Private hospitals
-
Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద ఔట్పేషెంట్ (ఓపీ), ఇన్ పేషెంట్ (ఐపీ) ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వ్యవధిలో బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతోపాటు ప్రతి నెల గ్రీన్ చానెల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది నెలలుగా చాలావరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఐపీ సేవలను కూడా నిలిపేశాయి. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు తేల్చిచెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తూ.. మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్పరం చేయడం కోసం ప్రజారోగ్యంతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షకు పెద్దపీట వేసే కంపెనీలతో బీమా కార్యక్రమం అమలు కోసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని.. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపేసినట్టు వివరించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కాగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 1 నుంచి రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి. -
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) సేవలను నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలటీ ఆస్పత్రుల సమాఖ్య (ఆశా) ప్రకటించింది. తమకు రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీరాలేదని, నోటీసులో పేర్కొనట్లుగా ఈనెల 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శనివారం విజయవాడలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం. బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం. -
కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!
ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదుతిరుపతి కొర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్గా పనిచేసే నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు రూ.3 లక్షల విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆస్పత్రి లోపలకు కూడా అనుమతించడం లేదు. – రమణమ్మ, తిరుపతి⇒ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కావేరి డెంగీ బారిన పడటంతో ఈ ఏడాది ఆగస్టు 23న తల్లిదండ్రులు కర్నూలులోని ఓ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందకపోవడంతో చేతి నుంచి రూ.లక్షల్లో చెల్లించారు. బాధిత బాలిక చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వరరావుకు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు, యాంజియో చేయాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నాగేశ్వరరావు చెప్పడంతో.. ‘ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం’ అని అనడంతో చేసేదేమీ లేక చేతి నుంచి రూ.20 వేలు చెల్లించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన పామర్తి వీరవెంకట సత్యనారాయణ (55) రైతు కూలీ. ఎరువుల బస్తాతో సైకిల్పై వెళ్తుండగా జారి పడిపోవడంతో చువ్వలు వెన్నెముకకు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని చేతులెత్తేశారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పుతెచ్చి కుటుంబ సభ్యులు అరకొర వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం అందక అనంతరం ఆయన మృతి చెందారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించి ఉంటే పెద్ద దిక్కును కోల్పోయే వాళ్లం కాదని సత్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు.సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు ఆరునెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కారు అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. ప్రజలు ఉచిత వైద్యం కోసం రూ.25 లక్షల వరకూ పరిమితి ఉండే ఆరోగ్యశ్రీని కాకుండా.. కేంద్రం అమలు చేసే పీఎం జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) పథకాన్ని వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయి పడటంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళితే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచితంగా చికిత్సలు చేయలేం..’ అని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఉచిత వైద్యం కలే..అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న రోగులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని మొత్తుకుంటున్నా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆలకించడం లేదు. వాస్తవానికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు, అవసరమైన సర్జరీలు, అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి. కార్డుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఆస్పత్రులు నిక్కచ్చిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. ఓపీ, రకరకాల పరీక్షలు, మందులు కొనాలంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. కడుపులో గడ్డ, ప్రసవం, చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి కొన్ని చోట్ల రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుండె, న్యూరో, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితులైతే రూ.50 వేల నుంచి రూ.లక్షలకు పైబడి వసూలు చేస్తున్నారు.ప్రజారోగ్యానికి పెద్దపీటప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి అండగా నిలిచారు. కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుల బాధితులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి భరోసా కల్పించారు. వైరల్ జ్వరాలు, డెంగీ బారినపడిన వారికి పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైరల్ జ్వరాలు, డెంగీ బాధితులకు ఉచిత చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లభించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.ప్రభుత్వానికి ఆస్పత్రుల లేఖ..ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అప్లోడ్ చేసినవి, చేయాల్సినవి కలిపితే రూ.3 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బిల్లులు బకాయిపడింది. నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.రోగులపై మందుల భారంరాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కారు మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. బీపీ, షుగర్, గ్యాస్ బాధితులకు పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్సా్టర్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీషియా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉచిత వైద్యం లేదన్నారుగత నెలలో వైరల్ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆస్పత్రికి వెళ్లగా ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. రూ.20 వేలకు పైగానే ఖర్చు అయింది. – పి.వాణి, కాకినాడ జిల్లారూ.30 వేలు డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా. పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించినా రూ.30 వేలు అదనంగా ఇవ్వాలన్నారు. డబ్బు కట్టే స్థోమత లేక అనంతపురం జీజీహెచ్కు వెళ్లా. రూ.వేలు ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏమిటి?– చంద్రశేఖర్, పోతులగాగేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాకార్డున్నా ఆపరేషన్ చేయలేదునా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో ఎడమచేతికి గాయమైంది. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫ్రాక్చర్ అయిందన్నారు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారు. – ఆసియా, అనంతపురంఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద క్యాన్సర్ రోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. విశాఖలో క్యాన్సర్ చికిత్సను అందించే ప్రముఖ ఆస్పత్రి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా అందించే క్యాన్సర్ చికిత్సలను నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆస్పత్రికి భారీగా బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధునాతన పరికరాలతోపాటు వైద్య నిపుణులు, సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రికి ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత సీఎం వైఎస్ చొరవతో... ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో క్యాన్సర్కు చికిత్స కోసం హైదరాబాద్ లేదా ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోనే క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా 77 ఎకరాలను కేటాయించారు. రూ.540 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రముఖ సంస్థలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలతోపాటు మంచి వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్ల సంయుక్త సహకారంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో క్యాన్సర్ బాధిత పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు మూడు రోజుల క్రితం మా మామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. క్యాన్సర్ స్టేజ్–2లో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందుతాయని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగాం. ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకపోవడం వల్లే నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలి. – ఎస్.శంకరరావు, అగనంపూడి నిర్వాసిత కాలనీ, విశాఖపట్నం -
డెంగీకి రూ. 2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చిపిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు... ఇప్పుడు డెంగీ రోగులను దోచుకుంటున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్లేట్లెట్ సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తూ బాధితులను ఏమార్చుతున్నాయి. దీంతో బాధితులు అప్పుసప్పూ చేసి అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నంబర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద డెంగీ, చికున్గున్యా వంటి వాటికి తెల్ల రేషన్కార్డుదారులకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కారు ఆసుపత్రులకే పరిమితం చేసింది. దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డెంగీ, చికున్గున్యా కేసులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయకపోవడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీకి ఆరోగ్యశ్రీని వర్తింప చేయొచ్చని, అది తమ చేతుల్లో లేదని ఆరోగ్యశ్రీ వర్గాలు చెప్పాయి. హడలిపోతున్న జనం రాష్ట్రంలో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం రాగానే డెంగీ, మలేరియా, చికున్గున్యా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,357 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,276 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా మేడ్చల్ జిల్లాలో 312, ఖమ్మం జిల్లాలో 305 డెంగీ కేసులు రికార్డు అయ్యాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. నాలు గైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చికున్గున్యా కేసులు 75, మలేరియా కేసులు 175 నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ, చికున్ గున్యా కేసుల వివరాలను సంబంధిత యాజమాన్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం లేదు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతంలో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా... ⇒ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. ఇన్పేòట్లలోనూ 20 శాతం పెరిగారని డాక్టర్లు చెబుతున్నారు. గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 44 మంది వైద్యులకుగాను 24 మందే ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు సైతం డిప్యూటేషన్పై ఉన్నారు. ⇒ కరీంనగర్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచే ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నారు. 7,24,135 మందిని సర్వే చేశారు. ఇందులో 3,711 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ⇒ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది 115 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 చికున్గున్యా కేసులు నమోదయ్యాయి. ⇒ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి. డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. చిన్న పిల్లలైతే రోజుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు, పెద్దలకు రోజుకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజుగతేడాది కంటే డెంగీ, చికున్గున్యా వంటి వైరల్ జ్వరాలు పెరిగాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అలాగే డెంగీ సీరియస్గా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపినప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అంతే తప్ప సాధారణ డెంగీకి సాధారణ ఫీజే చెల్లిస్తే సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 30 వేల కంటే తక్కువైతేనే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, టీఎక్స్ ఆసుపత్రి, హైదరాబాద్ -
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
కార్పొరేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నడిపితే వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. వివిధ ప్రొసీజర్లకు ఎంత బిల్లు వేస్తారనేది ఆయా ఆస్పత్రులు ఆరుబయట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా తాము బోర్డులపై ప్రదర్శిస్తా మన్నారు. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైద్య,ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర పర్యవేక్షణకు మూడు వేర్వేరు టాస్్కఫోర్స్లు నియమించబోతున్నామని వెల్లడించారు. క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు ఓ టాస్్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్ఫోర్స్, ఆహారకల్తీ చేసే వారిపై కఠిన చర్యలకు మూడో టాస్్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈ మూడు టాస్్కఫోర్స్లు నేరుగా తనకే రిపోర్ట్ చేస్తాయని చెప్పారు. ఐదేళ్లు నిండిన అందరినీ బదిలీ చేస్తాం ఐదేళ్లు నిండిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని బదిలీ చేసితీరుతామని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ విషయంలో సంఘాల నేత లు సహా ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. ఆస్పత్రుల్లో పాతుకుపోయిన డాక్టర్లు, కాలేజీల్లో పాతుకుపోయిన టీచింగ్ ఫ్యాకల్టీ అందరినీ బదిలీ చేస్తామని తెలిపారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను కూడా మారుస్తామన్నారు. సిటీలో పనిచేసే డాక్టర్ల కంటే, జిల్లాల్లో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఇందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. త్వరలోనే జీఓ వస్తుందని చెప్పారు. 65 ఏళ్లకు అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. టీవీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందజేస్తామన్నారు. ఇప్పుడు తాము టీవీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులు సృష్టిస్తున్నామని చెప్పారు. అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, మండలానికో పాలియేటివ్ కేర్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కార్పొరేషన్తో రూ. 9 వేల కోట్ల అప్పు చేశారు బీఆర్ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి, దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని దామోదర వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తాత్కాలికంగా నిలిపివేశామని, కేసీఆర్ కిట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నారు. ఆ రెండు పథకాల్లో మార్పులుచేర్పులు చేసి కొత్త రూపంలో తీసుకొస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీలో 30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ కాకుండా, కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణనలోకి తీసుకుంటామంటారు. అయితే తెల్లరేషన్ కార్డున్నవారు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోవాలన్నారు. డీహెచ్ పనితీరుపై అసంతృప్తి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్నాయక్ పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ విభాగాల అధిపతుల పనితీరును తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానన్నారు. యాక్సిడెంట్ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం...రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి, వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్లో రూ.లక్ష వరకూ ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు. -
ఎంబీబీఎస్కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
హడావిడిగా ఆరోగ్య చట్టం!
అత్యవసర సమయాల్లో రోగులు ముందుగా డబ్బు చెల్లించకపోయినా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో తక్షణ వైద్య సేవలు అందేలా రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టంపై (రైట్ టు హెల్త్) అక్కడి వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది! ఈ చట్టాన్ని నిరసిస్తూ లక్ష మందికి పైగా ప్రైవేటు డాక్టర్లు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. దాదాపు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవల్ని నిలిపివేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) కూడా వైద్యుల నిరసనకు మద్దతు తెలపడంతో రాజస్థాన్లో గత రెండు వారాలుగా ప్రజారోగ్య వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. అత్యవసర చికిత్స కోసం రోగులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన విరమించేది లేదని వైద్యులు, చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం పట్టుపట్టి మెట్టు దిగడం లేదు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఆరోగ్య హక్కు చట్టాన్ని తెచ్చామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చెబుతున్నారు. ఎప్పుడో ఇచ్చిన హామీని మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో నెరవేర్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాక, రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులన్నవే లేకుండా చేయాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉండివుండొచ్చని వైద్యులు ఆరోపిస్తున్నారు. మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. వెనువెంటనే వైద్యుల నిరసనలు మొదలయ్యాయి. మార్చి 28న వైద్యులకు మద్దతుగా ఐ.ఎం.ఎ. రంగంలోకి దిగింది. రాజస్థాన్ తెచ్చిన ఈ కొత్త ఆరోగ్య బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చినప్పుడు ప్రైవేటు వైద్యులు వైద్య సేవల్ని నిరాకరించకూడదు. డబ్బు చెల్లించలేక పోయినా తక్షణం చికిత్సను అందించి తీరాలి. చికిత్సానంతరం ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అత్యవసర వైద్యం నిరాకరించిన ఆసుపత్రి లేదా వైద్యుడు తొలిసారి 10 వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే 25 వేలు జరిమానా చెల్లించాలి. తప్పు మీద తప్పుకు ఆ మొత్తం అలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే రోగులకు ప్రభుత్వం కల్పించిన ఈ ఆరోగ్య హక్కు... వైద్యుల జీవించే హక్కును కాలరాసేలా ఉందని, రోగుల అత్యవసర పరిస్థితి ఎలాంటిదైనా కూడా తప్పనిసరిగా చికిత్సను అందించాలన్న చట్ట నిబంధన కారణంగా తమకిక కనీస విశ్రాంతి కూడా దొరకదన్నది వైద్యుల ఆందోళన. వైద్యాన్ని నిరాకరించిన డాక్టరుపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సైతం అనుమ తిస్తున్న తాజా బిల్లు కారణంగా వైద్యులకు వేధింపులు తప్పవనీ, తమపై తప్పుడు కేసులు కూడా నమోదయ్యే ప్రమాదం ఉందనీ ప్రైవేటు వైద్యులు కలవరపడుతున్నారు. అదే సమయంలో చట్టంలోని అంశాల విషయమై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టతను డిమాండ్ చేస్తున్నారు. ఒక్కోసారి మామూలు తలనొప్పిగా అనిపించినది కూడా అత్యవసర స్థితిగా మారి మెదడులో రక్తస్రావానికి దారి తీస్తే అప్పుడేమిటి? అప్పుడు ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? మరి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుల మాటేమిటి? తలనొప్పి, కడుపునొప్పితో వచ్చినవారికి పరీక్షలన్నీ చేశాక అది ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? బిల్లును పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది? ఇవీ... సమ్మె బాట పట్టిన వైద్యుల ప్రాథమిక సందేహాలు. ప్రభుత్వం ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. చట్టం ఉద్దేశం మంచిదే కావచ్చు. చట్టంలో అస్పష్టత లేనప్పుడే అది అమోద యోగ్యం అవుతుంది. దేశంలోనే తొలిసారి రాజస్థాన్ ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాద్ లాల్ మీనా గొప్పగా చెబుతున్నారు! అయితే ఇదేమీ పూర్తిగా కొత్తది కాదు. 2021లోనే తమిళనాడు ప్రభుత్వం... అన్ని ఆసుపత్రులూ బాధితులకు విధిగా అత్యవసర వైద్య సేవలను అందించేలా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద... బిల్లు చెల్లించలేని రోగుల తరఫున ప్రభుత్వమే ఆసుపత్రులకు రీయింబర్స్ చేస్తుంది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంతో పోల్చడానికి ఈ రీయింబర్స్మెంట్ సరిపోదు. ఆరోగ్యశ్రీ పథకం వీటితో పోల్చితే అత్యంత ప్రభావవంతమైనది, విజయవంతమైనది. దీన్ని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ వైద్యరంగాన్ని కూడా బలోపేతం చేయడంతో అది అన్ని రాష్ట్రాలకూ మోడల్గా ఆవిర్భవించింది. రాజస్థాన్ విషయానికి వస్తే ఆరోగ్య హక్కు చట్టాన్ని అక్కడి ప్రభుత్వం హడావిడిగా తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. అటు ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్టం చేయడానికి ఏ ప్రయత్నం చేయకుండా, ఇటు ఆరోగ్యశ్రీ వంటి ఒక బృహత్తర పథకాన్ని ఆలోచించకుండా, ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో చర్చించకుండా, వైద్యుల భయాలను సంపూర్ణంగా నివృత్తి చేయకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లును ఆమోదించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. బిల్లు అమలులోకి రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి. ఆరోగ్య హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ఆసుపత్రులేవో ప్రభుత్వం నిర్ణయించాలి. అప్పుడే రీయింబర్స్మెంట్ ప్రక్రియ గురించి స్పష్టత వస్తుంది. ఈ అన్ని దశలలోనూ వైద్యులతో ప్రభుత్వం తప్పక చర్చించాలి. చర్చలకు హామీ ఇస్తూ, సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరవాలని వైద్యులను కోరవలసిందీ, ఇందుకు తగిన చొరవ తీసుకోవలసిందీ ప్రభుత్వమే. -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
కాసుల యావ.. కోతల హవా: ఎడాపెడా ‘ప్రైవేటు’ సిజేరియన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది. సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్హోమ్లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం. గణాంకాలే నిదర్శనం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది. తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐటీ దాడులు.. చాటుగా పత్రాలు తరలింపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ అధికా రులు దాడులు చేశారు. బిలీఫ్ ఆస్పత్రి, రోహిత్ సంతాన సాఫల్య కేంద్రం, శ్రీరాం కిడ్నీ సెంటర్లలో సోదాలు చేశారు. సదరు ఆస్పత్రుల యాజ మాన్యాల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారని.. పలు పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే తనిఖీల కోసం ఐటీ బృందం రాగానే ఓ ఆస్పత్రి బాధ్యులు వెనుక భాగం నుంచి రహస్యంగా పలు పత్రాలను బయటికి తరలించడం కనిపించింది. -
స్పీడ్ పెంచిన ఐటీ.. ఖమ్మంలోనూ ఇన్కమ్టాక్స్ దాడులు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఇన్కమ్టాక్స్ అధికారులు వేగం పెంచారు. కరీంనగర్లో మంత్రి గంగులతో పాటు మైనింగ్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు.. ఖమ్మంపైనా దృష్టి సారించారు. ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులపై ఐటి దాడులు జరుగుతున్నాయి. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు ఈ ఉదయం 10 గంటల సమయంలో ఖమ్మం నగరానికి వచ్చిన ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మూడు వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బిలీఫ్ ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బిలీఫ్ ఆసుపత్రిలో కీలక పత్రాలు సేకరించడంతో పాటు, ఆసుపత్రి లావాదేవీలపై ఇన్కమ్టాక్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే తనిఖీలు పురైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న బిలీఫ్ ఆస్పత్రిని నాలుగేళ్ల కింద ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ స్టార్ ఆస్పత్రి ప్రారంభమైంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో -
165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి. అవకతవకలను అరికట్టేందుకు 3,810 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు, క్లినిక్లను ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 1,163 ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 165 ఆస్పత్రులను సీజ్ చేయగా, మరో 106 ఆస్పత్రుల యాజమాన్యాలకు జరిమానాలు విధించి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రజారోగ్య విభాగానికి నివేదిక సమర్పించగా, అధికారులు మంగళవారం గణాంకాలు విడుదల చేశారు. వామ్మో నాగర్కర్నూల్... అధికారులు సీజ్ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 ఆస్పత్రులు నాగర్కర్నూల్ జిల్లాలోనివే కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 54 ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు అందులో 70 శాతం ఆస్పత్రులను సీజ్ చేయడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అత్యధిక ఆస్పత్రులు సీజ్ చేసిన కేటగిరీలో నల్లగొండ–17, సంగారెడ్డి–16, భద్రాద్రి కొత్తగూడెం–15, హైదరాబాద్–10, రంగారెడ్డి–10 ఆస్పత్రులు ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన కేటగిరీలో హైదరాబాద్–274, కరీంనగర్–124, రంగారెడ్డి –107 ఆస్పత్రులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నోటీసుల జారీ ప్రక్రియ సాగింది. ప్రస్తుతం నోటీసుల జారీ, సీజ్, పెనాల్టీలతో సరిపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ వాటికి సంబంధించి వచ్చిన వివరణలు, తదుపరి చర్యలకు త్వరలో మరో డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఆర్ఎంపీలు అబార్షన్లు, ప్రసవాలు చేస్తే ఊరుకోం.. క్రిమినల్ కేసులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్ఎంపీ సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు. ఆస్పత్రులపై కొనసాగుతున్న దాడులు... రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా.. అత్య«ధికంగా రంగారెడ్డి జిల్లాలో 325, కరీంనగర్ జిల్లాలో 293, హైదరాబాద్లో 202, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144, వికారాబాద్లో 109 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తనిఖీలు జరగలేదు. కాగా, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. -
ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ అనేక ఆసుపత్రులను సీజ్ చేస్తోంది. కొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెమెంట్ యాక్ట్ (రిజిస్ట్రేషన్ – రెగ్యులేషన్) యాక్ట్, 2010 ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులపై పెద్దఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో కొన్ని ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల రిజిస్టర్డ్ డాక్టర్లు లేరని తెలిసింది. ఈ నేపథ్యంలో తమను కాపాడాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల చుట్టూ ఆసుపత్రుల యజమానులు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి ఆసుపత్రులు సీజ్చేయకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. వైద్యబృందాలు ఇప్పటివరకు 311 ఆసుపత్రులను తనిఖీ చేసి, 21 ఆసుపత్రులను సీజ్ చేశాయి. 83 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేశాయి. ఏడు ఆసుపత్రులకు భారీ జరిమానాలు విధించాయి. జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో ఇంకా తనిఖీలు మొదలుకాలేదు. కొమురంభీం జిల్లాలో నాలుగింటిని, మంచిర్యాలలో 14 ఆసుపత్రులను, మేడ్చల్ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్ లో 7 ఆసుపత్రులను, వరంగల్ జిల్లాలో మూడింటిని తనిఖీ చేసి, ఒక్క దానిపై కూడా చర్య తీసుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అనేకచోట్ల రోగులకు సరిగా వైద్యం అందించడంలేదని తెలిసింది. అనేకచోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను బెదిరించడానికే వైద్యబృందాలు దాడులు చేస్తున్నాయని పలువురు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక క్లినిక్లు నడుపుతూ, ప్రి్రస్కిప్షన్ లేకుండా ఇంజెక్షన్లు ఇస్తున్న రిజిస్టర్ కాని ప్రైవేట్ ప్రాక్టీషనర్లపై మాత్రం ఎలాంటి దాడులు జరగడంలేదని మండిపడుతున్నారు. -
Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్’ కాటు.. హడలిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్ నంబర్ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. డెంగీ లేకున్నా.. అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్లెట్ల కౌంట్ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రతను తగ్గించడం ఎలా? డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. రక్తస్రావం జరిగితే ప్రమాదకరం డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ ఐజీఎం పరీక్ష తప్పనిసరి డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్తో ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది. డాక్టర్ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్ఎంసీ ముసాయిదాను రూపొందించింది. ముఖ్యాంశాలివీ.. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు కార్పొరేట్ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు. జనరిక్ పేరుతోనే మందులు రాయాలి కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) అర్ధమయ్యేట్లు రాయాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకోకూడదు. ప్రాక్టీస్పై జీవితకాల నిషేధం! రోగులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు, అది నిజమని తేలితే నిపుణుల కమిటీ తగిన చర్యలు చేపడుతుంది. సాధారణ తప్పు అయితే డాక్టర్ను మందలిస్తుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే, లైసెన్స్ ఫీజుకు పది రెట్లు జరిమానాగా విధిస్తుంది. – వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రోగి చనిపోయినా, భారీ తప్పులు జరిగినా.. తీవ్రత ఆధారంగా అవసరమైతే ప్రాక్టీస్ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. – రోగుల విషయంలో నైతిక నియమాలను సరిగా పాటించకపోతే లైసెన్సును నెల రోజుల వరకు సస్పెండ్ చేయవచ్చు. రోగికి ప్రత్యక్షంగా హాని జరిగితే మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్ చేయొచ్చు. రోగికి వాస్తవ సమాచారం ఇవ్వాలి – రోగి పరిస్థితిని ఉన్నదున్నట్టు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దాచిపెట్టడం కానీ, ఎక్కువ చేసిగానీ చెప్పకూడదు. యథార్థ సమాచారం ఇవ్వాలి. ఆపరేషన్ అవసరమైతే కుటుంబ సభ్యుల అనుమతితోనే చేయాలి. సర్జన్ పేరు కూడా రికార్డులో ఉండాలి. – మైనర్లకు, మానసికంగా సరిగా లేని వ్యక్తులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. 8 ఏళ్లకు పైబడిన చిన్నారులైతే ఆ పిల్లలకు సంబంధిత చికిత్స వివరాలను తెలియజేయాలి. – రోగికి వైద్యం చేసిన తర్వాత వారి రికార్డులను మూడేళ్లు భద్రపరచాలి. వాటిని సంబంధిత వ్యవస్థలు ఏవైనా అడిగితే ఐదు రోజుల్లోగా ఇవ్వాలి. – నూతన నియమావళి రూపొందిన మూడేళ్ల లోపు రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రతి రికార్డును డిజిటలైజ్ చేయాలి. అలాగే రోగి వివరాలను గోప్యంగా ఉంచాలి. కొన్నిటికి మాత్రమే టెలిమెడిసిన్ – ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా టెలీ మెడిసిన్ ద్వారా మందులు ఇవ్వకూడదు. కనీసం గత ప్రిస్కిప్షన్ల వంటి ఆధారమైనా లేకుండా మందులు ఇవ్వకూడదు. – టెలీ మెడిసిన్.. వీడియో, ఆడియో, మెస్సేజ్, ఈ మెయిల్ రూపంలో జరుగుతుంది. కాబట్టి కొందరిని భౌతికంగా పరీక్షించాల్సి ఉంటే అలా చేయాల్సిందే. – ఆన్లైన్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కొన్ని రకాల మందులు సూచించడానికి ఇది పనికి వస్తుంది. దగ్గు మందులు, నొప్పి మందులు, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్స్ వంటి మందులను ఆన్లైన్లో సూచించవచ్చు. వాట్సాప్లోనూ ఇవ్వొచ్చు. – వీడియో కన్సల్టేషన్లో చర్మ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి వాటికి మందులను ఇవ్వొచ్చు. ఫాలోఅప్లో మందులు కూడా ఇవ్వొచ్చు. – క్యాన్సర్, మెదడును ఉత్తేజపరిచే, సైకియాట్రిక్ మందులు వాట్సాప్ ద్వారా కానీ టెలీమెడిసిన్లో కానీ ఇవ్వొద్దు. ఆ రోగులను భౌతికంగా చూడాల్సిందే. రోగి అనుమతితోనే మీడియాలో ప్రచురించాలి – రోగికి ఏవైనా ప్రత్యేక చికిత్సలు చేసినప్పుడు వారి అనుమతి మేరకే మీడియాలో ప్రచురించాలి. – గుర్తింపులేని వైద్యులతో కలసి పని చేయకూడదు. వైద్యంతో సంబంధం లేనివారు కూడా ప్రాక్టీస్ పెడుతున్నందున వారితో కలిసి పనిచేయవద్దు. – డాక్టర్లు సెమినార్లు, సదస్సులకు హాజరవుతూ వైద్యంలో అవుతున్న అప్డేట్ ఆధారంగా ప్రతి ఐదేళ్లకోసారి 30 మార్కులు పొందాల్సి ఉంటుంది. అలా సాధిస్తేనే ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తారు. – ఎలాంటి గుర్తింపు లేనివారికి వారి అనుభవం ఆధారంగా (ఆర్ఎంపీల వంటి వారికి) వైద్యులు సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. – వైద్యులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎన్వోసీ త్వరగా ఇవ్వడంలేదు. దాన్ని ఇప్పుడు సరళతరం చేసి వారంలో ఇచ్చేలా మార్పు చేశారు. -
నిర్మల్ జిల్లాలో కడుపు కోతల దందా..
-
దేశంలోనే మేటిగా మన పీహెచ్సీలు
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూదడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు కలగాలి. అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలు ఉండాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఆ మాటలను క్షేత్ర స్థాయిలో ఆచరింపజేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దీంతో మన రాష్ట్రంలోని వైద్య రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్వాస్) కార్యక్రమం కింద అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక పీహెచ్సీలు ఎన్క్వాస్ గుర్తింపు పొందటం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. 320 పీహెచ్సీలకు.. రాష్ట్రంలో 1,145 పీహెచ్సీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 320 పీహెచ్సీలకు ఎన్క్వాస్ గుర్తింపు లభించటంతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. 191 పీహెచ్సీలతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 1,280 పీహెచ్సీలకు గుర్తింపు ఉండగా.. వీటిలో 25 శాతం ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రి (డీహెచ్)లకు ఎన్క్వాస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతుంటాయి. పీహెచ్సీల్లో 6 డిపార్ట్మెంట్లలో 1,600 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా, సీహెచ్సీ, డీహెచ్లలో 18 డిపార్ట్మెంట్లలో, 6,625 అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ఆస్పత్రికి ఎన్క్వాస్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి ప్రమాణాలన్నింటినీ పరిశీలించిన అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. నాడు–నేడుతో.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.663 కోట్లతో 977 పీహెచ్సీలకు మరమ్మతులు, 148 పీహెచ్సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీల్లో నాడు–నేడు కింద మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద పీహెచ్సీల్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన నేపథ్యంలోనే దేశంలోనే అత్యధిక పీహెచ్సీలకు ఎన్క్వాస్ గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలవగలిగింది. -
144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
-
మహారాష్ట్రలో లాక్డౌన్?.. ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మరోసారి స్పష్టం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, రాజేశ్ టోపే, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, తాజా పరిస్థితులపై పవార్, టోపే ఆరా తీశారు. రాష్ట్రంలో చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న పవార్ వాస్తవాలు తెలుసుకునేందుకు టోపే, ఆరోగ్య శాఖ అధికారులతో స మావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ప్రత్యామ్నాయ విధానాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాక్సినేషన్, లాక్డౌన్, కరోనా ఆంక్షలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంక్షలు సక్రమంగా అమలు కాకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పవార్ నిర్ధేశించారు. రోగుల సంఖ్య పెరిగితే దుకాణాలు, సంస్థలు మూసివేయాలనే దానిపై కూడా చర్చ జరిగింది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో జనసమ్మర్థంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఈ విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని ప్రజలు, వాణిజ్య సముదాయాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని వారు ఆదేశించా రు. కరోనా టీకా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని, సాధ్యమైనంత త్వరలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మోదీ పర్యటనలో భద్రతా లోపం.. సుప్రీంలో విచారణ ఇదిలాఉండగా ముంబైలో వీకెండ్ లాక్డౌన్పై కూడా చర్చలు జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్య మంత్రి తెలిపారు. ప్రస్తుతమైతే ఎక్కడా లాక్డౌన్ విధించే అలోచన ప్రభుత్వానికి లేదని వారు పునరుద్ఘాటించారు. ఇటీవల కూడా ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో లోకల్ రైలు ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఆ సేవలు నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరోనా రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రైళ్లలో అనుమతిస్తున్నామని, తగు జాగ్రత్తలతో రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. చదవండి: విదేశీ చేతుల్లోకి ఎల్ఐసీ! కేంద్రం కసరత్తు కాగా ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం పెరగడం లేదని మంత్రి టోపే అన్నారు. ఇదిలాఉండగా శరద్ పవార్ కరోనా టీకా తీసుకుని 9 నెలలు కావస్తోంది. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
కారణం లేకుండా ‘కోత’ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 65 శాతం వరకు సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీంతో వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. కారణాలు లేకుండా ఏ గర్భిణికైనా ‘కోత’ ద్వారా ప్రసవం చేస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో మెజారిటీ ప్రసవాలు కోతల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇక ప్రతి వారం కోతల ప్రసవాలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ జరిగిన ప్రసవాల వివరాలు ఆయా జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? సాధారణ ప్రసవం కాకపోవడానికి గల కారణాలను ప్రత్యేక ఫార్మాట్లో ఇచ్చిన పేపర్లో నింపి పంపించాలి. ప్రతి 15 రోజులకోసారి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చిన గర్భిణులకు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి ఎక్కువ సేపు వేచిచూడాల్సి రావడం, అంతసేపు సహనంగా ఉండలేక వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ భవిష్యత్లో సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆడిట్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అసాధారణ కోతలు నిర్వహించే ఆస్పత్రులు లేదా డాక్టర్లు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘కోతల’ ప్రసవాలపై ఆడిట్ నిర్వహణ మొదలైంది. కోతల ప్రసవాలపైనే కాకుండా మాతృ మరణాలపైనా కారణాలు చెప్పాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు. -
Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!
రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మేడ్చల్కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్పేషెంట్ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేయాలని, ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్ అయ్యారు. నల్లగొండకు చెందిన రాజేందర్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు రూ. 900 కోట్లకుపైగా బకాయిలు రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..! రోగులకు తీవ్ర అవస్థలు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్పేషెంట్ సేవలేకాకుండా.. ఔట్పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్! ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్వర్క్ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్చార్జులే.. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్ ఐఏఎస్ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్రాజ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు. ఏడాదిన్నరగా సంక్షోభం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. – డాక్టర్ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 3 కోట్లు బకాయిలు రావాలి మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. – జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం -
ఏపీ: థర్డ్వేవ్కు 462 ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్ సేవల్లో వినియోగించుకోనుంది. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
రాష్ట్రంలో అటు కరోనా.. ఇటు సీజనల్ వ్యాధుల దాడి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా భయపెడుతుంటే, మరోవైపు సీజనల్ జ్వరాలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెలన్నర రోజుల్లో దాదాపు 10 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో అనేకమంది కరోనా రోగులుండగా.. మరింత మంది సాధారణ, డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి జ్వరాలకు గురయ్యారు. కొందరికి డెంగీతో పాటు కరోనా కూడా సోకుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి కరోనాతోపాటు డెంగీ, మలేరియా పరీక్షలు కూడా చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 352 డెంగీ కేసులు, 374 మలేరియా కేసులు నమోదు కాగా, అందులో గత 20 రోజుల్లోనే 52 డెంగీ, 41 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా జరుపుతున్న పరీక్షల్లో లక్షలాది జ్వరం కేసులు గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోజుకు దాదాపు లక్షన్నర మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలా పరీక్షలకు వచ్చే వారిలో చాలామంది జ్వరాలతోనే వస్తున్నారు. ఈ క్రమం లో హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రికి పది రోజుల కిందట 1,400 ఔట్పేషెంట్లు (ఓపీ) రాగా, బుధవారం 1,800 ఓపీ నమోదైంది. ఇక్కడ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 డెంగీ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా, అక్కడ అన్ని పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చాలావరకు ప్రాథమిక ఆస్పత్రుల్లో మందులు, ఇంజెక్షన్లు ఉండటం లేదని, చీటీలు రాసి ఇచ్చి బయట తెచ్చుకోవాలని చెబుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్నిచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వేలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటివరకు కరోనాతో దండుకొన్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రస్తుతం సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రక్త పరీక్షలు, ప్లేట్లెట్ల పేరుతో బాధితుల నుంచి వేలకు వేలు గుంజుతున్నాయి. బుధవారం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన ఒక బాధితుడికి వింతైన అనుభవం ఎదురైంది. సాధారణ జ్వరం వచ్చిందని వెళితే సీబీపీ, ఈఎస్సార్, డెంగీ టెస్టులు చేయాలని డాక్టర్ సూచించాడు. అందుకోసం అదే ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా ఏకంగా రూ.9 వేల బిల్లు వేశారు. ఇక ప్లేట్లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్లు 40 వేల దిగువకు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు అంటున్నారు. కానీ 50 వేలున్నా తక్కువ ఉన్నాయంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత కారణంగానే రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చలి జ్వరం వస్తే మలేరియా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సీజనల్ జ్వరాలు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ చెబుతుంది. ఏజెన్సీలో మలేరియా, ఇతర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు అధికంగా వ్యాపిస్తాయి. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ జ్వరాలను రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. మలేరియా వ్యాధి సోకితే చలి, వణుకుతో మొదలై జ్వరం వస్తుంది. చలి ప్రారంభమైనప్పుడే తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి. తర్వాత చలి బాగా పెరిగి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా వణుకు తగ్గదు. జ్వర తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమట పడుతుంది. ఈ జ్వరం ప్రతిరోజూ లేక రోజు విడిచి రోజు లేక నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది. డెంగీలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి డెంగీలో ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి తీవ్రతను బట్టి మూడు నుంచి ఐదు రోజులకు మందులు ఇస్తున్నారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు సమయానికి విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా సీజనల్ వ్యాధులతో ప్రజలు వస్తున్నారు. దీంతో పడకలు సరిపోవడం లేదు. ఈ ఆసుపత్రిలో డెంగీ కిట్లు అందుబాటులో లేవు. – మహబూబ్నగర్లో జిల్లాలో కూడా విష జ్వరాలు మొదలయ్యాయి. జనరల్ ఆస్పత్రిలో వైద్యులు రెగ్యులర్గా వస్తున్నా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం పది మంది వరకు బాధితులు సాధారణ జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్నారు. – అదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఒక మలేరియా కేసు నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో 41 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో బాధితులకు మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని బాధితులు చెబుతున్నారు. – ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లో డెంగీకి సంబంధించిన ఎలిసా టెస్ట్ అందుబాటులో ఉంది. కానీ 90 శాంపిళ్లు వచ్చినప్పుడు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్యం అందడం లేదు. గత రెండ్రోజుల్లో ఐదుగురికి మలేరియా పాజిటివ్గా తేలింది. మందులు అందుబాటులో ఉంచాలి కొత్తగూడెం ఆస్పత్రిలో జ్వరానికి సంబంధించి కొన్ని మందులు లేకపోవడం వల్ల బయట షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – మౌనిక, కొత్తగూడెం వైద్యులు సమయపాలన పాటించాలి ఆసుపత్రి వైద్యులు సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మి, రుద్రంపూర్ ప్లేట్లెట్ కౌంట్ మిషిన్ పనిచేయడం లేదు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగీకి సంబంధించి ప్లేట్ లెట్స్ కౌంట్ మిషన్ పనిచేయడం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో బాగు చేయాల్సిన అవసరం ఉంది. – పుష్ప, వెంకటాపురం టీటీ ఇంజెక్షన్లు లేవు కాలికి గాయమై కల్వకుర్తి కమ్యూనిటీ ఆసుపత్రికి వెళితే అక్కడ టీటీ ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేదు. ఆసుపత్రి సిబ్బంది చీటీ రాసి ఇచ్చి తెచ్చుకోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారే దుకాణానికి వెళ్లి తెచ్చిచ్చారు. చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక నిరక్షరాస్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతుంది. ఉన్నతాధికారులు ఆసుపత్రిలో మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చూడాలి. –జ్యోతి ప్రసాద్, కల్వకుర్తి, నాగర్కర్నూల్ -
సమర్థ నిర్వహణతో 11 లక్షల డోసులు ఆదా
మూడుచోట్ల వేగంగా చిన్నారుల ఆస్పత్రులు.. ► థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. చిన్నారుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్ బెటాలియన్లలో కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్థాయి వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్ సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావాలి. తద్వారా పీహెచ్సీల వైద్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు అందుబాటులోకి వస్తారు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమర్థ వ్యాక్సినేషన్ ద్వారా ఎక్కువ మందికి కోవిడ్ టీకాలు ఇవ్వగలిగామని, దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ప్రాధాన్యతగా ఉపాధ్యాయులకు టీకాలివ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్ డోసులు కేటాయిస్తే 4,63,590 డోసులను మాత్రమే వినియోగించుకున్నందున మిగిలిపోయిన కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా ఈ నెల 22వతేదీ నుంచి రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోవిడ్, వ్యాక్సినేషన్పై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్ధ నిర్వహణతో టీకాల ఆదా సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువమందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్ డోసులు 1,80,82,390. ఇంకా వినియోగించాల్సిన (బ్యాలెన్స్) డోసులు 8,65,500. ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851. వ్యాక్సిన్లు వృథా కాకుండా సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగాం. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. గత మే నెల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్ డోసులు 35 లక్షలు కాగా కేవలం 4,63,590 డోసులు మాత్రమే వినియోగం జరిగింది. అందువల్ల ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరతాం. గర్భిణిలకు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించి చురుగ్గా టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి. మరో వారం రాత్రి కర్ఫ్యూ కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేయాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై.. రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్ ఇస్తోందని సీఎం చెప్పారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఏ.మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఇలా... – సోమవారం నాటికి యాక్టివ్ కేసులు 24,708 – పాజిటివిటీ రేటు 2.83 శాతం – 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు జిల్లాలు 8 – 3 – 5 శాతం పాజిటివిటీ రేటు జిల్లాలు 5 – రికవరీ రేటు 98.05 శాతం – నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 94.19 శాతం – ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 76.07 శాతం – 13వ విడత ఫీవర్ సర్వే పూర్తి – 104 కాల్ సెంటర్కు వస్తున్న రోజువారీ కాల్స్ 1000 లోపు బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం.. –గత వారం నమోదైన కేసులు 15 – మొత్తం కేసులు 4075 –చికిత్స పొందుతున్నవారు 863 వ్యాక్సినేషన్.. –మొత్తం వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,41,42,094 –సింగిల్ డోసు పూర్తయినవారు 1,00,34,337 –రెండు డోసులు పూర్తయినవారు 41,07,757 -
ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి పక్కా రియల్ ఎస్టేట్ సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించింది. నివాస ప్రాంతాల్లో 2–3 పడక గదుల ఫ్లాట్లలో నర్సింగ్ హోమ్లు కొనసాగుతున్నాయని, కనీస భద్రతా ప్రమణాలు సైతం పాటించడం లేదని, రోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడింది. అలాంటి వాటిని మూసివేయాలని ఆదేశించింది. భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పాటించని హాస్పిటళ్లకు వచ్చే ఏడాది జూలై వరకూ గడువు (డెడ్లైన్) పొడిగిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆసుపత్రుల్లో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో గత ఏడాది డిసెంబర్ 18న తాము ఒక ఉత్తర్వు జారీ చేశామని, అయినప్పటికీ అగ్ని ప్రమాదాలు జరిగి, రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయని పేర్కొంది. ‘‘ఆసుపత్రుల్లో లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో గడువు పొడిగించడం సరైంది కాదు. రోగులను ఆరోగ్యవంతులుగా మార్చాల్సిన ఆసుపత్రులు కరెన్సీ ముద్రించే యంత్రాలుగా మారిపోయాయి’’అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం పేర్కొంది. నివాస ప్రాంతాల్లో ఇరుకు ఇళ్లలో హాస్పిటళ్లను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకోవడానికి ఆసుపత్రులకు మరో ఏడాది గడువిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ జారీ చేయడానికి గల కారణాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని నిలదీసింది. ఈ నోటిఫికేషన్ను బట్టి 2022 జూలై దాకా నిబంధనలు పాటించనక్కర్లేదని ఆసుపత్రులకు స్వేచ్ఛ ఇచ్చారని, అంటే అప్పటిదాకా జనం చచ్చిపోవాల్సిందేనా? అని ప్రశ్నించింది. గుజరాత్లో గత ఏడాది పలు కోవిడ్ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ 2020 డిసెంబర్ 18న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్ ఆడిట్ నిర్వహించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. -
ప్రైవేట్ కోటా కోవిడ్ టీకాలు మాకివ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోతున్న కరోనా వ్యాక్సిన్ల స్టాక్ను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. జూలైలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని.. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారని సీఎం తెలిపారు. జూన్లో కూడా ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని సీఎం ప్రధాని దృష్టికి తెచ్చారు. కోవిడ్ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని మోదీకి తెలిపారు. కోవిడ్ నివారణ చర్యలపై వివిధ రాప్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజనవల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. రాష్ట్ర విభజనవల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు కూడా ఏపీలో లేవు. అయినా సరే.. కోవిడ్ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాం. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటుచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేశాం. లక్షణాలున్న వారిని గుర్తించి టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగాం. కోవిడ్కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనే. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. అవి.. ►రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని ఎక్కడా కొంచెం కూడా వృధా చేయకుండా పకడ్బందీగా ఉపయోగించడంవల్ల మరింత ఎక్కువ మందికి వేయగలిగాం. అంటే.. 1,68,46,210 మందికి బదులు 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు వేయగలిగాం. వ్యాక్సినేషన్లో మంచి విధానాలు అవలంబించడంవల్లే ఇంత ఎక్కువ మందికి ఇది సాధ్యమైంది. ►ఇక జూలైలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. అదే నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో వారు ఇవ్వలేకపోతున్నారు. అలాగే, జూన్లో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే. ►ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన కోవిడ్ టీకా స్టాకును తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి మరిన్ని టీకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని టీకాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇందుకు మార్గంసుగమం చేసింది. రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే కరోనా టీకాల్లో 75 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, 25 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేస్తుంది. అయితే ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల నిమిత్తం కేటాయించిన టీకా డోసులు మిగిలిపోతున్నాయి. ఈ విధంగా మిగిలిన టీకాలను, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆయా రాష్ట్రాల్లో మిగిలిపోతున్న ప్రైవేట్ టీకా డోసులు కొనుగోలు చేసే ఆలోచనలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉంది. టీకాల కోసం ఎదురుచూపులు తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 1.20 కోట్లకు పైగా టీకాలను సరఫరా చేసింది. జూలై నెలకు మరో 28 లక్షలు కేటాయించింది. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది అర్హు లు ఇంకా టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు దాదాపు రెండు లక్షల డోసులు వేస్తున్నా కొరత వేధిస్తూనే ఉంది. కొన్ని టీకా కేంద్రాల్లో డోసులు అసలే దొరకడం లేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేం ద్రం.. జనాభా, కరోనా కేసుల ప్రాతిపదికన ఇస్తుండటంతో డిమాండ్ మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపకరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నా రు. ఇతర రాష్ట్రాల నుంచి టీకాలు కొనడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలుపడుతుందని చెబుతున్నారు. నెలకు అదనంగా మరో ఐదారు లక్షల టీకాలకు వీలు పడుతుందని పేర్కొంటున్నారు. టీకాల షెడ్యూల్కు కసరత్తు రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. అయితే ఒక్కోరోజు కొన్ని కేంద్రాల్లో టీకాల కార్యక్రమా న్ని అకస్మికంగా నిలిపివేస్తున్నారు. టీకాల కొరత, కొన్నిసార్లు ఇతర కేంద్రాలకు ఎక్కువగా పంపడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలాం టి పరిస్థితిని నివారించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఏ నెలలో ఎన్ని టీకాలు రాష్ట్రాలకు పంపాలో ఇప్పటికే నిర్ణయించి షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ ప్రకారమే రాష్ట్రాలు కూడా ప్రణాళిక రచించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. జిల్లాలు మొదలు టీకా కేంద్రాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసి సరఫరా చేయాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల ఏ టీకా కేంద్రానికి, ఏ రోజు, ఎన్ని డోసులు సరఫరా అవుతాయో స్పష్టత ఉంటుంది. దీనివల్ల లబ్ధిదారులకు కూడా ఎలాంటి ఇబ్బందీ కలగదు. కేంద్రం ఆదేశాల మేరకు షెడ్యూల్ ఖరారుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 15 నుంచి దేశంలో మోడెర్నా టీకా ప్రపంచంలో పేరుపొందిన టీకాల్లో ఒకటైన మోడెర్నా ఈ నెల 15వ తేదీ నుంచి దేశంలో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. మోడెర్నా టీకాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోనూ అందుబాటులోకి తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఇక సాధారణ చికిత్సలు షురూ
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తున్నాయి. సెకండ్ వేవ్లో గణనీయంగా కేసులు పెరగడంతో చాలావరకు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకే పరిమితమైన సంగతి తెలిసిందే. అత్యవసర చికిత్సలు మినహా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను సైతం ఆస్పత్రులు వాయిదా వేస్తూ వచ్చాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కొత్తగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కూడా బాగా తగ్గడంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ చికిత్సల పునరుద్ధరణకు అనుమతి ఇస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని కోవిడ్ చికిత్సను పూర్తిగా నిలిపివేసి సాధారణ కేసులను అడ్మిట్ చేసుకుంటున్నాయి. కరోనా చికిత్స అందిస్తున్నారంటే సాధారణ రోగులు రావడానికి వెనుకాడతారనే ఉద్దేశంతో చాలా ఆసుపత్రులు కోవిడ్ చికిత్సను విరమించుకున్నాయి. కరోనా పడకల్లో 91.11 శాతం ఖాళీ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 55,442 పడకలను కరోనా సేవల కోసం కేటాయించారు. వాటిల్లో ప్రస్తుతం 4,931 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారు. అంటే 91.11% పడకలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా సాధారణ ఐసొలేషన్ పడకలు 96.02 శాతం ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వెయ్యి లోపుగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని పడకలను ఇప్పుడు సాధారణ చికిత్సలకు కేటాయించడం ప్రారంభించారు. తమ ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు ప్రారంభించినట్లు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రచారం కూడా చేస్తున్నాయి. ఇలా కోవిడేతర రోగులు ఆసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అదనపు చెల్లింపులకు కోత కరోనా కేసులు బాగా పెరిగిన సమయంలో డాక్టర్లు, నర్సులకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర అలవెన్సులు ఇచ్చిన ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పుడు వాటిని గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుతం కరోనా చికిత్సలో పాల్గొనే వారికి మినహా మిగిలినవారి అదనపు వేతనాల్లో కోత విధించాయి. నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా ఎక్కువ జీతాలతో తీసుకున్న కొన్ని యాజమాన్యాలు ప్రస్తుతం వారిని విధుల నుంచి తొలగించాయి. ‘కేరళ సహా ఇతర రాష్ట్రాల నుంచి కొందరు నర్సులను ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వారిలో కొందరికి నెలకు రూ. 50 వేల వరకు ఇచ్చాం. ఇప్పుడు వారితో అవసరం లేదు. కాబట్టి వారిని పంపించాం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం’ అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులకు పోస్ట్ కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైద్యం అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల తాజా పరిస్థితి 1. మొత్తం కరోనా పడకలు – 55,442 కరోనా రోగులతో ఉన్నవి – 4,931 ఖాళీగా ఉన్నవి – 50,511 2. ఇందులో సాధారణ పడకలు – 21,846 కరోనా రోగులు ఉన్నవి – 871 ఖాళీగా ఉన్నవి – 20,975 3. ఆక్సిజన్ పడకలు – 21,751 కరోనా రోగులు ఉన్నవి – 2,266 ఖాళీగా ఉన్నవి – 19,485 4. ఐసీయూ పడకలు – 11,845 కరోనా రోగులు ఉన్నవి – 1,794 ఖాళీగా ఉన్నవి – 10,051 -
సీహెచ్సీల్లోనూ కోవిడ్ చికిత్స!
సాక్షి, అమరావతి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి ఆస్పత్రులకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులకే కోవిడ్ చికిత్సలు పరిమితమయ్యాయి. మూడో వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ చికిత్సలు అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 నుంచి 50 పడకల వరకూ ఉంటాయి. వీటిల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉంటుంది. 18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ సోకినా ఇబ్బందులు తలెత్తకుండా సీహెచ్సీల్లోనూ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల బాధితులకు సత్వరమే సమీపంలోనే సేవలు అందనున్నాయి. 24 గంటలూ కరెంటు ఉండేలా చర్యలు చేపట్టారు. వెంటనే ఆస్పత్రికి చేరుకునేలా.. సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కలిపి 50కిపైగా ఆస్పత్రులను కోవిడ్ చికిత్సకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవికాకుండా 10 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇంతకుముందు వీటిల్లో కోవిడ్ సేవలు అందించలేదు. కొత్తగా కోవిడ్ చికిత్స కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధారణంగా నియోజకవర్గ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తక్షణమే ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, వార్డుల పునరుద్ధరణ చేపట్టారు. కోవిడ్కు అవసరమైన మౌలిక వసతులను అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా చికిత్స అందించేలా వసతులు కల్పిస్తున్నారు. పీడియాట్రిక్ వైద్యులు లేని చోట్ల తక్షణమే నాన్కోవిడ్ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్యులను నియమిస్తారు. ఏ జిల్లాలో ఎక్కడ..? ► అనంతపురం: అనంతపురం సీడీహెచ్, గుత్తి, కల్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ,ఉరవకొండ సీహెచ్సీలు ► తూర్పు గోదావరి: రంపచోడవరం, తుని (ఏరియా ఆస్పత్రి), అడ్డతీగల, చింతూరు, గోకవరం, పి.గన్నవరం, పెద్దాపురం, పత్తిపాడు, రాజోలు, ఏలేశ్వరం సీహెచ్సీలు ► గుంటూరు: చిలకలూరిపేట, సత్తెనపల్లి (ఏరియా ఆస్పత్రులు), ఫీవర్ ఆస్పత్రి ► ప్రకాశం: గిద్దలూరు,యర్రగొండపాలెం (ఏరియా ఆస్పత్రులు), డోర్నాల, కంభం సీహెచ్సీలు, ఎంసీహెచ్ ఒంగోలు ► చిత్తూరు: మహల్, పుత్తూరు, సత్యవేడు, వాయల్పాడు సీహెచ్సీలతో పాటు తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి ► పశ్చిమ గోదావరి: భీమవరం,చింతలపూడి, నరసాపురం,పాలకొల్లు (ఏరియా ఆస్పత్రులు), కొవ్వూరు, నిడదవోలు సీహెచ్సీలు ► కృష్ణా: జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ (విజయవాడ), సీహెచ్సీ మైలవరం ► శ్రీకాకుళం: నరసన్నపేట, సీతంపేట ఏరియా ఆస్పత్రులు ► కడప: జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి (ఏరియా ఆస్పత్రులు), బద్వేల్, పోరుమామిళ్ల, వేంపల్లి, మైలవరం సీహెచ్సీలు ► కర్నూలు: బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్సీలు ► విశాఖపట్నం: అగనంపూడి (ఏరియా ఆస్పత్రి),చింతపల్లి, కోటపాడు, నక్కపల్లి, యలమంచిలి సీహెచ్సీలు -
ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించుకోలేని కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కోరారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం ప్రైవేట్ ఆస్పత్రులకు లేనందున వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించి టీకాల కార్యక్రమం వేగవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. తగినన్ని వ్యాక్సిన్లు కేటాయిస్తే రికార్డు స్థాయిలో టీకాలిచ్చే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు ఉందని ఇప్పటికే నిరూపించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ... సరైన నిర్ణయం.. కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. దేశంలో అర్హులైన వారందరికీ జూన్ 21 నుంచి అమలు చేస్తున్న టీకాల కార్యక్రమానికి తగినన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం సరైన విధాన నిర్ణయం తీసుకుంది. సర్వత్రా అభినందనలు అందుకుంటున్న ఈ నిర్ణయంతో వ్యాక్సినేషన్ సజావుగా సాగుతుంది. ఏపీలో విస్తృత వ్యవస్థ.. భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం మా రాష్ట్రానికి ఉందని ఇప్పటికే నిరూపించాం. జూన్ 20న ఒక్కరోజే 13,72,481 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా మా వ్యవస్థాగత సామర్థ్యాన్ని చాటిచెప్పాం. ఏప్రిల్ 14న 6,32,7890 మందికి, మే 27న 5,79,161 మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లు, 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేలకుపైగా ఏఎన్ఎంలు ఉండటంతోపాటు భారీ సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇంతటి విస్తృతమైన వ్యవస్థ సహకారం ఉన్న ఆంధ్రప్రదేశ్కు భారీ పరిమాణంలో వ్యాక్సిన్లు సరఫరా చేస్తే ఇదే రీతిలో టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించగలం. రాష్ట్రాలకు ఇస్తే వేగవంతం... మే 1 నుంచి అమలు చేసిన సరళీకృత జాతీయ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విధానం ప్రకారం దేశంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేట్, పారిశ్రామిక సంస్థలకు టీకాలు సరఫరా చేశారు. ప్రైవేట్ సంస్థలకు 25 శాతం వ్యాక్సిన్లు సరఫరా చేసే విధానాన్ని జూన్ 21 నుంచి అమలు చేస్తున్న జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా పొందుపరిచారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 2,67,075 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేయగలిగారు. అయినప్పటికీ మా రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు జూలై కోసం 17,71,580 డోసుల వ్యాక్సిన్లు కేటాయించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్గానీ ఆ ఆసుపత్రుల గత అనుభవాన్నిగానీ పరిశీలిస్తే అంత భారీ పరిమాణంలో వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోలేవన్నది స్పష్టమవుతోంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి జూన్ 24న నిర్వహించిన సమావేశంలో కూడా పలు రాష్ట్రాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా టీకాలు వేసేందుకు అనుమతించాలని కోరుతున్నా. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవడమే కాకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు దోహదపడుతుంది. అటువంటి నిర్ణయానికి విస్తృత ప్రజామోదం లభించడంతోపాటు మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
సాక్షి, అనంతపురం: ప్రైవేట్ ఆస్పత్రులో దోపిడీపై జాయింట్ కలెక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. హర్షిత ఆస్పత్రికి రూ.20 లక్షలు, చంద్ర ఆస్పత్రికి రూ.9 లక్షలు జరిమానా విధించారు. 14 ఆస్పత్రులకు రూ.39 లక్షలు జరిమానా విధించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పదేపదే అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు. చదవండి: ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు -
ప్రైవేటు ఆస్పత్రుల ఫీజులు ఖరారు: ఐసీయూకు రూ.7,500
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు రాష్ట్ర ప్రభు త్వం ఫీజులు ఖరారు చేసింది. గతేడాది జూన్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ వైద, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స సందర్భంగా నిర్వహించే కీలకమైన పరీక్షలు, పీపీఈ కిట్లు, అంబులెన్స్ తదితర వాటికి సంబంధించి ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సాధారణ ఐసోలేషన్ వార్డులో చికిత్సకు రోజుకు రూ.4 వేలు, ఐసీయూలో రోజుకు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్తో కలుపు కొని రోజుకు రూ.9 వేలు ఫీజుగా తీసుకోవాలి. అయితే ఇందులో కొన్ని పరీక్షలు కూడా కలిపి ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రొటీన్ యూరిన్ పరీక్ష, హెచ్ఐవీ, హెపటైటిస్ సీ. హెపటైటిస్ బీ, సిరమ్ క్రియేటినైన్, అల్ట్రాసౌండ్, 2డీ ఎకో, ఎక్స్ రే, ఈసీజీ పరీక్షలు ఫీజులో కలిసి ఉంటాయి. అలాగే ఆ సందర్భంగా అవసరమైన మందులు, డాక్టర్ కన్సల్టేషన్, బెడ్, భోజనం ఖర్చులు కూడా కలిసే ఉంటాయి. మూత్రనాళంలో గొట్టం ఏర్పాటు చేయడం వంటివి కూడా ఉంటాయి. ఖరీదైన మందులు ఎమ్మార్పీపైనే.. ఇక బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్లు, సెంట్రల్ లైన్, కీమోపార్ట్ ఇన్సెర్షన్, బయాప్సీ, పొట్టలో నుంచి ద్రవాన్ని తీయడం తదితరమైన వాటికి అదనంగా వసూలు చేసుకోవచ్చు. అయితే వీటికి 2019 డిసెంబర్ 31 నాటికి ఎంత ధర నిర్ధారించారో అంతే వసూలు చేయాలి. అలాగే ఇమ్యూనో గ్లోబిన్స్, మెరో పెనిమ్, పేరెంటల్ న్యూట్రిషన్, టొసిలిజుమాబ్ వంటి అధిక ధరలున్న మందులు రోగికి ఇవ్వాల్సి వస్తే అప్పుడు.. వాటికి ఎంఆర్పీ ప్రకారం వసూలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఆరోగ్య బీమాతో చేయించుకునే చికి త్సకు వర్తించవు. ఉదాహరణకు ఎవరైనా ఆరోగ్య బీమాతో ఆసుపత్రిలో చేరితే ఈ ఫీజులు వర్తించవు. ఆసుపత్రులు వారి పద్దతిలో ఆరోగ్య బీమా సంస్థల నుంచి వసూలు చేసుకోవచ్చని వైద్య వర్గాలు తెలిపాయి. సొంతంగా డబ్బులు చెల్లించి కరోనా వైద్యం చేయించుకునే వారికి మాత్రమే సర్కారు నిర్ధారించిన ఫీజులు వర్తిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తాజాగా పీపీఈ కిట్ ధర, అంబులెన్స్కు వసూలు చేయాల్సిన సొమ్ముపై స్పష్టత ఇచ్చారు. ఒక్కో పీపీఈ కిట్కు గరిష్టంగా రూ.273 మాత్రమే వసూలు చేయాలి. దూర ప్రాంతాలకు సాధారణ అంబులెన్సులో వెళ్లాల్సి వస్తే కిలోమీటరుకు గరిష్టంగా రూ.75 చొప్పున వసూలు చేయాలి. ఆక్సిజన్, ఇతర సౌకర్యాలతో కూడిన అంబులెన్సులోనైతే కిలోమీటరుకు రూ.125 చొప్పున వసూలు చేయాలి. మామూలుగా సాధారణ అంబులెన్సుకు గరిష్టంగా రూ. 2 వేలు మాత్రమే తీసుకోవాలి. ఇతర వసతులున్న అంబులెన్సులో అయితే రూ. 3 వేలు మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను కచ్చితంగా అమలు చేయాలనీ, అధిక ధరలు వసూలు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అనసరంగా సీటీ స్కాన్లు, టెస్టులు చేయవద్దని ఆదేశించింది. ఇదిలావుంటే ఈ ఫీజులు, ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని కొన్ని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొన్ని నిర్ధారణ పరీక్షల ధరలు ఇలా ఉన్నాయి... టెస్ట్ ధర (రూ.లలో) హెచ్ఆర్సీటీ 1,995 ఐఎల్–6 1,300 డిజిటల్ ఎక్స్రే 300 డీ డైమర్ 800 సీఆర్పీ 500 ప్రొకాల్సిటోనిన్ 1,400 ఫెర్రిటిన్ 400 ఎల్డీహెచ్ 140 పదింతల జరిమానా విధించండి: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రులకు ఇతర రాష్ట్రాల తరహాలో పదింతలు జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జీవోకు విరుద్ధంగా ఆస్పత్రులు వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాత్రమే పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు, ల్యాబ్ పరీక్షల ఫీజులకు సంబంధించి ప్రభుత్వ జీవోపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి ఆస్పత్రిలో రిసెప్షన్, అకౌంట్స్ విభాగాలున్న ప్రదేశాల్లో బాగా కనిపించేలా జీవో అతికించాలని స్పష్టం చేసింది. కాగా, అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రుల నుంచి రోగులకు డబ్బు రిఫండ్ చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల పై అధికారుల కొరడా
-
వ్యాక్సిన్ ధరలు కేంద్రం ఖరారు: ఎంతంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సోకకుండా వేసుకునే వ్యాక్సిన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రైవేటులో వేసుకోవాలనుకునే వారు వేసుకోవచ్చని చెప్పారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. నిర్ధిష్ట ధర విధిస్తూ ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా.. కోవిషీల్డ్ రూ.780 కోవాగ్జిన్ రూ.1,410 స్పుత్నిక్ రూ.1,145 5 శాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జీ అదనం నిర్దేశించిన ధరల కన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అధిక ధరలు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సిన్పై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి సోమవారం ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. త్వరలోనే ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా అందించనుంది. -
టీకా వివాదం.. వెనక్కి తగ్గిన అమరీందర్ సర్కార్
చండీగఢ్: ఓ వైపు జనాలు కోవిడ్ టీకాల కొరతతో ఇబ్బంది పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్పత్రులకు టీకాలను కేటాయిస్తూ.. జనాలకు అన్యాయం చేస్తున్నాయి. తాజాగా పంజాబ్లో ఇదే ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపణలో నేపథ్యంలో అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. 400 రూపాయలకు వచ్చే టీకాను సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్కు 1060 రూపాయలకుకి అమ్ముతున్నదని, ఆస్పత్రులు దానిని ప్రజలకు 1560 రూపాయలకు అమ్ముతున్నాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్లో ఆరోపించారు. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్లోని అమరీందర్ సర్కారును ఆదేశించింది. చదవండి: షాకింగ్గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు! -
కరోనా: రాష్ట్రంలో మరో ఆరు ఆసుపత్రులపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝులిపించింది. తాజాగా మంగళవారం తెలంగాణలో కొత్తగా మరో ఆరు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసిన వాటిలో సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్షైన్ ఆసుపత్రి, బంజారాహిల్స్లోని సెంచరీ, లక్డీకపూల్లోని లోటస్ ఆసుపత్రి, ఎల్బీనగర్లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్మెంటఖ రద్దు చేయగా.. ఇప్పటివరకు 113 ఆసుపత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మరో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు
సాక్షి, హైదరాబాద్: కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 105 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. వీటిలో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. నగరంలోని కేపీహెచ్బీ కాలనీలోని పద్మజా హాస్పిటల్, ఉప్పల్లోని టీఎక్స్ ఆస్పత్రి, అల్వాల్లోని లైఫ్లైన్ ఆస్పత్రి, వరంగల్లోని మ్యాక్స్క్యూర్, లలిత ఆస్పత్రులు, సంగారెడ్డిలోని సాయిశ్రీరామ్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశారు. -
విశాఖలోని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల పై ప్రభుత్వం దృష్టి
-
ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్ కేసులు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టాస్క్ఫోర్స్ విస్తృత తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులకు రూ.2.86 కోట్ల జరిమానా విధించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55 ఆస్పత్రులకు రూ.3.61 కోట్ల జరిమానా విధించారు. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమిన్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఏ ఆసుపత్రిలోనైనా 50 శాతం బెడ్లు ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీలో భర్తీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 104 కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమాచారాన్ని అందివ్వాలన్నారు. నోడల్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షుకులదే పూర్తి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
