Bank of Baroda
-
రుణ రేట్లను తగ్గించిన బీవోబీ
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించగా, దీన్ని తన కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ అనుసంధానిత రిటైల్, ఎంఎస్ఎంఈ రుణ రేట్లను 0.25 శాతం తగ్గించినట్టు తెలిపింది. అదే సమయంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను బీవోబీ ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. ఆటో, వ్యక్తిగత రుణాలు సహా అధిక శాతం రుణాలకు ప్రామాణికమైన ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటును మార్చకుండా 9 శాతం వద్దే కొనసాగించింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పీఎం విద్యాలక్ష్మీ రుణాలు
న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మీ (పీఎం–విద్యాలక్ష్మీ) పథకాన్ని అందుబాటులోకి తెచి్చనట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశంలోని టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో (క్యూహెచ్ ఈఐ) ప్రవేశం పొందిన విద్యా ర్థులు ఈ పథకం కింద రుణం కోసం అర్హులు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంటుంది. విద్యార్థులు లేదా వారి కుటుంబాలు ఎటువంటి ఆస్తులను తన ఖాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు పీఎం–విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విద్యా రుణం కోసం డిజిటల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్కు 8,300కి పైగా బ్రాంచ్లు, 12 ప్రత్యేక విద్యా రుణ ఆమోద కేంద్రాలు, 119 రిటైల్ అస్సెట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. అర్హులైన వి ద్యార్థులందరూ నాణ్యమైన విద్య పొందేందుకు అవ సరమైన ఆర్థిక తోడ్పాటు అందించ డం తమ లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ తెలిపారు. -
బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మహిళల కోసం ప్రత్యేకంగా.. ‘బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతాను’ ప్రారంభించింది. ఆటో స్వీప్ సదుపాయంతో ఇది ఉంటుంది. తద్వారా ఖాతాలో పరిమితికి మించి ఉన్న బ్యాలెన్స్ డిపాజిట్గా మారిపోయి, అధిక వడ్డీ రాబడి లభిస్తుంది. అలాగే, ఈ ఖాతాదారులకు గృహ రుణాలు, ఆటో రుణాలపై రాయితీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. 17 దేశాల్లో 60,000 టచ్ పాయింట్ల ద్వారా 16.5 కోట్ల అంతర్జాతీయ కస్టమర్లకు బీవోబీ సేవలు అందిస్తోంది. బీవోబీ ప్రీమియం ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో సేవింగ్స్ ఖాతా విషయంలోనూ మార్పులు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా ఉన్న భారతీయ మహిళలకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను అందించే లక్ష్యంతో బీవోబీ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్వో ఖాతాను రూపొందించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ మీనా వహీద్ ప్రకటించారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను ఇటీవల అప్డేట్ చేసింది. దీంతోపాటు బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ అనే కొత్త డిపాజిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇది డిపాజిట్దారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 14 నుండి అమలులోకి వచ్చాయి.కొత్త స్కీమ్ వడ్డీ రేట్లుబీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ సాధారణ పౌరులకు 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు 7.80 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే గరిష్టంగా 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ముబ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్డీ వడ్డీ రేట్ల మార్పు తర్వాత రూ. 3 కోట్ల లోపు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వ్యవధి గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25% నుండి 7.30% (ప్రత్యేక డిపాజిట్తో సహా) వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75% నుండి 7.80% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. -
వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ బ్యాంకులు ఇవే..
భారతదేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంచ్ మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇది జరిగింది.వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా & కెనరా బ్యాంక్లకు సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. కాగా యూసీఓ బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 10 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్మనీ
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్లైన్ హ్యాకథాన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది.బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్టెక్లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
ఇక ఆ బ్యాంక్ యాప్ వాడుకోవచ్చు.. ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్ని ఆర్బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్గా ఆన్బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్ను కూడా ఆర్బీఐ నిషేధించింది. -
బీవోబీ లాభం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.4,579 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,853 కోట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.27,092 కోట్ల నుంచి రూ.31,416 కోట్లకు వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ లాభం రూ.4,306 కోట్ల నుంచి రూ.4,789 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు దూసుకుపోయింది. నికర వడ్డీ ఆదాయం కేవలం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లపై వ్యయాలు 4.01 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. బ్యాంక్ రుణ ఆస్తుల నాణ్యత మరింత బలపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 3.08 శాతానికి (రూ.32,318 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి ఇవి 4.53 శాతంగా ఉంటే, 2023 సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 3.32 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.99 శాతంగా ఉంటే, 2023 సెపె్టంబర్ చివరికి 0.76 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ అడ్వాన్స్లు (రుణాలు) 13.6 శాతం పెరిగి రూ.10,49,327 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.3 శాతం వృద్ధితో రూ.12,45,300 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. వ్యవసాయ రుణాలు 12.6 శాతం, బంగారం రుణాలు 28 శాతం పెరిగి రూ.45,074 కోట్లకు చేరాయి. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)లో ఎక్స్పోజర్కు సంబంధించి రూ.50 కోట్లను పక్కన పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం ఎగసి రూ.248 వద్ద క్లోజ్ అయింది. -
స్వల్పకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంతంటే..
స్వల్పకాలిక రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.1 నుంచి 7.6 శాతం వరకూ ఆఫర్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం రేటు వర్తిస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. ‘బీఓబీ360’ పేరుతో ప్రారంభించిన ఈ తాజా బల్క్ డిపాజిట్ స్కీమ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ప్రస్తుత లేదా కొత్త కస్టమర్లు ఈ బల్క్ డిపాజిట్ స్కీమ్ను ఏదైనా బ్రాంచ్లో, ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెరవవచ్చు. కాగా, రెండు వారాల క్రితమే బీఓబీ రూ.2 కోట్ల లోపు స్వల్పకాలిక స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) వరకూ పెంచింది. 7–14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25% పెరిగి 4.25 శాతానికి చేరింది. 15–45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50%కి చేరింది. 271 రోజుల బల్క్ డిపాజిట్లపై బ్యాంక్ 6.25 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ ఇటీవలే అరశాతం వడ్డీరేటు పెంచిన నేపథ్యంలోనే బీఓబీ తాజా నిర్ణయం తీసుకుంది. 1.25 శాతం వరకూ పెరిగిన వడ్డీరేటు డిసెంబర్ 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. రుణ రేటు పెరుగుదల, నిధుల సమీకరణ అవసరాల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు డిపాజిట్ రేటు పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. తాజాగా బీఓబీ ఏడాది లోపు స్వల్పకాలిక కాలపరిమితులపై డిపాజిట్ రేట్ల పెంపుపై ప్రధానంగా బ్యాంక్ దృష్టి సారించింది. బీఓబీ తాజా నిర్ణయం ప్రకారం... రూ.2 కోట్ల వరకూ వివిధ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 10 బేసిస్ పాయిట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. 7 నుంచి 14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25 % పెరిగి 4.25 శాతానికి చేరింది. 15 నుంచి 45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50 శాతానికి చేరింది. -
చిరిగిన నోట్లలో తేడాలు.. ప్రభుత్వ బ్యాంక్కు భారీ ఫైన్!
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) భారీ షాక్ ఇచ్చింది. చిరిగిన, పాడైన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం గుర్తించడంతో ఈ బ్యాంక్కు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. చిరిగిన నోట్లలో నకిలీవి దీంతోపాటు చిరిగిన, పాడైన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ .. బ్యాంక్ ఆఫ్ బరోడాకు అదనంగా మరో రూ.2,750 ఫైన్ వేసింది. బీవోబీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానాలు ఆర్బీఐ విధించింది. క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ పెనాల్టీలను విధించినట్లు తెలుస్తోంది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ గత నెలలో కూడా పెద్ద మొత్తంలో పెనాల్టీ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు గతంలో బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల జరిమానా విధించింది. -
విద్యార్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్!
విద్యార్ధులకు ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. బీఆర్ఓ పేరిట విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్ జీరో బ్యాంక్ అకౌంట్ని తీసుకొచ్చింది. ఈ ఖాతాను 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు తెరవొచ్చు. ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. విద్యార్ధుల అర్హతను బట్టి జీవిత కాలం ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్ అకౌంట్పై ఇతర ప్రయోజనాలు 👉16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా 👉ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లతో జీవితకాల ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ 👉 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ 👉యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూ.2 లక్షలు 👉ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంది 👉డిజిటల్ ఛానెల్లు, బ్రాంచ్ ద్వారా ఉచిత ఎన్ఎఫ్టీ,ఆర్టీజీఎస్,ఐఎంపీఎస్,యూపీఐ సర్వీసులు 👉అపరిమిత ఉచిత చెక్ లీవ్లు 👉ఉచిత ఎస్ఎంఎస్, మెయిల్స్ అలెర్ట్ 👉డీమ్యాట్ ఏఎంసీలో 100శాతం వరకు రాయితీ 👉సున్నా ప్రాసెసింగ్ రుసుముతో విద్యా రుణాలపై రాయితీ వడ్డీ రేట్లు 👉అర్హతకు లోబడి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్లు -
విద్యార్థుల కోసం స్పెషల్ అకౌంట్ - ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్: విద్యార్థుల కోసం సున్నా బ్యాలన్స్ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రారంభించింది. 16–25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బీవోబీ బ్రో సేవింగ్స్ ఖాతా’ను రూపొందించినట్టు తెలిపింది. జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయోజనాలు.. 16–25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా సున్నా బ్యాలన్స్తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రపే ప్లాటినం డెబిట్ కార్డ్ సొంతం చేసుకోవచ్చు. ప్రతి త్రైవసికానికీ విమానాశ్రయాల్లో రెండు సార్లు లాంజ్ ప్రవేశాలను పొందొచ్చు. ర.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, ఆర్ట్జీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు ఉచితం. చెక్లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతా ఏఎంసీపై నూరు శాతం రాయితీ ఉంది. విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీ లేకపోగా, వడ్డీ రేటులో 0.15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు చేరువ చేసేందుకు గాను ఐఐటీ బోంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నియమించుకుంది. -
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్ను దాఖలు చేసింది. -
ప్రభుత్వ బ్యాంకులనూ వదలని ఆర్బీఐ - రూ.10.34 కోట్లు ఫైన్!
గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్పోజర్ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. సిటీ బ్యాంక్ (City Bank) ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ విధానాలను అమలు చేయడంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు. -
ఏటీఎంకు నిప్పు.. తెరుచుకోలేదని తగలబెట్టేశాడు!
ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుండగుడు.. అది తెరుచుకోకపోవడంతో నిప్పుపెట్టిన ఘటన ముంబై నగరంలోని బొరివాలీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సతార ప్రాంతానికి చెందిన విలాస్ శిలేవంత్ (22)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబై నగరంలోని బొరివాలీ వెస్ట్ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షింపోలీ బ్రాంచ్ ఉంది. దానికి ఆనుకునే ఏటీఎం సెంటర్ కూడా ఉంది. నవంబర్ 11న తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఈ ఏటీఎం సెంటర్లోని ఏటీఎం మిషన్ మంటల్లో కాలిపోయిన దృశ్యాన్ని గమనించిన బ్యాంక్ సర్వేలెన్స్ సిబ్బంది బ్యాంక్ మేనేజర్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడి చేరుకుని పరిశీలించగా ఏటీఎంను ఎవరో తెరవడానికి ప్రయత్నించారని తెలిసింది. దీంతో పోలీసులకు విషయం తెలియజేశారు. 25 నుంచి 30 ఏళ్లున్న యువకుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడినట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది. నిందితుడు ఏటీఎం మిషన్ను బద్దలుకొట్టడానికి ప్రయత్నించాడని, సాధ్యం కాకపోవడంతో నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఏటీఎం ముందు భాగానికి నిప్పుంటించినప్పటికీ అందులోని క్యాష్ వ్యాలెట్ను మాత్రం తెరవలేకపోయాడని పేర్కొన్నారు. -
లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ను ప్రకటించింది. ఈ అకౌంట్తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్లో రూ.3000, సెమీ అర్బన్లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
కొత్త కస్టమర్లను యాప్లో చేర్చుకోవద్దు.. ఆర్బీఐ షాక్!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తమ ‘బీవోబీ వరల్డ్’ మొబైల్ యాప్లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. యాప్లో కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణాపరమైన లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వాటిని సరిచేసి, సంబంధిత ప్రక్రియను పటిష్టం చేసినట్లు ఆర్బీఐ సంతృప్తి చెందితే తప్ప కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉండదు. దీనివల్ల ప్రస్తుత బీవోబీ వరల్డ్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ బ్యాంకుకు సూచించింది. ఆర్బీఐ సూచించిన అంశాలను ఇప్పటికే సరిదిద్దినట్లు, ఇతరత్రా ఏవైనా లోపాలుంటే వాటిని కూడా సరిచేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఆర్బీఐ ఆదేశాలను అమలు చేసే క్రమంలో కస్టమర్లకు సర్వీసులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలెర్ట్, అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు!
ఖాతాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను పెంచింది. దీంతో ఎఫ్డీ చేసిన సాధారణ ఖాతాదారులు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి 14 రోజుల టెన్యూర్ కాలానికి 3 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల కాలానికి 3.50శాతం పెంచింది. 4.5 శాతం ఉన్న వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి 46 నుంచి 180 రోజుల టెన్యూర్కు 5శాతం వడ్డీని, 181 నుంచి 210 టెన్యూర్ కాలానికి 5.50 శాతం,211 నుంచి 270 కాలానికి 6 శాతం, 271 నుంచి ఏడాది లోపు వడ్డీ రేట్లను 6.25 శాతం అందిస్తుంది. అయితే, 399 రోజుల కాలవ్యవధి గల ‘బరోడా తిరంగా ప్లస్’డిపాజిట్ స్కీమ్పై వడ్డీ రేటును 7.25 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు 2023 అక్టోబర్ 9 (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. -
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సమరం షురూ అయింది. అయితే ఈ మెగా టోర్నీకి ఆతిథ్య దేశంగా ఇండియా ఉండటంతో భారీ ఆదాయం సమకూరి, దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు 220 బిలియన్ రూపాయల (2.6 బిలియన్ల డాలర్లు) భారీ ఆదాయం సమకూరుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. 2019లో ఇంగ్లండ్లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ UK GDPకి మంచి బూస్ట్ అందించిందని ఈసారి భారత్లో కూడా అదే పునరావృతం అవుతుందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే అటు పండగ సీజన్, ఇటు వరల్డ్ కప్ ఫీవర్ కారణంగా యాడ్ రెవెన్యూ భారీగా పెరగనుందనే అంచనాల మధ్య బీవోబీ తాజా అంచనాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గురువారం (అక్టోబరు 5) ప్రారంభమై నవంబర్ మధ్య వరకు జరిగే చతుర్వార్షిక టోర్నమెంట్ దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్దమొత్తంలో సందర్శకులను, క్రికెట్ ఫ్యాన్స్ను ఆకర్షిస్తుంది. దీంతో పలు రకాలుగా ఆదాయ వృద్ధి నమోదుకానుందని అంచనావేశారు. 10 నగరాల్లో జరిగే మ్యాచ్లతో ప్రయాణ, ఆతిథ్య రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని బీవోబీ ఆర్థికవేత్తలు జాహ్నవి ప్రభాకర్, అదితి గుప్తా అభిప్రాయపడ్డారు. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ సహా 10 నగరాల్లో నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ సిరీస్ను చూసేందుకు వివిధ దేశాల నుంచి పర్యాటకుల సంఖ్య పెరగనుంది. ఇది ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే 80 - 90 శాతం పెరుగుతుందని అంచనా. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) భారత్కు క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. అది ఒక వేడుక. ఇక భారత్లో జరిగే ప్రపంచకప్ సిరీస్ క్రికెట్ అభిమానులకు పండుగే. అందులోనూ 12 ఏళ్ల తరువాత (2011) తొలిసారి ఇండియాలో జరుగుతున్న ఈ ఈవెంట్ సెప్టెంబర్లో ప్రారంభమైన మూడు నెలల పండుగ సీజన్తో సమానంగా ఉంటుందని, చాలా మంది "సెంటిమెంటల్ క్రయవిక్రయాలు చేస్తారు కాబట్టి రిటైల్ రంగానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. టోర్నమెంట్ కోసం టెలివిజన్, స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లతో సహా మొత్తం భారతీయ వీక్షకుల సంఖ్య 2019లో చూసిన 552 మిలియన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టీవీ హక్కులు ,స్పాన్సర్షిప్ రాబడిలో రూ. 10,500 కోట్ల నుండి రూ. 12,000 కోట్ల వరకు రావచ్చని వీరు భావించారు. మరోవైపు ప్రపంచ కప్ ధరల పెరుగుద కారణంగా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని ఆర్థిక వేత్తలు భావించారు. ఈ సమయంలో ఎయిర్లైన్ టిక్కెట్లు, హోటల్ అద్దెలు ఇప్పటికే పెరిగాయి. పండగసీజన్కు తోడు10 అతిధేయ నగరాల్లో అనధికారిక సెక్టార్లో సేవా ఛార్జీలు గణనీయమైన పెరుగుదల నమోదు కానుందన్నారు. ఫలితంగా అక్టోబర్ , నవంబర్లో ద్రవ్యోల్బణం 0.15 శాతం-0.25 శాతం మధ్య పెరగవచ్చని వారు చెప్పారు. -
బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?
బ్యాంకు నిబంధనలు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయనుకుని బ్యాంక్ లాకర్లో పెట్టుకున్న సొమ్ము చెదల పాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి సంపాదించిన సొమ్ము సర్వ నాశనం కావడంతో బాధిత మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు రూ. 18 లక్షల నగదు, కొన్ని ఆభరణాలను లాకర్లో దాచింది. అయితే ఆర్బీఐ నిబంధలన ప్రకారం KYC ధృవీకరణ , వార్షిక లాకర్ నిర్వహణ కోసం ఆమెను బ్యాంక్ అధికారులు పిలిచినప్పుడు ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ,చిన్న వ్యాపారం చేస్తూ, ఒక్కో రూపాయి పొదుపు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం లాకర్లో ఉంచిన రూ. 18 లక్షలను చెదపురుగులు తినేశాయి. ఈ విషయంపై స్పందించిన బ్యాంకు సిబ్బంది ఈ ఘటనను ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) లాకర్కు సంబంధించి తాజా నిబంధనలు బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే దీన్ని వినియోగించాలి. చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్పై 'తగిన చర్య' తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడి, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో 'సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్కు సమాచారం అందించి, కస్టమర్ అనుమతి తర్వాత బ్యాంక్ 'డ్యూ ప్రొసీజర్ను అనుసరించి' లాకర్ను తెరిచే అధికారం ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్తో ముగిసిపోగా తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాకర్లలో ఉంచకూడని వస్తువులు , సెల్ఫ్ డిక్లరేషన్ కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు రేడియేషన్ పరికరాలు చట్ట విరుద్ధమైన వస్తువులు ఉంచకూడదు. దీనికి సంబంధించి అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్లో దాచిపెట్టనని ఖాతాదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్ను వినియోగిస్తానంటూ సంబంధిత ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. అలా బ్యాంకులో లాకర్ తీసుకున్న తరువాత ఈ అగ్రిమెంట్ కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. -
రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేశాయి
లక్నో: బ్యాంకు లాకర్లో దాచిన రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని మొరాబాబాద్లో జరిగింది. మొరాదాబాద్కు చెందిన మహిళ అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షల నగదును గత ఏడాది అక్టోబర్లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలోని లాకర్లో భద్రపర్చింది. లాకర్ అగ్రిమెంట్ను నవీకరించుకోవాలని, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఇటీవల బ్యాంకు సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. అల్కా పాఠక్ బ్యాంకుకు వెళ్లి తన లాకర్ను తెరిచి చూసు కోగా, చెత్తాచెదారమే కనిపించింది. నగదును చెదపురుగులు కొరికేసి ముక్క లు ముక్కలు చేశాయి. మొత్తం సొమ్మంతా పనికి రాకుండా పోయింది. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది స్పందించారు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. -
పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!
ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. కేవలం ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే కాకుండా.. కొన్ని దిగ్గజ బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వడ్డీ & ఇతర రాయితీలను అందించనుంది. హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఇప్పుడు 8.4శాతం నుంచి ప్రారంభమవుతుంది బ్యాంక్ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రేట్ కార్ లోన్ల వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేవు ఎజ్యుకేషన్ లోన్ మీద వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది (60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ 10.10 శాతం నుంచి ప్రారంభమవుతుంది (80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే.. ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2023 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్స్ కింద బ్యాంక్ విద్య & వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను వరుసగా 60 bps, 80 bps తగ్గించింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే కొన్ని ఇతర బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ప్రత్యేక ఆఫర్స్ పొందవచ్చు. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: చిటికెలో రూ.50వేల లోన్! నమ్మారో..
బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో చేరితే చాలంటూ.. ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది. 'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి మెసేజ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. -
వీడియో కేవైసీని ప్రవేశపెట్టిన బీవోబీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వీడియో ఆర్ఈ కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఎప్పటికప్పుడు తమ కేవైసీ ధ్రువీకరణ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం బ్యాంక్ శాఖ వరకు రావాల్సిన అవసరాన్ని వీడియో ఆర్ఈ కేవైసీ విధానం నివారిస్తుంది. వీడియో కేవైసీ సదుపాయం వినియోగించుకోవాలంటే కస్టమర్ వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. భారతీయ పౌరసత్వం కలిగి, ఆధార్, పాన్ ఉండాలని బీవోబీ తెలిపింది. ముందుగా కస్టమర్లు బీవోబీ వెబ్సైట్కు వెళ్లి ఆన్లైన్ ఆర్ఈ–కేవైసీ దరఖాస్తును సమరి్పంచాలి. ఇందులో అడిగిన వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జిక్యూటివ్కు వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్ కంటే ముందు కస్టమర్ తన ఒరిజినల్ పాన్ కార్డ్, ఖాళీ వైట్ పేపర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ సిద్ధంగా ఉంచుకోవాలి. వీడియో ఆర్ఈ కేవైసీ కాల్ను అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య చేసుకోవచ్చు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా 251 పసిడి రుణాల షాపీలు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా 251 బంగారం రుణాల షాపీలను ప్రారంభించింది. వీటిలో 35 షాపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. కొత్త వాటి ప్రారంభంతో మొత్తం సంఖ్య 1,238కి చేరింది. బంగారంపై రుణాలపరమైన సరీ్వసులు అందించేందుకు బ్యాంకు శాఖలోనే ప్రత్యేకంగా కేటాయించిన ఎన్క్లోజర్ను షాపీగా వ్యవహరిస్తారు. ఇందులో ఒక ఇంచార్జి, కనీసం ఇద్దరు అప్రైజర్లు ఉంటారు. రుణాలపై నిర్ణయాధికారం ఇంచార్జికే అప్పగిచడం వల్ల ప్రాసెసింగ్ మరింత వేగవంతం కాగలదని బీవోబీ ఈడీ అజయ్ కే. ఖురానా తెలిపారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో బంగారంపై అధిక మొత్తంలో రుణాలు అందిస్తున్నామని, రూ. 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజులు లేవని ఆయన పేర్కొన్నారు. -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం. -
రైతులకు చేయూత.. మహిళలకు ఉపాధి
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటాలతో పాటు కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. పొదుపు సంఘాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుచేయనుంది. వీటికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొ చ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)తో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఎపీఎఫ్పీఎస్) నేడు (సోమవారం) అవగాహనా ఒప్పందం చేసుకోబోతుంది. తొలిసారి కర్నూలు జిల్లాలో ఏర్పాటు.. ఉల్లి, టమాటా రైతుల వెతలు తీర్చేందుకు ఏపీఎఫ్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారి కర్నూలు జిల్లాలో రూ.కోటి అంచనాతో 100 సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటుచేశారు. రూ.లక్ష అంచనా వ్యయంతో కూడిన ఈ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 35% సబ్సిడీతో వీటిని మంజూరు చేశారు. ఒక్కో యూనిట్ ఆరు టన్నుల చొప్పున ఏటా 7.200 వేల టన్నుల ఉల్లి, టమాటాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కల్గిన ఈ యూనిట్ల 100 మందికి ఉపాధి లభిస్తుండగా, ఆయా ప్రాంతాలకు చెందిన 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరుతోంది. వీటిని ఇటీవలే సీఎం జగన్ ప్రారంభించారు. ఇంట్లోనే ఏర్పాటుచేసుకునే ఈ యూనిట్ల ద్వారా ప్రతీనెలా రూ.12వేల నుంచి రూ.18వేల వరకు అదనపు ఆదాయాన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల యూనిట్లు మంజూరుచేయాలని సంకల్పించింది. బీఓబీ ఆర్థిక చేయూత.. మరోవైపు.. ఈ సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల విస్తరణ పథకానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొ చ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీపై వీటిని మంజూరు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో రూ.లక్ష అంచనాతో ఒక్కో యూనిట్ ఏర్పాటుచేయగా, ఇక నుంచి రూ.2లక్షల అంచనా వ్యయంతో రెట్టింపు సామర్థ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు వె చ్చిస్తున్నారు. ఈ మొత్తంలో రూ.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చుచేయనుండగా, లబ్దిదారులు తమ వాటాగా రూ.10కోట్లు భరించాల్సి ఉంటుంది. రూ.65 కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక చేయూతనిస్తోంది. ఇక బీఓబీ–ఏపీఎఫ్పీఎస్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు నేడు అవగాహనా ఒప్పందం చేసుకోబోతున్నాయి. -
అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!
