Urvashi rautela
-
ఊర్వశి మరో ఐటమ్ సాంగ్.. ఈసారి 'జాట్' కోసం
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని లేటెస్ట్ మూవీ 'జాట్'. ప్రముఖ హిందీ హీరో సన్నీ డియోల్ ఇందులో నటించాడు. టాలీవుడ్ కి చెందిన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి. ఇదివరకే టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొలి గీతాన్ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మాస్ పాటో, మెలోడీ సాంగ్ కాకుండా ఐటమ్ పాటని విడుదల చేశారు. టచ్ కియా అంటే సాగే ఈ పాటలో ఊర్వశి రౌతేలా హస్కీ స్టెప్పులేసింది. తమన్ ఈ చిత్రానికి సంగీతమందించాడు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీలో సయామీ ఖేర్, రెజీనా హీరోయిన్లు కాగా.. రణదీప్ హుడా కీలక పాత్రలో నటించాడు.(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి) -
రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా..
బాసూ.. వేర్ ఈజ్ ద పార్టీ.. అంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఐటం సాంగ్స్కు పెట్టింది పేరైన ఈ బ్యూటీ ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో అలరించింది. ఇటీవలే డాకు మహారాజ్ మూవీలో కీలక పాత్రలో నటించడంతో పాటు దబిడి దిబిడి పాటతో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఊర్వశి ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కారు విలువ అన్ని కోట్లా?భారత్లో ఏ నటికి సాధ్యం కాని రీతిలో ఏకంగా రూ.12 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కులినన్ను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఈ కారు సొంతం చేసుకున్న మొట్టమొదటి నటిగా ఊర్వశి రికార్డుకెక్కనుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్లోనూ స్థానం దక్కించుకున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో వెల్కమ్ టు ద జంగిల్, కసూర్ 2 చిత్రాలున్నాయి. ఊర్వశి ఇటు సినిమాల్లో యాక్ట్ చేస్తూ, స్పెషల్ సాంగ్స్ చేయడమే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది.విమర్శలపాలైన ఊర్వశిడాకు మహారాజ్ సినిమా రూ.100 కోట్లపైనే వసూళ్లు రాబట్టినప్పుడు ఊర్వశి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన సినిమా సెంచరీ దాటిందని గర్వపడిపోయింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి గురించి స్పందించమన్నప్పుడు కూడా డాకు మహారాజ్ సినిమా గురించి చెప్తూ సొంత డబ్బా కొట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత తనకు తల్లి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిందని చూపించింది. ఇలాంటివి చేతికి ధరించి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని కామెంట్స్ చేసింది. సైఫ్పై సానుభూతి చూపించకుండా తన బహుమతులను చూపిస్తూ షోఆఫ్ చేయడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె తన తప్పిదం తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. సైఫ్పై దాడి తీవ్రత తెలియకుండా మాట్లాడినందుకు క్షమించమని కోరింది.చదవండి: చిల్లిగవ్వ లేదు.. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పని చేశాం: హీరోయిన్ -
డాకు మహారాజ్ బ్యూటీ గొప్ప మనసు .. ఏకంగా 251 మంది అమ్మాయిలకు!
ఈ ఏడాది డాకు మహారాజ్తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా దబిడి దిబిడి సాంగ్తో అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్లో మెరిసిన ముద్దుగుమ్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల తన పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసుకుంది.అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా తన మంచి మనసును చాటుకుంది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహోన్నత కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వదించారు. దాదాపు 251 జంటలకు సామూహిక వివాహం జరిపించనట్లు ఊర్వశి రౌతేలా వెల్లడించారు. అంతేకాదు తానే స్వయంగా వారికి భోజనాలు కూడా వడ్డించింది బాలీవుడ్ భామ. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశి చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025 -
క్రికెట్ స్టేడియంలో ఊర్వశీ దబిడిదిబిడి..
-
క్రికెట్ స్టేడియంలో ఊర్వశీ దబిడిదిబిడి.. ఓరీ ఎంత పనిచేశావ్..!
-
ఊర్వశి రౌతేలా నీ ఫాలోయర్లు వేస్ట్...!
