు. మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల ప్రధాని పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. ఆర్థిక మోసానికి పాల్పడ్డారనే ప్రతిపక్షాలు ఆరోపణల కారణంగా సిరిసేన ప్రధానికి ఉన్న అధికారాలను తగ్గించడంతో పాటు రాజీనామా చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెంచారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. ద్రవ్య బిల్లు, అవిశ్వాస తీర్మానాలపై జరిగే ఓటింగ్లో ప్రభుత్వంలో భాగమైన సభ్యులందరూ ఓటు హక్కు కోల్పోయినపుడు మాత్రమే ప్రధానిని తొలగించి ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. కేవలం ఈ కారణంగానే విక్రమసింఘేను పదవి నుంచి తొలగించలేకపోయారు. అయితే ఇపుడు అధికార కూటమిలో భాగమైన అధ్యక్షుడు, ప్రధానులు తమ మధ్య తలెత్తిన విభేదాలు మర్చిపోయి కలిసి ముందుకు సాగితేనే ప్రభుత్వానికి ఏ ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ కూడా పట్టుబట్టింది. ఈ కారణంగానే అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు శ్రీలంక సెంట్రల్ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు. ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా కోరారు. కానీ ఆయన ఇందుకు నిరాకరించడంతో అధ్యక్షుడు కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. -
అవిశ్వాసం మళ్లీ తూచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 12వ అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గురువారం అనుమతించలేదు. కావేరీ నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యులు యథావిధిగా సభలో ఆందోళనకు దిగారు. సభ సజావుగా సాగడం లేదంటూ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. పదేపదే అదే దృశ్యం లోక్సభ గురువారం ఉదయం ప్రశ్నోత్తరాలతో లోక్సభ ప్రారంభమైంది. ఏఐఏడీఎంకే సభ్యులు వెల్లో ఆందోళనకు పూనుకోవడంతో కొద్దిసేపటికే సభాపతి సభను వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా ఏఐఏడీఎంకే సభ్యులు ఎప్పటిలాగే ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో పలు శాఖలకు సంబంధించిన పత్రాలను పలువురు మంత్రులు, సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం అవిశ్వాస తీర్మానం నోటీసుల గురించి స్పీకర్ ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు తన వద్దకు వచ్చినట్టు సభాపతి చెప్పారు. వాటిని సభలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని లెక్కించేందుకు వీలుగా సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. సంఖ్యా బలాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్వాదీ, జేఎంఎం, ఎంఐఎం తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలుచున్నారు. అయితే, స్పీకర్ విజ్ఞప్తిని లెక్కచేయకుండా ఏఐఏడీఎంకే సభ్యులు వెల్లో ఆందోళన కొనసాగిం చారు. దీంతో సభ ఆర్డర్లో లేదని, అవిశ్వాస తీర్మానం నోటీసుల ను సభ ముందుకు తీసుకురాలేకపోతు న్నానని స్పీకర్ ప్రకటించారు. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం శుక్రవారంతో ముగియనున్నాయి. కాగా, వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై 13వసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం నాటి సభా కార్యక్రమాల జాబితాలో ఆ అంశాన్ని చేర్చాలని నోటీసులో కోరారు. గురువారం ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు వీరికి సంఘీభావం తెలిపారు. రాజ్యసభలో ఆందోళన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టుకుని వెల్లో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్తో జతకట్టిన టీడీపీ పార్లమెంట్ సమావేశాలను సజావుగా నడపాలని, అన్ని అంశాలపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పలు పార్టీలు గురువారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. ఇందులో టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ నేతలతో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ పక్కన ప్లకార్డు పట్టుకుని నిలుచున్నారు. మరోవైపు సుజనా చౌదరి, తోట నర్సింహం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్తో ముచ్చటిస్తూ కనిపించారు.ఏపీ విభజనకు కాంగ్రెస్సే కారణమంటూ పదేపదే విమర్శించే టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో వియ్యానికి తెరలేపింది. రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రమాణ స్వీకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గురువారం ఉదయం రాజ్యసభలో ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను పలువురు ఎంపీలు అభినందించారు. -
దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీపరుడివని నిరూపించుకో
-
మళ్లీ అదే తీరు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభలో మళ్లీ అదే తీరు. వరుసగా పదకొండోసారి అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించలేదు. సభ ఆర్డర్లో లేదన్న కారణం చూపుతూ బుధవారం కూడా అవిశ్వాస తీర్మానాలను అనుమతించకుండానే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైన లోక్సభ కొద్దిక్షణాలకే వాయిదా పడింది. కావేరీ నదీజలాల యాజమాన్య బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు వెల్లోనే ఆందోళన చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. అయితే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ ప్రస్తావించారు. వైఎస్సార్సీపీతోపాటు పలు పార్టీల ఎంపీల నుంచి తనకు అవిశ్వాసంపై నోటీసులు వచ్చినట్టు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సభ్యుల బలాన్ని లెక్కించేందుకు వీలుగా సహకరించాలని కోరారు. అయినప్పటికీ అన్నాడీఎంకే ఆందోళన కొనసాగడంతో సభ సజావుగా లేదని స్పీకర్ పేర్కొంటూ అవిశ్వాస తీర్మానాన్ని సభ ముందుకు తేలేకపోతున్నానని ప్రకటించారు. సభను గురువారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. మళ్లీ నోటీసులిచ్చిన వైఎస్సార్సీపీ సభ్యులు: ఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్రెడ్డి బుధవారం మధ్యాహ్నం పన్నెండోసారి అవిశ్వాస తీర్మానానికి నోటీసు లిచ్చారు. గురువారం నాటి సభాకార్యక్ర మాల జాబితాలో చేర్చాలని కోరారు. అంతకుముందు ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వీరికి సంఘీభావం తెలిపారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో ఆందోళన నిర్వహించారు. హోదా డిమాండ్ తో కూడిన ప్లకార్డును ఆయన ప్రదర్శించారు. -
ఎవరిని కలిశారు? ఎందుకు కలిశారు..?