బాలీవుడ్ చాలారోజుల తర్వాత మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య థియేటర్లలో రిలీజైన 'గదర్ 2' సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుండటమే దీనికి కారణం. కెరీర్ ఇక అయిపోయిందనకున్న టైంలో సన్నీ డియోల్ ఈ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అలాంటిది ఈ హీరో ఇప్పుడు కోట్ల రూపాయల అప్పు చేసి ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అతడి ఖరీదైన విల్లాని వేలానికి రావడంతో ఈ విషయం బయటపడింది. ఏం జరిగింది? ముంబయి జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ డియోల్ కి ఒక విల్లా ఉంది. అయితే దీనిని గ్యారంటీగా పెట్టి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లు లోన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు దాన్ని చెల్లించే విషయంలో మాత్రం మొహం చాటేశాడు. బ్యాంక్ నోటీసులు పంపినా సరే స్పందించలేదు. దీంతో ఏకంగా ఆదివారం (ఆగస్టు 20) ఓ ప్రముఖ పేపర్లో విల్లాని వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. డబ్బుల్లేవా? బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర వారసుడు అయిన సన్నీ డియోల్.. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఇతడికి సరైన హిట్ అనేది లేదు. దీంతో అందరూ ఇతడి గురించి మర్చిపోయారు. ప్రస్తుతం 'గదర్ 2'తో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇలాంటి హీరో లోన్ తీసుకుని కట్టకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పు తీర్చకపోవడం అనేది ఇతడికి పెద్ద సమస్య కాదు. తలుచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంక్లో తీర్చేయొచ్చు. కానీ సన్నీ డియోల్ ఎందుకలా చేస్తున్నాడనే విషయం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. చూడాలి మరి ఈ వేలంలో ఏం జరుగుతుందనేది? (ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?) -
యువ కస్టమర్లే లక్ష్యంగా బీవోబీ అడుగులు
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ హెడ్ వీజీ సెంథిల్కుమార్, డిజిటల్ , యువ కస్టమర్లపై నిరంతర దృష్టి ద్వారా రిటైల్వ్యాపారంలో వాటాను పెంచుకోవాలనే బ్రాండ్ ఉద్దేశాన్ని నొక్కి చెప్పారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు సంక్షిప్తంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 15 కోట్లకు పైగా కస్టమర్ బేస్ ఉంది. తమ బ్రాండ్ సరియైన దిశలో నడపించండం ఎపుడూ సవాలే! అయినప్పటికీ, ఒక బ్రాండ్గా అనేక అధ్యయనాలు చేసాం. కస్టమర్ల అనుభవం పరంగా అన్ని బ్రాంచ్లలో ఒక సర్వే నిర్వహించాం. దీంతో బ్యాంకుపై కస్టమర్ల దృష్టిపై అవగాహన వచ్చింది. మార్కెటింగ్ పరంగా, యూత్ని టార్గెట్ చేయడమే లక్ష్యం. బాబ్ వరల్డ్ , ఇతర డిజిటల్ ఆఫర్లు బ్రాండ్ ఇమేజ్ను బలోపేతం చేయబోతున్నాయి. సమీప భవిష్యత్తులో, బ్రాండ్ రీకాల్, బ్రాండ్ కార్యకలాపాల ప్రభావం, ఇతర అంశాలపై నిర్దిష్ట సర్వేలు/అధ్యయనాలను కూడా నిర్వహిస్తాము.దీనిపై నిర్దిష్టమైన ఇన్పుట్లను పొందడానికి ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామి కావాలని ప్లాన్ చేస్తున్నాం. మా వ్యాపారంలో రుణాల విషయానికి వస్తే. దేశీయ పుస్తకంలో 42 శాతం కార్పొరేట్, రిటైల్ 22 శాతం, వ్యవసాయం 15.6 శాతం , MSME 13 శాతం. బాధ్యతల వైపు కూడా మనకు ఇలాంటి శాతాలు ఉన్నాయి. అయితే రిటైల్ వ్యాపారాన్ని ప్రస్తుత స్థితి నుండి పెంచాలనుకుంటున్నాము.అందుకే రిటైల్ విభాగంలో డిజిటల్ రుణాలపై దృష్టి పెడుతున్నాము. ప్రముఖ క్రీడాకారులు పీసీ సింధు, కె శ్రీకాంత్తోపాటు తాజాగా స్టార్ విమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ బ్రాండ్ ఎంబాసిర్గా చేరిపోయారు. విమెన్ ప్రీమియర్ లీగ్లో ఒక బ్రాండ్ అసోసియేషన్గా మాత్రమే కాకుండా భారతదేశంలో మహిళల క్రికెట్కు అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాం. యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని #LoansWithoutDrama ప్రచారాన్ని చేపట్టాం. మిగిలిన డిజిటల్ ప్లాట్ఫారమ్లన్నింటితో పోల్చినప్పుడు బీఓబీకున్న ఉన్న ప్రధాన బలం ఏమిటంటే, ప్లాట్ఫారమ్తోపాటు, తమ బ్రాంచెస్ కూడా సర్వీసింగ్ యూనిట్లుగా పనిచేస్తాయి. కస్టమర్లకు సేవ చేయడానికి 80 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ప్లాట్ఫారమ్ను నిర్మించవచ్చు కానీ మీరు సర్వీసింగ్ కోసం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ను నిర్మించలేరు. కస్టమర్ సేవ విషయానికి వస్తే, సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫారమ్పై మాత్రమే కాకుండా ఆధారపడకుండా శాఖలు కూడా ఎల్లపుడూ ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. -అడ్వర్టోరియల్ -
బీవోబీ ఏటీఎంలో యూపీఐతో విత్డ్రాయల్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తన కస్టమర్లకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటరాపరేబుల్ క్యాష్ విత్డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) సదుపాయం కింద.. యూపీఐ సాయంతో ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చని (విత్డ్రాయల్) ప్రకటించింది. ఈ సేవలు ప్రారంభించిన మొదటి ప్రభుత్వరంగ బ్యాంక్గా బీవోబీ నిలిచిపోనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లతో పాటు, ఇతర భాగస్వామ్య బ్యాంకుల కస్టమర్లు.. భీమ్ యూపీఐ, బీవోబీ వరల్డ్ యూపీఐ లేదా మరేదైనా యూపీఐ ఆధారంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం నుంచి డబ్బులు (డెబిట్ కార్డు అవసరం లేకుండా) తీసుకోవచ్చని తెలిపింది. కస్టమర్లు ఏటీఎం యంత్రంలో యూపీఐ క్యాష్ విత్డ్రాయల్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఎంత మొత్తం తీసుకోవాలో నమోదు చేయాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. కస్టమర్ తన ఫోన్లోని యూపీఐ యాప్ తెరిచి ఏటీఎం స్క్రీన్పై కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. తర్వాత యూపీఐ పిన్ను మొబైల్ యాప్లో నమోదు చేయాలి. దీంతో లావాదేవీ ప్రాసెస్ అయ్యి నగదు బయటకు వస్తుంది. ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలకు యూపీఐ ఉంటే, అప్పుడు విడిగా ఏదన్నది ఎంపికకు అవకాశం ఉంటుంది. ఒక్క లావాదేవీలో రూ.5,000 చొప్పున, రోజులో రెండు లావాదేవీలనే ఈ రూపంలో అనుమతిస్తారు. -
ఇండియాఫస్ట్ లైఫ్ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థలలో బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,30,56,415 షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. వాటాదారులలో కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లకుపైగా షేర్లు విక్రయించనుంది. ఇండియాఫస్ట్ లైఫ్లో బీవోబీ 65 శాతం వాటాను కలిగి ఉంది. వార్బర్గ్ పింకస్ సంస్థ కార్మెల్ పాయింట్కు 26 శాతం, యూనియన్ బ్యాంక్కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఇష్యూకి ముందు ప్రిఫరెన్షియల్ పద్ధతి లేదా ప్రయివేట్ ప్లేస్మెంట్(రైట్స్ ఇష్యూ) ద్వారా రూ. 100 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది. తాజా ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కంపెనీ గతేడాది అక్టోబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దేశీయంగా మూడో పెద్ద పీఎస్యూ బ్యాంక్ బీవోబీ, యూనియన్ బ్యాంక్ కంపెనీకి విస్తారిత బ్యాంకెస్యూరెన్స్ నెట్వర్క్ ద్వారా మద్దతిస్తున్నాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ రేట్ల పెంపు
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ కాల వ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచినట్టు ప్రకటించింది. ఈ రేట్లు మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు 0.25–0.35 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తోంది. మూడు నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. 5––10 ఏళ్ల డిపాజిట్పైనా ఇదే రేటు ఆఫర్ చేస్తోంది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 3–5 ఏళ్ల కాలానికి, 5–10 ఏళ్ల కాలానికి 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగాయి. -
గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తన కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ కేవైసీ (C-KYC)ని పూర్తి చేయాలని తన వినియోగ దారులను కోరింది. అలా చేయకపోతే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్లో ఒ కప్రకటన జారీ చేసింది. నిర్ధేశిత సమయంలోపు బ్యాంకు వినియోగదారులు సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ)ని పూర్తి చేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇప్పటికే ఎస్ఎంఎస్, నోటీసులు సంబంధిత ఖాతాదారులకు పంపించామని, వెంటనే వారు సమీప ఖాతాను సందర్శించిన అవసరమైన పతత్రాలు సమర్పించాలని సూచించింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ KYC ప్రాసెస్ను పూర్తి చేయని కస్టమర్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) సీ-కేవైసీని నిర్వహిస్తుంది. దీంతో కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిచ్చిన తరువాత డిజిటల్ ఫార్మాట్ సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. కేవైసీ వివరాలకు ఈ నంబరు ఇస్తే సరిపోతుంది. అంటే కస్టమర్ ఒక్కసారి సీ-కేవైసీని పూర్తి చేశాక కొత్త ఖాతాలను తెరవడం, జీవిత బీమా, లేదా డీమ్యాట్ ఖాతా లాంటి విభిన్న ప్రయోజనాల కోసం మళ్లీ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రాసెస్ను, కేవేసీ రికార్డ్లను సమర్థవంతంగా వినియోగించు కోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. pic.twitter.com/HZOMQN9pbJ — Bank of Baroda (@bankofbaroda) March 13, 2023 -
బీఎఫ్ఎస్ఎల్లో బీవోబీ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవో బీ) తన సబ్సిడరీ అయిన బీవోబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ (బీఎఫ్ఎస్ఎల్)లో 49 శాతం వరకు వాటాలను విక్రయించనుంది. ఇందుకు సంబంధించి బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్లకు తెలియజేసింది. బీఎఫ్ఎస్ఎల్లో బీవోబీకి ప్రస్తుతం 100 శాతం వాటా కలిగి ఉంది. అర్హత కలిగిన ఇన్వెస్టర్లు, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతూ త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని బీవోబీ తెలిపింది. -
వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు
ముంబై: వడ్డీ రేటు పెంపు జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) చేరాయి. ఈ నెల మొదట్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పావుశాతం పెంచడం (6.5 శాతానికి) దీనికి నేపథ్యం. ఎస్బీఐ బుధవారం రేట్ల పెంపు నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలో బీఓబీ, ఐఓబీలు చేరడం గమనార్హం. బీఓబీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఫిబ్రవరి 12 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి, ఓవర్నైట్, నెల, మూడు నెలా రేట్లు వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.3 శాతానికి చేరాయి. ఐఓబీ: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 8.45కు చేరింది. నెల, మూడు, ఆరు నెలల రేట్లుసైతం ఇదే స్థాయిలో పెరిగి వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.35 శాతాలకు చేరాయి. ఓవర్నైట్, రెండేళ్లు, మూడేళ్ల రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఎస్బీఐ డిపాజిటర్లకు తీపికబురు రుణ రేటును బుధవారం 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను కూడా గురువారం 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల శ్రేణిలో పెంచింది. తాజా పెంపు నేపథ్యంలో ఐదేళ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 8.5 శాతం వడ్డీరేటు పొందుతారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య రేటు పావుశాతం పెరిగి 7 శాతానికి చేరింది. మూడేళ్ల పైబడిన డిపాజిట్లపై రేటు కూడా పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్!
ఇటీవల క్రెడిట్ కార్ట్ వాడకం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు బోలెడు ఆఫర్లతో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కార్డు ఫ్రీగా లభిస్తుంది. అంతేనా ఉచితంగా బీమా కవరేజ్ కూడా పొందచ్చు. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఈ కొత్త క్రెడిట్ కార్డుని ప్రవేశపెట్టింది. కాకపోతే ఫుల్ ప్రయోజనాలతో వస్తున్న ఈ కార్డు కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వారి కోసం కొత్త క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు పేరు విక్రమ్ క్రెడిట్ కార్డు (Vikram Credit Card). ఇండియన్ డిఫెన్స్, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది కోసం ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. బీఎప్ఎస్ఎల్ ( BFSL) ఇప్పటికే ఇండియన్ ఆర్మీ (యోధా), ఇండియన్ నేవీ (వరుణహ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ (రక్షమాహ్), అస్సాం రైఫిల్స్(ది సెంటినెల్) వారి కోసం ప్రత్యేకమైన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లను అందించింది. నిస్వార్థంగా మనల్ని కాపాడుతూ, మన దేశానికి సేవ చేస్తున్న సిబ్బంది క్రెడిట్ అవసరాలను తీర్చేందుకు విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఎంత గానో ఉపయోగపడుతుందని బీఎఫ్ఎసఎల్ ( BFSL ) తెలిపింది. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కొత్త ఎక్స్క్లూజివ్ క్రెడిట్ కార్డులను వారికి అందిస్తామని బ్యాంక్ పేర్కొంది. విక్రమ్ క్రెడిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖిచి ప్రారంభించారు. విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్లు, ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం! ►జీవితకాల ఉచిత (LTF) క్రెడిట్ కార్డ్ ►ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లతో పాటు కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ యాక్టివేషన్ బహుమతి. ►ప్రమాద మరణ కవరేజీ రూ. 20 లక్షలు ►1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ►LTF యాడ్-ఆన్లు ►ఈఎంఐ ఆఫర్లు ►కాలానుగుణంగా వ్యాపార సంబంధిత ఆఫర్లు చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్ -
కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణ రేట్లు మరింత పెరగనున్నాయి. కొత్త రేటు జనవరి 12వ తేదీ నుంచి అమలవుతుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. నెల, మూడు, ఆరు, ఏడాది రేట్లు వరుసగా 8.15 శాతం, 8.25 శాతం, 8.35 శాతం, 8.50 శాతాలకు పెరిగాయి. పలు వాహన, వ్యక్తిగత, గృహ రుణాలకు ఏడాది రుణ రేటు అనుసంధానమై ఉండే సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లు సోమవారం రుణ రేటను 25 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఐఓబీ డిపాజిట్ల రేట్లు అప్ కాగా, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)రిటైల్ డిపాజిట్ రేటును తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 45 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని ప్రకారం 444 రోజుల కాలానికి డిపాజిట్లపై 7.75 శాతం రేటు అమలవుతుంది. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ రేటును కూడా మంగళవారం నుంచి బ్యాంక్ 1% పెంచింది. దీనితో ఈ రేటు 5 శాతానికి చేరింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్వేర్ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!
రెపోరేట్ల పెంపుతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ, ప్రభుత్వ రంగం బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రుణ రేట్లను పెంచాయి. అయితే తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’(బీవోబీ) ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. నవంబర్ నెలలో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అప్పుడు రేట్ల పెంపు 15 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఈ రుణ రేటు పెంపు నిర్ణయం డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెరగడం వల్ల హౌసింగ్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఈ (Small Medium Enterprises) లోన్స్ వంటివి భారం కానున్నాయి. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు రీసెట్ డేట్ నుంచి అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులకు కట్టే నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది. బీవోబీలో ఎంసీఎల్ రేట్లు ఇక బీవోబీ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 8.3 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి చేరింది. ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. -
బరోడా బీఎన్పీ పారిబాస్ నుంచి మల్టీ అసెట్ ఫండ్
బరోడా బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘బరో డా బీఎన్పీ పారిబాస్ మల్టీ అసెట్ ఫండ్’ను (ఎన్ఎఫ్వో/కొత్త పథకం) ప్రారంభించింది. ఈ నెల 12న ఈ ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఈ పథకం ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ), గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెడుతుంది. ఒకటికి మించిన సాధనాల్లో (మల్టీ అస్సెట్) ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. విడిగా ఒక్కో సాధనంమధ్య పెట్టుబడులను వర్గీకరించుకునే నిర్వహణ ఇబ్బంది ఈ పథకం ఎంపికతో ఉండదు. ఎన్ఎఫ్వోలో భాగంగా ఒక్క ఇన్వెస్టర్ కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలి. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
బీఓబీ ఖాతాదారులకు గుడ్న్యూస్
ముంబై: గృహ రుణ రేటును పరిమిత కాలానికి పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. దీనితో ఈ రేటు 8.25 శాతానికి తగ్గింది. తాజా రేటు 2022 డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటుందని కూడా పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక రేటు రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్కు అనుసంధానం చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. తగ్గించిన రుణ రేటు బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ గృహ రుణ రేటులో ఒకటని, అత్యంత పోటీ పూర్వకమైనదని బ్యాంక్ పేర్కొంది. తాజా రేటు తగ్గింపు తాజా గృహ రుణాలతో పాటు, బ్యాలెన్స్ బదలాయింపులకూ వర్తిస్తుందని తెలిపింది. ‘‘ఈ ఏడాది మేము గృహ రుణ విభాగంలో మంచి వృద్ధి రేటును చూశాం. అన్ని పట్టణాల్లో పటిష్ట డిమాండ్ ఉంది. మా తాజా నిర్ణయం రుణ వృద్ధి మరింత పెరగడానికి దోహదపడుతుంది’’ అని బ్యాంక్ జనరల్ మేనేజర్ (తనఖాలు, ఇతర రిటైల్ రుణాలు) హెచ్టీ సోలంకీ తెలిపారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు భారీ షాక్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేట్లను పెంచింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణరేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. సవరిత రేట్లు 12వ తేదీ (శనివారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరిగిన రేట్లను చూస్తే బెంచ్మార్క్ ఏడాది ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెరిగి 8.05%కి చేరింది. ఇది వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు అనుసంధానమైన రేటు. ఏడాది, మూడేళ్లు, 6 నెలల రేట్లు 10 బేసిస్ పాయింట్ల చొప్పున ఎగసి వరుసగా 7.70%, 7.75%, 7.90 శాతాలకు చేరాయి. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్చేసి రూ. 3,313 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,271 కోట్ల నుంచి రూ. 23,080 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 34 శాతం ఎగసి రూ. 10,714 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.48 శాతం మెరుగై 3.33 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.11 శాతం నుంచి 5.31 శాతానికి, నికర ఎన్పీఏలు 2.83 శాతం నుంచి 1.16 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,754 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 1,628 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.25 శాతంగా నమోదైంది. ఐవోబీ లాభం జూమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం జంప్చేసి రూ. 501 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 376 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,028 కోట్ల నుంచి రూ. 5,852 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.66 శాతం నుంచి 8.53 శాతానికి, నికర ఎన్పీఏలు 2.77 శాతం నుంచి 2.56 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ ఆదాయం రూ. 4,255 కోట్ల నుంచి రూ. 4,718 కోట్లకు బలపడింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), వీసా భాగస్వామ్యంతో తన ఖాతాదారుల కోసం కొత్తగా రెండు ప్రీమియం డెబిట్ కార్డులను విడుదల చేసింది. ‘బీవోబీ వరల్డ్ ఒపులెన్స్’అన్నది సూపర్ ప్రీమియం వీసా ఇన్ఫినైట్ డెబిట్ కార్డు కాగా, మరొకటి, ‘బీవోబీ వరల్డ్ సాఫైర్’. క్రెడిట్ కార్డుల మాదిరే వీటిపై రివార్డులు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. (Elon Musk సంచలనం: పరాగ్ అగర్వాల్కు మరో షాక్!) బోవోబీ వరల్డ్ ఒపులెన్స్ వీసా ఇన్ఫినైట్ కార్డుపై కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ సేవ, అపరిమితంగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనలు, క్లబ్ మారియట్ సభ్యత్వం, హెల్త్, వెల్నెస్, డైనింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ఆరంభంలో జాయినింగ్ ఫీజు కింద రూ.9,500, ఆ తర్వాత ఏటా రూ.9,500 కస్టమర్లు ఈ కార్డు కోసం చెల్లించుకోవాలి. ఇలాంటి ప్రయోజనాలే కలిగిన బీవోబీ వరల్డ్ సాఫైర్ జాయినింగ్ ఫీజు రూ.750. ఏటా రూ.750 ఫీజు ఉంటుంది. -
ఐపీవోకు ఇండియాఫస్ట్ లైఫ్
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000–2,500 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థ బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయనుంది. కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.30 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్లో బీవోబీ వాటా 65 శాతంకాగా.. కార్మెల్ పాయింట్(వార్బర్గ్ పింకస్)కు 26 శాతం, యూనియన్ బ్యాంక్కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో ఇండియాఫస్ట్ లైఫ్ పేర్కొంది. -
దివాళీ బొనాంజా: బ్యాంకులు బంపరాఫర్లు.. కస్టమర్లకు పండగే!
కస్టమర్లకు బంపరాఫర్. దీపావళి సందర్భంగా కొత్త ఇల్లు, కారు కొనాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు రెనోవేట్ చేయాలని అనుకుంటున్నారా? భారీగా పెరిగిన వడ్డీరేట్ల నుంచి ఉపశమనం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ,ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు పరిమిత కాలానికి లోన్ ఆఫర్లను ప్రకటించాయి. ఎస్బీఐ గృహ రుణాలను సంవత్సరానికి 8.4 శాతం నుండి టాప్-అప్ రుణాలను 8.8 శాతం నుండి అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరానికి 8.45 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. 8.45 శాతం నుండి కార్ లోన్లను అందిస్తుంది. కారు రుణాలపై ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంవత్సరానికి 7.9 శాతం చొప్పున కారు లోన్లను అందిస్తోంది. 50 శాతం పూర్తయిన తర్వాత (కనీసం 24 నెలలు) ఎలాంటి ఫోర్క్లోజర్ ఛార్జీలు లేవు. బంగారం రుణాలపై, ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం మాఫీ చేసింది. ఐసీఐసీ బ్యాంక్ ప్రస్తుతం కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను అందిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను చెక్ చేసిన తర్వాత, ప్రీ-అప్రూవ్డ్ లోన్లను మంజూరు చేస్తుంది. కారు రుణాలపై, ప్రాసెసింగ్ రుసుము రూ. 1,999, కొత్త కారు రుణాలపై ఆన్-రోడ్ ధరలో 100 శాతం వరకు లోన్ మొత్తాలను అందిస్తుంది. కార్ లోన్లపై ఫోర్క్లోజర్, ప్రీపేమెంట్ ఛార్జీలు లేవు. వ్యక్తిగత రుణాలపై 12 ఈఎంఐల తర్వాత ప్రీ-క్లోజర్ ఛార్జీలు ఉండవు (12ఈఎంఐల కంటే ముందు ఫోర్క్లోజర్ చేస్తే 3 శాతం వసూలు చేస్తాయి). పంజాబ్ నేషనల్ బ్యాంకు పండుగ సీజన్లో పీఎన్బీ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022 అనే పేరుతో గృహ రుణాలు, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.50 శాతం నుండి గృహ రుణాలను అందిస్తోంది. తిరిగి చెల్లించే వ్యవధి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలు లేవు. కార్ లోన్లను అందిస్తుంది. ఇది సంవత్సరానికి వడ్డీ 7.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. కారు రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులు లేవు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్లో గృహ, కారు రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలను 8.30 శాతం నుండి, కారు రుణాలను 8.70 శాతం నుండి అందిస్తోంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలను మాఫీ చేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏడేళ్ల వరకు కార్ లోన్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేసేలా 100 శాతం వరకు ఫైనాన్స్ అందిస్తోంది. సాధారణంగా, బ్యాంకులు కారు రుణం 80-85 శాతం వరకు ఫైనాన్సింగ్ను అందిస్తాయి. ఇది 72 నెలల వరకు రూ. 50 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఇతర ప్రముఖ బ్యాంకులతో పోలిస్తే, బ్యాంక్ ఎక్కువ కాలం పాటు వ్యక్తిగత రుణాలను అందిస్తోంది. గరిష్ట రుణ మొత్తం ఎక్కువగా ఉంటుంది. గృహ రుణాల కోసం 30ఏళ్ల వరకు సుదీర్ఘ కాల వ్యవధిని అందిస్తోంది. -
గాయత్రి ప్రాజెక్ట్స్పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన బాకీలను రాబట్టుకునేందుకు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్పై కెనరా బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అక్టోబర్ 10న (నేడు) చేపట్టనుంది. గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ బ్యాంకులకు దాదాపు రూ. 6,000 కోట్లు బకాయిపడింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అత్యధికంగా రుణాలిచ్చాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్ న్యూస్,రూ.2 కోట్ల వరకు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. పెరిగిన రేట్లు ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడాది టర్మ్ డిపాజిట్పై రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. 400 రోజులు దాటి, మూడేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై రేటు 5.45 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. మూడేళ్లు దాటి, పదేళ్ల వరకు డిపాజిట్లపై రేటు 0.15 శాతం పెరిగి 5.65 శాతానికి చేరుకుంది. ఏడాది కాల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం రేటు లభిస్తుంది. ఇతర కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా వృద్ధులకు కొంచెం అదనపు వడ్డీని బీవోబీ ఆఫర్ చేస్తోంది. ‘బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్’ 5–10 ఏళ్ల కాల వ్యవధికి 5.65 శాతం రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.15 శాతం అదనపు రేటును బ్యాంక్ అందిస్తోంది. -
హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!
న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు ఇళ్ల కొనుగోలు డిమాండ్కు అవరోధం కాదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అధ్యయన నివేదిక తెలిపింది. రుణ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు పెరగడం, తగ్గడం సహజమేనన్న విషయమై వారికి అవగాహన ఉంటుందని పేర్కొంది. రెండేళ్లుగా వడ్డీ రేట్ల పరంగా ఎటువంటి మార్పుల్లేని విషయం తెలిసిందే. కానీ, ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా మొత్తం 1.4 శాతం మేర రేట్లను పెంచడంతో.. బ్యాంకులు సైతం రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో బీవోబీ పరిశోధన నివేదిక ఇళ్ల డిమాండ్, వడ్డీ రేట్లపై దృష్టి సారించడం గమనించాలి. ‘భారత్లో గృహ రుణాల తీరు’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. కరోనా తర్వాత దేశంలో గృహ రుణ రంగం బలంగా నిలబడినట్టు తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే గృహ రుణాల్లో మంచి వృద్ధి కనిపించడాన్ని ప్రస్తావించింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రకటించిన మద్దతు చర్యలు, దీనికితోడు ప్రాపర్టీల ధరలు తగ్గడం, తక్కువ వడ్డీ రేట్లు మార్కెట్కు కలిసొచ్చినట్టు వివరించింది. గృహ రుణాలకు డిమాండ్ ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా మారిపోవడం, వృద్ధి పుంజుకోవడం, గృహాలకు డిమాండ్ను గణనీయంగా పెంచనున్నట్టు ఈ నివేదికను రూపొందించిన బీవోబీ ఆర్థికవేత్త అదితి గుప్తా పేర్కొన్నారు. ఈ సానుకూలతలు మద్దతుగా గృహ రుణాలకు మరింత డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ‘‘అధిక వడ్డీ రేట్లు కొద్ది మంది రుణ గ్రహీతలకు అవరోధం కావచ్చు. కానీ, ఇళ్లకు నెలకొన్న బలమైన డిమాండ్ దీన్ని అధిగమిస్తుంది. పైగా వ్యక్తిగత గృహ కొనుగోలుదారులు వడ్డీ రేట్ల ఆటుపోట్లపై అవగాహనతో ఉంటారు. కనుక అధిక రేట్లు వారి కొనుగోళ్లకు అవరోధం కాబోవు’’అని అదితి గుప్తా వివరించారు. జీడీపీలో పెరిగిన వాటాయే నిదర్శనం గడిచిన పదేళ్ల కాలంలో జీడీపీలో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల గృహ రుణాల రేషియో పెరగడం గృహ రుణాలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనమని ఈ నివేదిక గుర్తు చేసింది. 2010–2011లో జీడీపీలో గృహ రుణాల రేషియో 6.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 9.5 శాతానికి పెరిగినట్టు తెలిపింది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో గృహ రుణాల రేషియో 9.8 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి రియల్ ఎస్టేట్ బలంగా కోలుకుందని, గత ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాల రేషియో జీడీపీలో 11.2 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ‘‘2020–11 నాటికి రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల గృహ రుణాల పోర్ట్ఫోలియో 2020–21 నాటికి రూ.15 లక్షల కోట్లకు పెరిగింది. ఏటా 14.3 శాతం వృద్ధి నమోదైంది. గృహ రుణాల మార్కెట్లో ఇప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీటి వాటా 61.2 శాతంగా ఉంది. 2022లో హౌసింగ్ బూమ్..! పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు ఇళ్ల ధరలు పెరిగాయి. గృహ రుణాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అయినా సరే 2022లో ఇళ్ల విక్రయాలు కరోనా ముందు నాటిని మించి నమోదవుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు.. కరోనా ముందు సంవత్సరం 2019లో నమోదైన 2.62 లక్షల యూనిట్లను మించుతాయని అంచనాతో ఉంది. డీమోనిటైజేషన్, రెరా, జీఎస్టీ, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఆరేళ్లుగా ఈ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. అయితే, రెరా చట్టం కారణంగా కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడినట్టు గృహ కొనుగోలుదారుల మండలి ఎఫ్పీసీఈ అంటోంది అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ లిస్టెడ్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరానికి బుకింగ్ల పరంగా మంచి గణాంకాలను నమోదు చేయగా, 2022–23లోనూ మెరుగైన విక్రయాలు, బుకింగ్ల పట్ల ఆశాభావంతో ఉంది. అయితే, ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం, బ్యాంకులు ఈ మొత్తాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడంతో స్వల్ప కాలంలో ఇళ్ల విక్రయాలపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఇళ్ల ధరల పెరుగుదల ప్రభావం కూడా స్వల్పకాలంలో ఉండొచ్చని అంగీకరించింది. జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సుమారు 5 శాతం మేర పెరగడం గమనార్హం. పండుగల జోష్ అయితే పండుగల సీజన్ నుంచి ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చని రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంచనాలతో ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ సైతం ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు ఏడు ప్రధాన పట్టణాల్లో (ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా, పుణె) 2019లో నమోదైన 2,61,358 యూనిట్లను మించుతాయని అంచనా వేసింది. అయితే 2014లో నమోదైన గరిష్ట విక్రయాలు 3.43 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. దేశ హౌసింగ్ పరిశ్రమ నిర్మాణాత్మక అప్సైకిల్ ఆరంభంలో ఉందని మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఎండీ, సీఈవో అభిషేక్ లోధా తెలిపారు. వచ్చే 10–20 ఏళ్ల కాలానికి వృద్ధిపై ఆశావహంగా ఉన్నట్టు చెప్పారు. -
బరోడా బీఎన్పీ ఎంఎఫ్ సక్సెస్!