ఒక సినిమాకు కలెక్షన్లు రావాలంటే ఏం చేయాలి? అనగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల నుంచి ఠక్కున వచ్చే సమాధానం... భీభత్సంగా ప్రమోషన్ చేయాలి. సోషల్ మీడియాలో, టీవీ షోస్లో, ఓటీటీ ప్లాట్ఫార్మ్స్లో, క్లబ్బులూ కాలేజీలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలైతే అంతగా ప్రమోట్ చేయాలి...మరి అంత భారీగా ప్రమోషన్ చేసిన సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయ్? ఏ ప్రమోషన్ లేకుండా వచ్చిన సినిమాలు ఎందుకు కోట్లు కొల్లగొడుతున్నాయ్? అని అడిగితే మాత్రం సమాధానం దొరకదు. ఇటీవలే దీనిపై సీనియర్ బాలీవుడ్ నటుడు ఒకరు చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.(చదవండి: తేళ్లు, బొద్దింకలు తిన్నాను.. తెలుగు హీరోయిన్)ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు జావేద్ జాఫ్రి(Jaaved Jaaferi ) మాట్లాడుతూ ఈ తరహా ప్రమోషన్లను ఏ మాత్రం పనికిరావంటూ తీసిపారేయడం విశేషం. రకరకాల మాధ్యమాల్లో మార్గాల్లో చేసే ప్రమోషన్లు వృధా ప్రయాసేనని ఆయన తేల్చేశాడు. స్టార్లను వెర్రిగా అభిమానిస్తారని అందరూ భావించే ఇన్స్టా ఫాలోయర్ల సంఖ్య సైతం కలెక్షన్లకు ఉపకరించదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా దబిడి దిబిడి నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela )ను ఉదాహరణగా పేర్కొంటూ ఆమెకి ఇన్స్టాగ్రామ్లో 72 మిలియన్ల మంది ఫాలోయర్లు కలిగి ఉన్నారని, ఆమె ఫాలోయర్లలో కోటి మంది అంటే 10 మిలియన్ల మందిని తీసుకున్నా, ఆ 1 కోటి మంది రూ. 250 సినిమా టికెట్ కొంటే ఆమె ప్రతీ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసేది కదా?అని ఆయన ప్రశ్నించాడు. ఇటీవల ఊర్వశి నందమూరి బాలకృష్ణతో తెలుగు చిత్రం డాకు మహారాజ్లో నటించింది అంతేకాక సినిమా ప్రమోషన్లో ఆమె చురుగ్గా పాల్గొంది కూడా. అయితే కేవలం ప్రమోషన్లు మాత్రమే సినిమా విజయాన్ని ఖరారు చేయవని జావేద్ నొక్కిచెప్పారు. ‘‘మేం కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి కాలేజీలకు ఇంకా చాలా చోట్లకు వెళతాం. కానీ అది ఫలితాలను ఇవ్వదని చాలా సార్లు రుజువైంది’’ అని చెప్పిన ఆయన ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోషన్ చేయడంలో ఉత్సాహం చూపని రజనీకాంత్ను ఉదాహరణగా చూపించాడు. ‘‘రజనీకాంత్ సాబ్.. అతిపెద్ద స్టార్. ఆయన తన సినిమాను ఎక్కడ ప్రమోట్ చేస్తాడు? మరి ఆయన సినిమాలు కలెక్షన్లు ఎందుకు సాధిస్తున్నాయి?’’ అంటూ ప్రశ్నించాడు. మంచి సినిమా అయితే కొన్ని రోజుల పాటు రన్ అవుతుంది.ప్రమోషన్లు ఎంత చేసినా కానీ కొన్నిసార్లు కొంతమంది స్టార్లకు సరైన ఓపెనింగ్ కూడా లభించదు, ’’అని ఆయన చెప్పాడు.సరే ప్రమోషన్లు వృధా ప్రయాసే అనుకుందాం. మరి కలెక్షన్లు రావాలంటే.. సరైన మార్గం ఏమిటి? అంటే ఆయన సమాధానం ట్రైలర్. అవును... సినిమా అమ్ముడుపోయేలా చేసేది ట్రైలర్ మాత్రమే. నాకు ట్రైలర్ నచ్చితే నేను సినిమా చూస్తాను, అంతే తప్ప హీరో/హీరోయిన్లు ఏదైనా టీవీ షోకి లేదా డ్యాన్స్ షోకి వచ్చి హడావిడి చేసినంత మాత్రాన నేను పట్టించుకోను. సో..ట్రైలర్ మాత్రమే సినిమాకి కలెక్షన్లను రప్పిస్తుంది ’’అని అంటూ జావేద్ జాఫ్రి చెప్పాడు. -
హీరోయినే కానీ ఎప్పుడూ రూమర్స్, వివాదాలతోనే సావాసం (ఫొటోలు)
-
క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆట కాదు..భావోద్వేగాల యుద్దం. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా.. ఇండియా, పాకిస్తానే కాదు ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం(ఫిబ్రవరి23 ) పాకిస్తాన్తో భారత్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ని ప్రత్యేక్షంగా తిలకించేందుకు సామాన్య క్రికెట్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది దుబాయ్ వెళ్లారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, సుకుమార్, ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)తో పాటు మరికొంతమంది తారలు హాజరయ్యారు. అయితే వీరందరిలో ఊర్వశి రౌతేలా మాత్రమే అందరికి కళ్లను తనవైపుకు తిప్పుకునేలా చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ చేయడంతో పాటు తన బర్త్డే వేడుకను కూడా అక్కడే జరుపుకోవడంతో ఈ బాలీవుడ్ భామసెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.మైదానంలో ‘దబిడిదిబిడి’ స్టెప్పులుబాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషించడంతో పాటు ‘దబిడి డిబిడి’ అనే ఐటం సాంగ్కి స్టెప్పులేసింది. ఆ స్టెప్పులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడంపై నెటిజన్స్ మండిపడ్డారు. అయినా కూడా బాలయ్యతో పాటు చిత్రబృందం ఎవరూ స్పందించలేదు. ఇక తాజాగా ఇదే పాటకు క్రికెట్ స్టేడియంలో మరోసారి స్టెప్పులేసింది ఊర్వశి.ఓరీ..అదేం పనిఊర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా భారత్ ఆడిన చాలా మ్యాచ్ లలో మెరిసింది. ఇక తాజాగా దుబాయ్లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్లో ఓరీ(Orry)తో కలిసి డబిడి డిబిడి పాటకు స్టెప్పులేసింది. కిక్కిరిసిన స్టేడియంలో డాన్స్ చేస్తుండగా.. ఓరీ సడెన్గా ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఊర్వశి షాక్ అయింది. కొద్ది క్షణాలు అలానే ఆశ్చర్యంగా చూసింది. అనంతరం మళ్లీ సరదగా చిందులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry)ఎవరీ ఓరీ?ఓర్హాన్ అవత్రమని(Orhan Awatramani)... సింపుల్గా ఇతడిని ఓరీ అని పిలుస్తుంటారు.న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్గా పని చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, గ్రాఫిక్ డిజైనర్గా రకరకాలుగా పని చేసిన ఇతడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నాడు. బాలీవుడ్ తారల ప్రతి పార్టీలోనూ ఓరీ కనిపిస్తాడు. చిత్ర విచిత్ర పోజులు ఇస్తూ వారిని నవ్విస్తాడు. -
భలే చాన్స్?
