ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం బంద్ | will stop medical services to employees : private hospitals ultimatum | Sakshi
Sakshi News home page

Dec 9 2017 7:29 AM | Updated on Mar 20 2024 3:45 PM

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సేవల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తోంది. ఎంప్లాయీ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) కింద ఉద్యోగులకు చికిత్సలు అందించిన కార్పొరేట్‌ సహా అన్ని రకాల ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య, ఆరోగ్యశాఖ దాదాపు ఏడాదిగా చెల్లింపులు నిలిపేసింది. కార్పొరేట్‌ ఆస్పత్రులకు రూ.200 కోట్లు, మిగిలిన ఆస్పత్రులకు రూ.200 కోట్ల చొప్పున బకాయి పడింది. దీంతో ఆస్పత్రులు ఉద్యోగులకు వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement