ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ గ్యాంగ్ తన రెండో ఇన్నింగ్స్లో 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 110/5 ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా మరో 52 పరుగుల మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.