‘వేర్ ఈజ్ ద పార్టీ.. బాసూ వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని ‘వేర్ ఈజ్ ద పార్టీ..’ అంటూ సాగే ప్రత్యేక పాటలో ఆడిపాడారామె. ఆ తర్వాత ‘ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో అలరించారు.ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రంలో ఊర్వశి ఓ కీలక పాత్ర చేయడంతో పాటు ‘దిబిడి దిబిడి’ పాటలో తనదైన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘ఎన్టీఆర్ నీల్’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటించే భలే చాన్స్ని ఊర్వశీ రౌతేలా అందుకున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తర్వాతి షెడ్యూల్లో ఆమె పాల్గొంటారని టాక్. -
భారత్- పాక్ మ్యాచ్.. ఊర్వశి రౌతేలా క్రేజీ రికార్డ్!
భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఐదేళ్ల కుర్రాడి నుంచి డెబ్బై ఏళ్ల ముసలోళ్లు కూడా వదిలిపెట్టరు. మ్యాచ్ ఎప్పుడు మొదలతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రపంచ క్రికెట్లోనే అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ఏదైనా ఉందంటే ఇండియా- పాకిస్తాన్ పోరు మాత్రమే. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్లు లేనందువల్ల అప్పుడప్పుడు వచ్చే ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే తలపడుతున్నారు దాయాది జట్లు. మరి ఎప్పుడో ఒకసారి చాలా అరుదుగా వచ్చే ఈ మ్యాచ్ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతో పాటు క్రీడా అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక మ్యాచ్ లైవ్లో చూసేవారికి ఆ థ్రిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ను మరింత స్పెషల్గా మార్చుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా స్పెషల్? అనేది తెలియాలంటే మీరు లుక్కేసేయండి మరి.తాజాగా ఆదివారం దుబాయ్లో జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. ఇటీవల డాకు మహారాజ్తో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ సడన్గా మ్యాచ్లో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవితో సహా డైరెక్టర్ సుకుమార్, పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ మ్యాచ్ లైవ్లో అభిమానులు వీక్షించారు.అయితే చాలా మంది సెలబ్రిటీలు ఈ మ్యాచ్కు హాజరైనప్పటికీ అందరి కళ్లు ఊర్వశి రౌతేలాపైనే ఉన్నాయి. ఈ బాలీవుడ్ భామ దుబాయ్లో జరిగిన మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. టీమిండియా- పాక్ మ్యాచ్లో ఏకంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఫిల్మ్ ఫేర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్స్ ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తొలి సెలబ్రిటీ అంటూ..భారత్- పాక్ మ్యాచ్లో పుట్టినరోజు జరుపుకున్న తొలి సెలబ్రిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో రికార్డ్ సృష్టిస్తే.. ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఊర్వశి తొలిసారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని సరికొత్త రికార్డ్ నెలకొల్పిందని అంటున్నారు. మరికొందరైతే ఊర్వశి రౌతేలాపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆఖరికి ఫిల్మ్ ఫేర్ వాళ్లు కూడా ఊర్వశిపై జోకులు వేస్తున్నారని మరికొందరు రాసుకొచ్చారు. కొందరు రిషబ్ పంత్ పేరును కూడా కామెంట్స్లో ప్రస్తావిస్తున్నారు. అయితే ఆమెపై ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ.. చివరికీ బాలీవుడ్ భామ మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్లో అందర దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఇటీవల టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఊర్వశి రౌతేలా బర్త్ డే ఈనెల 25న కాగా.. ముందుగానే స్టేడియంలో సెలబ్రేట్ చేసుకుని హైలెట్గా నిలిచింది. #ViratKohli broke several records during the India vs Pakistan match yesterday but #UrvashiRautela became the first actress to celebrate her birthday during an #IndvsPak cricket match. 🤣#Trending #indvspak #indiavspakistan #iccchampionstrophy pic.twitter.com/OLjHILtvgh— Filmfare (@filmfare) February 24, 2025 -
సుకుమార్ చేయి వదలని ఐటమ్ బ్యూటీ.. వీడియో వైరల్