న్యూఢిల్లీ: ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ పథకం బరోడా బీఎన్పీ పరిబాస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ. 1,400 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో) జులై 25న ప్రారంభమై ఈ నెల(ఆగస్ట్) 8న ముగిసింది. బరోడా బీఎన్పీ పరిబాస్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియా చేపట్టిన తొట్టతొలి పథకమిది. బీఎన్పీ పరిబాస్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాలో బరోడా అసెట్ మేనేజ్మెంట్ ఇండియా విలీనమయ్యాక తీసుకు వచ్చిన తొలి పథకమిది. దేశవ్యాప్తంగా 120 పట్టణాల నుంచి 42,000 మంది ఇన్వెస్టర్లు ఎన్ఎఫ్వోపట్ల విశ్వాసముంచినట్లు బరోడా బీఎన్పీ పరిబాస్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియా సీఈవో సురేష్ సోనీ పేర్కొన్నారు. ఈ పథకాన్ని తిరిగి ఈ నెల 24 నుంచి రీఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు. -
ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 6 శాతం వరకూ అత్యధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తూ, ‘బరోడా తిరంగా డిపాజిట్ పథకం’ పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్ను ఆఫర్ చేసింది. అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వినియోగదారులకు అధిక వడ్డీరేటుతో తిరంగా డిపాజిట్ స్కీమ్ అందించడం సంతోషంగా ఉందనీ, అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో బీఓబీ ఒకటని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా ప్రకటనలో తెలిపారు. (ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!) 2022 డిసెంబర్ 31 వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. తిరంగా డిపాజిట్ స్కీమ్ వివరాల ప్రకారం, 555 రోజుల కాలవ్యవధికి డిపాజిట్పై 6.15శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు 0.5శాతం అదనపు వడ్డీని, నాన్-కాలబుల్ డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీని అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద నాన్-కాలబుల్ 555 రోజుల డిపాజిట్ పై 6.65 శాతం వరకూ వరకు వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం 555 రోజులకు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1.26 లక్షల కంటే ఎక్కువే పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్లకు మెచ్యూరిటీ మొత్తం రూ. 1.28 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. -
ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా : ఆగస్ట్ 1నుంచి ఆర్బీఐ సూచనల మేరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్'ని అమలు చేస్తుంది. తద్వారా చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదంటే వ్యక్తుల వివరాల్ని ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ కేవైసీ : రైతుల సౌలభ్యం కోసం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎంకేఎస్ఎన్వై) కోసం ఈ-కేవైసీ గడువు మే 31 నుండి జూలై 31 వరకు పొడిగించింది. రేపటి నుండి కేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం లేదు. పీఎంఎఫ్బీవై రిజిస్ట్రేషన్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జులై 31తో ముగుస్తాయి. రిజిస్ట్రేషన్లను కోల్పోయిన వారు ఈ స్కీంలో లబ్ధి పొందలేరు. కాగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్లోనైనా చేసుకోనే సదుపాయం కేంద్రం కల్పించింది. ఎల్పీజీ గ్యాస్ రేట్లు: ప్రతి నెల మొదటి తేదీన, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ధరలు సవరించబడతాయి. ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. గడువు తేదీని ప్రభుత్వం పొడిగిస్తే తప్ప, ఐటీఆర్లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. -
మరీ ఇంత దారుణమా! ఈ బ్యాంకు అధికారులకు బుద్ది లేదా ?
విజయ్మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్మోదీలను బ్యాంకులను మోసం చేశారు. దేశానికి ద్రోహం చేశారనే భావన ఇప్పటి వరకు చాలా మందిలో పేరుకు పోయింది. కానీ ఇప్పుడు చెప్పబోయే వివరాలు తెలిస్తే అవాక్కవడం ఖాయం. బ్యాంకులను డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లే ఎంతో నయం అనిపిస్తారు. ఎందుకంటే మన బ్యాంకులు అలా తయారయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తను మీరు చూడండి. కంపెనీ పేరు గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ దీన్ని ప్రమోట్ చేసిన వ్యక్తులు అనుమోద్ శర్మ, విరాఫ్ సర్కారీ, సంజయ్ చౌధరీలు. ఈ కంపెనీ చేసే వ్యాపారం విస్తరణ కోసం ఐడీబీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంకు ఆఫ్ బరోడాల నుంచి భారీ ఎత్తున రుణం తీసుకుంది. గ్యారెంటీగా గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ పలు ఆస్తులను చూపించింది. ఇంతకీ ఈ ఆస్తులు కలిగి ఉన్న కంపెనీ పేరు గ్రేట్ ఇండియన్ తమాషా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. రూ. 147 కోట్లు గ్రేట్ ఇండియన్ తమాషా కంపెనీ ఆస్తులను గ్యారెంటీగా ఉంచుకుని బ్యాంకు ఆఫ్ బరోడా 2015 ఫిబ్రవరి 13న ఏకంగా రూ.49.23 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు అదే ఏడాది డిసెంబరు 11న రూ 6.26 కోట్ల రుణం ఇచ్చింది. ఈ రెండు బ్యాంకులకు అసలు, వడ్డీ చెల్లించలేదు ది గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ. దీంతో ఈసారి అప్పు కోసం ఐడీబీఐ బ్యాంకును సంప్రదించాయి. గ్రేట్ ఇండియన్ తమాషానే గ్యారెంటీగా చూపుతూ 2021 నవంబరు 25న ఏకంగా రూ.86.48 కోట్ల రుణం పొందింది. ఆస్తుల వేలం తమాషా కంపెనీ తమకు రుణం చెల్లించడం లేదంటూ హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఆలస్యంగా గుర్తించగా పెద్ద మొత్తంలో లోను ఇచ్చిన ఐడీబీఐ ఆలస్యంగా గమనించింది. చివరకు తమాషా కంపెనీకి కర్నాటకలో ఉన్న ఆస్తులు వేలం వేస్తామంటూ 2022 మేలో పేపర్ ప్రకటన ఇచ్చింది. కర్నాటకలో తమాషా కంపెనీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న 107 ఎకరాలు, ఇతర స్థిర ఆస్తులను వేలం వేసి నష్టాలను పూడ్చుకుంటామంటూ ప్రకటన ఇచ్చాయి. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు నుంచి ప్రకటన జారీ అయ్యింది. ఇదే ట్వీట్ను హర్షద్ మెహతా స్కామ్ను వెలికి తీసిన సుచేతా దలాల్ రీట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ అవుతోంది. మోసగాళ్ల వల్లే కంపెనీ పేర్లు ‘ది గ్రేట్ ఇండియన్ నోటంకి’ అని గ్యారెంటీగా చూపించిన ఆస్తులు ‘ది గ్రేట్ తమాషా కంపెనీ’ అని నేరుగా కనిపించినా అధికారులు కనీసం బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా మంజూరు చేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నోటంకి, తమాషా లాంటి పదాలు నేరుగా కనిపించినా కళ్లు మూసుకుని రుణాలు ఇచ్చారంటే వీళ్లకు అసలు బుద్ధి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు, మోసగాళ్లతో కుమ్మక్కయిన కారణంగానే ఈ తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు మరికొందరు. మాఫీ చేస్తారు మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి రెండువేల కోట్ల రూపాయలు ఎగనామ పెట్టాడు. విజయ్మాల్యా ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులకు పది వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడ్డాడు.. ఈ జాబితాలో తమాషా లాంటి కంపెనీలు మరెన్నో ఉన్నాయి. ఇలా పేరుకుపోయిన అప్పులను అప్పుడప్పుడు బ్యాంకులు మాఫీ చేస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహాలో మాఫీ చేసిన అప్పుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలకుపై మాటే. My god... this is not a joke!! https://t.co/uXtVTW4Cgr — Sucheta Dalal (@suchetadalal) June 20, 2022 చదవండి: రూ.3లకు కక్కుర్తి పడితే.. చివరకు ఏం జరిగిందంటే? -
30 నుంచి ఆ రెండు బ్యాంకుల సమ్మె
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పలు డిమాండ్ల సాధనలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సమ్మెకు దిగనున్నాయి. ఒప్పందాలకు విరుద్ధంగా అధికారులు, సిబ్బందికి బదిలీలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నారు. అలాగే, ఔట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది ఈ నెల 30న సమ్మెకు దిగనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అటెండర్ స్థాయి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడాన్ని సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. (చదవండి: రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు) -
22 లక్షలతో పారిపోయి.. కోర్టులో లొంగిపోయి
హస్తినాపురం: రూ. 22.53 లక్షలతో ఉడాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటూ వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న వనస్థలిపురం సాహెబ్నగర్లోని బ్యాంకు ఆఫ్ బరోడా (బీఓబీ) క్యాషియర్ ప్రవీణ్కుమార్ హయత్నగర్ కోర్టులో సోమవారం లొంగిపోయాడు. మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు విరక్తి చెంది అవమానం భరించలేక మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని చెప్పారు. తాను వారణాసి, గోవా వెళ్లలేదని, వనస్థలిపురం నుంచి నేరుగా నల్లగొండ జిల్లా చిట్యాలకు బైక్పై వెళ్లి అక్కడ బైక్ను వదిలేసి ఆటోలో నల్లగొండకు, అక్కడి నుంచి బస్సులో దేవరకొండ మీదుగా జడ్చర్లకు వెళ్లానన్నారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వర్షంలో తడిచి ఓ గ్రామానికి వెళ్లి ఇతరుల ఫోన్ సాయంతో ఇన్స్టాగ్రామ్లో మీడియాకు సెల్ఫీ వీడియో పెట్టానని తెలిపారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తన బాధలు చెప్పుకోవడానికే ఇక్కడకి వచ్చానని, ఇప్పటికీ తనకు జరిగిన అవమానానికి బతకాలని లేదని అన్నారు. బ్యాంకులో అంతర్జాతీయ స్థాయి కుంభకోణం: ప్రవీణ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణం జరుగుతోందని ప్రవీణ్ ఆరోపించారు. బ్యాంకులో లాకర్కు పెట్టాల్సిన సీసీ కెమెరాలు వాటికి కాకుండా కిందికి పెట్టారని, తాను బయటికి రాగానే నిజాలను సాక్ష్యాలతో బయటపెడతానని కోర్టు బయట మీడియాకు చెప్పారు. తనను ఈ స్థాయికి తెచ్చిన వారిని వదిలిపెట్టబోనని, అన్ని నిజాలు త్వరలోనే బట్టబయలు చేస్తానని అన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రవీణ్ గత మంగళవారం బ్యాంకుకు వచ్చాక కాసేపటికే కడుపు నొప్పి వస్తోందని చీఫ్ మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకూ తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో కంగారు చెందిన చీఫ్ మేనేజర్ క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లి సిబ్బంది సమక్షంలో నగదు లెక్కించగా రూ. 22.53 లక్షలు తక్కువ వచ్చింది. దీంతో ప్రవీణ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నాడని బ్యాంక్ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. -
Hyderabad: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. అయితే, వారం రోజుల క్రితం రూ.22 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్.. పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అనంతరం హయత్ నగర్ కోర్టు.. ప్రవీణ్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రవీణ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 30 వరకు ప్రవీణ్ రిమాండ్లో ఉండనున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బ్యాంక్ ఆఫ్ బరోడాలో చాలా అవకతవకలు ఉన్నాయి. నేను ఎలాంటి మోసానికి పాల్పడలేదు. బ్యాంక్లో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకునేందుకే నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నారు. అతి త్వరలో బయటకు వచ్చి బ్యాంక్ మోసాలను బయట పెడతాను. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణలు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి సాక్షాలతో నిరూపిస్తాను. బ్యాంక్లో లకర్స్కి పెట్టాల్సిన కెమెరాను కిందకు పెట్టారు’’ అని తెలిపాడు. జరిగింది ఇది.. నగరంలోని వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 22.53 లక్షల నగదు తీసుకుని క్యాషియర్ ప్రవీణ్ కుమార్ పరారయ్యాడు. డబ్బులు తానే తీసుకెళ్లానని, క్రికెట్ బెట్టింగ్లో పెట్టి నష్టపోయానని.. మళ్లీ బెట్టింగ్లో పెడతానని అవి వస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ బ్యాంక్ మేనేజర్కు ప్రవీణ్ మొదట మెసేజ్ చేశారు. అనంతరం మాట మార్చి.. బ్యాంక్ నుంచి డబ్బులు తాను తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియోను బయటకు వదిలాడు. ఆ వీడియోలో బ్యాంక్ మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, అనవసరంగా తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించాడు. ఇది కూడా చదవండి: హైటెక్ దొంగ.. చోరీ చేసిన కార్లను.. -
గుడ్న్యూస్! గృహ రుణ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) పరిమిత కాలానికి గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30 వరకూ 6.50 శాతం వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇది 6.75 శాతంగా ఉంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ బట్టి కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు పేర్కొంది. గత కొద్ది నెలలుగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వడ్డీ రేటు ఆఫరు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంకు జనరల్ మేనేజర్ (మార్ట్గేజెస్, ఇతర రిటైల్ అసెట్స్) హెచ్టీ సోలంకి తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి కూడా కొత్త రేటు అందుబాటులో ఉంటుంది. సిబిల్ స్కోరు 771కి పైగా ఉన్న వారికి దీన్ని వర్తింపచేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ 6.5 శాతమే వడ్డీ రేటు ఆఫర్ చేసిన బీవోబీ .. ఏప్రిల్ 1 నుంచి దాన్ని 6.75%కి పెంచింది. మళ్లీ వెంటనే తిరిగి పూర్వ స్థాయికి తగ్గించడం గమనార్హం. చదవండి👉🏼: నగరంలో అల్ట్రా లగ్జరీ గృహాలు -
షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?
న్యూఢిల్లీ: గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరిగే దిశగా బ్యాంకులు దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) 0.10 శాతం వరకు పెంచాయి. మిగతా బ్యాంకులు కూడా అదే బాట పట్టనున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలు తీసుకున్న వివిధ రకాల రుణగ్రహీతలకు .. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) మరింత భారం కానున్నాయి. వివరాల్లోకి వెడితే.. ఎస్బీఐ తమ ఎంసీఎల్ఆర్ వివిధ కాలావధులకు సంబంధించి 0.10 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధికి ఈ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. అలాగే, రెండు.. మూడేళ్ల వ్యవధికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ వరుసగా 7.30 శాతం, 7.40 శాతానికి చేరింది. కొత్త ఎంసీఎల్ఆర్ ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ తమ వెబ్సైట్లో పేర్కొంది. అటు ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు బీవోబీ కూడా ఏడాది వ్యవధి ఎంసీఎల్ఆర్ను 0.05 శాతం పెంచడంతో ఇది 7.35 శాతానికి చేరింది. ఏప్రిల్ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా (కేఎంబీ) బ్యాంకులు కూడా ఏడాది కాలావధి ఎంసీఎల్ఆర్ను సవరించడంతో ఇది 7.40 శాతానికి చేరింది. యాక్సిస్ బ్యాంక్ కొత్త రేటు ఏప్రిల్ 18 నుంచి, కేఎంబీ రేటు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకివచ్చాయి. ఈబీఎల్ఆర్ రేట్లు యథాతథం ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఈఎంఐలు స్వల్పంగా పెరగనున్నప్పటికీ .. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ ఆధారిత రుణాల నెలసరి వాయిదాలు యథాతథంగానే కొనసాగనున్నాయి. ఎస్బీఐకి సంబంధించి ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఈబీఎల్ఆర్) ఏప్రిల్ 1 నుంచి 6.65 శాతంగాను, రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతం స్థాయిలో ఉన్నాయి. హౌసింగ్, ఆటో లోన్స్ సహా రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్పై కొంత క్రెడిట్ రిస్క్ ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నాయి. ద్రవ్య పరపతి విధానంలో మార్పుల ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అయ్యేలా చూసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని పాటించాలంటూ బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దీని ప్రకారం 2019 అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు.. రుణ మంజూరీలో ఈబీఎల్ఆర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..! -
బీవోబీ కనీస రుణ రేటు పెంపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తన కనీస రుణ రేటు ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్)ను అన్ని కాలపరిమితులకు సంబంధించి స్వల్పంగా 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. పెంచిన రేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఓవర్నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్లు 0.05 శాతం పెరిగి వరుసగా 6.50 శాతం, 6.95 శాతం, 7.10 శాతం, 7.20 శాతం వరకూ పెరిగాయి. వ్యక్తిగత, ఆటో, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ వడ్డీరేటు 7.35 శాతానికి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)లో ఎటువంటి మార్పూ చేయకపోయినప్పటికీ, వ్యవస్థలో ఉన్న దాదాపు రూ.8.5 లక్షల కోట్ల అదనపు ద్రవ్యాన్ని కొన్ని సంవత్సరాల్లో క్రమంగా వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్పై ఉండదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్ట్ విశ్లేషించింది. చమురు ధరల భారీ పెరుగుదలే భారత్ ఎకానమీకి అతిపెద్ద సవాలని శుక్రవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... కీలక అంశాలు - బేరల్కు 75 డాలర్లు ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన 2022–23 వార్షిక బడ్జెట్ రూపొందింది. అయితే సరఫరాలు కొరత, యుద్ధం వంటి పరిణామాలతో క్రూడ్ బేరల్కు 100 డాలర్లు దాటింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, కరెన్సీ మార్పిడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అంశం. - కమోడిటీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత వంటి అంశాలు ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన సవాళ్లు. దీర్ఘకాలం ఇదే ధోరణి కొనసాగితే పరిస్థితి వృద్ధి మందగమనానికి దారితీసే వీలుంది - ఇరాన్ తరహాలో పాశ్చాత్య చెల్లింపులు, ఫాస్ట్–మెసేజింగ్ వ్యవస్థల నుండి రష్యాను మినహాయించే స్థాయికి శత్రుత్వాలు – ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాల అంతరాయం కారణంగా వృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడవచ్చు. రష్యా తన గ్యాస్లో 40 శాతం, బొగ్గుతో సహా సగం ఘన ఇంధనం, చమురులో నాలుగింట ఒక వంతు ఐరోపాకు సరఫరా చేస్తుంది. ఇతర తీవ్ర ఆంక్షల సంగతి ఎలాఉన్నా, ఇప్పటివరకు గ్లోబల్ పేమెంట్ వ్యవస్థ నుండి రష్యాను అమెరికా నిషేధించకపోవడం గమనార్హం. - యుద్ధ పరిస్థితికి ముందే 2022–23 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం, ఫిబ్రవరి తొలి వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు జరిగాయి. దీనితో ఆయా నిర్ణయాలు, అంశాలు యుద్ధ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చు. ఈ తరహా సవాళ్లు భారత్ ఎకానమీలో తక్షణ అనిశ్చితికి దారితీయవచ్చు. - ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం ఎకానమీపై ఏ స్థాయిలో ఉంటోందన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలించాల్సిన అవసరం ఉంది. ద్రవ్యలోటు తగ్గింపు, స్థిరీకరణ బాటలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రుణ సమీకరణ పరిమాణం భారీగానే ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో సబ్బిడీల పెంపు, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాల కోతకు అవకాశాలు చాలా పరిమితమే. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకన్నా (రూ.9,67,708 కోట్లు) ఇది దాదాపు రూ.2 లక్షల కోట్లు అధికం. ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం అంతంతే... భారత్కు రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో, రష్యాకు భారతదేశం ఎగుమతులు కేవలం 2.7 బిలియన్ డాలర్లు. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో ఈ వాటా 0.9 శాతం. రష్యాకు ప్రధాన ఎగుమతుల్లో ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ విభాగాలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో రష్యా నుండి భారతదేశం దిగుమతులు 5.5 బిలియన్ డాలర్లు. మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 1.4 శాతం. రష్యా నుండి భారతదేశం దిగుమతుల్లో సగభాగం పెట్రోలియం ఉత్పత్తులే. ఇతర మార్కెట్లతో ఈ వాటాను సులభంగా భర్తీ చేయడానికి వీలుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై యుద్ధం ప్రభావం ఎటువంటి తీవ్ర ప్రభావం చూపదు. చమురు దిగుమతుల తీరిది... బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, భారతదేశ తన మొత్తం చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు దిగుమతులకు సంబంధించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం చమురు దిగుమతుల విలువ 82.7 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021–జనవరి 2022 వరకూ) చమురు దిగుమతులు 125.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశంలో ఎకానమీ రికవరీ, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక సంవత్సరం ఇంకా దాదాపు రెండు నెలలు ఉండగానే దిగుమతులు విలువ భారీగా నమోదయ్యింది. చమురు ధరలు దాదాపు ఎనిమిది సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ దిగుమతులు విలువ తగ్గే పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల విలువ 155.5 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. 2022–23లో ఎకానమీ రికవరీ వేగవంతం వల్ల చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 2022 ఏప్రితో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో చమురు డిమాండ్ ఐదు శాతం పెరుగుతుందన్నది అంచనా. మిగిలిన అంశాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని భావించిన పక్షంలో ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 165 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. చమురు ధరలు పెరిగే కొలదీ భారత్ దిగుమతుల భారం మరింత తీవ్రం అవుతుంది. శాశ్వత ప్రాతిపదికన చమురు ధరలలో ప్రతి 10 శాతం పెరుగుదలకు చమురు దిగుమతుల భారం 15 బిలియన్ డాలర్లు లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 0.4 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నది అంచనా. ఇది దేశంలోకి వచ్చీపోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసాలను ప్రతిబింబించే కరెంట్ అకౌంట్పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) సమస్యకు ఈ పరిణామాలు దారితీయవచ్చు. చమురు అధిక ధరల వల్ల రూపాయి కూడా బలహీనపడే వీలుంది. ఇది వాణిజ్యలోటును మరింత పెంచే అంశం. ఆయా అంశాలు విదేశీ మారకానికి సంబంధించి దేశానికి ప్రతికూలంగా మారతాయి. కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసినప్పటికీ, చమురు ధరల తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం సవాళ్లు టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఉత్పత్తుల బాస్కెట్లో ముడి చమురు సంబంధిత ఉత్పత్తుల వెయిటేజ్ 7.3 శాతంగా ఉంది. అందువల్ల చమురు ధరలలో 10 శాతం పెరుగుదల ప్రత్యక్ష ప్రభావం డబ్ల్యూపీఐపై 0.7 శాతంగా అంచనా ఉంటుందని అంచనా. పరోక్ష ప్రభావాన్ని కూడా జతచేస్తే, మొత్తం ప్రభావం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంలో దాదాపు 1 శాతంగా ఉండవచ్చు. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై చమురు ధరల పెరుగుదల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటుంది. చమురు ధరలలో 10 శాతం పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 0.15 శాతం పెరిగే వీలుంది. సరఫరా చైన్కు సంబంధించి పరోక్ష ప్రభావం, ఇతర ధరల పెరుగుదల కారణంగా 0.25–0.35 శాతం మేర వస్తువులు, సేవల ధరల పెరుగుదల ఉండవచ్చు. ద్వైపాక్షిక చెల్లింపుల్లో సమస్యలు ఉండవు-పారిశ్రామిక వర్గాల అంచనా రష్యాపై ఇతర పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా ఆ దేశంతో ద్వైపాక్షిక చెల్లింపులపై ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మారక రేట్లలో హెచ్చుతగ్గులు తప్ప పెద్దగా మార్పులు ఉండబోవని పేర్కొన్నాయి. సాధారణంగా ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులు భారత కరెన్సీ అయిన రూపాయల్లో జరుగుతుంటాయి. కాబట్టి పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం చెల్లింపుల విషయంలో ప్రభావం చూపకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతంలో ఇరాన్పై ఆంక్షలు అమలైనప్పుడు కూడా ఆ దేశంతో లావాదేవీల కోసం భారత్ ఇలాంటి వ్యూహాన్నే అనుసరించింది. దీని ప్రకారం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే భారత వ్యాపార వర్గాలు .. రూపాయి మారకంలో యూకో బ్యాంకులోని ఇరానియన్ బ్యాంకుల ఖాతాలో చెల్లింపులను డిపాజిట్ చేసేవి. ఇరాన్కు ఎగుమతి చేసే భారతీయ ఎగుమతిదారులకు ఈ ఖాతా నుంచే రూపాయి మారకంలో చెల్లింపులు జరిగేవి. ఈ లావాదేవీలన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు సెటిల్ చేసేవారు. భారత్కు రక్షణ రంగ ఉత్పత్తులను రష్యా భారీగా సరఫరా చేస్తోంది. ఇంధనాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు మొదలైనవి ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు తదితర ఉత్పత్తులు రష్యాకు ఎగుమతి అవుతున్నాయి. సీఏఐటీ ఆందోళన రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంపై ఎక్కువగా ఉంటుందని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నుంచి దేశీ వాణిజ్యం కోలుకుంటుండగా, ఈ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. చమురు ధరలు పెరగడం అత్యంత కీలకమైన అంశమని, ధరల పెరుగుదలకు ఇది దారితీస్తుందని వివరించింది. తయారీ, వస్తు రవాణా వ్యయాలు పెరిగి, ఉత్పత్తుల ధరలు మరింత భారం అవుతాయని వివరించింది. చదవండి: Russia Ukraine War: సూపర్గా మారితే తప్ప చైనా ముప్పుని ఎదుర్కోలేం? -
రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్, తక్కువ ధరకే ట్రైన్ టికెట్లు!! ఎలా అంటే?
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త. కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్ సహాయంతో తక్కువ ధర టిక్కెట్లను అందిస్తున్నట్లు తెలిపింది. తరచూ దూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ ధరకే టికెట్లను అందించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) సంయుక్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చాయి. ఐఆర్సీటీసీ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి ఏదైనా ఏసీ క్లాస్ రైల్వే టిక్కెట్ను బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ట్రైన్ టికెట్లను పొందవచ్చు. అంతేకాదు ఈ కార్డ్ తో కిరాణా స్టోర్ నుంచి పెట్రోల్ బంకులతో పాటు ఇతర షాపింగ్ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. జేసీబీ నెట్వర్క్ సాయంతో అంతర్జాతీయ వ్యాపార కార్యాలపాలు నిర్వహించే వారు ఏటీఎం ట్రాన్సాక్షన్లు నిర్వహించేందుకు ఈ కార్డ్ను ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజని హసిజాతో మాట్లాడుతూ..ఐఆర్సీటీసీ బాబ్ రూపే కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్కార్డ్ హోల్డర్లు 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ,సీసీ,ఎగ్జిక్యూటివ్పై గరిష్టంగా 40 రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన క్లాస్ బుకింగ్లు చేసే కార్డ్ కస్టమర్లు ట్రైన్ టిక్కెట్ బుకింగ్లపై ఒక శాతం డిస్కౌంట్ను అందిస్తుంది. కార్డ్ జారీ చేసిన 45 రోజులలోపు రూ.1000లేదా అంతకంటే ఎక్కువ విలువైన బోనస్ రివార్డ్ పాయింట్లు పొందవచ్చని రజనీ తెలిపారు. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కిరాణా, డిపార్ట్మెంటల్ స్టోర్లపై నాలుగు రివార్డ్ పాయింట్లు, ఇతర వినియోగంపై రెండు రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. రైల్వే లాంజ్లలో కార్డు హోల్డర్లు సంవత్సరానికి 4 కాంప్లిమెంటరీ విజిట్ చేయోచ్చు. అంతేకాదు ఈ కార్డ్ సాయంతో దేశంలో అన్నీ పెట్రోల్ బంకుల్లో ఒక శాతం ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు అందిస్తుంది. కార్డ్ హోల్డర్లు ఐఆర్సీటీసీ లాగిన్ ఐడీతో లింక్ చేసిన తర్వాత, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లో రివార్డ్ పాయింట్లు రీడీమ్ చేసుకోవచ్చు. చదవండి: రైల్వే ప్రయాణికులకు తీపికబురు.. తత్కాల్ టికెట్ బుకింగ్ కష్టాలకు చెక్..! -
బీవోబీ లాభం రెట్టింపు
ముంబై: పీఎస్యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ నికర లాభం రెట్టింపై రూ. 2,197 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ3లో రూ. 1,061 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు వడ్డీ ఆదాయం పెరగడం, ప్రొవిజన్లు తగ్గడం దోహదపడింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 14 శాతం ఎగసి రూ. 8,552 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,557 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.77 శాతం నుంచి 3.13 శాతానికి బలపడ్డాయి. ఎన్పీఏలకు చెక్ ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.48 శాతం నుంచి 7.25 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్పీఏలు సైతం 2.39 శాతం నుంచి 2.25 శాతానికి వెనకడుగు వేశాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,830 కోట్లుకాగా.. రికవరీలు రూ. 20,32 కోట్లు, అప్గ్రెడేషన్లు రూ. 1,272 కోట్లకు చేరాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,450 కోట్ల నుంచి రూ. 2,506 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.47 శాతంగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు, ఫీజు ఆదాయంలో నమోదైన వృద్ధిని ఇకపైనా కొనసాగించే వీలున్నట్లు బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా పేర్కొన్నారు. -
ఈ రూల్ ఫాలో కాకుంటే..! మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం..!
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి చెక్కు చెల్లింపుల వ్యవస్థలో కొత్త మార్పులు రానున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల ముందస్తు సమాచారం అందించాలని బ్యాంకు ఖాతాదారులను అభ్యర్థించింది. "బీఓబీ కస్టమర్లు లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురుంచి ముందస్తు సమాచారం ముందస్తు సమాచారం అందించాలి. తద్వారా సీటిఎస్ క్లియరింగ్ సమయంలో బ్యాంక్ బేస్ బ్రాంచ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ ఫోన్ కాల్ లేకుండానే హై వాల్యూ చాక్లను ప్రాసెస్ చేయనున్నట్లు" బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఓబీ ఈ కొత్త రూల్స్ అమలులోకి తీసుకొని వచ్చింది. చెక్కు మోసాలను అరికట్టడం కోసం జనవరి 1, 2021 నుంచి కొత్త వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ మార్గదర్శకాలను జారీ చేసింది. "చెక్కు చెల్లింపులలో కస్టమర్ భద్రతను మరింత పెంచడానికి, చెక్కులను ట్యాంపరింగ్ చేయడం వల్ల జరిగే మోసలను తగ్గించడానికి, రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన అన్ని చెక్కులకు పాజిటివ్ పే యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు" అని ఆర్బీఐ పేర్కొంది. పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి? పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం.. ఖాతాదారుడు ఎవరైనా లబ్ధిదారుడికి చెక్కుజారీ చేసిన తర్వాత ఆ చెక్కు వివరాలను తమ బ్యాంకుతో పంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుతో పంచుకోవలసిన వివరాలలో చెక్కు నెంబరు, చెక్కు తేదీ, పేయీ పేరు, ఖాతా నెంబరు, మొత్తం మొదలైనవి ఉంటాయి. ఖాతాదారులు లబ్ధిదారుడికి చెక్కు ఇచ్చే ముందు ఆ చెక్ ముందు, వెనుక వైపు ఫోటోలు తీసి బ్యాంకుకు పంపాల్సి ఉంటుంది. లబ్ధిదారునికి చెల్లింపు చేసే ముందు, ఖాతాదారుడు ఇచ్చిన చెక్కుపై అన్ని వివరాలను బ్యాంకు క్రాస్ చెక్ చేస్తుంది. ఒకవేళ వివరాలు జత అయితే, అప్పుడు చెక్కు క్లియర్ చేస్తుంది. సీటీఎస్ ద్వారా ఏదైనా అవకతవకలు గుర్తిస్తే బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. (చదవండి: మరో సూపర్ కంప్యూటర్ను అభివృద్ది చేసిన సీ-డీఏసీ) -
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!
అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచనుంది. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. ► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్స్టాల్మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి. ► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి. (చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్..!) -
AP: ఇక రోడ్ల పనులు చకచకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నుంచి రూ.2 వేల కోట్ల రుణ సేకరణకు రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ (ఆర్డీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వగా.. ఈ మేరకు ఆర్డీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధులు రుణ ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశారు. ఈ నిధులతో ఆర్డీసీ రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 8,268 కి.మీ. మేర 1,147 రోడ్ల పునరుద్ధరణ కోసం ఆర్డీసీ టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది. మొదటి దశలో రూ.604 కోట్లతో 328 పనుల కోసం టెండర్లు ఖరారు చేసింది. రెండో దశలో రూ.1,601 కోట్లతో 819 రోడ్ల పనుల కోసం టెండర్లు ఇటీవల పిలిచింది. తాజాగా రోడ్ల పునరుద్ధరణ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాతో రూ.2వేల కోట్లకు రుణ ఒప్పందం కూడా కుదరడంతో కాంట్రాక్టర్లలో కొత్త జోష్ వచ్చింది. ఎందుకంటే ఆర్డీసీ ఆ రుణ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయనుంది. రోడ్ల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఆ ఖాతా నుంచి నేరుగా బిల్లు చెల్లింపులు జరుగుతాయి. దీనివల్ల మొదటి దశ టెండర్ల పనులు వేగవంతం కానుండటంతోపాటు.. రెండో దశ టెండర్లలో పాల్గొనేందుకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు సంసిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన మేరకు డిసెంబర్ మొదటి వారంలో పనులు చేపట్టి 2022 మే నాటికి పూర్తి చేసేలా ఆర్ అండ్ బీ సమాయత్తమవుతోంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం 24% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,088 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 1,679 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 24 శాతం అధికం. రైటాఫ్ చేసిన ఖాతాల నుంచి అధిక మొత్తం రికవర్ కావడం, మార్జిన్లు స్థిర స్థాయిలో కొనసాగడం తదితర అంశాలు లాభాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు బ్యాంక్ ఎండీ సంజీవ్ చడ్ఢా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 7–10 శాతం స్థాయిలో ఉండవచ్చని, కార్పొరేట్ రుణాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 20,729 కోట్ల నుంచి రూ. 20,271 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం 6.33 శాతం క్షీణించి రూ. 17,820 కోట్ల నుంచి రూ. 16,692 కోట్లకు తగ్గింది. వడ్డీయేతర ఆదాయం 23 శాతం పెరిగి రూ. 2,910 కోట్ల నుంచి రూ. 3,579 కోట్లకు చేరింది. మరోవైపు, ఇచ్చిన మొత్తం రుణాల్లో .. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 9.14 శాతం నుంచి 8.11 శాతానికి దిగి వచ్చింది. కానీ నికర ఎన్పీఏలు 2.51 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 2.83 శాతానికి చేరాయి. మొండి బాకీలు తదితర అంశాలకు కేటాయింపులు రూ. 2,811 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. బీఎస్ఈలో బుధవారం బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం క్షీణించి రూ. 100.65 వద్ద క్లోజయ్యింది. -
వ్యవసాయ రుణాల్లో 25 శాతం వృద్ధి లక్ష్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల విభాగంలో 25 శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) హైదరాబాద్ జోన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వీటి పరిమాణం రూ. 9,100 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 600 కోట్ల పైచిలుకు రుణాలు అందించడంతో.. ఇది సుమారు రూ. 9,700 కోట్లకు చేరింది. బీవోబీ నిర్వహిస్తున్న రైతు పక్షోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) మన్మోహన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీవోబీ కార్యకలాపాలు హైదరాబాద్ జోన్ పరిధిలోకి వస్తాయి. కరోనా వైరస్ విజృంభణ అనంతరం ఎకానమీ నెమ్మదిగా కుదుటపడుతున్న నేపథ్యంలో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని గుప్తా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు 397 బ్రాంచీలు ఉన్నాయని, తమ శాఖలు లేని చోట్ల కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 4వ విడత ‘‘బరోడా రైతు పక్షోత్సవాలు’’ నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 31 దాకా కొనసాగుతాయని వివరించారు. ‘మన చర్యలే మన భవిష్యత్’ నినాదంతో చేపట్టిన ఈ పక్షోత్సవాల్లో భాగంగా రైతుల కోసం క్రెడిట్ క్యాంపులు, చౌపల్స్, పశువులకు ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సాక్షరత క్యాంపులు మొదలైనవి నిర్వహిస్తున్నామని గుప్తా చెప్పారు. అలాగే వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా తమ 18 జోనల్ కార్యాలయల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ (సీఏఎంపీ) పేరిట ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో ఒకటి హైదరాబాద్ జోన్లో కూడా ఉందని పేర్కొన్నారు. -
బరోడా కిసాన్ పక్వాడా.. రైతు రుణాలకే అధిక ప్రాధాన్యం
హైదరాబాద్: ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని కిసాన్ దివాస్ను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది. ఫుడ్ అండ్ ఆగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఆలోచనలకు అనుగుణంగా మన చర్యలే మన భవిష్యత్ థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ బరోడా కిసాన్ పక్వాడాలో భాగం కావాలంటూ రైతులకు పిలుపు నిచ్చింది. భారతదేశవ్యాప్తంగా పక్షం రోజులపాటు సాగే ఈ కార్యక్రమం 2021 అక్టోబర్ 31న ముగుస్తుంది. బరోడా కిసాన్ దివాస్ సందర్భంగా 18 జోనల్ కార్యాలయాల్లో సెంటర్ ఫర్ ఆగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ (CAMP) పేరుతో కొత్త కేంద్రీకృత వ్యవసాయ రుణాల ప్రాసెసింగ్ కేంద్రాలను బరోడా బ్యాంకు ప్రారంభించింది. సంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెటింగ్ వంటి వ్యవహారాలను క్యాంప్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో గోల్డ్ లోన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫైనాన్స్కు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. -
గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ మార్కెట్లో భారీ వాటా దక్కించుకోవడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు తగ్గింపు సహా రుణ గ్రహీతలకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుంది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ► ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. వీరి మధ్య రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్బీఐ తొలగించింది. ► రుణ బ్యాలన్స్ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది. ► ప్రాసెసింగ్ ఫీజునూ బ్యాంకింగ్ దిగ్గజం రద్దు చేసింది. రిటైల్ రుణాలపై బీఓబీ ఆఫర్లు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్ను పురస్కరించుకుని రిటైల్ రుణాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్ రుణ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గాయి. కారు రుణ రేటు 7 శాతం వద్ద ప్రారంభమైతే, గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుంది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ తగ్గించింది. బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా వెబ్సైట్పై కూడా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫెస్టివల్ బొనాంజా ఆఫర్లు..!
త్వరలో రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు రిటైల్ లోన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించనుంది. హోమ్లోన్స్, కార్లోన్స్కు వర్తించే వడ్డీరేట్లపై సుమారు 0.25 శాతం మాఫీని ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా హోమ్లోన్స్పై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును కూడా అందిస్తోంది. గృహ రుణాలు 6.75 శాతం నుంచి , కారు రుణాలు 7.00శాతం నుంచి వడ్డీరేట్లు ప్రారంభమవుతాయి. (చదవండి: Gpay: గూగుల్ పే భారీ అవకతవకలు!) కస్టమర్లు బాబ్ వరల్డ్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎమ్ హెచ్.టీ. సోలంకీ మాట్లాడుతూ.. రానున్న పండుగ సీజన్లో రిటైల్ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడంతో కస్టమర్లకు తమ బ్యాంకు తరపునుంచి పండుగ ఉత్సాహాన్ని అందించాలని భావిస్తున్నామన్నారు. బ్యాంక్ కస్టమర్లకు కొత్త రుణాలు అందించడం కోసం గృహ రుణాలు, కారు రుణాలపై ఆకర్షణీయమైన ప్రతిపాదనతో బీవోబీ ముందుకు వచ్చిందన్నారు. తక్కువ వడ్డీరేట్లకు కస్టమర్లు రుణాలను పొందవచ్చునని పేర్కొన్నారు. ఆయా రుణాలకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి కూడా మినహయింపు వస్తుందని తెలిపారు. చదవండి: SBI Home Loan: పండుగ సీజన్ రాకముందే ఎస్బీఐ ఆఫర్ల వర్షం -
కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో విచారణ వేగవంతం
-
కీలక దశకు చేరిన కిలికిరి బ్యాంక్ విచారణ
-
బీవోబీలో అక్రమాలపై ముమ్మర విచారణ
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో వెలుగుచూసిన అక్రమాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం విచారణకు బీవోబీ రీజినల్ మేనేజర్ ఎం.వి.శేషగిరి, ఉద్యోగులు కె.జయకృష్ణ, ఈశ్వరన్, అబీదా ముబీన్, మహమ్మద్ షరీఫ్, రామచంద్రుడు, సి.ఈలు, తేజసాయి, సి.రాము, ఇన్చార్జ్ మేనేజరు రామసుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. బదిలీపై వెళ్లిన మేనేజర్ మద్దిలేటి వెంకట్ గైర్హాజయ్యారు. ఉదయం నుంచి వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి ఉద్యోగులను విచారించారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి నకిలీ ఖాతాలు సృష్టించి రూ.కోటి వరకు నగదు తీసుకుని మెసెంజర్తోపాటు కొందరు ఉద్యోగులు పంచుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. కాగా, అక్రమ లావాదేవీలతో తమకు సంబంధం లేదని, తమ యూజర్నేమ్, పాస్వర్డ్లతో మెసెంజర్ అలీఖాన్ ఇదంతా చేశారని విచారణకు హాజరైన ఉద్యోగులు తెలిపారు. మెసెంజర్ అలీఖాన్ ఉద్యోగులందరికీ యూజర్నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేయించి ఇచ్చేలా మేనేజర్లే సూచించారని చెప్పారు. దీంతో అందరి యూజర్నేమ్, పాస్వర్డ్లు ఉపయోగించి అక్రమ నగదు లావాదేవీలు చేశారని పోలీసులకు వివరించారు. -
బ్యాంకులో రూ. 2.23 కోట్ల బంగారం చోరీ
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో రూ.2.23 కోట్ల విలువైన 5 కిలోలకుపైగా బంగారం మాయమైంది. ఈ బంగారాన్ని కాజేసినవారు ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టుపెట్టి రూ.60 లక్షలు తీసుకున్నారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి ప్యార్లీ సుమంత్రాజ్ పరారీలో ఉన్నాడు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో తాము కుదువపెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు సోమవారం బ్యాంకు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు తాత్కాలిక ఉద్యోగి సుమంత్రాజ్ సూత్రధారిగా ఈ చోరీ జరిగినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు సోమవారం స్థానిక టౌన్ పోలీసు స్టేషన్లో విలేకరులతో చెప్పారు. తమ బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టుకున్న రూ.2.23 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ విద్యాసాగర్ ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారని తెలిపారు. పరారీలో ఉన్న సుమంత్రాజ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చోరీచేసిన 5 కిలోల 8 గ్రాముల బంగారంలో 80 శాతాన్ని ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.60 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. తాకట్టు పెట్టేందుకు సహకరించారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐలు పి.కృష్ణయ్య, కడప శ్రీనివాసరెడ్డి, ఎస్.ఐ.లు మహ్మద్రఫీ, వెంకటప్రసాద్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ బయటపడింది ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చోరీ గురించి నిందితుడే బయటపెట్టాడు. సాధారణంగా బ్యాంకులో బంగారు ఆభరణాలపై ఏడాదిలో రెండు, మూడుసార్లు శాఖాపరమైన ఆడిట్ నిర్వహిస్తారు. బాపట్ల బీవోబీలో ఆభరణాలను తనిఖీ చేసేందుకు అధికారులు వస్తున్నట్లు ఈనెల ఒకటో తేదీన ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమంత్రాజ్ ఒకటి, రెండో తేదీల్లో విధులకు హాజరుకాలేదు. తన విషయం బయటపడి ఉంటుందని భావించిన అతడు మూడోతేదీన బ్యాంకు ఉద్యోగి ఒకరికి.. తాను తన తల్లికి ఆపరేషన్ చేయించేందుకు బంగారు ఆభరణాలు తీసుకున్నానని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఆ ఆభరణాలను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టేందుకు సహకరించిన ఇద్దరి పేర్లను మరో మెసేజ్లో తెలిపినట్లు సమాచారం. దీంతో బ్యాంకు అధికారులు రీజనల్ మేనేజర్కు సమాచారం ఇచ్చి శాఖాపరమైన విచారణ చేపట్టారు. మొత్తం రూ.2.23 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నలుగురు కలికిరి బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్
-
నలుగురు కలికిరి బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో పలువురు సిబ్బంది కుమ్మక్కై రూ.2 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం కలికిరి బ్రాంచికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఈ అక్రమాల నేపథ్యంలో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం కలికిరిలో విధులు నిర్వర్తిస్తున్న జాయింట్ మేనేజరు రామచంద్రడు, క్లర్క్ ఈలు, ఇటీవలే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి బ్రాంచ్కు బదిలీపై వెళ్లిన జాయింట్ మేనేజరు కరణం జయకృష్ణ, గుంతకల్లు బ్రాంచ్కు బదిలీ అయిన ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వరన్లను బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బ్యాంకు మెసెంజర్ అలీ నకిలీ రసీదులు ఇచ్చి అవకతవకలకు పాల్పడినట్లు ఒక పొదుపు సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాల డొంక కదిలింది. బ్యాంకు అంతర్గత దర్యాప్తులో ఇప్పుడు సస్పెండైన నలుగురు మెసెంజర్ అలీతో కుమ్మక్కయ్యారని ప్రాథమికంగా నిర్ధారించారు. -
కలికిరి బ్యాంకు ఆఫ్ బరోడా లో గోల్ మాల్
-
లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,209 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 864 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం బలపడటం, మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 2.59 శాతం నుంచి 3.12 శాతానికి పుంజుకోవడంతో గ్లోబల్ స్థాయిలో 2.52 శాతం నుంచి 3.04 శాతానికి ఎగశాయి. గతేడాది 2.7 శాతంగా నమోదైంది. -
బీవోబీ, యూ గ్రో నుంచి ప్రథమ్ రుణాలు
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) తాజాగా ఫిన్టెక్ కంపెనీ యూ గ్రో క్యాపిటల్తో చేతులు కలిపింది. తద్వారా ప్రథమ్ పేరుతో రుణాలను అందించనుంది. యూ గ్రో క్యాపిటల్ సహకారంతో ఎంఎస్ఎంఈ రంగంలోని సంస్థలకు రూ. 1,000 కోట్లను రుణాలుగా విడుదల చేయనున్నట్లు బీవోబీ తెలియజేసింది. బీవోబీ 114వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రథమ్ పేరిట రుణాల జారీని చేపట్టినట్లు చిన్న సంస్థలకు రుణాలందించే టెక్ ఆధారిత ప్లాట్ఫామ్.. యూ గ్రో క్యాపిటల్ పేర్కొంది. సహరుణ విడుదల కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు అవసరాలకు అనుగుణంగా(కస్టమైజ్డ్) రుణాలను పోటీస్థాయి వడ్డీ రేట్లతో అందించనున్నట్లు తెలియజేసింది. రూ. 50 లక్షల నుంచి ప్రారంభించి రూ. 2.5 కోట్ల వరకూ రుణాలను మంజూరు చేయనున్నట్లు వివరించింది. 8 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గరిష్టంగా 120 నెలల కాలావధితో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. సహరుణ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కె. పేర్కొన్నారు. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. -
Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీకి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీకి సంబంధించి భారీ ప్రణాళికలతో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ 100 మిలియన్ డాలర్ల (రూ.744 కోట్లు) దీర్ఘకాలిక రుణాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఓలా రూ.2,400 కోట్లతో మొదటి విడత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించింది. తాజాగా సమీకరించనున్న రుణాన్ని ఇందుకోసం వినియోగించనున్నట్టు తెలిపింది. తమిళనాడులో 500 ఎకరాల్లో ‘ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పేరుతో ఓలా నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ కేంద్రం ఏటా కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యంతో ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఓలా ఎలక్ట్రిక్ పరిగణిస్తోంది. ‘ఓలా, బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య కుదిరిన దీర్ఘకాల రుణ ఒప్పందం.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ ప్లాంట్ను రికార్డు సమయంలోనే ఏర్పాటు చేయాలన్న మా ప్రణాళికల పట్ల రుణ దాతల్లో నమ్మకానికి నిదర్శనం. ప్రపంచానికి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలన్న ప్రణాళికకు కట్టుబడ్డాం’ అని ఓలా చైర్మన్, గ్రూపు సీఈవో భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. చదవండి : వెయ్యి టన్నులా, బంగారం కొనుగోళ్లపై సెంట్రల్ బ్యాంక్ల ఫోకస్ -
హైదరాబాద్ స్టార్టప్లకు శుభవార్త
హైదరాబాద్: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), ఏఐసీ ఎస్టీపీఐనెక్ట్స్తో బ్యాంకు ఆఫ్ బరోడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా స్టార్టప్లకు సహకారం అందించనున్నట్టు బ్యాంకు ప్రకటించింది. స్టార్టప్లకు కేంద్రాలైన గురుగ్రామ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్, అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్, చండీగఢ్, లక్నో, కోల్కతా, ఇండోర్, కోచి ఇలా 15 ప్రాంతాల్లో స్టార్టప్ శాఖలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. స్టార్టప్ల కోసమే ఆకర్షణీయమైన రేట్లతో రుణ పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. -
సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు
లక్నో: చిన్నపాటి గొడవలకే తుపాకీతో కాల్చడం ఈ మధ్యన ఫ్యాషన్గా మారిపోయింది. తాజాగా బ్యాంకుకు వచ్చిన కస్టమర్ మాస్క్ ధరించలేదని తుపాకీతో కాల్చిపారేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కాగా తుపాకీ తూటాలకు ఆ వ్యక్తికి తీవ్ర రక్తస్రావం కాగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తుపాకీతో కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డ్ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి శుక్రవారం పని నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బ్యాంకకు ఎంటరవుతున్న సమయంలో రాజేశ్ ఫేస్మాస్క్ పెట్టుకోకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ అడ్డగించాడు. మాస్క్ పెట్టుకుంటేనే లోనికి అనుమతి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో రాజేశ్, సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన సెక్యూరిటీ గార్డ్ తనవద్ద ఉన్న తుపాకీతో రాజేశ్ తొడపై కాల్చాడు. తీవ్ర రక్తస్రావంతో రాజేశ్ అలాగే కిందపడిపోగా.. పక్కనే ఉన్న అతని భార్య..'' నా భర్తను ఎందుకు కాల్చావు'' అంటూ పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న మిగతావారు అక్కడికి వచ్చి ఇంత చిన్న విషయానికి తుపాకీతో కాలుస్తావా.. నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని గార్డ్ను ఆక్షేపించారు. 27 సెకెన్ల నడివి ఉన్న ఫుటేజీ సీసీటీవీలో రికార్డు అయింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గార్డ్ను అదుపులోకి తీసుకున్నారు. '' రాజేశ్ మాస్క్ ధరించలేదని.. ఆ విషయం చెప్పానని.. కానీ అతను నోటి దురుసుతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించాడని.. నన్ను బూతులు తిట్టాడు.. దీంతో తుపాకీ చూపించి బెదిరిద్దాం అనుకున్నా.. కానీ తుపాకీ మిస్ఫైర్ అయి అతనికి తగిలింది. ఇది అనుకోకుండా జరిగింది''. అని సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు వివరించాడు. చదవండి: మహిళ విషయంలో గొడవ.. పక్కా ప్లాన్తో In #Bareilly a railway employee was allegedly shot by bank guard at Junction road branch of Bank of Baroda. Reports claimed that victim was shot following an argument over not wearing mask. Victim taken to district hospital. pic.twitter.com/SzuHRpGZv5 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 25, 2021 -
Reliance : అమ్మకానికి అనిల్ అంబానీ ఆస్తులు
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కొనుగోలుకి ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గరిష్ట బిడ్డర్గా నిలిచింది. రూ. 2,900 కోట్ల ఆఫర్తో బిడ్ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభిచనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు వివరించాయి. బిడ్డింగ్కు వారాంతాన గడువు ముగిసింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్కు రుణాలిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రూ. 2,587 కోట్లు అందుకునే వీలున్నట్లు పేర్కొన్నాయి. రేసులో ఆథమ్ దేశీ ఎన్బీఎఫ్సీ ఆథమ్ రేసులో తొలి ర్యాంకులో నిలిచినట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆథమ్ నెట్వర్త్ రూ. 1,500 కోట్లుగా నమోదైంది. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా ఆథమ్ వేసిన బిడ్ అత్యధిక నికర ప్రస్తుత విలువ(ఎన్పీవీ)ను కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అత్యధిక శాతం రుణదాతలు ఆథమ్కు ఓటు వేసినట్లు వెల్లడించాయి. ఇతర సంస్థలూ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కొనుగోలుకి ఆథమ్ కాకుండా.. ఏఆర్ఈఎస్ ఎస్ఎస్జీ, అసెట్స్కేర్– రీకన్స్ట్రక్షన్ ఎంటర్ప్రైజ్, ఏఆర్సీఎల్తో కలసి ఎవెన్యూ క్యాపిటల్, క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ బిడ్ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..! -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ) తన ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివిధానాన్ని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఉద్యోగుల నుంచి మరింత ఉత్పాదకతను రాబట్టే యోచనతో ఉంది. కరోనా రాకతో ఉద్యోగుల పని స్వభావం మార్పు చెందిందని.. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే అనుకూలత ఏర్పడినట్టు బీవోబీ 2020-21 సంవత్సరం వార్షిక నివేదికలో పేర్కొంది. ‘‘ఎక్కడి నుంచి అయినా పనిచేయడం అన్నది నూతన సాధారణ విధానం. ఉద్యోగ బాధ్యతలకు, వ్యక్తిగత జీవితానికి సమాన ప్రాధాన్యం దీంతో సాధ్యపడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఉత్పాదకత పెరుగుతుంది. కొన్ని రకాల విధులను మారుమూల ప్రాంతాల నుంచీ లేదా ఎక్కడ నుంచి అయినా పనిచేసే విధంగా నిర్వహణ నమూనాపై దృష్టి పెట్టాము. ఇది ఉద్యోగులకు ఎంతో వెసులుబాటునిస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్ బరోడా తెలిపింది. డిజిటల్ సేవలకు డిమాండ్ సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో చర్యలను అమలు చేసే విషయంలో బ్యాంకింగ్ సేవలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు బీవోబీ చైర్మన్ హస్ముఖ్ అదియా చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిజిటల్ సేవలకు అవసరం ఏర్పడిందని.. కస్టమర్లకు సౌకర్యవంతమైన అనుభవం కోసం బ్యాంకు సేవలను డిజిటల్గా మారుస్తున్నట్టు అదియా వివరించారు. బ్యాంకు శాఖల స్థాయిల్లో అధిక శాతం డిపాజిట్లు పేపర్ రహితంగానే ఉంటున్నట్టు తెలిపారు. మొబై ల్ బ్యాంకింగ్ డిజిటల్ సేవలకు కీలకంగా పేర్కొన్నారు. రుణాల మంజూరును సైతం డిజిటల్గా ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విధానాలతో ఖర్చు లు తగ్గించుకుని, మరింత వృద్ధి చెందడానికి అవకా శం ఉంటుందని తెలిపారు. ఆస్తుల నాణ్యత, డిపాజిట్లు, రుణాల వృద్ధి, లాభదాయకత, నిధుల పరం గా బీవోబీ పటిష్ట స్థితిలో ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన అతిపెద్ద వజ్రం -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు!