అధిక ఫీజుల వసూల్పై ఏపీ సర్కార్ సీరియస్
-
పది రెట్లు పెనాల్టీ.. క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: మానవత్వం మరచి కోవిడ్ రోగుల వద్ద అధిక ఫీజులు దండుకునే ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. తీరు మార్చుకోని ప్రైవేటు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ చికిత్సలకు, పరీక్షలకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలన్న ఆదేశాలను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి ఆస్పత్రులకు ఇప్పటివరకు నోటీసులు జారీ చేసి, జరిమానాలను విధిస్తూ వస్తున్నారు. అయితే, తీరు మార్చుకోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులతో దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఈ విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి రావడంతో అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్ శుక్రవారం కీలక ఉత్తర్వులిచ్చారు. వీటి ప్రకారం.. తొలి సారి నిబంధనలను ఉల్లంఘించి, ప్రభుత్వం నిర్ధారించిన దానికన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అలాంటి ఆస్పత్రులకు పది రెట్లు పెనాల్టీ విధిస్తారు. రెండో సారి కూడా అధిక ఫీజుల వసూలుకు పాల్పడితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులలో ‘ఆక్సిజన్’ ఇలా ఉండాలి.. రాష్ట్రంలోనిప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల సంఖ్య ఆధారంగా ఉండాల్సిన ఆక్సిజన్ పరికరాలకు సంబంధించి గత చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో 50 పడకలు దాటిన ఆస్పత్రులలో ఎన్ని పడకలు ఉన్నాయో అన్ని ఆక్సిజన్ సిలిండర్లను కలిగి ఉండాలి. 50 లోపు పడకలున్న ఆస్పత్రులు 40 ఆక్సిజన్ సిలిండర్లను కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఆస్పత్రిలో పడకల సంఖ్యకు సమానంగా రెగ్యులేటర్తో కూడిన ఆక్సిజన్ మాస్క్లు ఉండాలి. 100కు పైగా పడకలున్న ఆస్పత్రి 1,000 ఎల్పీఎం పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్, 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రి 500 ఎల్పీఎం పీఎస్ఏ ప్లాంట్ను కలిగి ఉండాలి. ప్రతి ఆస్పత్రిలో పడకల సంఖ్యకు సమానంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను కలిగి ఉండాలని అనిల్కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కోవిడ్ చికిత్సల నుంచి.. 5 ఆస్పత్రులు ఔట్
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలో నిర్లక్ష్యం, అడ్డగోలుగా చార్జీలు వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆయా ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సల అనుమతిని రద్దు చేసింది. కొత్తగా కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా ఆస్పత్రుల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలిచ్చింది. వరుస ఫిర్యాదులతో.. కరోనా చికిత్సలో నిర్లక్ష్యం, భారీ వసూళ్లపై ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇందులో 66 ఆస్పత్రులపై ఆధారాలతో సహా అందిన 88 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల తీవ్రత, నోటీసుల పట్ల యాజమాన్యాల స్పందన ఆధారంగా చర్యలు చేపట్టారు. ఐదు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేశారు. ఈ జాబితాలో బంజారాహిల్స్లోని విరించి హాస్పిటల్, సనత్నగర్లోని నీలిమ హాస్పిటల్, కూకట్పల్లిలోని మాక్స్ హెల్త్ హాస్పిటల్, కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్, బేగంపేట్లోని వీఐఎన్ఎన్ ఆస్పత్రి ఉన్నాయి. ఇకపై కొత్తగా కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే చికిత్స పొందుతున్నవారికి నిబంధనల ప్రకారం చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు ఫిర్యాదులకు సంబంధించి మరికొన్ని ఆస్పత్రులకు కూడా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయా ఆస్పత్రుల నుంచి వివరణ తీసుకుని పరిశీలిస్తున్నారు. సర్వీసులో నిర్లక్ష్యంతో రోగులకు చికిత్స చేయడంలో బంజారాహిల్స్లోని విరించి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారంటూ నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఆస్పత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చి, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు చేపట్టారు. అధిక వసూళ్లతో.. కరోనా బాధితుల నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ... బేగంపేటలోని వీఐఎన్ఎన్ హాస్పిటల్పై మోహసీన్ ఉస్మానీ, గౌరమ్మ, కె.సుభాష్, రామచంద్ర, సంధ్య తదితరులు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్పై దయాకర్, సయ్యద్ గౌసియా బేగం.. సనత్నగర్లోని నీలిమ హాస్పిటల్పై షేక్ గులామ్ ముస్తఫా... కూకట్పల్లిలోని మాక్స్ హెల్త్ హాస్పిటల్స్పై బాధితురాలు శశికళ వైద్యశాఖకు ఫిర్యాదులు చేశారు. వీటిపై స్పందించిన అధికారులు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో.. కోవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. -
విరించి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మీటింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేశారు. గతంలో కూడా విరించి ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నప్పటికి.. తీరు మార్చుకోకపోవడం గమనార్హం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో శుక్రవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. కరోనా చికిత్సకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. చదవండి: ఆనందయ్య మందు నేనూ ఇస్తా.. యువకుడి పోస్ట్ -
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారుల సమావేశం
-
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాల్సిన పేషెంట్ల నుంచి డబ్బు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ఇటీవలే వివిధ వైద్య వర్గాలు, ఆస్పత్రుల యాజమాన్యాలను సంప్రదించి చికిత్సకు రేట్లు పెంచామని, వీటిని కూడా కాదని పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు ఆస్పత్రులకు జరిమానా విధించామన్నారు. రోజూ నోడల్ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులను పర్యవేక్షిస్తారని తెలిపారు. పలువురు నిపుణులు, వైద్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చిన్నపిల్లల్లో కేసులు వస్తే ఎలాంటి వసతులు కల్పించాలన్న దానిపై కమిటీ వేశామన్నారు. వెంటిలేటర్లు, ప్రత్యేక వార్డులు, మరికొన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, దీన్నిబట్టి అన్ని ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ సరిగా అమలు కానందునే పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయని రాయడం అవగాహన రాహిత్యమన్నారు. పట్టణాల్లో 1.46 కోట్ల జనాభా, పల్లెల్లో 3.49 కోట్ల జనాభా ఉందని చెప్పారు. తాజాగా వచ్చిన కేసులను బట్టి చూస్తే లక్ష జనాభాకు పల్లెల్లో 248, పట్టణాల్లో 383 కేసులు వచ్చాయన్నారు. మే 16 నుంచి 22 వరకు వారం రోజుల గణాంకాల్లో ఈ మేరకు తేలిందన్నారు. ఆ వారంలో 1,42,707 కేసులు నమోదయ్యాయని, వాటిలో పట్టణాల్లో 56,058, గ్రామాల్లో 86,649 కేసులు ఉన్నాయని వివరించారు. కేసుల్ని జనాభా ప్రాతిపదికన లెక్కించాలని, అది అవగాహన లేక కొన్ని పత్రికల్లో పల్లెల్లో ఎక్కువగా కేసులు వస్తున్నట్టు రాశారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎక్కువమంది నియామకం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్యశాఖలో 1,448 మందిని ఎక్కువగా నియమించినట్లు చెప్పారు. గత ఏడాది 17,315 మందిని నియమించగా, ఈ ఏడాది 18,763 మందిని నియమించినట్టు తెలిపారు. ఇందులో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్నర్సులు అందరూ ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23.81 లక్షల మందికి రెండు డోసులు, 36.49 లక్షల మందికి ఒక డోసు టీకా వేసినట్లు చెప్పారు. 1.41 లక్షల కోవాగ్జిన్, 13.88 లక్షల కోవిషీల్డ్ స్టాకు ఉందన్నారు. కోవాగ్జిన్ సెకండ్ డోసు వారికి, కోవిషీల్డ్ మొదటి డోసు వారికి వాడతామన్నారు. సోమవారం నాటికి ఆనందయ్య మందుపై స్పష్టత ఆనందయ్య మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీకి, సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని చెప్పారు. సోమవారం నాటికి దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మందుల్లో వాడిన దినుసుల మిక్సింగ్ ఎలా ఉంది, మందు వాడితే నష్టం ఉందా, ఫలితాలు ఏమేరకు కనిపించాయి అన్నదానిపై మందు వాడిన వారినుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారని, దీనిపై స్పష్టత రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలో సెకండ్వేవ్లో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తీసుకొచ్చామన్నారు. కేంద్రం మనకు 590 మెట్రిక్ టన్నులే కేటాయించినా అడ్హక్ ప్రాతిపదికన ఎక్కువ తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వారం రోజులుగా చూస్తే కేసులు తగ్గుతున్నాయని, ఐసీయూ, ఆక్సిజన్ పడకల లభ్యత చూస్తే ఇది అర్థమవుతుందని చెప్పారు. తాజాగా 3,552 ఆక్సిజన్ పడకలు, 812 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజురోజుకు అడ్మిషన్లు తగ్గుతున్నాయని, డిశ్చార్జిలు పెరుగుతున్నాయని తెలిపారు. చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే -
‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకు తినే ఆస్పత్రులను అధికారులు ఫినిష్ చేయాలని ఆదేశించారు. ఇటువంటి ఆస్పత్రులను క్షమిస్తే, భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు -
రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తేకఠిన చర్యలు
-
ప్రైవేట్ ఆస్పత్రికి రూ.10 లక్షలు ఫైన్
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ రోగుల నుంచి కాసుల దోపిడీకి పాల్పడే ప్రైవేటు ఆస్పత్రులకు విజయనగరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్కుమార్ కళ్లెం వేశారు. ఇక ముందు ఏ ఆస్పత్రి నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా అధిక మొత్తంలో అపరాధ రుసుం విధించారు. విజయనగరం పట్టణంలోని కర్రల మార్కెట్ రోడ్డులో ఉన్న పీజీ స్టార్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తోందంటూ జేసీతో పాటు ఆరోగ్యశ్రీ అధికారులకు ఇటీవల పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై జేసీ, జిల్లా ఆరోగ్యశ్రీ అదనపు సీఈవో మహేష్కుమార్లు విచారణ చేపట్టారు. విచారణలో అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు నిర్ధారణ కావడంతో పీజీ స్టార్ ఆస్పత్రికి రూ.10 లక్షల అపరాధ రుసుం విధిస్తూ జేసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 719 నెట్వర్క్ ఆస్పత్రులకు ఏప్రిల్ 15 నాటికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు సమర్పించిన బిల్లులకుగాను 195.36 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 584 నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి 15 నాటికి ఇచ్చిన బిల్లులకుగాను రూ.40.58 కోట్లు కలిపి మొత్తం రూ.235.94 కోట్లు చెల్లించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రులకు నోటీసులు కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడలోని నిమ్రా ఆస్పత్రి, ఆంధ్ర ఆస్పత్రులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో సరిగా స్పందించడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా పేద ప్రజలకు చికిత్సలు అందించాల్సిందేనని, ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, చికిత్సలు చేయకపోయినా అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ప్రైవేట్’కు వ్యాక్సిన్పై పునరాలోచించండి
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణకు ప్రస్తుతం వ్యాక్సినేషనే శరణ్యమని, ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రుల వారు నేరుగా వ్యాక్సిన్ కోనుగోలు చేసుకోవడానికి కేంద్రం అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. దేశంలో వ్యాక్సిన్ సరఫరా తగినంత లేని ఈ సమయంలో ఈ నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజల భయాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా దోపిడీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోవిడ్ నియంత్రణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ.. వ్యాక్సిన్ సరఫరా విషయమై వాస్తవ పరిస్థితి వివరిస్తూ పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరాను కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం చేయాలని కోరారు. ఈ లేఖలోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. ప్రజలపై భారం పడుతుంది.. ► రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాము. అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాము. ► మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసులుబాటు ఉండడంతో, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, విమర్శలకు దారి తీస్తోంది. ► నిజానికి కోవిడ్ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది. అలా వీలు కాకపోతే నామమాత్రపు ధరలో టీకా వేయాలి. 45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్ల వాక్సిన్ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అదే జరిగితే బ్లాక్ మార్కెట్కు బాటలు ► ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉంది. ఇది పేద ప్రజలను వాక్సిన్కు దూరం చేయడమే కాకుండా, డిమాండ్ పెరగడంతో వాక్సిన్ల బ్లాక్ మార్కెట్కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది. రెమ్డిసివిర్ ఇంజక్షన్ల విషయంలో ఏం జరిగిందో చూశాం. ► ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం అన్నది మంచి ఆలోచనే అయినా, అవసరానికి మించి వాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే అది సబబు అవుతుంది. ► వాక్సిన్ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్ వేయించుకుంటారు. కానీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం చార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది. ► ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను. దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్ డోస్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్ డోస్లు వేసే వీలుంటుంది. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, వాక్సిన్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను. -
ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా ఆరోగ్యశ్రీలో కోవిడ్కు 50 శాతం పడకలు ఇవ్వకపోతే ఆ ఆస్పత్రులకు కోవిడ్ అనుమతులతోపాటు అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దుచేస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో పేరున్న ఓ ఆస్పత్రికి మచిలీపట్నం బ్రాంచ్లో 130 పడకలుండగా, 5 పడకలు మాత్రమే ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. అదే ఆస్పత్రికి విజయవాడ భవానీపురంలో 150 పడకలుంటే 10 పడకలు కూడా చూపించలేదు. ఇలాంటి ఆస్పత్రులు విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్యశాఖకు సమాచారం వచ్చింది. దీంతో రానున్న రెండు రోజుల్లో అన్ని ఆస్పత్రుల్లోను తనిఖీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ చికిత్స చేసే ఏ ఆస్పత్రిలో అయినా సరే 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలని, కోవిడ్ సమయంలో అన్ని ఆస్పత్రులు ఇది పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొన్ని ఆస్పత్రులు ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోనే చర్యలు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి ఆస్పత్రిపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటాం. కోవిడ్ చికిత్సకు 50 శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దుచేసేందుకైనా వెనుకాడేది లేదు. – డాక్టర్ ఎ.మల్లికార్జున,సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చికిత్స నిమిత్తం కోవిడ్ రోగులు చెల్లించే మొత్తాలను ఇకపై ప్రతి కోవిడ్ ఆస్పత్రిలో ఉండే నోడల్ అధికారి లేదా హెల్ప్ డెస్క్ మేనేజర్ ద్వారా చెల్లింపులు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరింది. ఇందుకు తగిన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. రోగి లేదా అతని అటెండెంట్ లేదా డబ్బు చెల్లించిన వ్యక్తి నుంచి తగిన అక్నాలడ్జ్మెంట్ తీసుకోవాలంది. దీనివల్ల డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాలను అప్పగించేది లేదని ఆస్పత్రులు చెప్పేందుకు అవకాశం ఉండదని తెలిపింది. దుకాణాల ముందు ఓ కానిస్టేబుల్ను ఉంచి, జనం భౌతిక దూరం, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అదేవిధంగా కోవిడ్ కేర్ కేంద్రాలను పట్టణాల్లోనే ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్కు సూచించింది. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఏపీకి ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కోవిడ్ విషయంలో పలు అభ్యర్థనలతో హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. 90 వేల వయల్స్ మాత్రమే వచ్చాయి.. కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 6 వరకు ఏపీకి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తూ వచ్చామని, తర్వాత దీన్ని 580 మెట్రిక్ టన్నులకు పెంచామని చెప్పారు. ఈ నెల 16 వరకు 2,81,257 రెమిడెసివిర్ వయల్స్ను ఏపీకి సరఫరా చేశామని తెలిపారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ విభేదించారు. కేవలం 90 వేల వయల్స్ మాత్రమే రాష్ట్రం అందుకుందన్నారు. 3.75 లక్షల ఇంజక్షన్లు ఇస్తామని కేంద్రం నుంచి ఇటీవలే రాష్ట్రానికి లేఖ అందిందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో బెడ్ల ఖాళీల వివరాలను తెలియచేసే వ్యవస్థను త్వరలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. మరో న్యాయవాది జీఆర్ సుధాకర్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రానికి 50 క్రయోజనిక్ ట్యాంకర్లు, 10 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తదుపరి విచారణ సమయంలో ఈ వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
ప్రైవేట్ ఆస్పత్రులను మీ అజమాయిషీలోకి తీసుకోండి
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు తగిన చికిత్స అందించేందుకు వీలుగా ప్రైవేట్ ఆస్పత్రులను తన అజమాయిషీలోకి తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు కోరింది. దీనివల్ల చాలా మందికి చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. రోగులకు బెడ్ల ఖాళీల వివరాలను తెలిపేందుకు నిర్దిష్ట సమాచార వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంది. ప్రస్తుతం ఉన్న టోల్ఫ్రీ నంబర్ 104తో పాటు మరో నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలంది. అలాగే హెల్త్ బులెటిన్ను కూడా విడుదల చేయాలంది. వ్యాక్సిన్ వేసేటప్పుడు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్కు సంబంధించి దాఖలైన పలు పిల్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కర్ఫ్యూ సత్ఫలితాలిస్తోంది..: ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కరోనాను అడ్డుకోవడంలో కర్ఫ్యూ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. కేంద్రం నుంచి తగిన సంఖ్యలో వ్యాక్సిన్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్రానికి రావడం లేదన్నారు. 2.35 లక్షల వయల్స్ పంపుతామన్న కేంద్రం కేవలం 95 వేల వయల్స్ మాత్రమే పంపిందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రెమ్డెసివిర్ కొనుగోలు చేస్తోందని, దీంతో ఎలాంటి కొరత ఉండడం లేదన్నారు. మరింత మంది రోగులకు చికిత్స అందించడానికి కోవిడ్ ఆస్పత్రులను 650 నుంచి 680కి పెంచామన్నారు. అధిక ఫీజులు గుంజుతున్న ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రోగుల పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ అంబులెన్సులపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. ఆక్సిజన్ హేతుబద్ద సరఫరా కోసం జాతీయ స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీకి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’
పరిగి మండలానికి చెందిన నరేష్ కొన్ని వారాల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మూడు రోజుల తర్వాత స్వల్పంగా దగ్గు మొదలైంది. ఎందుకైనా మంచిదని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నారు. చికిత్స కోసం వచ్చిన అతన్ని కనీసం తలెత్తి కూడా చూడని ఆ డాక్టర్.. నరేష్ చెబుతున్న జబ్బు లక్షణాలు పూర్తి కాకనే ఓ రెఫరల్ ప్రిస్కిప్షన్ చేతిలో పెట్టేశాడు. చెస్ట్ ఎక్స్రే, సీటీ స్కాన్, బ్లడ్ చెకప్ చేయించాలని రాసి ఉంది. అదే ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్ను కలిసి బ్లడ్ చెకప్కు సంబంధించి నమూనాలు ఇచ్చి, రూ.900 బిల్లు చెల్లించాడు. డాక్టర్ సూచించిన ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వెళ్లి ఎక్స్రే కోసం రూ.350, సీటీ స్కాన్ కోసం రూ.3వేలు బిల్లు చెల్లించుకున్నాడు. ఈ మొత్తం రిపోర్టులు పరిశీలించిన తర్వాత నరేష్కు కరోనా సోకిందంటూ నెమ్మదిగా చెప్పిన డాక్టర్.. తనకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్ ద్వారా రూ.800 విలువ చేసే మందులు కొనుగోలు చేయించాడు. దగ్గు కోసం చికిత్సకు వెళితే.. కేవలం రెండు గంటల వ్యవధిలో డాక్టర్ కన్సల్టింగ్ ఫీజుతో కలిపి రూ.4,350 వరకు నరేష్ చెల్లించుకోవాల్సి వచ్చింది. తనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎందుకైనా మంచిదని అదే రోజు తనకు తెలిసిన ఊపిరితిత్తులకు సంబంధించిన మరో ప్రైవేట్ వైద్యుడిని కలిశాడు. అతన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం కరోనా లేదని, ఇన్ఫెక్షన్ సోకడం వల్ల దగ్గు వస్తోందంటూ తేల్చి ఓ టానిక్, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇక్కడ ఆస్పత్రి కన్సల్టెంగ్ ఫీజు, నెబులైజర్, మందులకు 1,300 ఖర్చయింది. ఇంటికెళ్లి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఓ రెండు రోజుల తర్వాత నరేష్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ పరిస్థితి కేవలం నరేష్ ఒక్కనిదే కాదు. సాధారణ జబ్బులతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుతున్న వారందరూ ఈ తరహా దోపిడీకి గురవుతున్నారు. హిందూపురం టౌన్: ఆస్పత్రికి వచ్చే వారిని కచ్చితంగా సీటీ స్కానింగ్ చేయించుకోవాలని ప్రైవేట్ వైద్యులు జులుం చేస్తున్నారు. ఇలా హిందూపురం ప్రాంతంలోని చాలా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ పేరిట పెద్ద ఎత్తున స్కామ్కు తెరలేపారు. కరోనా కష్టకాలంలో రోగుల్లోని భయాన్ని కొందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. స్వల్పంగా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చాలు.. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు అంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. రోజుకు సగటున 70కి పైగా.. హిందూపురం జిల్లా ఆస్పత్రితో పాటు మరో మూడు ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రిలోని సీటీ స్కానింగ్ యంత్రం పనిచేయడం లేదు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలోనూ ఒకటి పనిచేయడం లేదు. దీంతో పనిచేస్తున్న రెండు స్కానింగ్ సెంటర్లకు కరోనా కష్ట కాలంలో భారీ డిమాండ్ నెలకొంది. గతంలో సీటీ స్కాన్కు రోగి అవసరాన్ని బట్టి రూ.4 వేలు నుంచి రూ.5వేల వరకూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేసుకునేవారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ తీసుకుంటున్నారు. ఈ లెక్కన హిందూపురంలోని స్కానింగ్ సెంటర్లలో రోజుకు 70 నుంచి 140 వరకు సీటీ స్కాన్లు నిర్వహిస్తుంటారు. జిల్లాస్పత్రిలో సీటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవసరాన్ని బట్టి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేస్తుంటారు. రెఫరల్కు రూ.800 కమీషన్ హిందూపురం నియోజకవర్గంతో పాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల ప్రజలు అత్యవసర చికిత్సల కోసం హిందూపురంలోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. కరోనా భయంతో కుదేలవుతున్న రోగులకు అవసరం లేకున్నా సీటీ స్కాన్లు నిర్వహిస్తూ ఆర్ఎంపీలు, ప్రైవేట్ డాక్టర్లు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగులకు అవసరం లేకున్నా.. ముందుగా సీటీ స్కాన్లు, బ్లడ్ చెకప్లు, ఎక్స్రేలకు డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యకూ సీటీ స్కాన్ తప్పనిసరి చేసేశారు. సీటీ స్కానింగ్కు రెఫర్ చేసిన డాక్టర్కు ఒక్కో స్కాన్కు రూ.800 చొప్పున కమీషన్ను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అందజేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర వైద్య పరీక్షల్లోనూ కమీషన్లను డాక్టర్లు దండుకుంటున్నారు. చివరకు మందుల కొనుగోలు విషయంలోనూ కమీషన్లు ఉండడంతో ప్రి్రస్కిప్షన్ చాలా పొడవుగా ఉంటోంది. సీటీ స్కాన్తో అన్నీ సమస్యలే.. అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించడం చాలా ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందంటున్నారు. కొంతమంది వైద్యులు ప్రతి మూడు రోజులకు ఒకసారి సీటీ స్కాన్ చేయిస్తుంటారని, దీంతో రోగి శరీరం అధిక రేడియేషన్కు గురికావడంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మాత్రం అదీ వైద్యులు సూచిస్తేనే సీటీ స్కాన్ చేయించుకోవాలని చెబుతున్నారు. సీటీ స్కాన్ కంటే చెస్ట్ ఎక్స్రేకే తొలి ప్రాధాన్యమివ్వాలని.. అప్పటికీ జబ్బు పరిస్థితి తేలకపోతే సీటీ స్కాన్కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక సీటీ స్కాన్ 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్రేలతో సమానమని హెచ్చరిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగా ఉన్న వారికి సీటీ స్కాన్ అసలు అవసరం లేదని అంటున్నారు. తుంగలోకి కోవిడ్ నిబంధనలు కరోనా నిర్ధారణకు ఆర్ఎంపీలు, ప్రైవేట్ వైద్యులు సీటీ స్కాన్పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ డిమాండ్ను అనుకూలంగా మార్చుకున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కేశారు. డాక్టర్లు రాసిచ్చిన రెఫరల్ ప్రి్రస్కిప్షన్ను మళ్లీ రోగి చేతికి ఏ ఒక్క స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఇవ్వడం లేదు. కేవలం రిపోర్టులు మాత్రమే చేతిలో పెట్టేసి డబ్బు గుంజుతున్నారు. దీనికి తోడు ఒకరికి స్కాన్ చేసిన తర్వాత యంత్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయడం లేదు. దీంతో తొలుత స్కాన్ చేసిన రోగికి కరోనా పాజిటివ్ ఉంటే.. తర్వాత స్కాన్ చేసిన రోగికి లేకపోయినా.. అతను కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అయితే నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రెఫరల్ ప్రిస్కిప్షన్ లేకపోయినా.. సొంత నిర్ణయాలతో సీటీ స్కాన్లు చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ సిఫారసు లేకుండా చేయరాదు అవసరం లేకున్నా స్కాన్కు రెఫర్ చేయడం సరికాదు. క్వాలిఫైడ్ డాక్టర్ల సిఫారసు లేకుండా సీటీ స్కాన్ చేస్తే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. రోగులు సైతం డాక్టర్ల సలహా మేరకే స్కానింగ్ చేయించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలు చాలా నష్టం కలిగిస్తాయి. – డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’ నిరంతరాయంగా స్టీల్ప్లాంట్ ఆక్సిజన్ -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొరఢా ఝులిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. వీటితోపాటు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న మరో 5 ఆస్పత్రుల నిర్వాహకులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కార్డు గల రోగులకు వైద్యం చేయకపోవడం, ఆరోగ్యశ్రీ రోగుల నుంచి కూడా బిల్లులు వసూలు చేయడం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రి, విశాఖపట్నంలోని ఆదిత్య, దుర్గ, వైఎస్సార్ జిల్లాలోని సంజీవిని, విజయవాడ భవానీపురంలోని ఆంధ్రా ఆస్పత్రి, కాకినాడ ఇనోదయ, కేర్ ఎమర్జెన్సీ ఆస్పత్రి, ఏలూరులోని ఆంధ్రా ఆసుపత్రి, జంగారెడ్డిగూడెంలోని చిరంజీవి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా, విశాఖలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నెల్లూరులో నలుగురిపై కేసు నమోదు చేసి, మరో కేసులో ఒకర్ని అరెస్ట్ చేశారు. విజయవాడలో నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఆయా ఆస్పత్రులపై ఐపీసీ సెక్షన్ 188, 269, 420, విపత్తుల చట్టంలోని సెక్షన్ 51(8), 51(బి), 53, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 18 (బి), ఈసీ యాక్ట్ 61, 71 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నట్టు రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని అంజిరెడ్డి ఆస్పత్రిపై ఈ నెల 5న కేసు నమోదైందని, అయినా అక్రమాలకు పాల్పడటంతో మరోమారు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు
-
అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్లు మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కేవీఎన్ రాజేంద్రనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల తనిఖీల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన రోగులకు చికిత్స చేయడానికి నిరాకరించడం, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే అధిక చార్జీల వసూలు, పేషెంట్ల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దుర్వినియోగం, అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స వంటి అవకతవకలను గుర్తించినట్టు డీజీ వివరించారు. విశాఖపట్నంలోని రమ్య ఆస్పత్రి, విశాఖ జిల్లా నీరుకొండలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ భీమిలి), గోపాలపట్నంలోని ఎస్ఆర్ ఆస్పత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చైత్ర, విజయవాడలోని అచ్యుత ఎన్క్లేవ్, శ్రీరామ్, గుంటూరులోని విశ్వాస్ ఆస్పత్రి, చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ ప్రసాద్, అనంతపురంలోని ఆశా ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వాటిపై ఐపీసీ 188, 420, 269 సెక్షన్లు, విపత్తుల నిర్వహణ చట్టంలోని 51(ఎ), 51(బి), 53 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్లు ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో అక్రమాలకు పాల్పడిన 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. సోదాల్లో అవకతవకలు వెలుగుచూసిన ఆస్పత్రులకు జరిమానా, పనిష్మెంట్ ఇచ్చి వైద్య, ఆరోగ్య శాఖ పునరుద్ధరించినప్పటికీ ఆవే ఆస్పత్రులు మళ్లీ అక్రమాలకు పాల్పడితే వాటి యాజమాన్యాలను అరెస్ట్ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
రాష్ట్రానికి పెద్ద వైరస్ చంద్రబాబే
కాకినాడ రూరల్: రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద వైరస్ చంద్రబాబునాయుడేనని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ను కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదని చెప్పారు. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోండని జిల్లాలకే అవకాశం ఇచ్చారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారని, ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. ‘యజ్ఞం చేసేటప్పుడు భగ్నం చేసే రాక్షసుడు పక్కనే ఉంటాడని పురాణాల్లో విన్నాం. సరిగ్గా ఇలాగే కరోనాను కట్టడి చేసి, ప్రజల ప్రాణాలను కాపాడే యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే.. చంద్రబాబు విష ప్రచారం చేస్తూ, లేనిపోని వదంతులను సృష్టిస్తున్నారు. జాతీయ విపత్తు వచ్చినప్పుడు యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహాయ పడాల్సింది పోయి పార్టీ నాయకులతో ధర్నాలు చేయిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. బాబు మాటలను ఎవరూ నమ్మొద్దు ► కర్నూలులో ఎన్–440కే అనే వైరస్ వచ్చి, మిగిలిన చోట్లకూ విస్తరిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల ఇతర రాష్ట్రాలు మనవైపు అనుమానంగా చూస్తున్నాయి. ఒకపక్క సీసీఎంబీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు ఆ వైరస్ వచ్చిందనడం అబద్ధమని చెప్పినా కూడా చంద్రబాబు ప్రజలను టెర్రరిస్టులా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మొద్దు. దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు మాత్రమే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులు. ఈ లెక్కన ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున నెలకు 3.5 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించగలుగుతారు. దీని ప్రకారం దేశంలోని 130 కోట్ల జనాభాకు వ్యాక్సినేషన్కు ఎంత సమయం పడుతుందో తెలియదా? ► వ్యాక్సిన్ను కేంద్రమే రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఈ రెండు సంస్థలూ జూలై, ఆగస్టు నాటికి సామర్థ్యం పెంచుకుంటామంటున్నాయి. నెలకు గరిష్టంగా 16 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తే, ఈలోగా రష్యా నుంచి స్పుత్నిక్ టీకా వస్తే దేశం, రాష్ట్రంలో వ్యాక్సినేషన్కు కొన్ని నెలలు పడుతుంది. ► రాష్ట్రంలో మొత్తం అందరికీ ఉచితంగా టీకాలు వేయించేందుకయ్యే రూ.1,600 కోట్లు భరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర జనాభా 5.30 కోట్ల మందిలో 3.48 కోట్ల మంది వ్యాక్సిన్కు అర్హులు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ వచ్చిన డోసులు 73.49 లక్షలు. అవసరమైన డోసులు 6.96 కోట్లు. ఆ కమీషన్ మీరే తీసుకుని టీకా ఇప్పించండి ► వాస్తవాలు ఇలా ఉండగా టీకాలు వేయడం లేదంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీకు అత్యంత సన్నిహితుడైన రామోజీరావు గారి కుమారుడి వియ్యంకుడి కంపెనీ భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్లను మీ పరపతిని ఉపయోగించి ఇప్పించాలి. అలా చేస్తే రూ.1,600 కోట్లు మీరు చెప్పిన అకౌంట్కు ఇస్తాం. ఇండెంట్ ఎవరికి పంపించాలో చెప్పండి. ► ఈ రోజు ఓ పచ్చపత్రికలో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే టీకాలు కొనడం లేదంటూ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ కమీషన్లు మీరే తీసుకోండి. ఇండెంట్ భారత్ బయోటెక్కు పంపించమంటారా? ఈనాడుకా లేక అచ్చెన్నాయుడుకా? ► రాష్ట్రంలో టీకా అవసరాలపై భారత్ బయోటెక్తో సీఎం వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడారు. అధికారులు రవిచంద్ర, తదితరులు లేఖలు రాశారు. 3,43,930 డోసులు ఇవ్వాలని భారత్ బయోటెక్కు కేంద్రం చెప్పింది. అందులో 1,25,000 డోసులు సరఫరా చేస్తామని తెలియజేసింది. అలాగే కోవిషీల్డ్ 9,91,700 డోసులు అందిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. మొదటి డోసు వేసుకున్నవారికి రెండోది వేయకపోతే పని చేయదని వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ► ఆక్సిజన్ను ఒడిశాలోని అంగురు నుంచి విమానాల ద్వారా తీసుకు వస్తున్నాం. ఆక్సిజన్, రెమ్డెసివిర్ కొరత లేకుండా చూస్తున్నాం. వైఎస్సార్ టెలి మెడిసిన్ పని చేస్తోంది. ఇన్ని విధాల పని చేస్తున్న ప్రభుత్వంపై విష ప్రచారం సరికాదు. మీడియా కూడా సంయమనం పాటించాలి. -
ఏపీ ఆసుపత్రుల్లో మరోసారి విజిలెన్స్ దాడులు
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్నరెమిడెసివిర్ ఇంజక్షన్ను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వాటిలో గుంటూరు నారాయణ ఆస్పత్రి, విశాఖ ఆరిలోవలోని కుమార్ ఆస్పత్రి, అనంతపురం సాయిరత్న ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులు ఉన్నాయి. -
అక్రమ వసూళ్లపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
-
ప్రైవేట్ ఆస్పత్రిలో టీకా.. హెల్త్ డైరెక్టర్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇవ్వాలని సూచించింది.వ్యాక్సిన్లను నేరుగా కంపెనీల నుంచి సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ హెల్త్ డైరక్టర్ జీ. శ్రీనివాసరావు కోరారు. కోవిడ్ పేషంట్లకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్ డైరక్టర్ పలు సూచనలను చేశారు. కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ రేటు 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే వారిని హోం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్లకు సిఫారసు చేయాలని తెలిపారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారిని రిపోర్టులతో సంబంధం లేకుండా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలన్నారు. అంతేకాకుండా ఆస్పత్రుల ఎంట్రెన్స్ వద్ద బెడ్ల వివరాల పట్టికను ఉంచాలని ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సూచించారు చదవండి: కరోనా: వీరు మరింత జాగ్రత్తగాఉండాలి! -
తెలంగాణ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ నిలిపివేత
-
కరోనా: 13 లక్షలు ఖర్చు చేశారు..అయినా
గీసుకొండ/వరంగల్: మెరుగైన వైద్యం అందుతుందని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన పాపానికి లక్షల్లో బిల్లు వేశారు. అయినా రోగి ప్రాణం కాపాడారా అంటే అదీ లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటన వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు కొప్పుల మొగిలి (63) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించగా స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని, ఆస్పత్రిలో చేరితే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో బంధువులు అతడిని వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. రెండు మూడు రోజులు జనరల్ వార్డులో చికిత్స చేసిన అనంతరం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని, ఐసీయూ వార్డులోకి మార్చాలని వైద్యులు సూచించడంతో అలాగే చేశారు. అయితే ఐసీయూలో ఉంచినా మొగిలి కోలుకోలేదు. పైగా, పేగు మెలిక పడిందని, ఆపరేషన్ చేసి సరిచేయాలని వైద్యులు చెప్పడంతో.. ఆ ఆపరేషన్ కూడా చేయించారు. అయితే, శుక్రవారం రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ మొగిలి ఆస్పత్రిలోనే మృతిచెందాడు. చివరి బిల్లు రూ. 5.80 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని, యాజమాన్యాన్ని బతిమిలాడగా రూ. లక్ష తగ్గించారని మృతుడి కుమారుడు రంజిత్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన 20 రోజుల్లో సుమారు రూ.13 లక్షలు ఖర్చయ్యాయని, అయినా ప్రాణం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇదే గ్రామంలో పది రోజుల వ్యవధిలో ఆరుగురు కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
ప్రైవేటు ఆస్పత్రుల కొత్త ఎత్తుగడ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలతో రెమ్డెసివిర్ ఇంజక్షన్లపై కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇంజక్షన్ల కొరత సృష్టించేందుకు, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మందుల డిపోల వద్ద ఇంజక్షన్లు కొనడం మానేశాయి. మందుల డిపోల వద్ద గత రెండు రోజుల కొనుగోళ్లలో 30 శాతం తగ్గుదల చూస్తే ఇది స్పష్టమవుతోంది. కాగా, ఇన్నాళ్లూ మందుల డిపోల వద్దకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్లు తెచ్చుకునేవి. బ్లాక్మార్కెట్ నియంత్రణకు రంగంలోకి దిగిన ఔషధ నియంత్రణ శాఖ.. నిబంధనలు కఠినం చేసింది. అలాగే ఆస్పత్రులు కొని తెచ్చుకున్న ఇంజక్షన్లు సరిపోకపోతే.. లోటు ఉన్న ఇంజక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రెమ్డెసివిర్ కొరత నియంత్రణలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం లోటును భర్తీ చేస్తుంటే.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డిపోల నుంచి వారికి కావాల్సినవి కూడా కొనడం మానేశాయి. ఇలా చేసి కొరత చూపుతున్నాయని, బ్లాక్మార్కెట్కు అవకాశం ఉంటే డిపోల దగ్గర కొనేవారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు ప్రైవేటు ఆస్పత్రులకు కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భాగస్వామ్యం అందిస్తోంది. బ్లాక్మార్కెట్ను నిలువరించేసరికి డిపోల దగ్గర కొనడం మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. బాగా నియంత్రణలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇలాంటి ధోరణి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. –రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
తెలంగాణకు టీకా అందేనా ?
-
తెలంగాణకు టీకా అరకొరే.. ఆ ఆస్పత్రులకు టీకా బంద్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత కొరవడింది. ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నా వ్యాక్సిన్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభా వం చూపుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు 47 లక్షల డోసులే పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు కోటికిపైగా డోసులు పంపిణీ చేయగా... తెలంగాణకు ఇప్పటివరకు టీకా కేటాయింపులు అరకోటి దాటలేదు. వ్యాక్సిన్ నిల్వలను బట్టి పంపిణీ చేస్తున్న రాష్ట్ర యంత్రాంగం... ప్రస్తుతం టీకా కోటా నిల్వలు నిండుకోవడంతో పంపిణీ ప్రక్రియలో వేగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తింది. 2 లక్షల నుంచి లక్షకు తగ్గించి... వైరస్ వ్యాప్తి వేగం పెరగడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం వైద్య, ఆరోగ్య శాఖ విస్తృతం చేసింది. టీకాల పంపిణీ ప్రారంభ సమయంలో రోజుకు 20–30 వేల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన అధికారులు ఈ నెల 20 నుంచి ఏకంగా 2 లక్షల డోసులకు పెంచారు. 4–5 రోజులపాటు రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన యంత్రాంగం... టీకాల కోటా నిండుకోవడంతో గత 5 రోజులగా పంపిణీ వేగాన్ని తగ్గించి కేవలం లక్ష మందికే టీకాలు ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద లక్షకు మించి టీకాల కోటా లేనట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఈ నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వైద్యశాఖ వద్ద టీకాల కోటా తగినంతగా లేనందున మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టలేమని తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిల్వ ఉన్న కోటాను రెండో డోసు వేసుకొనే వారికి ఇస్తే మెరుగైన ఫలితం ఉంటుందని భావించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. 45 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకొనేందుకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అక్కడ కోటి దాటినా: కొన్ని రాష్ట్రాల్లో పలుచోట్ల టీకాల పంపిణీ విస్తృతంగా సాగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.61 కోట్ల డోసులు పంపిణీ చేశారు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో ఇప్పటికే కోటికి పైగా డోసులు పంపిణీ చేశారు. కర్ణాటకలో కూడా దాదాపు కోటి డోసులు వేయగా... తెలంగాణలో మాత్రం అరకోటి దాటలేదు. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వ టీకాల సరఫరా బంద్.. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సరఫరా చేసిన టీకా నిల్వలు ఉంటే వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేసే ఉద్దేశంతో ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం టీకా సరఫరా చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. ఉచితంగా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. శనివారం నుంచి 3వ దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా టీకా నిల్వలు లేని కారణంగా అమలు సాధ్యం కాదని ప్రైవేట్ ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఈ నెల 3 తర్వాతే స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తమ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తామని అపోలో వర్గాలు వెల్లడించాయి. -
‘ప్రైవేటు’ నిర్వాకం.. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్యం బంద్
కడప రూరల్: కోవిడ్ బాధితులకు చికిత్స చేసే విషయంలో అక్రమాలను అధికారులు ప్రశ్నించినందుకు నిరసనగా వైఎస్సార్జిల్లా కేంద్రం కడపలోని 6 ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులు వైద్యం నిలిపేశాయి. ఈ ఆస్పత్రుల్లో చికిత్సకు కోవిడ్ బాధితుల నుంచి రోజుకు రూ.50 వేలు, రూ.లక్షకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ హరికిరణ్.. జాయింట్ కలెక్టర్ సాయికాంత్వర్మ తదితరులతో ఆ ఆస్పత్రుల్లో తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు, లోపాలు వెలుగుచూశాయి. ఆరోగ్యశ్రీ కోవిడ్ పేషెంట్ల వద్ద డబ్బులు అధికంగా వసూలు చేసినట్లు తేలడంతో రెండు ఆస్పత్రులకు జరిమానా వేశారు. అనంతరం కూడా కొన్ని ఆస్పత్రుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం కడపలోని ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల యజమానులు సమావేశమయ్యారు. అధికారులు అక్రమాల గురించి ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోయిన వారు.. కోవిడ్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులను అడ్మిట్ చేసుకోకూడదని, వైద్యసేవలు అందించకూడదని నిర్ణయించారు. ఆస్పత్రులను మూసేసి, కోవిడ్ పేషెంట్లను చేర్చుకోబోమంటూ ముఖద్వారాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సరికాదు..: చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి రాయచోటి: వైఎస్సార్ జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘కరోనా కేసులను చూడం..’ అంటూ బోర్డులు పెట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బయట మార్కెట్కు తరలుతున్నాయని, తద్వారా నిజమైన పేదలకు అవి అందడం లేదనే విజిలెన్స్ తనిఖీలు జరిపారని, ఇవి కక్షపూరితం కాదని చెప్పారు. పేదలకు ఆరోగ్య సహాయ çసహకారాలు అందాల్సిన సమయంలో వైద్యులు చెడ్డపేరు మూటగట్టుకునే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రాయచోటిలో కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన అమరావతి ఆస్పత్రిని శానిటేషన్ పేరుతో మే 1 వరకు మూసివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. దీనిపై పునరాలోచించాలని కోరారు. తప్పుచేసిన ఆస్పత్రి యజమానులు, వైద్యులపైన మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన గుర్తుచేశారు. చదవండి: ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
ఆరోగ్య సంరక్షణ గాల్లో దీపమేనా?
వైద్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఇది పోవాలంటే, మెరుగైన వైద్యం ప్రజలకు అందాలంటే దేశంలోని ప్రతి జిల్లాలోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెఫరల్ ఆసుపత్రిని తప్పకుండా నెలకొల్పాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల అవసరం సామాన్యులకు ఉండదు. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లలో పెంపొందాలి. కులం, తెగ, జెండర్, నేపథ్యంతో పనిలేకుండా ఏ భారతీయుడినైనా సరే వారికీ వారి కుటుంబానికి ప్రప్రథమంగా కావలసింది ఏమిటి అని అడిగితే పదిమందిలో కనీసం ఎనిమిదిమంది మంచి ఆరోగ్యం, దాంతోపాటు సంతోషం కావాలని కోరుకుంటారు. అయితే ఒక పోలింగ్ బూత్లోని ఏ వ్యక్తినైనా పట్టుకుని అభ్యర్థిని ఎంచుకోవడంలో అతడి లేక ఆమె ప్రధమ ప్రాధాన్యత ఏది అని అడిగారనుకోండి.. ఆరోగ్య సంరక్షణను కల్పించే అభ్యర్థి తమకు కావాలనే సమాధానం వారినుంచి కలికానిక్కూడా వినిపించదు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పగూలిపోవడానికి మన ఓటర్లలోని ఈ నిర్లిప్తతే ప్రధాన కారణం. తాము ఎన్నుకుంటున్న ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, ఉండాలని మన ఓటర్లు అస్సలు ఆలోచించడం లేదు. మరిన్ని ఆసుపత్రులు నిర్మించడం, ఉన్న ఆస్పత్రులను నవీకరించి మెరుగుపర్చడం అనేది జరగకపోతే, అభివృద్ధి కావాలంటే ఓటు వేయండని రాజకీయ పార్టీల, నేతలు చెప్పే దానికి ఏమాత్రం విలువ ఉంటుంది? ఒకసారి అభివృద్ధి లేక వికాస్ అనే భావనను ఎవరికీ అర్థం కాని అమూర్త భావనగా మార్చేశాక, మన రాజకీయ నాయకులు దాన్ని వాడుకోవడంలో మీడియా సైతం బ్రహ్మాండంగా తనవంతు పాత్ర పోషిస్తోంది. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకేసి చూద్దాం. ఈ మూడు రాష్ట్రాలకు చండీగడ్ లోని పీజీఐ ఆసుపత్రి మాత్రమే ఏకైక దిక్కుగా ఉంటోంది. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతూ ఉంటోంది. చండీగఢ్ లోని పీజీఐ ఆసుపత్రి గేటు వద్దకు చేరుకోవడానికి ముందే అంబులెన్స్లోనే ప్రాణాలు కోల్పోతున్న భయానక గాథలు ఎన్నో ఎన్నెన్నో. ఒకవేళ ప్రాణాలు నిలుపుకుని వారు ఆసుపత్రిలోకి అడుగుపెడితే చికిత్సకోసం గంటలపాటు ఆసుపత్రి ప్రాంగణంలో వేచి చూడక తప్పదు. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. దేశంలో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఎయిమ్స్, పీజీఐ వంటి రిఫరల్ ఆసుపత్రులు తమ సామర్థ్యానికి మించి రోగులకు సేవలందిస్తూ అలిసిపోతున్నాయి. నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దేశంలో కలికానిక్కూడా లేదు కాబట్టే.. ఇలాంటి రిఫరల్ ఆసుపత్రులపై ఇంత అలవిమాలిన భారం పడుతోంది. చాలా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. అందువల్లనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కనీస అవసరాలకు కూడా దూరమైపోయాయి. దేశ స్థూల దేశీయోత్పత్తిపై, ఆర్థిక వ్యవస్థపై పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రభావం ఏ స్థాయిలో ఉందనే అంశం ఇప్పటికే చాలాసార్లు వెల్లడవుతూవచ్చింది. ఇలాంటి దుష్ప్రభావం బారిన పడకుండా అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు తమ పౌరులకు ఏదో ఒక రూపంలో రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అదే భారతదేశం విషయానికి వస్తే కుటుంబంలో ఒక్క సభ్యుడు తీవ్ర వ్యాధికి, అస్వస్థతకు గురైతే సంవత్సరాలుగా పొదుపు చేస్తూ వచ్చిన మొత్తాలు కరిగిపోతాయి. ఈవిధంగా ఆరోగ్య సంబంధిత వ్యయం కారణంగానే ప్రతి సంవత్సరమూ దేశ జనాభాలో 3.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ స్థాయికి పడిపోతున్నారని మీడియా వార్తలు చెబుతున్నాయి. తమ ప్రియతముల, ఆప్తుల వైద్య ఖర్చులు భరించడానికి సమస్తాన్ని అమ్ముకుంటున్న, తాకట్టుపెడుతున్న కుటుంబాల గాధలు ఒకటీ రెండూ కాదు. చాలావరకు ఇలాంటి గాథలు విషాదాంతాలుగానే ముగిసిపోతుంటాయి. ఆస్తుల్ని కరగదీసినా కుటుంబం వ్యాధుల పాలైన తన ప్రియతములను కోల్పోతూనే ఉంటుంది. దేశంలోని పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బారినపడి ఘోరంగా నలుగుతున్న బాధితుల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అందని ద్రాక్షపండుగానే ఉంటున్నాయి. పైగా అత్యుత్తమమైన టయర్ 1 ఆసుపత్రులు వీరికి అందుబాటులో ఉండటం లేదు. దీంతో అనివార్యంగా వీరు ప్రమాణాలు లేని, నాసిరకం సామగ్రితో కునారిల్లుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బారిన పడుతున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు రోగి కుటుంబాలనుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతూ చికిత్సను మధ్యలోనే నిలిపివేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రుల చుట్టూ ఉంటున్న ల్యాబ్లు డాక్టర్ల తరపున సేవలందించే అటెండెంట్లతో నిండి పచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రయోగశాలలు అందించే కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్న వైద్యపుంగవులు అయినదానికి కానిదానికి టెస్టుల మీద టెస్టులు రాస్తూ రోగులను ఇలాంటి ల్యాబ్ల బారిన పడేస్తున్నారు. కోవిడ్–19 సంక్షోభం వైద్యులు, ల్యాబ్లు వంటి ఈ తరహా పరాన్న జీవుల పంట పండిస్తున్నట్లుంది. భారత్ నిజమైన గ్లోబల్ లీడర్గా ఆవిర్భవించాలంటే ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించాల్సిందే. ఉచిత, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అనేది ఏ రకంగానూ ఉచితంగా లభిస్తోందని చెప్పడానికి లేదు. దాన్ని ఇకనుంచి మనం ప్రీ–పెయిడ్ (ముందస్తుగా చెల్లించిన) ఆరోగ్య సంరక్షణ అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణపై పెట్టే ప్రతి పైసానూ మనం ఏదో ఒకరకంగా పన్నుల నుంచే చెల్లిస్తున్నామని గ్రహించి తీరాలి. చివరకు అంగట్లో అగ్గిపెట్టె కొనుక్కునే కూలీ సైతం దానిపై పరోక్షంగా పన్ను చెల్లిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను పిండుకుంటున్న ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదార్లకు కనీసమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాల్సి ఉంటుంది. దేశంలో నెలకొల్పిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలావరకు రాజ కీయ కుటుంబాల ప్రత్యక్ష యాజమాన్యంలో ఉంటున్నాయి లేక వారు అనుమతించిన వారి యాజమాన్యంలో ఉంటున్నాయి. ఈ ఆసుపత్రులకు ఉచితంగా భూమిని అప్పగిస్తున్నారు. రాజకీయ నేతల సమ్మతి లేనిదే దేశంలో నిజమైన వాణిజ్య సంస్థలు సైతం ఇలాంటి రాయితీలను ఒక్కదాన్నైనా పొందలేవు. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి రాజకీయ వర్గానికి ఈ భారీ స్థాయి రాయితీలే అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకునేది ఎవరు? పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య సంస్థలు (పీజీఐ) దేశంలో 1950, 60లలో ఉనికిలోకి రాగా, అప్పటినుంచి దేశ జనాభా ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వైద్య అవసరాలు తీరాలంటే కనీసం జిల్లాకు ఒక పీజీఐ స్థాయి రెఫరల్ ఆసుపత్రిని తప్పక నిర్మించాల్సి ఉంది. రెండు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఉచిత, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పన రాజకీయ పార్టీలకు ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను మేనిఫెస్టోల్లో పొందుపర్చేవారికే ఓటువేసేలాగా మన ఓటర్లు కుల, తెగ పరమైన రాజకీయాలకు అతీతంగా పరిణితి చూపాల్సిఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లకు కలిగినప్పుడు రాజకీయ పార్టీలనుంచీ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయగలుగుతారు. ప్రజారోగ్య వ్యవస్థ కుప్పగూలిపోవడానికి బాధ్యులెవరో కూడా గ్రహించి వారే ఈ సమస్యను పరిష్కరించాలని ఓటర్లు డిమాండ్ చేయాలి. గుల్ పనాగ్ వ్యాసకర్త రచయిత్రి, నటి, వాణిజ్యవేత్త (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కరోనాపై ప్రైవేటు ఆస్పత్రుల తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కరోనా చికిత్సలతో నిండిపోయిన ఆస్పత్రులను ఇక ముందు పెరగనున్న వ్యాక్సినేషన్ ఉక్కిరిబిక్కిరి చేయనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18-44 ఏళ్ల మధ్య వారికి కూడా కరోనా టీకాలు వేయనుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రద్దీ మరింత పెరగనుంది. అసలే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత మొదలైన ప్రస్తుత సమయంలో.. అటు కరోనా చికిత్సలు, ఇటు వ్యాక్సినేషన్ను ఎలా నిర్వహించాలన్న తర్జనభర్జన కనిపిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లుపైబడిన వారికే టీకాలు వేస్తున్నారు. అందులో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొందరు ప్రైవేట్లో తీసుకుంటున్నారు. అయితే వచ్చే ఒకటో తేదీ నుంచి బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తుండటంతో.. ప్రైవేట్ ఆస్పత్రులే టీకా బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్సలు, వ్యాక్సినేషన్ను సమన్వయం చేసుకోవడంపై ఆస్పత్రులు దృష్టిపెట్టాయి. భారీగా వ్యాక్సిన్లకు ఆర్డర్లు 18-44 ఏళ్ల మధ్య వారికి కేంద్రం ఉచితంగా టీకా వేయబోవడంలేదు. 45 ఏళ్లు పైబడినవారికే ఉచితంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే భారీగా వ్యాక్సినేషన్ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో 18-44 ఏళ్ల మధ్య వయసు వారు 1.82 కోట్ల మంది ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఇందులో చాలా వరకు ప్రైవే ట్లోనే టీకా పొందాల్సి ఉండనుంది. ఇంత భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోంలను సిద్ధం చేయాల్సి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 3 వేల ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్హోంలలో టీకాలు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడి కల్ షాపుల్లో టీకాలు అందుబాటులో ఉంచుతారని.. వాటిలో కొనుగోలు చేసి, ఆస్పత్రిలో వేయించుకోవచ్చని అంటున్నారు. లేదా ఆస్పత్రులే ప్రత్యేకం గా ఏర్పాట్లు చేసి.. వ్యాక్సిన్ వేసే అవకాశాలున్నా యి. ఇప్పటికే హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు టీకాలకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం. ఇష్టమున్న వ్యాక్సిన్ వేసుకోవచ్చు లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాక్సిన్ వేసుకోవడానికి వీలు కల్పిస్తామని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్లకు అనుమతి ఉంది. తాజాగా అనుమతి పొందిన స్పుత్నిక్ టీకాతోపాటు త్వరలో ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఫైజర్ టీకాను మైనస్ 70 నుంచి మైనస్ 80 డిగ్రీల మధ్య నిల్వ చేయాలి. ఆ మేరకు అటు కంపెనీ, ఇటు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టీకా అందుబాటులోకి వచ్చినా దాని ఖరీదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 28 నుంచి టీకాలకు రిజిస్ట్రేషన్లు 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి వచ్చే ఒక టో తేదీ నుంచి మొదలయ్యే వ్యాక్సినేషన్కు సం బంధించి.. ఈ నెల 28వ తేదీ నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం 28వ తేదీలోగానే వ్యాక్సినేషన్ కేం ద్రాల వివరాలను వైద్యారోగ్యశాఖ కోవిన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉండనుంది. ఈ ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు తెలిపారు. చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ.. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ -
ప్రైవేట్ హాస్పిటల్ లో వసూళ్ల దందా
-
ఉన్నకాడికి ఊడ్చేసి.. చివరికి గాంధీకి
హైదరాబాద్: నిజామాబాద్కు చెందిన రాజేందర్ (52)కు పది రోజుల క్రితం కోవిడ్ నిర్ధారణ అయింది. చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్సలు అందించారు. ఇందుకు రూ.4.18 లక్షల బిల్లు వేశారు. తీరా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. గత్యంతరం లేక చివరకు అదే వెంటిలేటర్ సహాయంతో బుధవారం రాత్రి గాంధీకి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందారు. హుజూరాబాద్కు చెందిన సమ్మయ్య(40)కు వారం రోజుల క్రితం కోవిడ్ నిర్ధారణ అయింది. తొలుత వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చేర్చుకుని రూ.90 వేల బిల్లు వేశారు. తీరా తమ వల్ల కాదని, హైదరాబాద్కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆయన్ను బుధవారం సికింద్రాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ఎమర్జెన్సీలో ఉంచుకున్నారు. రూ.20 వేలకుపైగా ఛార్జీ చేశారు. అనంతరం వెంటిలేటర్లు లేవని చెప్పి బయటికి పంపారు. దిక్కుతోచని స్థితిలో వారు రాత్రి 2 గంటలకు గాంధీకి చేరుకున్నారు. అప్పటికే ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్పై ఉంచారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు... ఇలా ఒక్క రాజేందర్, సమ్మయ్య మాత్రమే కాదు...కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న అనేక మందిని ఉన్నకాడికి ఊడ్చేసి..చివరి నిమిషంలో..మా వల్ల కాదంటూ..ఇలాగే వదిలించుకుంటున్నాయి. వాళ్లు దోచుకుంటే..నిందలు మాపైనా? రోగి ఆస్పత్రిలో చనిపోతే..రోగి బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అంతే కాదు ఆస్పత్రి ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత చికిత్సకు రోగి స్పందించడం లేదని..అయినా ఐసీయూలో ఉంచితే..వైద్య ఖర్చులు రోజుకు రూ.60 వేలకుపైగా అవుతుందని బంధువులను భయపడుతున్నారు. మెరుగైన వైద్యం అందాలంటే గాంధీకి తీసుకెళ్లడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నాయి. బలవంతంగా వారిని వదిలించుకుంటున్నారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో గాంధీ వైద్యులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా ఆఖరి నిమిషంలో వచ్చిన వారిలో కొంత మంది ఆస్ప్రతిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందుతుండగా...మరికొంత మంది రెండు మూడు రోజుల తర్వాత కన్ను మూస్తున్నారు. చికిత్సల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంది కార్పొరేట్ ఆస్పత్రులైతే...చికిత్సల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలను గాంధీ వైద్యులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వందకుపైగా అడ్మిషన్లు..20లోపే డిశ్చార్జిలు 1850 పడకలు ఉన్న గాంధీ ఆస్పత్రిలో 500 వెంటిలేటర్లు, 1250 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. ప్రస్తుతం వెంటì లేటర్లు ఖాళీ లేవు. ఆక్సిజన్ పడకలపై కూడా 250 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి నేరుగా వచ్చే కేసులతో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్పై వస్తున్న కేసులే అధికం. నేరుగా వచ్చిన కేసులకు పడకలు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సోమవారం 110 మంది వస్తే..మంగళవారం 205 మంది వచ్చారు. బుధవారం 185 మంది వచ్చారు. డిశ్చార్జిలు అవుతున్న వారు కేవలం 20లోపే. కొత్తగా వెంటిలేటర్తో వచ్చిన వారికి చేర్చుకోలేని దుస్థితి. అనివార్య పరిస్థితుల్లో వారిని ఆక్సిజన్ పడకలపై ఉంచాల్సి వస్తుండటంతో ఊపిరాడక వారు ముందే చనిపోతున్నారు. ( చదవండి: గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్ ) -
ఆస్పత్రుల్లో అధిక చార్జీలపై కఠిన చర్యలు
కర్నూలు కల్చరల్/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, అంతకుమించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హెచ్చరించారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు ఆస్పత్రులపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ను సమర్థంగా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. గత సంవత్సరం కోవిడ్ కట్టడిలో సమర్థంగా పనిచేసిన టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డిని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్గా నియమించారన్నారు. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు 21 మంది ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు వేశారన్నారు. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషలాఫీసర్లుగా సీనియర్ అధికారులను నియమించినట్లు తెలిపారు. కోవిడ్ బాధితుల వైద్యం కోసం మందులు, ఆక్సిజన్ కొరత రానీయకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలు పాటించాలి కరోనా చికిత్సలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోని ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పని చేస్తోందన్నారు.