ఆదివారం ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఫీవర్ నడిచింది. దుబాయిలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు సెలబ్రిటీలు కూడా వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి, ఫ్యామిలీతో కలిసి దర్శకుడు సుకుమార్ కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఇదే మ్యాచ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా సందడి చేసింది. తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు సుకుమార్ ని కూడా గట్టిగానే కాక పట్టేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది. ఎందుకంటే సుకుమార్ ని కలిసిన ఆనందంలో ఆయన చేయి పట్టుకున్న ఊర్వశి.. కాసేపటి వరకు అస్సలు వదల్లేదు. ఆ వీడియోనే తన ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.సుకుమార్ ని కలిసిన వీడియోని పోస్ట్ చేసిన ఊర్వశి.. ఈయన్ని తెగ పొగిడేసింది. 'సుకుమార్ గారు మీరు సాధించిన విజయాలకు శుభాకాంక్షలు. మీ మేధస్సు, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో స్పూర్తి కలిగిస్తున్నాయి. మేమంతా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం' అని రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)ఈ మధ్యే సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి అంటూ ఐటమ్ పాటకు స్టెప్పులేసిన ఊర్వశి.. బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పనిలో పనిగా సుకుమార్ ని కూడా కాకా పట్టేసి తెలుగు ఇండస్ట్రీలో సెటిలైపోయే ప్లాన్ ఏమైనా వేస్తుందా అనిపిస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 241 పరుగులు చేసింది. ఛేదనలో కొన్ని ఓవర్లు మిగిలుండగానే భారత్ గెలిచేసింది. కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: 'హిట్ 3' టీజర్ రిలీజ్.. అస్సలు ఊహించలే!) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
తారలు తరలి వెళ్లారు...
దుబాయ్: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్ ధావన్, వెంకటేశ్ ప్రసాద్... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుకుమార్, బాలీవుడ్ నుంచి హీరోయిన్ సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి రాగా, వివేక్ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్కర్డ్ సంగ్మా, త్రిపుర వెస్ట్ నియోజకవర్గం లోక్సభ సభ్యుడు బిప్లాబ్ కుమార్ దేబ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పాప్ సింగర్ జాస్మిన్ వాలియా, బాలీవుడ్ చిత్ర గీతాలతో పాపులర్ అయిన పాకిస్తాన్ సింగర్ అతీఫ్ అస్లామ్ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది, ఇమాద్ వసీమ్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె భక్తావర్ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసీమ్ ఖాన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తదితరులు మ్యాచ్ను తిలకించిన వారిలో ఉన్నారు. -
డాకు మహారాజ్ బ్యూటీకి అన్యాయం? ఓటీటీలో ఆమె సీన్స్ కట్!
సంక్రాంతి హిట్ బొమ్మ డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి రానుంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా రాబట్టింది. థియేటర్లో అదరగొట్టిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 21న) ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. అయితే ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్లో ఊర్వశి రౌతేలాను మిస్ చేయడంతో ఫ్యాన్స్ ఫైరయ్యారు. దీంతో మరో పోస్ట్లో ఊర్వశి రౌతేలా సహా డాకు మహారాజ్ మూవీలో నటించిన ప్రధాన పాత్రలు అందరూ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.ఊర్వశికి అన్యాయం?ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ మూవీలో కేవలం ఐటం సాంగ్లో ఆడిపాడటమే కాకుండా ఓ కీలక పాత్రలోనూ నటించింది. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్కూ హాజరైంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆమెకు మరోసారి భంగపాటు ఎదురుకానుందట! ఆమె నటించిన సీన్లు ఓటీటీలో కనిపించవంటూ ప్రచారం జరుగుతోంది. ఊర్వశి నటించిన సన్నివేశాలను నెట్ఫ్లిక్స్ నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోందని రూమర్లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడిందని, ప్రతి ప్రమోషన్కు హాజరైందని, అలాంటి తనకు ఎందుకింత అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. డాకు మహారాజ్అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. థియేటర్లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని యథాతథంగా ఓటీటీలోనూ విడుదల చేస్తున్నారట. అంటే ఊర్వశితో బాలయ్య నటించిన సన్నివేశాలు, డ్యాన్స్ స్టెప్పులు ఓటీటీలోనూ చూడొచ్చన్నమాట! డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.చదవండి: 19 ఏళ్ల వయసులో బట్టతల.. భరించలేకపోయా: ఛావా నటుడు -
డాకు మహారాజ్ ఓటీటీ పోస్టర్.. ఆమె లేకపోవడంపై నెటిజన్స్ ఫైర్!
నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాదిలో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వళి రౌతేలా ప్రత్యేక పాత్రలో మెరిసింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు.అయితే ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్ల్ వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్లో కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫోటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్లో అభిమానులను ఓ ఊపు ఊపేసిన ఊర్వశికి ఇచ్చే గుర్తింపు ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాకు మహారాజ్ పోస్టర్ను ఉద్దేశించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్ నుంచి తీసేస్తారా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఉన్నారా?.. మరి పోస్టర్లో కనిపించడం లేదంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. దబిడి దిబిడి సాంగ్ డ్యాన్స్ చేస్తూ పోస్టర్ బయటికి వెళ్లిపోయిందంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తానికి డాకు మహారాజ్ పోస్టర్లో బాలీవుడ్ భామ ఫోటో లేకపోవడం ఫ్యాన్స్తో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju! Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025 -
హీరోయిన్ పెళ్లి వీడియో, ఒంటినిండా నగలతో దబిడి దిబిడి బ్యూటీ
ఛావా సినిమా ప్రమోషన్స్లో రష్మిక మందన్నాపెళ్లి వీడియో షేర్ చేసిన పార్వతి నాయర్గ్రీన్ స్వెట్షర్ట్లో శ్రీలీలషాపింగ్మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దబిడి దిబిడి ఐటం సాంగ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాస్టెప్పులతో అదరగొట్టిన ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Alex (@alexander.mcube) View this post on Instagram A post shared by Nidhi Agarwal (@nidhiagarwal_) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
ప్రకృతిని ఆస్వాదిస్తోన్న దేవర భామ.. నేపాల్లో శ్రియా శరణ్ చిల్!
ప్రకృతి అందాలు ఆస్వాదిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్..రాయ్పూర్లో డాకు మహారాజ్ భామ ఊర్వశి రౌతేలా..సమంత బ్లాక్ అండ్ వైట్ లుక్స్..బ్లాక్ డ్రెస్లో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్..ఫ్యామిలీతో నేపాల్లో చిల్ అవుతోన్న శ్రియా శరణ్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
బ్లూ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటీ.. మహబూబ్ నగర్లో డాకు మహారాజ్ భామ!
విదేశీ పర్యటనలో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్..మహాకుంభ్ మేళాలో బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..బ్లూ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్ లుక్స్..మహబూబ్నగర్లో డాకుమహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..కళ్లతోనే ఆకట్టుకుంటోన్న హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
డాకు మహారాజ్ బ్యూటీపై మళ్లీ ట్రోలింగ్.. ఇక మారవా?
'డాకు మహారాజ్' (Daaku Maharaaj Movie) సక్సెస్తో ఆనందంలో మునిగి తేలిపోతుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఎంతలా అంటే.. సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోనంతగా! ఇటీవల బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి జరిగిన విషయం తెలిసిందే కదా! ఓ ఆగంతకుడు ముంబైలో సైఫ్ ఇంట్లో చొరబడి అతడిని దారుణంగా కత్తితో పొడిచి అక్కడినుంచి పరారయ్యాడు. నటుడికి సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక దగ్గర విరిగిన కత్తి మొనను శరీరంలో నుంచి వేరు చేశారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.వజ్రపు ఉంగరం చూపిస్తూ..ఇకపోతే ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా (Urvashi Rautela)కు.. సైఫ్పై దాడి గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడామె సైఫ్పై దాడి దురదృష్టకరం అని చెప్తూనే.. నాకు మా అమ్మ డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చింది తెలుసా? అన్నట్లుగా.. చేతికున్న వజ్రపు ఉంగరాన్ని చూపించింది. అలాగే మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ కూడా ఇచ్చారు. కానీ వీటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరైనా సైఫ్పై దాడి చేసినట్లే మనపైనా అటాక్ చేస్తారనే భయం ఉంటుంది అని మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రియుడితో ఏడడుగులు..)తెలియక మాట్లాడా..ఆయనపై జరిగిన దాడి గురించి మాట్లాడమంటే నీ గిఫ్టుల గురించి చెప్తున్నావేంటని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పు తెలుసుకున్న ఊర్వశి సోషల్ మీడియా వేదికగా క్షమించమని కోరింది. సైఫ్పై దాడి తీవ్రత తెలియకుండా నేను నటించిన డాకు మహారాజ్ సక్సెస్ వల్ల వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. అందుకు సిగ్గుపడుతున్నాను అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. మళ్లీ ఇదేం పిచ్చి పనితల్లి మీరా రౌతేలా అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపింది. ఈ మేరకు మీరా ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. మా అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోలో ఊర్వశి గాగుల్స్ పెట్టుకుని తల్లిని హత్తుకుంది. ఇది చూసిన జనాలు ఇక్కడ కూడా స్టైల్గా కళ్లద్దాలు పెట్టుకోవడం అవసరమా? అని తిట్టిపోస్తున్నారు. మరికొందరేమో సైఫ్ అలీఖాన్ గురించి నీ కామెంట్లు విన్నాకే ఆమె ఆస్పత్రిపాలైందని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఊర్వశి.. డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి అనే ఐటం సాంగ్లో ఆడిపాడింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) చదవండి: మా నాన్న బతికుంటే ఇంకా సంతోషంగా ఉండేది: అజిత్ కుమార్ -
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
హీరోయిన్ వీడియో.. కావాలనే చేశారట!
