ప్రపంచ నంబర్వన్, భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు ఫైనల్లో చుక్కెదురైంది. కామన్వెల్త్ గేమ్స్లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పోరులో ఓటమి చెందడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ 19-21, 21-14, 21-14 తేడాతో కిడాంబి శ్రీకాంత్పై విజయం సాధించి స్వర్ణం సాధించాడు.