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉన్నత చదువులు చదివేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ లోన్స్పై 6.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు అందిస్తోంది. బ్యాంక్బజార్ తెలిపిన సమాచారం ప్రకారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.8 శాతం వడ్డీరేటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతంగా వడ్డీరేటు ఉంది. భారతదేశం, విదేశాలలో ఉన్నత చదువుల కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. విద్యా రుణాలు తీసుకునే వారికి సెక్షన్ 80ఈ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ కోసం, మీ జీవిత భాగస్వామి లేదా పిల్లలకు విద్యా రుణం తీసుకున్నట్లయితే చెల్లించే వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే రెండు బెనిఫిట్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని భావిస్తే.. లేదంటే విదేశాల్లో చదివించాలని భావిస్తే.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. చదవండి: ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో వినియోగదారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం, చెక్ బుక్ వంటి ఇతర పనుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఖాతాదారుల కోసం కొన్ని ప్రత్యేక నంబర్లను జాబితాను విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా లావాదేవీ వివరాలను తెలుసుకోవడంతో సహా బ్యాలెన్స్ను తనిఖీ చేసుకోవచ్చు అని తెలిపింది. అలాగే, టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు అని ట్విటర్ ద్వారా వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన ఈ ముఖ్యమైన సంఖ్యలు 24 * 7 అందుబాటులో ఉంటాయి. బ్యాంకింగ్ సేవలు అవసరమైన సంఖ్యల జాబితా మీ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి- 8468001111కి మిస్డ్ కాల్ ఇవ్వండి చివరి 5 లావాదేవీల సమాచారం కోసం- 8468001122కి మిస్డ్ కాల్ ఇవ్వండి టోల్ ఫ్రీ -18002584455 / 18001024455 వాట్సాప్ బ్యాంకింగ్ సేవల కోసం- 8433888777 To maintain social distancing, you can continue your banking services from your home. #BankofBaroda is here by your side 24x7, with these simple and easy ways. #BankfFromHome #BreakTheChain #StaySafeBankSafe pic.twitter.com/MiXNKaCSc8 — Bank of Baroda (@bankofbaroda) May 10, 2021 బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, బ్యాలెన్స్ తెలుసుకోవడం, చెక్ స్టేటస్, వడ్డీ రేట్లు, మినీ స్టేట్మెంట్లు మొదలైనవి తెలుసుకోవచ్చు. ఇటీవల, బ్యాంక్ 'బరోడా ఎమ్ కనెక్ట్ ప్లస్' యాప్ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఖాతాదారులు 24 * 7 వారి మొబైల్ ఫోన్లలో బ్యాంకింగ్ సంబంధిత సదుపాయాలను వెంట వెంటనే పొందవచ్చు. చదవండి: ఈ మొబైల్ ఫోన్పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
ముంబైలోని ప్రభుత్వరంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ను బలోపేతం చేయడానికి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఈ–రిలేషన్షిప్ మేనేజర్, టెర్షరీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రొడక్ట్ హెడ్–ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్, హెడ్–ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ సేల్స్ మేనేజర్, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్–మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 29వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ► మొత్తం పోస్టుల సంఖ్య: 511 పోస్టుల వివరాలు: ► సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్–407, ఈ–వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్–50, టెర్షరీ హెడ్–44, గ్రూప్ హెడ్–06, ప్రొడక్ట్ హెడ్(ఇన్వెస్ట్మెంట్–రీసెర్చ్)–01, హెడ్(ఆపరేషన్స్ –టెక్నాలజీ)–01, డిజిటల్ సేల్స్ మేనేజర్–01, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్–01. ► సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్: అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 24–35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఈ–వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 23–35ఏళ్ల మధ్య ఉండాలి. ► టెర్షరీ హెడ్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 27–40ఏళ్ల మధ్య ఉండాలి. ► గ్రూప్ హెడ్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 31–45 ఏళ్ల మధ్య ఉండాలి. ► ప్రొడక్ట్ హెడ్(ఇన్వెస్ట్మెంట్–రీసెర్చ్): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 28–45ఏళ్ల మధ్య ఉండాలి. ► హెడ్(ఆపరేషన్స్–టెక్నాలజీ): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. ► డిజిటల్ సేల్స్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26–40 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్/సైన్స్/టెక్నాలజీ వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26–35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్/ఇతర ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021 ► వెబ్సైట్: : www.bankofbaroda.co.in/careers.htm ఏపీ, వాటర్ రిసోర్స్ విభాగంలో ఖాళీలు -
అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించబడుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొమ్మిది యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. "ప్రైవేటీకరణ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని పబ్లిక్ ఎంటర్ప్రైస్ పాలసీ స్పష్టంగా చెబుతోంది. అలాంటప్పుడు అన్ని ప్రభుత్వ బ్యాంకులను విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు. ప్రైవేటీకరించే బ్యాంకుల ప్రతి సిబ్బంది వేతనాలు, పింఛన్లు వంటి ప్రయోజనాలను తాము రక్షిస్తామని" సీతారామన్ అన్నారు. నేడు దేశవ్యాప్తంగా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు సమ్మె వల్ల మూతపడ్డాయి. రూ.1.75 లక్షల కోట్లు సమీకరణ కోసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఈ సమ్మె ప్రారంభమైంది. 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పెట్టుబడులను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. పీఎస్బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు. చదవండి: హోమ్లోన్ తీసుకునేముందు ఇవి గమనించండి! కరోనా కాలంలో ఎగుమతుల జోరు -
సీఎంను కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ
సాక్షి,అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ముంబై) విక్రమాదిత్య సింగ్ కిచి గురువారం కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రగతికి తమవంతు కృషి చేస్తామని విక్రమాదిత్య సింగ్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇంటిం టికీ రేషన్ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించిన 9,260 కమర్షియల్ వాహనాలకు అవసరమైన రుణాలను బ్యాంక్ ఆఫ్ బరోడా అందించినట్లు తెలిపారు. బ్యాంక్ జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా (హైదరాబాద్) మాట్లాడుతూ..సాంకేతికను సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు విభిన్నమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో బ్యాంక్ విజయవాడ రీజనల్ మేనేజర్ ఠాకూర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎం.విద్యాసాగర్, డీజీఎం సీహెచ్ రాజశేఖర్ ఉన్నారు. -
కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి
సాక్షి, అమరావతి: బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించినప్పుడే గత సర్కారు ఆ సంస్థపై వేటు వేసి పోలవరం పనుల నుంచి తొలగిస్తే ఇంత భారీ కుంభకోణానికి అవకాశమే ఉండేది కాదని 14 బ్యాంకుల కన్సార్షియం, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కుంభకోణాన్ని చంద్రబాబు చేత.. చంద్రబాబు కోసం.. చంద్రబాబే పాల్పడిన స్కాంగా అభివర్ణిస్తున్నారు. ఎక్కడా లేని రీతిలో కేబినెట్ తీర్మానం ద్వారా పోలవరం పనుల్లో ట్రాన్స్ట్రాయ్కి సిమెంట్, స్టీలు ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసేలా నాటి సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు. కానీ రాయపాటి వాటిని కొనుగోలు చేయకుండానే నకిలీ బిల్లులతో రూ.1,527.10 కోట్ల బ్యాంకు రుణాన్ని దారి మళ్లించి స్వాహా చేయడాన్ని బట్టి ఈ కుంభకోణంలో బాబే ప్రధాన సూత్రధారి అనేది స్పష్టమవుతోంది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ట్రాన్స్ట్రాయ్ వాటా 13 శాతమే.. పోలవరం హెడ్వర్క్స్ను ట్రాన్స్ట్రాయ్–జేఎస్సీ– ఈసీ–యూఈఎస్ (జేవీ) రూ.4,054 కోట్లకు దక్కించుకుని 2013 మార్చి 2న నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ జేవీలో రష్యా, ఉక్రెయిన్కు చెందిన జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ వాటా 87% కాగా రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ వాటా కేవలం 13 శాతమే. జేఎస్సీ–ఈసీ–యూఈఎస్ సంస్థలో తన సమీప బంధువు చెరుకూరి శ్రీధర్ను డైరెక్టర్గా చేర్చి ఆ సంస్థకు కమీషన్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. చిన్న ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్ట్రాయ్కి 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్ట్రాయ్కి పోలవరం కాంట్రాక్టు దక్కిందని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన రాయపాటి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. దివాలా తీసిన సంస్థకే దన్ను.. పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించిన ట్రాన్స్ట్రాయ్కి కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం బ్యాంకు గ్యారెంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్, రుణం రూపంలో రూ.7,926.01 కోట్లు ఇచ్చేందుకు 2013లో అంగీకారం తెలిపాయి. ఆ మేరకు రుణాలిచ్చాయి. ఇందులో కొంత భాగాన్ని 2014 ఎన్నికల్లో టీడీపీకి ఇం‘ధనం’గా మళ్లించారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న రుణాన్ని ఇతర సంస్థలకు మళ్లించి స్వాహా చేయడంతో 2014 అక్టోబర్ 5న ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని ఎన్పీఏగా బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఆ తర్వాత 13 బ్యాంకులు ట్రాన్స్ట్రాయ్ రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించాయి. చదవండి: (పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక జేవీలోని విదేశీ సంస్థలైన జేఎస్సీ, యూఈఎస్ సంస్థలు పత్తా లేకుండా పోయాయి. కేవలం కాంట్రాక్టు దక్కించుకోవడానికి మాత్రమే విదేశీ సంస్థలను కాగితాలపై చూపిన ట్రాన్స్ట్రాయ్పై వేటు వేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2015 మార్చి 12న తొలి సారిగా సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) విదేశీ సంస్థలు పత్తా లేకపోవడాన్ని ప్రశ్నించింది. దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్కి పోలవరం పనులు చేసే సత్తా లేదని, దాన్ని తప్పించాలని సూచించినా చంద్రబాబు వినలేదు. ట్రాన్స్ట్రాయ్ని ముందు పెట్టి దోపిడీ.. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని గత సర్కారుకు కేంద్రం పలుదఫాలు సూచించింది. అయితే పీపీఏతో ఒప్పందం చేసుకుంటే సత్తాలేని రాయపాటి సంస్థపై వేటు పడటం ఖాయం. ప్రాజెక్టును కేంద్రం చేపడితే కమీషన్లు రావని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ పనులను ఎల్ అండ్ టీ–బావర్(జేవీ), జెట్ గ్రౌటింగ్ పనులను కెల్లర్, మట్టి తవ్వకం పనులను త్రివేణి, కాంక్రీట్ పనులను పూట్జ్మీస్టర్, పెంటా, గేట్ల పనులను బీకెమ్ సంస్థలకు అప్పగించి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. దీన్నేమంటారు బాబూ..? డయాఫ్రమ్ వాల్ పనులు చేస్తున్న సంస్థలకు ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లించేలా 2015 అక్టోబర్ 10న కేబినెట్లో చంద్రబాబు తీర్మానం చేయించారు. ఈ మేరకు ట్రాన్స్ట్రాయ్, సబ్ కాంట్రాక్టర్లు, పోలవరం ఈఎన్సీల పేరు మీద బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్క్రో అకౌంట్ను గత సర్కార్ తెరిపించింది. బిల్లులు చెల్లించేటప్పుడు ఎస్క్రో అకౌంట్లో జమ చేయాలి. పోలవరం ఈఎన్సీ సూచనల ప్రకారం వాటిని ఆయా సంస్థలకు బ్యాంకు విడుదల చేస్తుంది. ట్రాన్స్ట్రాయ్కి బిల్లులు వస్తాయని నాటి సీఎం చంద్రబాబు చెప్పడంతో నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆ సంస్థకు రూ.300 కోట్ల రుణాన్ని ఇచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి బ్యాంకులను రాయపాటి దోచేయడంలో బాబు ప్రధాన పాత్ర పోషించారన్నది స్పష్టమవుతోంది. కేబినెట్ తీర్మానం తుంగలోకి.. ఎస్క్రో అకౌంట్ తెరిచిన కొద్ది రోజులకే దివాలా తీసిన ట్రాన్స్ట్రాయ్ 2018 అక్టోబర్ 10న ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. ట్రాన్స్ట్రాయ్కి ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటాయని, కమీషన్లు రావని పసిగట్టిన గత సర్కారు పెద్దలు నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లింపులు జరపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చారు. ట్రాన్స్ట్రాయ్కి రూ.2,362.22 కోట్లను చెల్లించగా కేవలం రూ.95 కోట్లను మాత్రమే ఎస్క్రో అకౌంట్ ద్వారా చెల్లించారు. రూ.2,267.22 కోట్లను నేరుగా ట్రాన్స్ట్రాయ్కే చెల్లించడం ద్వారా కేబినెట్ తీర్మానాన్ని ఉల్లంఘించారు. ఇందులో సింహభాగం చంద్రబాబు జేబులోకి చేరినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాదా సహకారం? ►నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నేలా బ్యాంకుల నుంచి రూ.7,926.01 కోట్లను రాయపాటి లూటీ చేయడంలో ప్రధాన సూత్రధారి ఎవరు? దివాళా తీసిన ట్రాన్స్ట్రాయ్ని పోలవరం కాంట్రాక్టు నుంచి తొలగించకుండా కొనసాగించడం ద్వారా ఈ లూటీకి చంద్రబాబు సహకరించలేదా? ►బ్యాంక్ ఆఫ్ బరోడా 2014లోనే ట్రాన్స్ట్రాయ్ రుణాన్ని నిరర్ధక ఆస్థి (ఎన్పీఏ)గా ప్రకటించినందున నిబంధనల ప్రకారం ఆ సంస్థకు మళ్లీ రుణం ఇవ్వకూడదు. కానీ ట్రాన్స్ట్రాయ్, జలవనరుల శాఖలతో అదే బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరిపించిన చంద్రబాబు దాన్ని హామీగా చూపి 2017లో కొత్తగా రూ.300 కోట్ల రుణం ఇప్పించడంలో ఆంతర్యం బ్యాంకులను లూటీ చేయడం కాదా? -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.1,679 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2) లో స్టాండెలోన్ ప్రాతిపదికన (ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలపైనే) రూ. 1,679 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 737 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ.864 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) బ్యాంకు క్యూ2లో రూ.1,771 కోట్ల నికర లాభాన్ని సాధించింది. నికర వడ్డీ ఆదాయం 6.83 శాతం వృద్ధితో రూ.7,508 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ 2.96 శాతంగా నమోదైంది. మొండిబాకీలు తగ్గుముఖం...: బీఓబీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) ఈ ఏడాది క్యూ2లో 9.14 శాతానికి తగ్గుముఖం పట్టాయి. గతేడాది క్యూ2లో ఇవి 10.25%గా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 3.91 శాతం నుంచి 2.51%కి దిగొచ్చాయి. మొత్తం కేటాయింపులు (ప్రొవిజన్లు) జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,209 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు తగ్గాయి. క్యూ2లో తాజాగా మొండిబకాయిలుగా చేరిన రుణాలు రూ.899 కోట్లు. ఇక క్యూ2లో రూ.2,500 కోట్లను బ్యాంక్ రికవరీ చేసుకుంది. బీఓబీ షేరు బీఎస్ఈలో 2 శాతం ఎగబాకి రూ.43 వద్ద స్థిరపడింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా.. పండుగల ఆఫర్లు
ముంబై: పండుగల వాతావరణం నేపథ్యంలో వ్యవస్థలో డిమాండ్ను పెంచడానికి పలు చర్యలు తీసుకుంటున్న బ్యాంకుల జాబితాలో తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. గృహ, కారు రుణ గ్రహీతలకు పలు ప్రోత్సాహకాలను మంగళవారం ప్రకటించింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం– బరోడా గృహ రుణాలు (ఇతర బ్యాంక్ నుంచి రుణాన్ని బదలాయించుకున్న ఖాతాలకు సంబంధించి) , బరోడా కారు రుణాలకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వడ్డీరేటుపై పావుశాతం తగ్గింపు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ ఇప్పటికే పండుగ ఆఫర్లను ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును 100% మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికీ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు వివరిం చింది. ఇక, క్రెడిట్ స్కోర్, గృహ రుణ పరిమాణాన్ని బట్టి వడ్డీ రేటులో 10 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) దాకా రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రాయితీ పొందవచ్చని పేర్కొంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం 864 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ. 864 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండిబాకీలు మొదలైనవాటికి అధిక కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. ‘ప్రామాణిక ఖాతాలకు రూ. 1,811 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం వల్ల స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1లో రూ. 864 కోట్లు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 679 కోట్ల నికర నష్టం నమోదైంది‘ అని బ్యాంక్ వెల్లడించింది. సమీక్షాకాలంలో వడ్డీ ఆదాయం రూ. 18,944 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ. 18,494 కోట్లకు తగ్గింది. అటు కేటాయింపులు 71 శాతం పెరిగి రూ. 3,285 కోట్ల నుంచి రూ. 5,628 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 10.28 శాతం నుంచి 9.39 శాతానికి తగ్గడంతో అసెట్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. నికర ఎన్పీఏ నిష్పత్తి 3.95 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గింది. సోమవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు స్వల్పంగా పెరిగి రూ. 48.55 వద్ద క్లోజయ్యింది. -
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీపై సీబీఐ అభియోగం
న్యూఢిల్లీ : ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ 'గౌర్సన్స్' కుటుంబసభ్యులపై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. 80 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగం మోపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా , సిండికేట్ బ్యాంకుల నుంచి గౌర్సన్స్ చైర్మన్ బిఎల్ గౌర్ , అతని భార్య నవనీత్ ,కుమారుడు రాహుల్ గౌర్ బ్యాంకుల నుంచి 80 కోట్ల రూపాయలకు మోసం చేశారని అధికారులు వెల్లడించారు. (ఇద్దరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు అరెస్ట్) నోయిడాలో లగ్జరీ అపార్ట్మెంట్తో కూడిన హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు సదరు కంపెనీ 250 కోట్ల రూపాయలు (బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 150 కోట్లు, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ .100 కోట్లు) తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దశల వారిగా చిల్లించాల్సిన డబ్బును చెల్లించడం లేదని, అంతేకాకుండా ప్రాజెక్టు కూడా ప్రారంభ దశలోనే ఆగిపోయిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఫిర్యాదులో పేర్కొంది. తప్పుడు లెక్కలు చూపించి , ప్రాజెక్టు నిర్మిస్తిన్నట్లు అవాస్తవాలను చూపించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించింది. (బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్కు బ్రేక్) -
ఏషియన్ పెయింట్స్- బీవోబీ.. భేష్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ఓవైపు ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్, మరోపక్క పీఎస్యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ చెప్పుకోదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఏషియన్ పెయింట్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో దిగ్గజ కంపెనీ ఏషియన్ పెయింట్స్ నికర లాభం నామమాత్రంగా 2 శాతం తగ్గి రూ. 462 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం 7 శాతం వెనకడుగుతో రూ. 4636 కోట్లకు చేరింది. అయితే ఇబిటా మార్జిన్లు 0.7 శాతం బలపడి 18.5 శాతాన్ని తాకాయి. కాగా.. ఎడిల్వీజ్, కొటక్ సెక్యూరిటీస్, యాంటిక్ స్టాక్ తదితర బ్రోకింగ్ సంస్థలు కంపెనీ మార్కెట్ లీడర్కావడంతో కోవిడ్-19 పరిస్థితుల్లోనూ నిలదొక్కుకోగలదని భావిస్తున్నాయి. లాక్డవున్ కారణంగా సమీప భవిష్యత్లో అమ్మకాలు తగ్గినప్పటికీ రెండు మూడు త్రైమాసికాలలో రికవరీ సాధించగలదని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్చేసి రూ. 1779 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1798 వరకూ ఎగసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ రంగ సంస్థ బీవోబీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 507 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 991 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంక్ తాజా స్లిప్పేజెస్ రూ. 3050 కోట్లకు తగ్గినట్లు బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 6798 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10 శాతం నుంచి 9.4 శాతానికి నీరసించాయి. ఈ నేపథ్యంలో బీవోబీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్చేసి రూ. 53 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 55 వరకూ ఎగసింది. -
ఎంఎస్ఎంఈలకు అండగా బీఓబీ
విజయవాడ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు అండగా నిలవడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్–19 వైరస్ విపత్తు కారణంగా ఈ రంగం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, పరిష్కారాలకు తగిన సూచినలను అందించడంలో భాగంగా జాతీయస్థాయి వెబినార్ను నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కిచి మాట్లాడుతూ.. ‘దేశంలోనే అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఎంఎస్ఎంఈకి బీఓబీ అండగా ఉంటుంది. ఈ రంగానికి ఆర్బీఐ అందిస్తున్న పలు ప్రోత్సాహాల గురించి సమావేశం ద్వారా తెలియజేశాం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 33వేలకు పైగా ప్రతినిధులు ఆన్లైన్లో పాల్గొన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. -
ఎస్బీఐ బాటలో బీఓబీ, యూబీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను 0.75 బేసిస్ పాయింట్లు (రెపో ప్రస్తుతం 4.4 శాతం) తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనం మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు కస్టమర్లకు బదలాయించాయి. రెపో ఆధారిత రుణ రేటు తగ్గింపు మార్చి 28వ తేదీ నుంచీ అమల్లోకి తెస్తున్నట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో రెపోకు అనుసంధానమయ్యే వ్యక్తిగత రిటైల్, కార్పొరేట్, చిన్నతరహా పరిశ్రమల రుణ రేట్లు 0.75 శాతం మేర తగ్గనున్నాయి. ఇక తమ తగ్గింపు రేట్లు బుధవారం నుంచీ అమల్లోకి వస్తాయని యూబీఐ పేర్కొంది. యూనియన్ బ్యాంక్లో విలీనమవుతున్న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్లకూ తగ్గించిన వడ్డీరేట్లు అమలవుతాయని తెలిపింది. పీఎన్బీ కొత్త లోగో: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కొత్త లోగోను ఆవిష్కరించింది. పీఎన్బీలో ఏప్రిల్ 1 నుంచి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. సుజ్లాన్ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ ఓకే టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ సమ్మతి తెలిపింది. 18 బ్యాంకుల కన్సార్షియంకు ఎస్బీఐ లీడ్ బ్యాంకర్గా వ్యవహరిస్తోంది. సుజ్లాన్లో 10% వాటాను భాగస్వామ్య బ్యాంకులు తీసుకోనున్నాయి. బ్యాంకులకు సుజ్లాన్ రూ.12,785 కోట్లు బాకీ పడింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి యత్నం
-
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో చోరీకి యత్నం
సాక్షి, రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్ సమీపంలో ఓ దుండగుడు భారీ చోరీకి యత్నించాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం మిషన్ను బద్దలుకొట్టి నగదును దోచుకునేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో సైరన్ మోగడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై, ఏటీఎం మిషన్ వద్దకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు తమిళనాడుకు చెందిన మని మారన్గా పోలీసులు గుర్తించారు. అయితే ఏటీఎం మిషన్ నుంచి నగదు పోలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. కాగా నిందితుడు 2007లో తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మని మారన్ను విచారణ జరుపుతున్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం 1,407 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత ఆర్థి క సంవత్సరం క్యూ3లో రూ.436 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.1,407 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎమ్డీ, సీఈఓ సంజీవ్ చంద్ర తెలిపారు. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించారు. గత క్యూ3లో రూ.4,504 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో 47 శాతం పెరిగి రూ.6,621 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.7,128 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 10.91 శాతం నుంచి 10.43 శాతానికి, నికర మొండి బకాయిలు 4.79 శాతం నుంచి 4.05 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.10,387 కోట్లుగా ఉన్నాయి. దీంట్లో ఆర్బీఐ గుర్తించిన మొండి బకాయిల మళ్లింపులు రూ.4,509 కోట్ల మేర ఉన్నాయి. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్.వి.ప్రభాకర్, అతనూ కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీగా, దాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్.రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. -
మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంతో సహా పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతో బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపు నిచ్చాయి. అక్టోబర్ 22, మంగళవారం నిర్వహించనున్న ఈ సమ్మె కారణంగా తమ బ్యాంకింగ్కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. అక్టోబర్ 22న ట్రేడ్ యూనియన్ సంస్థలు ప్రతిపాదించిన సమ్మె కారణంగా బ్యాంక్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే హెచ్చరించింది. తమ శాఖల పనితీరు ప్రభావితం కావచ్చు లేదా స్తంభించిపోవచ్చు అని ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కార్యకలాపాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ హామీ ఇచ్చింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) సంయుక్తంగా అక్టోబర్ 22 న అఖిల భారత బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) మద్దతు లభించిందని అసోసియేషన్ ప్రకటించింది. ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా ఏర్పరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ విలీనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టకరమని విమర్శిస్తున్నాయి. గత నెలలో కూడా నాలుగు బ్యాంక్ యూనియన్లు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ)ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్బీవోసీ) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్వోబీవో) , ఇలాంటి సమస్యలపై సమ్మెకు పిలుపునిచ్చారు. తరువాత, కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తమ డిమాండ్లను పరిశీలిస్తామని యూనియన్లకు హామీ ఇవ్వడంతో సెప్టెంబర్ 26-27 నిర్వహిచ తలపెట్టిన 48 గంటల సమ్మె వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
బీఓబీ లాభం రూ.826 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్కు రూ.826 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.646 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ల విలీనం తర్వాత తాము వెల్లడిస్తున్న తొలి ఆర్థిక ఫలితాలు ఇవని, అందుకని గత క్యూ1, ఈ క్యూ1 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. గత క్యూ1లో రూ.13,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.22,057 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం వృద్ధితో రూ.6,496 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ4లో 2.78 శాతంబ ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ1లో 2.73 శాతానికి తగ్గిందని పేర్కొంది. 4 శాతం పెరిగిన నిర్వహణ లాభం స్టాండ్అలోన్ పరంగా చూస్తే, ఈ క్యూ1లో నికర లాభం రూ.709 కోట్లు, మొత్తం ఆదాయం రూ.20,861 కోట్లని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. గత క్యూ1లో రూ.528 కోట్ల నికర లాభం, రూ.12,788 కోట్ల ఆదాయం వచ్చాయని పేర్కొంది. స్టాండ్అలోన్ నిర్వహణ లాభం 4 శాతం వృద్ధితో రూ.4,276 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, 34 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. తగ్గిన తాజా మొండి బకాయిలు.... ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 10.28 శాతంగా, నికర మొండిబకాయిలు 3.95 శాతంగా ఉన్నాయని బ్యాంక్ తెలిపింది. గత క్యూ1లో స్థూల మొండి బకాయిలు 12.46 శాతమని, నికర మొండి బకాయిలు 5.4 శాతమని వెల్లడించింది. ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు రూ.5,583 కోట్లని, సీక్వెన్షియల్గా చూస్తే, తాజా మొండి బకాయిలు తగ్గాయని తెలిపింది. ఈ క్యూ1లో రూ.3,168 కోట్ల కేటాయింపులు జరిపామని తెలిపింది. రిటైల్ రుణాలు 21 శాతం వృద్ధి చెందడంతో మొత్తం రుణాలు 5 శాతం ఎగసి రూ.5.33 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దేశీయ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ.7.85 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 0.68 శాతం నష్టంతో రూ.110 వద్ద ముగిసింది. -
తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం, బ్యాంక్ ఆఫ్ బరోడా నికర నష్టాలు(స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,102 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.991 కోట్లకు తగ్గాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నష్టాలు ఈ స్థాయిలో వచ్చాయని వివరించింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే మాత్రం, బ్యాంక్ నిరాశపరిచింది. గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఈ బ్యాంక్కు రూ.471 కోట్ల నికర లాభం వచ్చింది. ఇక మొత్తం ఆదాయం రూ. 12,735 కోట్ల నుంచి రూ.15,285 కోట్లకు పెరిగింది. 11 శాతం పెరిగిన ఏడాది ఆదాయం.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.2,432 కోట్ల నికర నష్టాలు(స్టాండ్ అలోన్)రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.433 కోట్ల నికర లాభం వచ్చింది. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,887 కోట్ల నికర నష్టాలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం ఆదాయం(స్టాండ్అలోన్) 11% వృద్ధితో రూ.56,065 కోట్లకు, కన్సాలిడేటెడ్ పరంగా అయితే 13% వృద్ధితో రూ.60.793 కోట్లకు పెరిగింది. మెరుగుపడిన రుణ నాణ్యత... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 12.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 9.61 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.49 శాతం నుంచి 3.33 శాతానికి తగ్గాయి. విలువ పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.15,609 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.3,521 కోట్లకు చేరాయి. ఇది ఎనిమిది క్వార్టర్ల కనిష్ట స్థాయి. కేటాయింపులు రూ.7,053 కోట్ల నుంచి రూ.5,550 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యాపారం రూ.10,18,747 కోట్ల నుంచి 9 శాతం ఎగసి రూ.11,07,509 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 0.6 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది. -
రెండేళ్లలో అనుసంధానం పూర్తి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్ బరోడాలో విలీనమై ఒక్కటిగా మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనుసంధానానికే 12 నెలల వరకు సమయం తీసుకోవచ్చని, ఇతర వ్యవస్థల మధ్య అనుసంధానతకు మరో ఏడాది పట్టొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమయంలో ఖాతాదారులకు అసౌకర్యాన్ని పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విలీనం వల్ల ఏర్పడే అదనపు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణపరమైన అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,042 కోట్ల నిధులు సమకూర్చినట్టు ఆ అధికారి తెలిపారు. విలీన ప్రభావం మొదటి త్రైమాసికమైన ఏప్రిల్–జూన్ కాలంలో కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. విలీనానంతర బ్యాంకుకు రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.6.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉంటాయి. విలీనం తర్వాత బీవోబీ ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు. -
బీఓబీ... ఇక దేశంలో టాప్–2 బ్యాంక్!