సినీ తారలకు ట్రోలింగ్ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్ కామెంట్స్తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్ చేసింది. కానీ ఆమె వీడియో లీక్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్ని లీక్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?కావాలనే లీక్గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్గా బాత్రూం వీడియోను ఎలా షేర్ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. ‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. కాగా, 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.టాలీవుడ్లో ఫుల్ క్రేజీఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. స్పెషల్ సాంగ్స్కి ఫేవరేట్గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్ని పట్టించుకోకుండా..సక్సెస్ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్గా మిగిలింది.. డాకు మహారాజ్ బ్యూటీ కామెంట్స్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) మరోసారి తన మాటలతో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది. తాజాగా గేమ్ ఛేంజర్( Game Changer) సినిమా రిజల్ట్ గురించి ఊర్వశి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి రేసులో పోటీ పడిన చిత్రాల్లో గేమ్ ఛేంజ్ర్ కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఊర్వశి చేసిన కామెంట్లు చరణ్ అభిమానుల్లో కోపాన్ని తెప్పించేలా ఉన్నాయి.డాకు మహరాజ్(Daaku Maharaaj) సినిమాలో బాలకృష్ణతో స్టెప్పులేసిన ఊర్వశికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమె తాజాగా బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలో తన పాత్రకు మంచి మైలేజ్ వచ్చిందని ఇలా మాట్లాడింది. 'బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. కానీ, నేను నటించిన డాకు మహరాజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నా తప్పు అయితే లేదు. సినిమా బాగా లేకున్నప్పటికీ పెయిడ్ పీఆర్లు సోషల్మీడియాలో ప్రచారం చేసుకున్నా జనాలు తిప్పికోడతారు.' అని ఊర్వశి చెప్పుకోచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.(ఇదీ చదవండి: అదివారం నాడు ఒక సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ)చాలామంది ఈ రెండు సినిమాల గురించి సోషల్మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారని ఊర్వశి పేర్కొంది. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని అంటూనే ఊర్వశి రౌటేలా నటించిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయిందని చాలామంది తెలుపుతున్నారని ఆమె తెలిపింది. శంకర్ సర్ చాలా ప్రసిద్ధ దర్శకుడని ఆమె చెప్పింది. ఆయనతో ఇండియన్ 2లో కూడా పనిచేశానని గుర్తుచేసింది. ఆ సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ, అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేదని ఆమె అభిప్రాయపడింది.వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. సుమారు రూ. 450 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ (10రోజులు) ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సక్నిల్క్ వెల్లడించింది. అయితే, తొలి రోజే ఈ చిత్రానికి రూ. 186 కోట గ్రాస్ వచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. దాంతో సోషల్మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కలెక్షన్స్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు.Kiara's #GameChanger is a disaster and my film #DaakuMaharaaj is a blockbuster. - @UrvashiRautela pic.twitter.com/ieKUHB9UIP— Telugu Chitraalu (@TeluguChitraalu) January 19, 2025 -
చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) క్షమాపణలు చెప్పారు. సైఫ్పై జరిగిన దాడిని చాలామంది సినీ ప్రముఖులు తవ్రంగా ఖండించారు. కానీ, డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సైఫ్పై జరిగిన దాడి గురించి కామెంట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంటూనే తన చేతికి ఉన్న వ్రజపు ఉంగరాన్ని చూపుతూ మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమె క్షమాపణలు చెబుతూ సోషల్మీడియాలో ఒక నోట్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్)'డియర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు. డాకు మహారాజ్ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను. ఆ సక్సెస్ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది' అని పేర్కొన్నారు.సైఫ్పై ఊర్వశి చేసిన కామెంట్లు'డాకు మహారాజ్' విజయం వల్ల తనకు చాలామంది బహుమతులు పంపించారని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే సమయంలో తనకు వచ్చిన బహుమతులను సైఫ్ దాడికి ముడిపెట్టి మాట్లాడడటం వల్ల ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 'సైఫ్పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ రూ.105కోట్లు వసూళ్లతో మంచి విజయం సాధించింది. నాకు మా అమ్మ డైమండ్ ఉంగరం కానుకగా ఇచ్చింది. మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ ఇచ్చారు. అయితే, వాటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్) చేస్తారనే భయం ఉంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగింది దొంగతనం కోసమే కావడంతో ఆమె వ్యాఖ్యలు కూడా ఆ సంఘటనను గుర్తు చేస్తూ మాట్లాడటం వల్ల విమర్శలు వచ్చాయి. -
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
కియారా సినిమా డిజాస్టర్.. ఊర్వశి మూవీ బ్లాక్బస్టర్.. బ్యూటీ రియాక్షనిదే!