న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్ దిగ్గజంగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) అవతరించింది. దేనా, విజయాబ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచీ లాంఛనంగా అమల్లోకి రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తరువాత బీఓబీ రెండవ స్థానంలోకి చేరింది. దీనితో ఇప్పటి వరకూ రెండవ స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మూడవ స్థానంలోకి వెళ్లింది. ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు చూస్తే... ►ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ స్థానంలోకి బీఓబీ వస్తే, మొత్తం బ్యాంకింగ్ రంగంలో చూస్తే, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరువాత మూడవ స్థానానికి బీఓబీ చేరింది. ► తాజా విలీనంతో బీఓబీ వ్యాపారం విలువ దాదాపు రూ.15 లక్షల కోట్లు దాటనుంది. ఇందులో రూ.8.75 లక్షల కోట్లు డిపాజిట్లు, రుణాలు రూ.6.25 లక్షల కోట్లు. ► దేశం మొత్తంమీద బ్యాంక్కు 9,500 బ్రాంచీలు ఉంటాయి. 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగుల నుంచి దాదాపు 12 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందుతాయి. ►విలీన పథకం ప్రకారం, దేనాబ్యాంక్, విజయాబ్యాంక్ షేర్హోల్డర్లకు బీఓబీ షేర్ కేటాయింపులను పూర్తిచేసింది. విజయాబ్యాంక్ షేర్ హోల్డర్లు తమ వద్ద ఉన్న ప్రతి వెయ్యి షేర్లకు 402 బీఓబీ ఈక్విటీ షేర్లు పొందారు. ఇక దేనా బ్యాంక్ విషయంలో షేర్హోల్డర్లు ప్రతి వెయ్యి షేర్లకూ 110 బీఓబీ ఈక్విటీ షేర్లు పొందారు. ►సోమవారం షేర్ల జారీ, కేటాయింపులు జరిగినట్లు బీఓబీ ఎక్సే్ఛంజ్లకు పంపిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ► విలీనం పూర్తయిన నేపథ్యంలో.. గుజరాత్లో బీఓబీ మార్కెట్ షేర్ 22 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్లలో ఈ షేర్ 8 నుంచి 10 శాతంగా ఉంది. ► మొండిబకాయిల భారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏ)లో ఉన్న దేనా బ్యాంక్ వినియోగదారులకు రుణ సౌలభ్యం ఇప్పటివరకూ అందుబాటులో లేదు. తాజా విలీనంతో తిరిగి తక్షణం ఈ సౌలభ్యత అందుబాటులోకి వస్తుంది. ► గత ఏడాది సెప్టెంబర్లో బీఓబీతో విజయా,దేనా బ్యాంకుల విలీన నిర్ణయాన్ని ప్రకటించింది. విలీనం 2019 జనవరిలో నోటిఫై అయ్యింది. ఏప్రిల్ 1న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ► భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకులను అంతర్జాతీయ పోటీ స్థాయికి తీసుకువెళ్లడానికి వాటి బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడానికి ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలో తీసుకున్న పలు సంస్కరణల్లో భాగంగా బ్యాంకింగ్ విలీన ప్రక్రియ ఊపందుకుంది. ►ఈ సంస్కరణల్లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్లోని 51 శాతం షేర్ను జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కొనుగోలు చేసింది. ► దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థికశాఖ దాదాపు రూ.1.06 లక్షల కోట్లను తాజా మూలధనంగా సమకూర్చింది. దీనితో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్సహా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బయటపడ్డాయి. 2018 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ మొండిబకాయిల మొత్తం దాదాపు రూ.23,860 కోట్ల మేర తగ్గాయి. ►తాజా విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18కి తగ్గింది. కేంద్ర తాజా విలీన ప్రక్రియ ప్రారంభానికి ముందు దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య మొత్తం 27. అయితే భారతీయ మహిళాబ్యాంక్సహా ఐదు అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కలిశాయి. దీనితో ఈ సంఖ్య 27 నుంచి 21కి తగ్గింది. ►ఈ విలీనం నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)కు కేంద్రం రూ.5,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ►విలీనానికి సరిగ్గా నెల రోజుల ముందు బీఓబీ చైర్మన్గా మాజీ ఆర్థిక కార్యదర్శి హస్ముఖ్ అదియా నియమితులయ్యారు. ►గుజరాత్లోని ఒకప్పటి బరోడాలో బ్యాంక్ ఆఫ్ బరోడా 1908 జూలై 20న ఏర్పాటయ్యింది. ప్రస్తుతం బరోడా వడోదరగా పిలుస్తున్నారు. ఇక కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 1931లో ఏబీ శెట్టి విజయాబ్యాంక్ను స్థాపించగా, ముంబైలో 1938లో దేవ్కరణ్ నాన్జీ దేనా బ్యాంక్ను స్థాపించారు. ►తాజా విలీన నిర్ణయాల్లో తప్పులు జరిగాయని, ఈ ప్రక్రియను నిలుపుచేయాలని బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది. ►తాజా విలీనం నేపథ్యంలో... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీడ్ బ్యాంకర్ల (రాష్ట్రాల్లో ప్రధాన బ్యాంకులుగా పరిగణించే) బాధ్యతను ఆర్బీఐ పునర్వ్యవస్థీకరించింది. ►విలీనం అమల్లోకి రావడంతో బీఓబీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 3.15 శాతం పెరిగి 132.70 వద్ద ముగిసింది. కస్టమర్లకు, ఉద్యోగులకు ప్రయోజనం తాజా విలీనం వల్ల 12 కోట్ల మందికిపైగా కస్టమర్లకు, బ్యాంక్ ఉద్యోగులకు అత్యుత్తమ ప్రయోజనాలు సమకూరనున్నాయి. నగదు నిర్వహణా వ్యవహారాలు, రుణ సత్వర అందుబాటు, ఆర్థిక, ద్రవ్య ప్రణాళికలు, సంపద నిర్వహణ వంటి విస్తృతస్థాయి అంశాల్లో ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగుల సేవలు మెరుగుపడతాయి. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించడం జరుగుతుంది. విలీన ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ 12–18 నెలల్లో పరిష్కారం అవుతాయి. – బీరేంద్ర కుమార్, బీఓబీ జీఎం, బెంగళూరు జోనల్ ఆఫీస్ -
ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్– ఆర్బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్బీఐ అలహాబాద్ బ్యాంక్పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్ వేరే బ్యాంక్లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్..స్విఫ్ట్కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్లపై ఆర్బీఐ చెరో కోటి రూపాయలు జరిమానా విధించింది. -
పీఎన్బీ.. సంస్కరణల అమల్లో టాప్
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ–ఐబీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్, రుణ వితరణ తదితర 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం విడుదల చేశారు. ఇందులో 100 మార్కులకు గాను పీఎన్బీకి 78.4 స్కోరు దక్కించుకుంది. మిగతా బ్యాంకుల స్కోర్లు చూస్తే.. బీవోబీ 77.8, ఎస్బీఐ (74.6), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69), కెనరా బ్యాంక్ (67.5), సిండికేట్ బ్యాంక్ 67.1గా ఉన్నాయి. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ వితరణ, ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సత్వరం స్పందించడం తదితర అంశాల్లో పీఎన్బీ ’మెరుగైన పనితీరు’ కనపర్చినట్లు బీసీజీ–ఐబీఏ నివేదిక పేర్కొంది. ‘భారీ కుంభకోణం కారణంగా ఇటు ఆర్థికంగాను, అటు ప్రతిష్టపరంగానూ దెబ్బతిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండిబాకీలకు రూ. 14,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అయితే, 9 నెలల్లోనే బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. తొమ్మిది నెలల తర్వాత గత క్వార్టర్లో లాభాలు కూడా ప్రకటించింది. అలాగే, సంస్కరణల అమల్లో అగ్రస్థానాన్నీ దక్కించుకోవడం అభినందనీయం‘ అని జైట్లీ ప్రశంసించారు. ఇలాంటి ర్యాంకింగ్ల విధానంతో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడి తగ్గిందని, మొండిబాకీలను గుర్తించడంతో పాటు వాటికి పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడం కూడా ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. పీసీఏలోని బ్యాంకులకూ ర్యాంకింగ్.. భారీ మొండిబాకీల కారణంగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఈ నివేదికలో ర్యాంకింగ్ లభించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి 66.7, యూకో బ్యాంక్ (64.1), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (60.8), ఐడీబీఐ బ్యాంక్ (60.2), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (55.7), దేనా బ్యాంక్కు 53.8 ర్యాంక్ లభించింది. ప్రభుత్వ రంగంలో మొత్తం 21 బ్యాంకులు ఉండగా, 11 బ్యాంకులను ఆర్బీఐ గతేడాది పీసీఏ పరిధిలోకి చేర్చి కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. 5 బ్యాంకులు ఇటీవలే దీన్నుంచి బైటికి వచ్చాయి. దివాలా చట్టంతో ప్రయోజనాలు.. దివాలా చట్టం, మొండిబాకీల రికవరీపరమైన సంస్కరణల పక్కా అమలు.. బ్యాంకులు కోలుకునేందుకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. 2015 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2.87 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ దాకా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 98,498 కోట్లు రాబట్టుకోగలిగాయని తెలిపింది. 2014–15 నుంచి 2019 ఫిబ్రవరి దాకా ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ. 2.5 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చింది. కొనసాగనున్న బ్యాంకుల విలీనం.. అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకుల విలీన విధానాన్ని క్రమంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మొండిబాకీలను బ్యాంకులు పూర్తిగా బైటపెట్టేలా చర్యలు తీసుకోవడంతో.. ప్రారంభంలో వీటి పరిమాణం భారీ స్థాయికెళ్లిందని, అయితే కేటాయింపులు, రికవరీలతో ఇవి తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన 2–3 త్రైమాసికాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మొండిబాకీల సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు. ‘అదనపు మూలధనం సమకూర్చడంపై ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. పలు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి రావడం హర్షణీయం. త్వరలో మిగతావి కూడా తమ కార్యకలాపాలు మెరుగుపర్చుకుని, బైటికి రాగలవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక.. బ్యాం కుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి ఫుల్స్టాప్ పడిందని జైట్లీ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిభ, ప్రొఫెషనలిజంకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే మరిన్ని నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండటం అభినందించతగ్గ విషయమని జైట్లీ పేర్కొన్నారు. -
బ్యాంకులకు 48వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు(పీఎస్బీ) రూ.48,239 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం వెల్లడించింది. ఆయా బ్యాంకులు నియంత్రణ సంస్థ నిర్దేశిత మూలధన నిల్వల నిబంధనలు పాటించేందుకు, వృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు ఈ నిధులు తోడ్పడగలవని పేర్కొంది. తాజా నిధులతో కలిపి రూ.1.06 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలకు మొత్తం రూ.1,00,958 కోట్లు ఇచ్చినట్లవుతుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లను విలీనం చేసుకుంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా అవసరాల నిమిత్తం రూ.5,000 కోట్లు పక్కన పెట్టినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి ఈ విడతలో కార్పొరేషన్ బ్యాంక్కు అత్యధికంగా నిధులు లభించనున్నాయి. రూ.9,086 కోట్లు దక్కనున్నాయి. అటు అలహాబాద్ బ్యాంక్కు రూ.6,896 కోట్లు సమకూర్చనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఇవి ప్రస్తుతం భారీ మొండిబాకీల కారణంగా ఆర్బీఐ పర్యవేక్షణలో సత్వర దిద్దుబాటు చర్యలపరమైన (పీసీఏ) ఆంక్షల పరిధిలో ఉన్నప్పటికీ కొంత మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా మరింత మూలధనం లభించడం వల్ల వీటి మొండిబాకీల నిష్పత్తి మెరుగుపడగలదని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,638 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ.205 కోట్లు లభించనున్నాయి. ఇవి రెండూ ఇటీవలే పీసీఏ పరిధి నుంచి బైటికొచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు మరిన్ని.. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.5,908 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,112 కోట్లు, ఆంధ్రా బ్యాంక్కు రూ.3,256 కోట్లు, సిండికేట్ బ్యాంక్కు రూ. 1,603 కోట్లు లభించనున్నాయి. పీసీఏ పరిధిలో ఉన్న మరో నాలుగు బ్యాంకులకు (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్) రూ.12,535 కోట్లు అందనున్నాయి. డిసెంబర్లో పీఎస్బీలకు సమకూర్చనున్న మొత్తాన్ని రూ.41,000 కోట్ల మేర పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక పరిమాణం రూ.65,000 కోట్ల నుంచి రూ. 1.06 లక్షల కోట్లకు చేరింది. ఇందులో భాగంగా డిసెంబర్లో రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం రూ. 28,615 కోట్లు సమకూర్చింది.పీసీఏ పరిధి నుంచి బైటికి రావడానికి తాజాగా అందే అదనపు మూలధనం తోడ్పడుతుందని కార్పొరేషన్ బ్యాంక్ ఎండీ పి.వి. భారతి చెప్పారు. పరిస్థితులను బట్టి అదనంగా ప్రొవిజనింగ్ చేయాల్సి వస్తే ఈ నిధులను వినియోగించుకుంటామని, తమ నికర ఎన్పీఏలు 6 శాతం లోపునకు తగ్గుతాయని ఆమె తెలిపారు. వీటి ఊతంతో ఈ మార్చి క్వార్టర్లోనే పీసీఏ పరిధి నుంచి బైటపడగలమని భారతి వివరించారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం నాలుగు రెట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) నికర లాభం నాలుగు రెట్లు ఎగిసి, రూ. 471 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 112 కోట్లు. మరోవైపు, మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 12,976 కోట్ల నుంచి రూ. 14,563 కోట్లకు పెరిగింది. క్యూ3లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 11.31% నుంచి 11.01%కి, నికర ఎన్పీఏలు 4.97 శాతం నుంచి 4.26%కి తగ్గాయి. విలువపరంగా చూస్తే.. డిసెంబర్ 31 నాటికి స్థూల మొండిబాకీలు రూ. 53,184 కోట్లుగా ఉన్నాయి. మొండిబాకీలకు కేటాయింపులు రూ. 3,155 కోట్ల నుంచి రూ. 3,416 కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత మెరుగుపడటం, లో బేస్ ఎఫెక్ట్ కారణంగా లాభాలు మెరుగుపడ్డాయని బ్యాంక్ ఎండీ పి.ఎస్. జయకుమార్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 1.99 శాతం నుంచి 2.69 శాతానికి చేరింది. సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ రుణాలు ఇందులో రూ. 1,169 కోట్లుగా ఉన్నాయి. ఐఎల్అండ్ఎఫ్ఎస్కు బీవోబీ మొత్తం రూ. 4,677 కోట్లు రుణమిచ్చింది. మరోవైపు రూ. 31,000 కోట్ల ఫ్రాడ్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ గ్రూప్నకు బీవోబీ రూ. 4,000 కోట్ల రుణాలిచ్చింది. -
బీఓబీ మినిమం బ్యాలెన్స్ నిర్వహణ రెట్టింపు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పొదుపు ఖాతాదారులు తమ ఖాతాల్లో నిర్వహించే కనీస బ్యాలెన్స్ను రెట్టింపు చేసింది. నగర, మెట్రో, సెమీ అర్బన్ బ్రాంచ్ల్లో కనీస నిల్వను రూ 1000 నుంచి రూ 2000కు పెంచుతున్నట్టు బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ల్లో కనీస నిల్వను రూ 500 నుంచి రూ 1000కి పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి నూతన మినిమం బ్యాలెన్స్లు అమల్లోకి వస్తాయని బ్యాంకు పేర్కొంది. బీఓబీలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లు విలీనం కావడంతో ఈ రెండు బ్యాంకుల పొదుపు ఖాతాలకూ ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. కాగా మినిమం బ్యాలెన్స్ నిర్వహణను వంద శాతం మేర బ్యాంకు పెంచినప్పటికీ కనీస నిల్వను నిర్వహించని ఖాతాదారులపై విధించే జరిమానాను పెంచకపోవడం ఖాతాదారులకు కొంత ఊరట ఇస్తోంది. అయితే అదనంగా మినిమమ్ బ్యాలెన్స్ను నిర్వహించడం ఖాతాదారులపై భారం మోపనుంది. -
మరో మెగా బ్యాంక్ రెడీ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో మరో భారీ బ్యాంక్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారయ్యింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల సర్వీస్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, సిబ్బంది తొలగింపు చర్యలుండవని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు చెప్పారు. ‘ఈ విలీనంతో ఉద్యోగుల సర్వీస్ కండీషన్స్పై ప్రతికూల ప్రభావం ఉండదు. ] అలాగే, ఉద్యోగుల తొలగింపు చర్యలూ ఉండవు. కస్టమర్ల సంఖ్య పెరగడంతో పాటు మార్కెట్, నిర్వహణ సామర్థ్యాలు, పథకాల విస్తృతి, కస్టమర్లకు సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. నెట్వర్క్, చౌక డిపాజిట్లు మొదలైనవి విలీన బ్యాంకుకు లాభిస్తాయి‘ అని ఆయన వివరించారు. అంతర్జాతీయ బ్యాంకులకు దీటుగా బీవోబీని తీర్చిదిద్దే లక్ష్యంతో 3 బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మూడింటి విలీనం అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల సంఖ్య 19కి తగ్గుతుంది. విలీన స్కీమును ఈ శీతాకాల సమావేశాల్లోనే సభ్యుల పరిశీలనకు పార్లమెంటు ముందు 30 రోజులు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపా యి. ఈ సమావేశాలు జనవరి 8తో ముగుస్తాయి. ప్రభుత్వ రంగంలో రెండో పెద్ద బ్యాంక్.. విలీనానంతరం ఏర్పడే కొత్త బ్యాంక్ రూ.14.82 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్గా అవతరిస్తుంది. ప్రభుత్వ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా నిలుస్తుంది. విలీన బ్యాంక్ నికర మొండిబకాయిల నిష్పత్తి 5.71% స్థాయిలో ఉండనుంది. మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు 12.13 శాతంగా ఉంది. ఇక క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి (సీఏఆర్) కూడా నియంత్రణ సంస్థ నిర్దేశిత 10.87 శాతం కన్నా అధికంగా 12.25 శాతం స్థాయిలో ఉంటుంది. అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనంతో ఎస్బీఐ ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా మారిన సంగతి తెలిసిందే. అదే కోవలో బీవోబీని కూడా మెగా బ్యాంక్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో విజయ బ్యాంక్, దేనా బ్యాంక్లను అందులో విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగం గతేడాది సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుంది. మైనారిటీ షేర్హోల్డర్ల అభ్యంతరాలేమైనా ఉంటే పరిష్కరించేందుకు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కడే సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. షేర్ల స్వాప్ నిష్పత్తి ఖరారు.. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్లను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తాజాగా షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయ బ్యాంక్ షేర్హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. బీవోబీ, దేనా బ్యాంక్ల బోర్డులు షేర్ల స్వాప్ నిష్పత్తి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయి. బుధవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 3.16 శాతం క్షీణించి రూ. 119.40 వద్ద, దేనా బ్యాంక్ షేరు 0.28 శాతం క్షీణించి రూ.17.95 వద్ద ముగియగా.. విజయ బ్యాంక్ షేరు స్వల్పంగా 0.29 శాతం లాభపడి రూ. 51.05 వద్ద క్లోజయ్యింది. ఈ ధరల ప్రకారం చూస్తే.. దేనా బ్యాంక్ షేర్హోల్డర్లకు రూ.17,950 విలువ చేసే షేర్లకు బదులుగా రూ.13,134 విలువ చేసే బీవోబీ షేర్లు లభిస్తాయి. అలాగే విజయ బ్యాంక్ షేర్హోల్డర్లకు రూ.51,050 విలువ చేసే 1,000 షేర్లకు గాను రూ.47,998.80 విలువ చేసే బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. ఎగుమతి వర్తకులకు వడ్డీ రాయితీ.. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఎగుమతి వర్తకులకు 3 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.600 కోట్ల మేర వ్యయం కానుంది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా లఘు, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఉత్పత్తులు, వ్యవసాయ, హస్తకళలు, జౌళి, తోలు, యంత్రపరికరాల సంస్థలు తయారు చేసే సుమారు 416 ఉత్పత్తులు ఈ పరిధిలోకి వస్తాయి. వడ్డీ రాయితీ స్కీములో ఎగుమతి వర్తకుల్ని కూడా చేర్చడంతో వారు మరింతగా ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహం లభించగలదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా ఎంఎస్ఎంఈల్లో ఉత్పత్తి పెరిగి, మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. తయారీ ఎగుమతిదారుల కోసం 2015 ఏప్రిల్లో వడ్డీ రాయితీ పథకాన్ని అయిదేళ్ల వ్యవధికి కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే, ఇందులో వర్తక ఎగుమతిదారులకు చోటు కల్పించలేదు. తాజాగా వీరిని కూడా ఈ స్కీమ్లో చేర్చింది. రుణాలు తక్కువ వడ్డీకే లభించడం వల్ల ఎగుమతిదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని భారతీయ ఎగు మతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. మరోవైపు, తయారీ ఎగుమతిదారుల తరహాలోనే ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించే వర్తక ఎగుమతిదారులను కూడా ప్రోత్సహిం చాల్సిన అవసరం ఉందని ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. -
నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: విజయ, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె విషయమై సమాచారాన్ని కూడా తెలియజేశాయి. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెను నిర్వహిస్తోంది. విలీనం విషయంలో ముందుకు వెళ్లబోమంటూ ప్రభుత్వం నుంచి తమకు హామీ రాలేదని, దాంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ప్రభుత్వం బ్యాంకుల సైజు పెరగాలని కోరుకుంటోందని, ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా గానీ, ప్రపంచంలోని టాప్ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. -
మూడు బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయా బ్యాంక్ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఆమోద ముద్ర వేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం ఈ విషయం వెల్లడించింది. విలీన ప్రతిపాదనకు ఏఎం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం సమాచారమిచ్చిందని బీవోబీ తెలియజేసింది. అంతర్జాతీయ స్థాయిలో పటిష్టమైన బ్యాంక్ ఏర్పాటు దిశగా ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలోని ఏఎం గతంలో నిర్ణయించింది. దీంతో సెప్టెంబర్ 29న బీవోబీ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మిగతా రెండు బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఇప్పటికే ఓకే చెప్పాయి. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పాటయ్యే కొత్త సంస్థ కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. విలీన బ్యాంకు వ్యాపార పరిమాణం దాదాపు రూ.14.82 లక్షల కోట్లుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత స్థానాన్ని ఇది దక్కించుకుంటుంది. విలీన బ్యాంక్ మొండిబాకీల నిష్పత్తి 5.71 శాతంగా ఉండనుంది. పీఎస్బీల సగటు 12.13 శాతం కన్నా ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. విలీన ప్రతిపాదనకు ఏఎం అనుమతుల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో బీవోబీ షేరు .. 0.30 శాతం పెరిగి రూ. 115.20 వద్ద క్లోజయ్యింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా భేష్!
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్లో రూ.425 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.355 కోట్ల నికర లాభం వచ్చిందని 20 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 40 శాతం పెరిగి రూ.686 కోట్లకు ఎగిసిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.12,490 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం అప్ నికర వడ్డీ ఆదాయం రూ.3,720 కోట్ల నుంచి 21 శాతం పెరిగి రూ.4,492 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఈ క్యూ2లో తాజా మొండి బకాయిలు రూ.2,281 కోట్లుగా ఉన్నాయని, గత ఏడాదిన్నర కాలంలో ఇవే అతి తక్కువ తాజా మొండి బకాయిలని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. గత క్యూ2లో 5.40 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 4.86 శాతానికి తగ్గాయని వెల్లడించింది. ఈ క్యూ1లో 12.46 శాతంగా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ క్యూ2లో 11.8 శాతానికి తగ్గాయని తెలిపింది. మొండి బకాయిల కోసం రూ.1,467 కోట్ల కేటాయింపులు జరిపామని, ఇది తొమ్మిది క్వార్టర్ల కనిష్ట స్థాయని వివరించింది. మొత్తం కేటాయింపులు 4 శాతం పెరిగి రూ.2,430 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో 1.82 శాతంగా ఉన్న రుణ వ్యయం ఈ క్యూ2లో 1.31 శాతానికి తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్ 2.34 శాతం నుంచి 2.61 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, ఇది స్వల్పంగా తగ్గింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 2.7 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. -
విలీన ప్రతిపాదనకు దేనా బ్యాంక్ ఓకే
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) విజయ బ్యాంక్తో పాటు విలీనం కావాలన్న ప్రతిపాదనకు దేనా బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కన్సాలిడేషన్తో అంతర్జాతీయ బ్యాం కుల స్థాయిలో కార్యకలాపాలు సాగించగలిగే పటిష్ట బ్యాంకు ఏర్పడగలదని, దేశీయంగా.. అంతర్జాతీయంగా సమర్ధంగా పోటీనివ్వగలదని స్టాక్ ఎక్చ్సేంజీలకు దేనా బ్యాంకు తెలియజేసింది. రుణ వృద్ధిని పెంచేందుకు, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు అమలు చేసేందుకు, వ్యయాలు నియంత్రించుకునేందుకు తోడ్పడగలదని వివరించింది. దేనా, విజయా, బీవోబీల విలీనంతో ఏర్పడే కొత్త సంస్థ.. మొత్తం రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంకు కానుంది. -
దీర్ఘకాలంలో మంచిదే.. కానీ..
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనంతో స్వల్పకాలికంగా మొండిబాకీలు ఎగియడం వంటి సవాళ్లు ఉంటాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ విలీనంతో ప్రయోజనాలు ఉండగలవని వివరించింది. ప్రతిపాదిత విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వచ్చిన తర్వాత.. రేటింగ్ను మదింపు చేస్తామని ఇండియా రేటింగ్స్ తెలిపింది. దేనా బ్యాంక్కు తక్కువ మూలధన నిల్వలు ఉన్నప్పటికీ.. విజయా బ్యాంక్ వద్ద అధిక స్థాయిలో ఉన్నందున.. ఆ మేరకు సర్దుబాటు జరుగుతుందని పేర్కొంది. విలీన బ్యాంక్కు మాత్రం అదనంగా మూలధనం అవసరమవుతుందని వివరించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చూస్తే నిర్వహణ వ్యయాలు .. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు పటిష్టం కావడం వంటి సానుకూల ప్రయోజనాలు ఉంటాయని ఇండియా రేటింగ్స్ వివరించింది. మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకోలేం... ప్రస్తుతం మరిన్ని బ్యాంకులను టేకోవర్ చేసే పరిస్థితిలో ఎస్బీఐ లేదని ఆ బ్యాంకు చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. అనుబంధ బ్యాంకుల విలీనంతో చేకూరిన ప్రయోజనాలు కనిపించడానికి కనీసం 2–3 సంవత్సరాలైనా పడుతుందని ఆయన వివరించారు. ఎస్బీఐకి 23 శాతం మార్కెట్ వాటా ఉందని, మరిన్ని బ్యాంకులను చేర్చుకోవడం వల్ల గుత్తాధిపత్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని రజనీష్ కుమార్ తెలిపారు. అయితే, మెరుగైన నిర్వహణ కోసం విలీనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. -
మరో మెగా బ్యాంకు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాటలోనే మరో మెగా బ్యాంకు ఏర్పాటుకు కేంద్రం తెరతీసింది. రుణ వృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు..బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్లను విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో.. మొత్తం రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ ఏర్పాటు కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఈ విషయం ప్రకటించారు. ఈ విలీనంతో బ్యాంకులు మరింత పటిష్టంగా మారడంతో పాటు రుణ వితరణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలవని చెప్పారు. పెరుగుతున్న మొండిబాకీలతో చాలా బ్యాంకులు దుర్బలంగా మారాయని జైట్లీ చెప్పారు. ‘‘బ్యాంకుల రుణ వితరణ కార్యకలాపాలు బలహీనపడ్డాయి. దీంతో కార్పొరేట్ పెట్టుబడులు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడు బ్యాంకుల విలీనంతో ఏర్పడే సంస్థతో బ్యాంకింగ్ కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలుంటాయి’’ అని ఆయన వివరించారు. నాలుగు నుంచి ఆరు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని బీవోబీ సీఈవో పీఎస్ జయకుమార్ అభిప్రాయపడ్డారు. అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకే.. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల అధ్యయనానికి జైట్లీ సారథ్యంలో ఏర్పాటైన ప్రత్యామ్నాయ యంత్రాంగం ఈ మేరకు సిఫార్సు చేసింది. విలీన ప్రతిపాదనను పరిశీలించాలంటూ మూడు బ్యాంకుల బోర్డులకు సూచించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ‘ఆయా బ్యాంకులు నిర్వహణ సామర్థ్యాన్ని, కస్టమర్ సేవలను మెరుగుపర్చుకోవడానికి ఈ విలీనం తోడ్పడుతుంది. విలీన సంస్థ దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవిస్తుంది. నెట్వర్క్, చౌక డిపాజిట్లు, అనుబంధ సంస్థల పరంగా ఈ మూడింటికి సానుకూలాంశాలు ఉన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలు, బ్రాండ్ ఈక్విటీకి పరిరక్షణ ఉంటుంది’’ అని కుమార్ వివరించారు. విలీన సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన మద్దతు కొనసాగుతుందని ఆయన చెప్పారు. విలీనానంతరం కూడా మూడు బ్యాంకులు స్వతంత్రంగానే కొనసాగుతాయన్నారు. ‘విలీన ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్నాళ్లు పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ గత విధానాలను, అనుభవాలను బట్టి చూస్తే.. 4–6 నెలలు పట్టొచ్చు. పరిస్థితిని బట్టి మరింత వేగంగా కూడా పూర్తి కావొచ్చు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. 5.71 శాతం ఎన్పీఏలు.. మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న బ్యాంకుల్లో దేనా బ్యాంక్ కూడా ఉంది. దీంతో దేనా రుణ కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ప్రకటించిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విజయ బ్యాంకు కూడా ఒకటి కావడం గమనార్హం. విలీన బ్యాంకు నికర మొండిబాకీలు 5.71 శాతం మేర ఉండనున్నాయి. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 12.25 శాతంగాను, టియర్1 క్యాపిటల్ 9.32 శాతంగాను ఉంటుంది. విలీన బ్యాంకుకు మొత్తం 9,500 శాఖలుంటాయి. ’మొండి’ పీఎస్బీలు .. దేశీయంగా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఉండగా.. వీటిలో ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. ఇక దేశీ బ్యాంకింగ్ రంగంలో మూడింట రెండొంతుల వాటా పీఎస్బీలదే ఉంటోంది. అలాగే, బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల్లో కూడా వీటి వాటా భారీగా ఉంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలను అందుకునేందుకు వచ్చే రెండేళ్లలో ఈ బ్యాంకులు కోట్ల కొద్దీ మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. పురోగామి చర్య: ఫిక్కీ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పురోగామి చర్యగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి.. పటిష్టమైన బ్యాంకింగ్ రంగం అత్యంత అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
బీవోబీ చీఫ్ పదవీకాలం పొడిగించే అవకాశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ, సీఈవో పీఎస్ జయకుమార్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన మూడేళ్ల పనితీరును మదింపు చేసిన అనంతరం ఈమేరకు తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లుగా ప్రైవేట్ రంగం నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఇద్దరు ప్రొఫెషనల్స్లో జయకుమార్ కూడా ఒకరు. 2015 అక్టోబర్లో బీవోబీ సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 12తో ముగియనుంది. జయకుమార్ బాధ్యతలు చేపట్టాక 11 త్రైమాసికాల్లో బీవోబీ నికరంగా రూ. 7,092 కోట్ల నష్టాల్ని ప్రకటించింది. -
రెట్టింపైన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన పనితీరు ప్రదర్శించింది. ఎన్పీఏలకు కేటాయింపులు తగ్గడంతో బ్యాంకు నికర లాభం రెట్టింపై రూ.528 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.3,102 కోట్ల మేర నష్టాలను ప్రకటించిన విషయం గమనార్హం. క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో రూ.203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో పోలిస్తే బ్యాంకు లాభం రెట్టింపునకు పైగా పెరిగింది. జూన్ క్వార్టర్లో మొత్తం ఆదాయం స్వల్ప పెరుగుదలతో రూ.12,787 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే 29 శాతం, క్రితం త్రైమాసికంతో పోలిస్తే 9.47 శాతం మేర పెరిగి రూ.4,381 కోట్లుగా ఉంది. దేశీయ నికర వడ్డీ ఆదాయ మార్జిన్ 2.93 శాతంగా, అంతర్జాతీయ కార్యకలాపాలపై వడ్డీ మార్జిన్ 2.65 శాతంగా ఉన్నాయి. ప్రధాన సేవల ఫీజు ఆదాయం కూడా 17 శాతం పెరిగి రూ.794 కోట్లుగా నమోదైంది. ఆస్తుల నాణ్యత: జూన్ క్వార్టర్లో బ్యాంకు మొండి బకాయిలు చెప్పుకోతగ్గ స్థాయిలోనే పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.40 శాతం నుంచి 12.46 శాతానికి చేరాయి. విలువ పరంగా రూ.55,874 కోట్లుగా ఉన్నాయి. ఇదే ఏడాది మార్చి క్వార్టర్లో ఉన్న రూ.56,480 కోట్లతో చూస్తే మాత్రం స్వల్పంగా తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా 5.17 శాతం నుంచి 5.40 శాతానికి (రూ.22,384 కోట్లు) పెరిగాయి. ఎన్పీఏలకు కేటాయింపులు రూ.1,760 కోట్లకు తగ్గాయి. ముఖ్యంగా ఐబీసీ కింద 26 ఎన్పీఏ ఖాతాలకు రూ.522 కోట్లను పక్కన పెట్టింది. ప్రొవిజన్స్, కంటింజెన్సీలు మొత్తం కలిపి రూ.2,477 కోట్లుగా ఉన్నాయి. జూన్ క్వార్టర్లో తాజాగా ఎన్పీఏలుగా మారిన రుణాల మత్తం రూ.2,868 కోట్లు. ఇదే కాలంలో రూ.2,579 కోట్ల మేర బకాయిలను వసూలు చేసుకుంది. రూ.546 కోట్ల విలువైన రుణాలను అప్గ్రేడ్ చేసింది. సంకేతాలన్నీ చూస్తే జూన్ క్వార్టర్ తమకు లాభదాయకమైనదని, దీన్ని నిర్థారించుకునేందుకు మరో క్వార్టర్ వేచి చూస్తామని బ్యాంకు చీఫ్ పీఎస్ జయకుమార్ తెలిపారు. -
స్వల్పంగా పెరిగిన బీఓబీ వడ్డీ భారం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేటు 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగింది. ఆర్బీఐ కీలక రెపో రేటు నిర్ణయానికి ఒకరోజు ముందు బీఓబీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజా నిర్ణయం ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) జూన్ 7 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో దీనికి అనుసంధానమైన గృహ, వాహన రుణ రేట్లు కొంత పెరిగే వీలుంది. ఈ పెంపు నేపథ్యంలో ఇకపై బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉండనుంది. రోజువారీ, నెల, మూడు నెలలు, ఆరు నెలల రేట్లు వరుసగా 7.95, 8, 8.1, 8.3 శాతాలుగా ఉంటాయి. ఇప్పటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్లుసహా పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా పెంచాయి. -
మొండిబాకీల్లో.. పోటాపోటీ!
ఐడీబీఐ బ్యాంకు ఇస్తున్న రుణాల్లో ప్రతి వంద రూపాయలకూ రూ.28 వరకూ నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏ) మారిపోతోంది. అంటే తిరిగి చేతికొస్తున్నది 72 రూపాయలే. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇస్తున్న 100 రూపాయల అప్పులో దాదాపు రూ.12.26 వరకూ ఎన్పీఏగా మారి... రూ.77.74 మాత్రమే చేతికొస్తోంది. ఈ రెండు బ్యాంకుల మొత్తం ఎన్పీఏలెంతో తెలుసా..? అక్షరాలా లక్షా పన్నెండువేల కోట్లపైనే!!. ఐడీబీఐ నష్టాలు రూ.5,663 కోట్లు మొండిబాకీలకు భారీ కేటాయింపుల వల్ల ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు మరింతగా పెరిగాయి. క్యూ4లో నికర నష్టాలు రూ.5,663 కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 జనవరి–మార్చి మధ్య నష్టాలు రూ.3,120 కోట్లు. తాజా క్యూ4లో బ్యాంకు ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.7,703 కోట్ల నుంచి రూ. 7,914 కోట్లకు చేరింది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) వాటా 21.25 శాతం నుంచి ఏకంగా 27.95 శాతానికి ఎగిసింది. నికర ఎన్పీఏలు కూడా 13.21 శాతం నుంచి 16.69 శాతానికి పెరిగాయి. విలువ పరంగా ఎన్పీఏలు రూ.55,588 కోట్లు. నాలుగో త్రైమాసికంలో ఎన్పీఏల కోసం కేటాయింపులు రూ. 6,054 కోట్ల నుంచి రూ. 10,773 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు షేరు 3 శాతం క్షీణించి రూ. 65.10 వద్ద ముగిసింది. బీఓబీ నష్టం రూ.3,102 కోట్లు మొండి బాకీలకు కేటాయింపులు పెరగటంతో నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.3,102 కోట్ల నష్టం ప్రకటించింది. 2016–17 క్యూ4లో రూ.155 కోట్ల లాభం నమోదు చేయటం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండిబాకీల కేటాయింపు ఏకంగా రూ.2,425 కోట్ల నుంచి రూ.7,052 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 12,852 కోట్ల నుంచి రూ. 12,735 కోట్లకు తగ్గింది. రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 10.46% నుంచి 12.26 శాతానికి పెరిగింది. విలువపరంగా చూస్తే.. రూ. 42,719 కోట్ల నుంచి రూ. 56,480 కోట్లకు చేరింది. నికర ఎన్పీఏలు 4.72% నుంచి 5.49 శాతానికి పెరిగాయి. శుక్రవారం బీఎస్ఈలో బీవోబీ షేరు 1.80 శాతం పెరిగి రూ. 141.20 వద్ద క్లోజయ్యింది. -
సింధు మీనన్పై చీటింగ్ కేసు
సాక్షి, బెంగళూరు: ‘చందమామ’ ఫేం, హీరోయిన్ సింధు మీనన్పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్ఎంసీ యార్డ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్ఎంసీ యార్డ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. ఆమె రుణం కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీనన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా.. ఆమె విదేశాల్లో ఉండటంతో వీలుకాలేదు. మీనన్ సోదరుడు కార్తికేయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
35 విదేశీ శాఖల మూసివేత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) విదేశీ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. లాభసాటిగా లేని 35 శాఖలు, రిప్రజెంటేటివ్ కార్యాలయాలను మూసివేశాయి. స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ విధానాల అమల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మొత్తం 216 విదేశీ శాఖలు, రెమిటెన్స్ సెంటర్లు మొదలైన వాటన్నింటినీ సమీక్షించి, క్రమబద్ధీకరించుకోవాలంటూ గతేడాది నవంబర్లో నిర్వహించిన పీఎస్బీ మంథన్లో బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తాజాగా బ్యాంకులు చర్యలు ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి 31 నాటికి.. పీఎస్బీలకు అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లు, ప్రాతినిధ్య కార్యాలయాలు కాకుండా 165 పైచిలుకు విదేశీ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి అత్యధికంగా 52 శాఖలు ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 50, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 29 ఉన్నాయి. పీఎస్బీ శాఖలు ఎక్కువగా బ్రిటన్ (32), హాంకాంగ్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (చెరి 13), సింగపూర్లో (12) ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ దుబాయ్ ఆఫీసు మూసివేత.. విదేశీ శాఖల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.. దుబాయ్లో తమ తమ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే పీఎన్బీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. షాంఘై ఆఫీసులు మూసివేశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అటు యాంగాన్, బోట్స్వానా కార్యకలాపాలు కూడా నిలిపివేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సైతం.. హాంకాంగ్ శాఖను మూసివేశాయి. -
సినిమాను తలపించేలా బ్యాంకు దోపిడీ
ముంబై : సినిమాలో చూపించేలా దుండగులు బ్యాంకు దోపిడికి పాల్పడ్డారు. ముంబైలో బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచు నుంచి రూ.3 కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. నేవి ముంబైలోని బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచులో నవంబర్12న ఈ దొంగతనం జరిగింది. ఈ సంఘటనపై సీసీటీవీ పుటేజి ఒకటి బయటపడింది. ఈ పుటేజీలో ముగ్గురు దుండగులు బ్యాంకు నుంచి నవంబర్ 12న ఉదయం పూట నగదును, ఇతర విలువైన వస్తువును పట్టుకొని వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దొంగతనం కోసం దుండగులు 25 అడుగుల సొరంగం కూడా తవ్వారు. ఈ సొరంగ మార్గం ద్వారా దొంగలు బ్యాంకు లాకర్ల వద్దకు చేరుకున్నారు. లాకర్ల నుంచి నగదును, విలువైన వస్తువులను దొంగలించారు. అనంతరం ఆ విలువైన వస్తువులను తీసుకుని నడక మార్గాన బయటికి వెళ్లినట్టు పోలీసు అధికారులు చెప్పారు. ఈ సొరంగ మార్గం బ్యాంకు స్టోర్ రూమ్కు వెలుపల ఉన్న ఒక పరిసర దుకాణం నుంచి తవ్వినట్టు తెలిసింది. ఈ బ్యాంకు స్టోర్ రూమ్ విలువైన వస్తువులను, డాక్యుమెంట్లను కాపాడటానికి ప్రజలకు అద్దెకిచ్చిన ప్రైవేటు లాకర్లను కలిగి ఉంది. బ్యాంకు స్టాఫ్ లాకర్ల వద్దకు వెళ్లినప్పుడు, దొంగతనం జరిగినట్టు గుర్తించారని, నవంబర్ 13 ఉదయం పూట ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
మెరుగుపడిన బీఓబీ రుణ నాణ్యత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా... ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. రుణ నాణ్యత మెరుగుపడినా... లాభం, ఆదాయం విషయంలో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో బ్యాంకు నికర లాభం 36 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.355 కోట్లకు పరిమితమయింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర లాభం తగ్గినట్లు బ్యాంకు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.12,047 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.12,490 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.3,721 కోట్లకు పెరిగింది. గత క్యూ2లో 2.12 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ2లో 2.31 శాతానికి చేరిందని, రిటైల్ రుణాలు 25 శాతం వృద్ధి చెందడంతో దేశీయ రుణాలు 14 శాతం పెరిగాయని, మొత్తం మీద 9 శాతం రుణ వృద్ధి సాధించామని బ్యాంకు తెలిపింది. ఇతర ఆదాయం 11 శాతం పెరుగుదలతో రూ.1,737 కోట్లకు, నిర్వహణ లాభం 13 శాతం వృద్ధితో రూ.3,042 కోట్లకు ఎగిశాయి. వడ్డీ, ఫీజు ఆదాయాలు పెరగడంతో నిర్వహణ ఆదాయం పెరిగినట్లు బ్యాంకు తెలియజేసింది. ఈ బ్యాంక్ రూ.459 కోట్ల నికర లాభం, రూ.3,520 కోట్ల నికర వడ్డీ ఆదాయం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. మెరుగుపడిన రుణ నాణ్యత క్యూ1లో 11.40 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 11.16 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు సైతం 5.17 శాతం నుంచి 5.05 శాతానికి తగ్గాయి. గతేడాది క్యూ2లో స్థూల మొండి బకాయిలు 11.35 శాతంగా, నికర మొండి బకాయిలు 5.46 శాతంగా ఉండటం గమనార్హం. సీక్వెన్షియల్గా చూస్తే, స్థూల మొండి బకాయిలు, పునర్వ్యస్థీకరణ రుణాలు తగ్గాయని బ్యాంకు వివరించింది. గత క్యూ2లో రూ.9.22 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం వ్యాపారం ఈ క్యూ2లో 5 శాతం పెరిగి రూ.9.71 లక్షల కోట్లకు చేరింది, డిపాజిట్లు రూ.5.67 లక్షల కోట్ల నుంచి రూ.5.83 లక్షల కోట్లకు ఎగిశాయి. పెరిగిన మొండి కేటాయింపులు... మొండి బకాయిలకు కేటాయింపులు గత క్యూ2లో రూ.1,796 కోట్లుగా ఉండగా... ఈ క్యూ2లో 30 శాతం పెరిగి రూ.2,329 కోట్లకు చేరాయి. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ఆశావహ అంచనాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ 1.5 శాతం లాభంతో రూ.174 వద్ద ముగిసింది. -
అమెజాన్లో విక్రేతలకు సూక్ష్మ రుణాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాతో టైఅప్ ► రూ. లక్ష నుంచి 25 లక్షల దాకా ముంబై: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ప్లాట్ఫాంపై ఉత్పత్తులు విక్రయించే విక్రేతలకు సూక్ష్మ రుణాల సహకారం అందించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్వైట్ ఓన్లీ (ఆహ్వానం) ప్రాతిపదికన మాత్రమే విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ తోడ్పాటుతో జులైలోనే అమెజాన్ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వార్షికంగా 10.45–11.5 శాతం దాకా వార్షిక వడ్డీ రేటుపై రూ. 1 లక్ష నుంచి రూ. 25 లక్షల దాకా రుణ లభ్యత ఉండగలదని అమెజాన్ తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార అవసరాలపై మంచి అవగాహన ఉన్నందున, అమెజాన్ ఇండియాలోని 2 లక్షల మంది పైగా విక్రేతలకు సమగ్రమైన బ్యాంకింగ్ సేవలు అందించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ పీఎస్ జయకుమార్ తెలిపారు. వచ్చే ఏడాది వ్యవధిలోగా 15–20 శాతం మంది అమెజాన్ సెల్లర్లు ఈ సదుపాయం ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు వివరించారు. అమెజాన్ పోర్టల్లో అమ్మకాల ట్రాక్ రికార్డు, కస్టమర్స్ ఫీడ్ బ్యాక్, నిబంధనలను పాటించడం మొదలైన అంశాల ప్రాతిపదికగా విక్రేతలకు ఈ పథకం కింద రుణ అర్హత వివరాలతో ప్రీ–అప్రూవ్డ్ ఆఫర్ బ్యాంకు నుంచి అందుతుంది. కార్యకలాపాలు విస్తరించే క్రమంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే నిధుల కొరత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ పథకం అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ గోపాల్ పిళ్లై తెలిపారు. -
రైతుల కోసం బీవోబీ, ఇఫ్కో కో–బ్రాండెడ్ డెబిట్ కార్డులు
రూ.2,500 ఓవర్డ్రాఫ్ట్ సౌలభ్యంతో.. న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇఫ్కో సంయుక్తంగా రైతుల కోసం కో–బ్రాండెడ్ డెబిట్ కార్డులను ఆవిష్కరించాయి. వీటికి ఒక నెల వరకు వడ్డీ లేకుండా రూ.2,500 ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఇరు సంస్థలు తెలియజేశాయి. ఇక 30 రోజులు దాటిన తర్వాత ఓవర్డ్రాఫ్ట్కు 8.60% వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. రైతుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను పెంచడానికి ఈ కార్డులను తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రెండు లక్షల కో–బ్రాండెడ్ కార్డులను జారీ చేస్తామని ఇరు సంస్థలు వివరించాయి. ఈ స్కీమ్ విజయవంతమైతే ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ను మరింత పెంచుతామని పేర్కొన్నాయి. కాగా రైతులు ఈ సౌలభ్యాన్ని పొందాలంటే ఆధార్ నెంబర్ ఇచ్చి, రూ.100 డిపాజిట్తో ‘బరోడా ఇఫ్కో కృషి సేవింగ్ బ్యాంక్ అకౌంట్’ను తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఈ కార్డులను ఏటీఎంలో కూడా ఉపయోగించొచ్చు. వీటిద్వారా ఇఫ్కో ప్రొడక్టులను కొనొన్చు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా టర్న్ ఎరౌండ్
ఎన్పీఏలకు కేటాయింపుల తగ్గుదల ప్రభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో టర్న్ ఎరౌండ్ అయ్యింది. గతేడాది ఇదేకాలంలో నికరనష్టాన్ని ప్రకటించిన బ్యాంకు తాజా త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరలాభాన్ని వెల్లడించింది. మొండి బాకాయిలకు కేటాయింపులు భారీగా తగ్గడంతో బ్యాంకు నికరలాభాన్ని సాధించగలిగింది. 2016 మార్చి క్వార్టర్లో బ్యాంకు రూ. 3,230 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 12,789 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలకు కేటాయింపులు రూ. 6,867 కోట్ల నుంచి రూ. 2,623 కోట్లకు తగ్గినట్లు బ్యాంక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. స్థూల ఎన్పీఏలు మాత్రం 9.99 శాతం నుంచి 10.46 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 5.06 శాతం నుంచి 4,72 శాతానికి తగ్గాయి. బ్యాంకు డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 1.20 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 2 శాతం క్షీణతతో రూ. 187 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి. -
సీబీఐ ఉత్తమ అధికారి లంచగొండిగా మారి..
న్యూఢిల్లీ: మంచి పనితీరుతో అవార్డు పొందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. సీబీఐ ముంబై విభాగం డీఎస్పీగా నీరజ్ అగర్వాల్ పనిచేస్తున్నారు. మెరుగైన పనితీరు కనబరిచినందుకుగానూ నీరజ్ అగర్వాల్ 2016 సంవత్సరానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు. ఈయన స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ ప్రదీప్షాకు సంబంధించిన కేసును విచారిస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పించటానికిగాను అగర్వాల్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి రూ.35 లక్షలు ఇచ్చేందుకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, దీనిపై బాధితుడు సీబీఐని ఆశ్రయించారు. సీబీఐ సూచనల మేరకు బుధవారం మొదటి విడతగా రూ.4 లక్షలు అందజేస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన తివారీ అనే వ్యక్తిపైనా కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
బ్యాంక్ బరోడాలో అవినీతి తిమింగలం!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.6.5కోట్ల నల్లధనాన్ని మార్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి చీఫ్ మేనేజర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని మండోలి ప్రాంతంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి చీఫ్ మేనేజర్ కొందరు ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి నిబంధనలకు వ్యతిరకేంగా వివిధ బ్యాంకు అకౌంట్లలోకి రూ.6.5 కోట్ల నగదును పంపి మార్పిడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పింది. విజిలెన్స్ అధికారులతో పాటు బ్యాంకులో చేసిన తనిఖీల్లో వివిధ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు తెలిసిందని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు ముందు వరకూ ఆయా అకౌంట్లలో తక్కువ నిల్వలు ఉన్నాయని ఆ తర్వాత అకౌంట్ల నగదు గణనీయంగా పెరిగిందని చెప్పింది. వీటిలో కొన్నింటికి కేవైసీ డాక్యుమెంట్లు జత చేయలేదని పేర్కొంది. ఇంకా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. -
రూ. 2 కోట్లకు ఆన్లైనేశాడు
ఖాతాదారుల సొమ్ము సొంత అకౌంట్లోకి తరలింపు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పేరిట బ్యాంక్ ఆఫ్ బరోడాలో మోసం ఆరు లక్షలతో కారు కొనుగోలు.. రూ.25 లక్షలు స్వాహా పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు షాద్నగర్ క్రైం: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు.. ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన వారిని పక్కదారి పట్టించింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటూ ఏకంగా బ్యాంకులోనే కౌంటర్ తెరిచారు. ఖాతాదారుల నుంచి నగదు తీసుకున్న వారు ఖాతాదారుల అకౌంట్లో జమ చేయకుండా తమ అకౌంట్లో వేసుకున్నారు. ఖాతాదారుల సొమ్ముతో ఖరీదైన కారు కొనుగోలు చేసిన ప్రబుద్ధులు చివరకు అడ్డంగా దొరికిపోయి పోలీసు విచారణలో ఉన్నారు.. వివరాల్లోకి వెళితే... ఫరూఖ్నగర్ మండల కేంద్రానికి చెందిన బుడ్డోల్ల శ్రీకాంత్ గౌడ్ పట్టణంలో గాంధీనగర్ కాలనీలో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న కొందుర్గు మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన బుడ్డోళ్ల శ్రీకాంత్ను పనిలో పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల్లో రద్దీ బాగా పెరగడంతో పట్టణానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తమ బ్యాంకులోనే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. దీంతో బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు చాలామంది గంటల తరబడి క్యూలో నిలబడలేక తమ వద్ద ఉన్న నగదును కౌంటర్లో ఉన్న బుడ్డోళ్ల శ్రీకాంత్కు ఇచ్చి కౌంటర్ ఫైల్ తీసుకుని వెనుదిరిగేవారు. ఈ తరహాలో నవంబరు 10 నుండి డిసెంబరు 21 వరకు 127 మంది ఖాతాదారులు మొత్తం రూ. 2 కోట్ల మేర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం శ్రీకాంత్కు ముట్టజెప్పారు. ఇదిలా ఉండగా ఎంతకీ తమ డబ్బులు సంబంధిత అకౌంట్లలో జమకాకపోవడంతో ఖాతాదారులు బ్యాంకు మేనేజరును సంప్రదించి విషయం ఏంటని వాకబు చేయగా అసలు విషయం బయట పడింది. ఖాతాదారుల నుండి తీసుకున్న నగదును వారి అకౌంట్లలో వేయకుండా శ్రీకాంత్ తమ సొంత సేవింగ్ ఖాతాలో జమచేసిన విషయాన్ని బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే అకౌంట్ ఫ్రీజ్ చేసి ఖాతాదారుల ఖాతాలకు డబ్బులు మార్పిడి చేశారు. ఖాతాదారుల నుంచి తీసుకున్న నగదులో రూ. 6 లక్షలను మహబూబ్నగర్కు చెందిన జై రామా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కారు కొనుగోలు కోసం ఆర్టీజీఎస్ ద్వారా నగదును ట్రాన్ఫ్ర్ చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. శ్రీకాంత్ సేవింగ్ ఖాతాలో ఉన్న నగదును బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంకా రూ. 25,91,694 లక్షల నగదు ఖాతాదారుల నుంచి తీసుకుని శ్రీకాంత్ తన సొంత అవసరాలకు వాడుకున్నాడని గుర్తించారు. ఈ మేరకు షాద్నగర్ పోలీసులకు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. -
ఏటీఎంలో డబ్బుల వర్షం
జైపూర్: డీమానిటైజేషన్, నగదు కొరతతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు రాజస్థాన్ లోని ఒక ఏటీఎం డబ్బుల వర్షం కురిపించడం కలకలం రేపింది. రాజధాని జైపూర్ కు సమీపంలోని టాంక్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఏంలో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తుల్ని లక్కీస్టార్స్ ని చేసేసింది. అడిగిన దానికంటే ఎక్కువగా భారీ మొత్తంలో నగదును అందించింది. దీంతో ఏటిఎం కేంద్రానికి వచ్చిన ప్రజలు హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులో రావడంతో భలే చాన్సులే.. లల..లల. లక్కీ ఛాన్స్ లే అంటూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అయితే 100 నోట్లకు బదులుగా రెండు వేల నోట్లు జారీ కావడంతో ఈ పరిణామం సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే జితేష్ దివాకర్ ఏటీఎంకు వెళ్లి.. 3500 కావాలని టైప్ చేశాడు. కానీ రూ 3,500 స్థానంలో రూ 70వేలు రావడంతో షాకయ్యాడు. దాదాపు ఇదే అనుభవం మిగిలినవారికి కూడా ఎదురైంది. అయితే ఏటీఎం మిషీన్ లో లోపాన్ని తండ్రి, ఇతర బంధువులకు చేరవేశాడు దివాకర్. వారు బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందించడంతో బ్యాంక్ సిబ్బంది అప్రమత్తయ్యారు. వెంటనే ఏటీఎంను మూసివేశారు. కానీ అప్పటికే రూ.6.76 లక్షలు విత్ డ్రా అయిపోయాయి. రూ.100 నోట్ల స్లాట్ లో రూ.2 వేల నోట్లను లోడ్ చేయడం వల్ల లోపం తలెత్తిందని బ్యాంక్ ప్రతినిధి హరిశంకర్ మీనా తెలిపారు. కానీ సాధారణంగా ఇలా జరగదనీ, సాంకేతికంగా రూ 100 కేసెట్ లో రూ 2వేల నోట్లు లోడ్ చేయడం సాధ్యం కాదని అందుకే ఈ తప్పిదంపై సాంకేతిక నిపుణులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. అలాగే ఏటీఎం మెషీన రికార్డుల అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారి సహకారంతో నగదును ఖాతాదారులనుండి తిరిగి రాబడతామ చెప్పారు. దివాకర్ ఒక్కరే తమకు సమాచారం అందించాడనీ.. మిగిలినవారు అదనపు నగదు తో ఇంటికి వెళ్లి మిన్నకుండిపోయారని మీనా వ్యాఖ్యానించారు. -
హెరిటేజ్ ఫుడ్స్తో బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన
-
చౌక వడ్డీరేట్లు ఆఫర్ చేసే బ్యాంకిదే!