ఎప్పుడొచ్చామన్నది కాదు హిట్టు కొట్టామా? లేదా? అన్నదే ముఖ్యం! ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో మొట్ట మొదట రిలీజైన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer Movie). రామ్చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టినా మిక్స్డ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి డీలా పడిపోయింది.దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్రెండు రోజుల గ్యాప్తో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ (Daaku Maharaaj Movie)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు జోరందుకున్నాయి. దబిడి దిబిడి పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో బాలయ్య చేసిన స్టెప్పులపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ అవేవీ సినిమా విజయానికి అడ్డుగా నిలవలేదు.సంక్రాంతి విన్నర్?చివరగా జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam)తో వచ్చాడు. వస్తూనే పండగ మోసుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. మౌత్ టాక్తోనే ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించగలిగాడు. రూ.100 కోట్లు అందుకోవడానికి డాకు మహారాజ్కు నాలుగు రోజులు పడితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు రోజుల్లోనే సెంచరీ క్లబ్లో చేరింది.(చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య)అభిప్రాయాలు గౌరవిస్తాఇకపోతే దబిడి దిబిడి సాంగ్లోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్పై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకోగలను. నందమూరి బాలకృష్ణతో చేసిన డ్యాన్స్ విషయానికి వస్తే.. మా పర్ఫామెన్స్ గురించి పలువురూ పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను.అది ఒక కళఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డ్యాన్స్ అంటే కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంగా ఫీలవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. . మేము వేసిన ప్రతి స్టెప్ కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పని చేయడం వల్ల నా కల నిజమైనట్లుగా ఉంది అని చెప్పుకొచ్చింది.నేనేం చేయలేదుకియారా అద్వానీ గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ.. మనం నటించిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మనకంటూ ఓ క్రేజ్ తీసుకొస్తాయి. ఉదాహరణకు.. 2025లో రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్ అవుట్సైడర్ నటిగా ఓ రికార్డు ఇచ్చారు. ఇది మనకు ఇండస్ట్రీ ఇచ్చే గుర్తింపు. దీనివల్ల మన యాక్టింగ్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నేను కొన్ని ట్వీట్స్ చూశాను.. కియారా అద్వానీ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఊర్వశి సినిమా బ్లాక్బస్టర్ అని రాశారు. అందులో నా హస్తం ఏమాత్రం లేదు అని ఊర్వశి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) చదవండి: సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా? -
డాకు మహారాజ్ స్టెప్స్ పై ఊర్వశీ రౌతేలా స్ట్రాంగ్ కౌంటర్..
-
పండుగ పూట బీజేపీలో జనసేన విలీనం..!? బాలకృష్ణ వేధింపులు
-
మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్తో ఆ స్టెప్పులు!
‘దబిడి దిబిడి’ పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికి తెలిసిందే. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు కూడా ఆ స్టేప్పులను తప్పుపట్టారు. అయితే ఇందులో బాలయ్య కంటే ఎక్కువగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్నే ఎక్కువగా ట్రోల్ చేశారు. ఓ ఎమ్మెల్యే, సీనియర్ హీరో అయిన బాలకృష్ణతో అలాంటి అసభ్యకరమైన స్టెప్పులేయించాండంటూ శేఖర్ మాస్టర్ను ఏకిపారేశారు. మరికొంతమంది నెటిజన్స్ అయితే కూతురు వయసు ఉన్న ఊర్వశీ రౌతేలాతో బాలయ్య అలాంటి స్టెప్పులేయడం అసభ్యకరంగా ఉందని కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ని చిత్ర యూనిట్తో సహా బాలయ్య కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఓ పార్టీ ఈవెంట్లో ఊర్వశీతో బాలయ్య మళ్లీ అదే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.సక్సెస్ పార్టీతో వికృత స్టెప్పులు!హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ప్రగ్యా జైశ్వాల్, శ్రధ్ధాశ్రీనాథ్ హీరోయిన్. . శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ అంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో సహా చిత్రబృందం అంతా హాజరైంది. ఈ సందర్భంగా ఊర్వశీతో బాలయ్య స్టెప్పులేశాడు. ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేస్తూ మళ్లీ అసభ్యకరమైన స్టెప్పులేశారు. బాలయ్య ఆ స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు రాగానే.. ఊర్వశీ పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ వీడియోని ఊర్వశీ తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) ముద్దులతో ముంచేసిన బాలయ్య`డాకు మహారాజ్`పార్టీలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముద్దులతో ముంచేశాడు బాలకృష్ణ. సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేస్తూ `కంగ్రాట్చ్యూలేషన్స్ టూ డాకు మహారాజ్` అని విశ్వక్ సేన్ అనగా.. థ్యాంక్యూ ‘లైలా ’అంటూ విశ్వక్ సేన్కి బాలయ్య ముద్దు పెట్టాడు. విశ్వక్ కూడా తిరిగి బాలయ్యకు ముద్దు పెట్టారు. పక్కనే ఉన్న సిద్దు కూడా ‘నాకు పెట్టలేదు(కిస్) అనగానే..బాలయ్య లాక్కొని సిద్దుకి కూడా కిస్ ఇచ్చాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు దర్శకుడు బాబీకి కూడా కిస్ ఇచ్చాడు బాలయ్య. పార్టీ మూడ్లో బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆ వీడియోలన్నీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. -
డాకు మహారాజ్లో ఊర్వశి రౌతేలా.. బాలయ్యతో మరోసారి చిందులు!