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.. గృహరుణ వడ్డీ రేట్లలో అత్యంత చౌక రేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుగా ముందు నుంచి తెగ పేరుంది. ఆ పేరును ఇప్పుడు ఎస్బీఐ ప్రత్యర్థి బ్యాంకు ఆఫ్ బరోడా కొట్టేసింది. ఎస్బీఐ కంటే అత్యంత చౌక గృహ రుణ వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్న బ్యాంకుగా బ్యాంకు ఆఫ్ బరోడా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు తన కస్టమర్లకు ఆఫర్ చేసే గృహ రుణాలపై వడ్డీరేట్లు తక్కువగా 8.35 శాతంగా ఉన్నాయి.. వడ్డీరేట్లపై 70 బేసిస్ పాయింట్లను కట్ చేయడంతో ఈ రేట్లు 8.35 శాతానికి దిగొచ్చాయి. సిబిల్ స్కోర్(రుణం పొందాలనుకునే వారి విశ్వసనీయత) మెరుగ్గా ఉన్న కస్టమర్లకే ఈ వడ్డీరేట్లు త్వరగా అందుబాటులో ఉండనున్నాయని బ్యాంకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు భారీ ఎత్తున్న డిపాజిట్లు వెల్లువెత్తడంతో చాలా బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వంటివి కూడా వారి వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ క్రమంలోనే బ్యాంకు ఆఫ్ బరోడా కూడా వడ్డీరేట్లపై కోత పెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణాలపై 8.50 శాతం వడ్డీరేట్లను వసూలు చేస్తోంది. తగ్గిన వడ్డీరేట్ల ప్రకారం ఎస్బీఐ ఆఫర్ చేసే వడ్డీరేట్ల కంటే బ్యాంకు ఆఫ్ బరోడా ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లే చాలా చౌకగా ఉన్నాయని తెలిసింది. ఎలాంటి ఛార్జీలు అవసరం లేకుండానే బేస్రేట్లతో లింక్ అయిన రుణాలు , కొత్త ఎంసీఎల్ఆర్లోకి మార్చుకునే వెసులుబాటును కూడా ఈ బ్యాంకు ఆఫర్ చేస్తోంది. కానీ ఎస్బీఐ లాంటి ఇతర బ్యాంకులు కొత్త ఎంసీఎల్ఆర్లోకి మారడానికి ఫీజులు వసూలు చేస్తున్నాయి. -
బ్యాంకు అధికారులపై అల్లరిమూకల దాడి
-
బ్యాంకు అధికారులను చితక్కొట్టారు
అలహాబాద్ : బ్యాంకు అధికారులకు, ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలహాబాద్ బ్యాంకు శాఖ బయట రోడ్డుపైనే అధికారులు, ప్రజలు ఒక్కరినొక్కరూ కుమ్ములాడుకున్నారు. ఇద్దరు బ్యాంకు ఆఫ్ బరోడా అధికారులను తీవ్రంగా చితక్కొట్టారు. డబ్బులు ఇవ్వకుండా పదేపదే తిప్పించుకుంటున్నారని ఆగ్రహంతో ప్రజలు మండిపడ్డారు. ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ వాగ్వాద వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పాత నోట్లు రద్దైన దగ్గర్నుంచి ప్రజలు బ్యాంకుల ఎదుటే రోజుల తరబడి వేచిచూడటం, తీరా తమవద్దకు వచ్చే సరికి బ్యాంకుల్లో నగదు అయిపోయినట్టు అధికారులు చెప్పడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. గంటల కొద్దీ నిరీక్షణకు ఫలితం దక్కకపోవడంతో ప్రజలు బ్యాంకు అధికారులపై దాడికి పాల్పడుతున్నారు. ఇటీవలే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాల్దా శాఖను ప్రజలు ధ్వంసం చేశారు. అక్కడక్కడా బ్యాంకు శాఖ వద్ద ప్రజలు నిరసనలకు కూడా దిగుతున్నారు. -
బ్యాంకు అధికారులను చితక్కొట్టారు
-
దూసుకెళ్ళిన ప్రభుత్వ బ్యాంక్ షేర్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాలు నింగిని తాకుతున్నాయి .గురువారం నాటి మార్కెట్లో దేశీయ సూచీలు మెరుపులు మెరిపిస్తున్నాయి. మదుపర్ల భారీ కొనుగోళ్ళతో ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్ సూచీ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 9.56 పంజాబ్ నేషనల్ బ్యాంకు 9.19శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.73 శాతం ఎగిశాయి. ఓబీసీ, యూనియన్ బ్యాంక్, సిండికేట్, అలహాబాద్ బ్యాంక్ కూడా ఇదే బాటలో పురోగమిస్తున్నాయి. అలాగే కెనరా బ్యాంక్ 7 శాతం, ఐసీఐసీఐ 6 శాతం, హెడ్డీఎఫ్సీ, 2 శాతం జంప్ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కువ డిపాజిట్లు, ముఖ్యంగా తక్కువ ధర డిపాజిట్ల నమోదుతో బ్యాంకుల లాభాలు కొనసాగనున్నాయని కోటక్ సెక్యూరిటీస్ సీఈవో కమేలేశ్ రావు అభిప్రాయపడ్డారు. అయితే, రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్లోని బ్యాంకుల ఆస్తులపై అధిక ఒత్తిడి తప్పదని తెలిపారు. ప్రభుత్వ చర్యతో ద్రవ్యోల్బణం కట్టడవుతుందని, తద్వారా వడ్డీ రేట్లు తగ్గేందుకు వీలుచిక్కుతుందని, అంతేకాకుండా డిపాజిట్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు చర్య దోహదపడుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయంతో బుధవారం నాటి భారీ పతనంతో ఆకర్షణీయంగా ఉన్న ధరల్లో మదుపర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో మెటల్ షేర్లతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. -
మూడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా!
♦ కేవైసీ, ఏఎంఎల్ నిబంధనలు పాటించని ఫలితం ♦ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు రూ.2 కోట్ల జరిమానా ♦ బీఓబీకి రూ.5 కోట్లు, పీఎన్బీకి రూ.3 కోట్లు ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ స్థాయిలో జరిమానాలు విధించింది. యాంటీ మనీలాండరింగ్(ఏఎంఎల్) నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు, నో యువర్ కస్టమర్(కేవైసీ) నిబంధనలను సరిగ్గా పాటించనందుకు ఆర్బీఐ ఈ జరిమానాలు వడ్డించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.5 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్పై రూ.3 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై రూ. 2 కోట్ల చొప్పున ఆర్బీఐ జరిమానా విధించిందని ఆయా బ్యాంక్లు బీఎస్ఈకి నివేదించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్లో గత ఏడాది అక్టోబర్లో రూ.6,100 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. యాంటీ మనీలాండరింగ్ నిబంధనలకు సంబంధించి అంతర్గత నియంత్రణ వ్యవస్థ విఫలమైందని, అందుకే ఈ స్కామ్ చోటు చేసుకుందని బీఓబీ అంగీకరించింది. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. అనుమానాస్పద లావాదేవీల నివేదికలు(ఎస్టీఆర్-సస్పీసీయస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్)లు సమర్పించకపోవడం, సరై కేవైసీ పత్రాలు లేకుండా వివిధ సంస్థలకు ఖాతాలు ప్రారంభించే వెసులుబాటు కల్పించడం.. తదితర అవకతవకలను బీఓబీ లావాదేవీల్లో ఆర్బీఐ గుర్తించింది. రూ.5 కోట్ల జరిమానా వడ్డించింది. పెద్ద విషయం కాదు.. కాగా తమ బ్యాంక్ వ్యాపారం రీత్యా రూ.3 కోట్ల జరిమానా పెద్ద విషయం కాదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లకు నివేదించామని తెలిపింది. భవిష్యత్తులో ఏఎంఎల్, కేవైసీ నిబంధనల ఉల్లంఘన జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని పీఎన్బీ భరోసానిచ్చింది. రెమిటెన్సెస్లో పలు అవకతవకలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆర్బీఐ ఒక షోకాజ్ నోటీస్ను జారీ చేసింది. దీనికి సమాధానంగా హెచ్డీఎఫ్సీ సమర్పించిన సవివర నివేదికను మదింపు చేసింది. కేవైసీ, యాంటీ మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ హెచ్డీఎఫ్సీపై రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఇలాంటివి జరగకుండా తమ విధానాలను సమీక్షించుకుని, తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆర్బీఐ అన్ని వాణిజ్య బ్యాంకులనూ కోరింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఫారిన్ రిలేటెడ్ అక్రమాల కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పై రూ .5 కోట్లు జరిమానా విధించింది. బీఓబీ బీఎస్ఈకిచ్చిన నోటీసులో ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై విచారించిన ఆర్బీఐ విచారణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. తనపై నగదు డిపాజిట్లు, బదిలీల వివరాలను ఫైనాన్స్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సమర్పించిన లావాదేవీలను పర్యవేక్షించిన ఆర్బీఐ విదేశీ చెల్లింపులు జరిగినట్టు నిర్ధారించిందనీ, తాము విచారణకు పూర్తిగా సహకరించామని తెలిపింది. ఆర్బీఐ సూచనల మేరకు తమ ఈ లోపాలను సరిచేసుకోవడానికి అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. కాగా ఈ బ్యాంకుకు చెందిన అశోక్ విహార్ బ్రాంచ్ లో బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి 59 కరెంట్ ఖాతా హోల్డర్స్ , 33 ఖాతాలకు సంబంధించిన నగదు డిపాజిట్లు, బదిలీల వివరాలను ఫైనాన్స్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కి తెలిపినట్టు బీఓబీ ఉన్నతాధికారులు గతంలో వెల్లడించారు. ఈ అక్రమ లావాదేవీల్లో తమ ప్రమేయం లేదని బ్యాంకు అంతర్గత ఆడిటింగ్ లో ఈ వివరాలు తెలియడంతో సీబీఐ, ఈడీలకు తామే సమాచారం ఇచ్చామని బీఓబీ చెప్పింది. దీనిపై విచారించిన సీబీఐ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వివిధ శాఖల ద్వారా విదేశాలకు తరలించారని సీబీఐ వెల్లడించింది సుమారు రూ.6000 కోట్ల అక్రమాలు జరిగాయని, వీటిలో ఎక్కువగ భాగం తరలింపులు హాంగ్ కాంగ్ కు జరిగినట్టు ఈ ఏడాది మార్చిలో సీబీఐ నివేదించిన సంగతి తెలిసిందే. -
బ్యాంక్ ఆఫ్ బరోడాకు మన్మోహన్ సింగ్ నోటీసు
విజయ్ మాల్యాకు గ్యారంటర్గా ఉన్నానంటూ తన ఖాతాలను ఫ్రీజ్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడాపై పిలిభిత్కు చెందిన రైతు మన్మోహన్ సింగ్ పరువునష్టం దావా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముంబైలోని ప్రాంతీయ కార్యాలయానికి ఆయన ఒక లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగించినందుకు గాను 30 రోజుల్లోగా రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. ఖజురియా నవీరామ్ గ్రామానికి చెందిన మన్మోహన్ సింగ్ అనే రైతు విజయ్ మాల్యా తీసుకున్న రూ. 550 కోట్ల రుణానికి గ్యారంటర్గా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ముంబై ప్రాంతీయ కార్యాలయం గత డిసెంబర్ నెలలో కనుగొంది. దాంతో సింగ్ సేవింగ్స్ ఖాతాతో పాటు అతడి పంట రుణానికి సంబంధించిన ఖాతాను కూడా ఫ్రీజ్ చేయించింది. తనకు దాంతో ఏం సంబంధం లేదని.. తన ఖాతాలు పునరుద్ధరించాలని సింగ్ ఎన్నిసార్లు కోరినా, బ్యాంకు అధికారులు స్పందించలేదు. దీనివల్ల తన క్లయింటు విపరీతమైన ఒత్తిడికి లోనవడంతో పాటు ఆయన పరువుకు కూడా భంగం వాటిల్లిందని, అందువల్ల బ్యాంకు ఆయనకు పరువునష్టం కింద రూ. 10 లక్షల పరిహారంతో పాటు పంటరుణం రాకపోవడం వల్ల ఆయనకు కలిగిన నష్టం కింద మరో రూ. 24వేలు కూడా చెల్లించాలని సింగ్ తరఫు న్యాయవాది రామ్ పాల్ గంగ్వార్ తెలిపారు. తనకు బ్యాంకు ఖాతా లేకపోవడంతో చెక్కులు డ్రా చేసుకోలేనని, అందువల్ల తన చెరుకుపంటను కూడా ప్రభుత్వ సంస్థలకు కాకుండా తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చిందని.. దాంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని మన్మోహన్ సింగ్ చెప్పారు. తనలాంటి చిన్న రైతుకు ఇది చాలా పెద్ద నష్టమేనని అన్నారు. -
యూపీ రైతుకు మాల్యా దెబ్బ!
ఉత్తరప్రదేశ్ : ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు సర్దార్ మన్మోహన్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ జిల్లాలోని ఖజూరియా- నిబిరామ్ గ్రామానికి చెందిన రైతు. నాలుగు దశాబ్దాల కిందట పంజాబ్ నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. దీన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా నందగావ్ బ్రాంచీలో తనఖా పెట్టి కుమారుడి పెళ్లి కోసం మూడు లక్షల అప్పు తీసుకున్నాడు. వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించేశాడు. అయితే గత ఏడాది డిసెంబరులో నందగావ్ బీఓబీ శాఖ ఇతని రెండు ఖాతాలను స్తంభింపజేసింది. విషయం తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్లిన మన్మోహన్కు మేనేజర్ చెప్పిన సమాధానం విని కళ్లుబైర్లు కమ్మాయి. కింగ్ఫిషర్ అధినేత విజయ్మాల్యా తీసుకున్న వేల కోట్ల రుణాలకు మన్మోహన్ పూచీకత్తు ఇచ్చాడని, ఇతని పేరు కింగ్ఫిషర్ డెరైక్టర్లు, హామీదారుల జాబితాలో ఉందని మేనేజర్ చెప్పాడు. ఈ మేరకు ముంబైలోని నారీమన్ పాయింట్ రీజినల్ ఆఫీసు నుంచి తమకు సమాచారం వచ్చిందని, మన్మోహన్ ఖాతాలను స్తంభింపజేయాలని లేఖలో కోరారని నందగావ్ మేనేజర్ వివరించాడు. లబోదిబోమన్న మన్మోహన్ ఏడాదికి మూడులక్షలకు మించి ఆదాయం లేని తాను కోట్ల రూపాయల రుణానికి పూచీగా ఉండటమేమిటని మొత్తుకున్నాడు. అసలు తానెప్పుడూ యూపీనే దాటలేదని, మాల్యా ఎవరో ఇటీవల పత్రికల్లో వచ్చేదాకా తనకు తెలియదని వాపోయాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని ... తన ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని రాతపూర్వకంగా విన్నవించుకున్నాడు. ఒక ఖాతాలో నాలుగు వేల రూపాయలు, మరోదాంట్లో పన్నెండు వందలు ఉన్నాయని తెలిపాడు. ఇతని పూర్వాపరాలను వివరిస్తూ నారీమన్ పాయింట్ ఆఫీసుకు రాస్తే... ఇటీవలే ఖాతాలను పునరుద్ధరించమని అనుమతి ఇచ్చారట. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : బ్యాంకింగ్, ఐటీ, రియాల్టీ, ఆటో స్టాక్స్ లో కొనసాగుతున్న నష్టాలతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతోంది. అదేవిధంగా మార్నింగ్ ట్రేడ్ లో 100 పాయింట్ల రేజ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్ సైతం 63.94 పాయింట్లు నష్టపోతోంది. సెన్సెక్స్ 25,426 వద్ద, నిఫ్టీ 7,796 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా నాలుగో త్రైమాసికంలో రూ.3,230 కోట్ల నష్టాలను నమోదుచేస్తూ శుక్రవారం ఫలితాలను విడుదలచేయడంతో, నేటి ట్రేడింగ్ 7శాతం మేర ఆ బ్యాంకు షేర్లు పతనమవుతున్నాయి. మార్కెట్ విశ్లేషకులు అంచనావేసిన కంటే దారుణంగా దీని లాభాలు పడిపోయాయి. బ్యాంకు ఆప్ బరోడాతో పాటు యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, దేనా బ్యాంకులు మొండి బకాయిల బెడదతో క్యూ4 ఫలితాల్లో నిరాశను చూపాయి. దీంతో నిఫ్టీ పీఎస్ యూ ఇండెక్స్ 3శాతం కిందకు జారింది. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఏషియన్ పేయింట్స్, బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లాభాల్లో నడుస్తుండగా.. ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్ యూఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, గెయిల్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. పసిడి, వెండి ధరలు నేటి మార్కెట్లో పుంజుకున్నాయి. పసిడి రూ.63 పెరిగి రూ.30,097గా నమోదవుతుండగా... వెండి రూ.392 పెరిగి రూ. 41,366గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.85గా ఉంది. -
బ్యాంకులపై ‘బకాయిల’ బండ
♦ ఎన్పీఏలకు భారీ కేటాయింపులతో కుదేల్.. ♦ బ్యాంక్ ఆఫ్ బరోడాకు రెండో సారీ భారీ నష్టం ♦ అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులదీ ఇదే పరిస్థితి... చెన్నై/కోల్కత: ప్రభుత్వ రంగ బ్యాంక్లకు మొండి బకాయిలు మోయలేని భారం మోపుతున్నాయి. మొండి బకాయి(ఎన్పీఏ)లకు కేటాయింపులు అంతకంతకు పెరిగిపోతుండటంతో బ్యాంక్లకు భారీగా నష్టాలు వస్తున్నాయి. శుక్రవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన ఆరు బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు నష్టాలనే ప్రకటించాయి. మొండి బకాయిల కేటాయింపులు భారీగా ఉండటంతో ఈ బ్యాంక్లు లాభదాయకత దారుణంగా దెబ్బతిన్నది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, దేనా బ్యాంక్లు నికర నష్టాలు ప్రకటించగా, ఒక్క యూనియన్ బ్యాంక్కు మాత్రం నికర లాభాలు వచ్చాయి. ఈ ఐదు బ్యాంకుల నష్టాలు.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,751 కోట్లకు చేరాయి. నష్టాలు ప్రకటించడంతో ఈ బ్యాంక్ షేర్లు కూడా భారీగా క్షీణించాయి. వివరాలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం రూ.3,230 కోట్లు... మొండి బకాయిలకు భారీ కేటాయింపులతో బ్యాంక్ ఆఫ్ బరోడా కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.3,230 కోట్ల నికర నష్టం వచ్చింది. భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద త్రైమాసిక నష్టం. ఈ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,342 కోట్ల నికర నష్టం పొందింది. భారత బ్యాంకింగ్ చరిత్రలో అత్యంత పెద్ద త్రైమాసిక నష్టం ఇదే. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,057 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.12,789 కోట్లకు పెరిగింది. కేటాయింపులు రూ.1,817 కోట్ల నుంచి రూ.6,857 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 3.72 శాతం నుంచి 9.99 శాతానికి పెరిగాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సర పరంగా చూస్తే.., గత ఆర్థిక సంతవ్సరానికి రూ.5,386 కోట్ల నికర నష్టం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంతవ్సరంలో ఈ బ్యాంక్ రూ.3,398 కోట్ల నికర లాభం సాధించింది. మొత్తం ఆదాయం రూ.47,366 కోట్ల నుంచి రూ.49,060 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు రూ.16,261 కోట్ల నుంచి రూ.40,521 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.8,969 కోట్ల నుంచి రూ.19,406 కోట్లకు ఎగిశాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 1.7 శాతం క్షీణించి రూ.155 వద్ద ముగిసింది. అలహాబాద్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.581 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు ఈ బ్యాంక్ రూ.203 కోట్ల నికర లాభం ఆర్జించింది. కేటాయింపులు రూ.631 కోట్ల నుంచి నాలుగింతలై రూ.2,487 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.5,391 కోటల నుంచి రూ.5,051 కోట్లకు తగ్గింది. ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.621 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.743 కోట్ల నికర నష్టం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.21,712 కోట్ల నుంచి రూ.20,795 కోట్లకు తగ్గింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో అలహాబాద్ బ్యాంక్ షేర్ 1.6 శాతం క్షీణించి రూ.53 వద్ద ముగిసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఈ బ్యాంక్కు రూ.898 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.617 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4 రెట్లు పెరిగి రూ.2,287 కోట్లకు చేరాయి. స్థూల ఎన్పీఏలు 6.09% నుంచి 11.95%కి పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేర్ 0.8% క్షీణించి రూ.78 వద్ద ముగిసింది. యూనియన్ బ్యాంకు లాభం రూ.96 కోట్లు యూనియన్ బ్యాంక్(యూబీఐ)కు మాత్రం లాభాలు వచ్చాయి. 2014-15 ఏడాది క్యూ4లో రూ.444 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 78% తగ్గి రూ.96 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 4.96 శాతం నుంచి 8.7 శాతానికి, నికర మొండి బకాయిలు 2.71% నుంచి 5.25%కి పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.9,384 కోట్ల నుంచి రూ.8,885 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంక్ రూ.1,352 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే అంతక్రితం ఏడాది లాభం(రూ.1,782 కోట్లు)తో పోల్చితే తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ.35,607 కోట్ల నుంచి రూ.35,831 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 1.8 శాతం క్షీణించి రూ.116 వద్ద ముగిసింది. 15.43 శాతానికి యూకో బ్యాంక్ ఎన్పీఏలు ఎన్పీఏలు భారీగా పెరగడంతో యూకో బ్యాంక్కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,715 కోట్ల నికర నష్టం వచ్చింది. 2014-15లో ఇదే క్వార్టర్కు బ్యాంక్ రూ.209 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం రూ.రూ.5,263 కోట్ల నుంచి రూ.4,745 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.968 కోట్ల నుంచి 142 శాతం వృద్ధితో రూ.2,345 కోట్లకు పెరిగాయని బ్యాంక్ తెలిపింది. స్థూల ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 15.43 శాతానికి, నికర మొండి బకాయిలు 4.3 శాతం నుంచి 9.09 శాతానికి ఎగిశాయని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో యూకో బ్యాంక్ షేర్ 5.9 శాతం క్షీణించి రూ.34 వద్ద ముగిసింది. -
బ్యాంకింగ్లో అవకతవకలు నిజమే!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్లో పలు అవకతవకలు చోటుచేసుకుంటున్న అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టికి వచ్చింది. గత ఏడాది బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూఢిల్లీ అశోక్ విహార్ బ్రాంచ్లో చేటుచేసుకున్న రూ.6,100 కోట్ల దిగుమతుల చెల్లింపుల కుంభకోణం నేపథ్యంలో ఆర్బీఐ జరిపిన పరిశీలనలో తాజా అంశాలు వెలుగుచూశాయి. అనుమానాస్పద లావాదేవీల రిపోర్టుల (ఎస్టీఆర్) ఫైలింగ్లు సమర్పించకపోవడం, సమర్పించినా తీవ్ర ఆలస్యం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) మార్గదర్శకాలు పాటించకుండానే అకౌంట్ల ప్రారంభం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. బీఓబీ ఉదంతం తరువాత అన్ని వాణిజ్య బ్యాంకుల చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు ఆర్బీఐ ఒక లేఖ రాసింది. ప్రస్తుత విధానాలపై సమీక్ష జరపాలన్నది ఈ లేఖ సారాంశం. ఎటువంటి అవకతవకలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్బీఐ ఈ లేఖలో బ్యాంకింగ్కు సూచించింది. పీటీఐ ఫైల్ చేసిన ఒక ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా అందిన ఆర్బీఐ లేఖ ప్రతి ద్వారా ఈ అంశాలు తెలిశాయి. వివిధ బ్యాంకులనుంచి అంతర్గత ఆడిట్ నివేదికలను తెప్పించుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ తెలిపింది. -
ఏటీఎం కార్డు లేకున్నా డబ్బులు విత్డ్రా
నర్మెట : బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డులు జారీ చేయకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఖాతాదారుల సెల్కి మెసేజ్ వచ్చిన సంఘటన వరంగల్ జిల్లాలో మంగళవారం జరిగింది. జిల్లాలోని నర్మెట మండలంలోని ఎల్లండ గ్రామానికి చెందిన దొండకాయల గట్టయ్య బ్యాంక్ అఫ్ బరోడా నర్మెట శాఖలో ఖాతా తెరిచాడు. అతనికి బ్యాంకు అధికారులు ఇప్పటివరకు ఏటీఎం కార్డు జారీ చేయలేదు. అయితే అకౌంట్ నుంచి రూ. 1800 ఏటీఎం ద్వారా విత్డ్రా అయినట్లు ఆయన సెల్కు ఓ మెసేజ్ వచ్చింది. అదే విధంగా అదే గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మయ్య ఖాతా నుంచి కూడా 900 విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. వీరిద్దరికి ఏటీఎం కార్డులు జారీ చేయకుండా శాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం ఏమిటని వారు బ్యాంక్ అధికారులను నిలదీశారు. అయితే సంఘటనపే విచారణ చేస్తున్నామని బ్యాంక్ అధికారులు తెలిపారు. -
బీఓబీ లాభం 89 శాతం డౌన్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 89% క్షీణించింది. గత క్యూ2లో రూ.1,104 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.124 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పడిపోయిందని వివరించింది. గత క్యూ2లో రూ.11,817 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ. 12,300కు ఎగసిందని పేర్కొంది. ఢిల్లీలోని అశోక్ విహార బ్రాంచ్లో రూ.11 కోట్ల మోసాన్ని గుర్తించామని, ఆర్బీఐకు నివేదించామని తెలిపింది. ఒక రుణ గ్రహీత రూ.374 కోట్ల ఖాతాకు గాను 25% మొత్తానికి(రూ.94 కోట్లు)కు కేటాయింపులు జరిపామని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.32% నుంచి 5.56%కి పెరిగాయని వివరించింది. -
విచారణ పూర్తయితేనే.. లోతు తెలిసేది: జైట్లీ
ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా నల్లధనం బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, ఎస్ఎఫ్ఐఓలు జరుపుతున్న విచారణ పూర్తయిన తర్వాతే... ఈ కేసు తీవ్రత ఎంతన్నది తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రి తెలిపారు. బీవోబీకి చెందిన కొందరు అధికారులు 59 మంది ఖాతాదారులతో కుమ్మక్కై విదేశాలకు (ముఖ్యంగా హాంకాంగ్కు) సుమారు రూ. 6,000 కోట్ల పైచిలుకు రెమిటెన్సులు అక్రమంగా పంపారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. నకిలీ కంపెనీలు ఏర్పాటు చేయ డం, ఎగుమతుల విలువను ఎక్కువ చేసి చూపించి ఆ తర్వాత సుంకాలపరమైన ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడం వంటి ఆరోపణలతో పలువురు అరెస్టయ్యారు. నిజాలు నిగ్గుతేలే దాకా బీవోబీపై విచారణ: రాజన్ నిందితులకు శిక్షపడే దాకా, నిజాలు నిగ్గుతేలే దాకా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెమిటెన్సుల కేసులో విచారణ కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. వేగంగా స్పందించకపోతే ఇలాంటి మోసాలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు, బీవోబీ కేసులో రెమిటెన్సుల మొత్తం.. ముందుగా భావించినట్లు రూ. 6,000 కోట్లు కాకుండా రూ. 3,500 కోట్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పేర్కొన్నారు.