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాకుండా దబిడి దిబిడి అంటూ సాగే ఐటమ్ సాంగ్లో బాలయ్య సరసన మెప్పించింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్లింది.సాంగ్పై విమర్శలు..డాకు మహారాజ్లోని దబిడి దిబిడి సాంగ్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.పట్టించుకోని ఊర్వశి రౌతేలా..అయితే సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు వస్తున్నా పిచ్చ లైట్ అంటోంది బాలీవుడ్ భామ. తాజాగ ఇన్స్టా వేదికగా మరో వీడియోను పోస్ట్ చేసింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో కలిసి దబిడి దిబిడి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఊర్వశి రౌతేలాపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాలో రాస్తూ..' డాకు మహారాజ్ సక్సెస్ బాష్. దబిడి దిబిడి సాంగ్ 20 మిలియన్ల వ్యూస్ సాధించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ న్యూయర్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
రెడ్ కలర్ శారీలో గులాబీలా మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా (ఫొటోలు)
-
వాళ్లకు అలాంటిదేం లేదు.. నీకేమైంది?.. ఊర్వశి రౌతేలాపై ఘాటు కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కొత్త ఏడాదిలో మరో సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) డ్యాన్స్ చేసిన 'దబిడి దిబిడి' అంచూ సాగే సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది.అయితే సాంగ్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య అలా చేయడం కరెక్ట్ కాదంటూ పలువురు విమర్శించారు. అంతేకాదు శేఖర్ మాస్టర్ చెత్త కొరియోగ్రఫీ అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఆ స్టెప్పులేంటి అంటూ చాలా మంది బహిరంగంగానే బాలయ్యతో పాటు డాకు మహారాజ్ టీమ్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కేఆర్కే(Kamal R Khan) ఈ సాంగ్ను ఉద్దేశించి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగువాళ్లు అలాంటి పాటలు చేయడానికి వెనకాడరు.. కానీ ఊర్వశి రౌతేలా ఆ పాటను చేయడం చూస్తే తనకు ఎలాంటి సిగ్గులేదనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారు. అయితే కేఆర్కే ట్వీట్పై ఊర్వశి రౌతేలా స్పందించింది. జీవితంలో ఏం సాధించలేని కొందరు.. కష్టపడేవారిని విమర్శించే అర్హత ఉందనుకోవడం విడ్డూరం అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు.. అవతలి వారి పైకి తీసుకొచ్చేలా చేయడం.. వారి గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకోవడంలో ఉంటుందని' అని కౌంటర్ ఇచ్చిపడేసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.(ఇది చదవండి: స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్)కాగా.. డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్ రద్దు చేసింది.It’s ironic how some who’ve achieved nothing feel entitled to criticize those who work tirelessly. Real power isn’t in tearing others down it’s in lifting them up and inspiring greatness. @kamaalrkhan https://t.co/kS3tdXFk0a— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) January 9, 2025 -
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ HD మూవీ స్టిల్స్
-
Daaku Maharaaj: దబిడి దిబిడి పాట వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. గురువారం (జనవరి 2న) మూడో పాట రిలీజైంది. 'డాకు మహారాజ్' చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'దబిడి దిబిడి' సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్లకు పెట్టింది పేరు. అలా బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్తో రూపుదిద్దుకున్న పాటే 'దబిడి దిబిడి'. ఈ సాంగ్లో ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వాగ్దేవి ఆలపించారు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను మాస్ ట్రీట్లా మార్చింది.డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. చదవండి: ఆ హీరో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగాడు: ఖుష్బూ -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్బాస్ దివి..కోట్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
అవార్డ్ గెలుచుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. ఫోటోలు
-
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో 24 క్యారెట్ల బంగారపు డ్రెస్లో ఊర్వశి రౌతేలా!
ఇటీవల జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా వేదిక మీద నడుస్తూ ఉంటే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె ధరించిన అచ్చమైన బంగారంతో రూపొందించిన మణిపూర్ సంప్రదాయ బ్రైడల్ డ్రెస్ స్పెషాలిటీని చూపుతిప్పుకోనివ్వలేదు. ఈ ఏడాది జరిగిన గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో డిజైన్ చేసిన పాట్లోయ్ డ్రెస్లో నటి, మోడల్ ఊర్వశి రౌతేలా మెరిసిపోయింది. ఈ ప్రత్యేక సందర్భం కోసం ఆమె బంగారు జరీ దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు పాట్లోయ్ను ధరించింది. సాధారణంగా వధువులు ధరించే సంప్రదాయ దుస్తుల మధ్య ఊర్వశి అద్భుతంగా మెరిసిపోయింది. ప్రఖ్యాత మణిపురి డిజైనర్ రాబర్ట్ నౌరెమ్ రూపొదించిన ఈ దుస్తులలో మణిపూర్లోని మెయిటీ కమ్యూనిటీ సాంస్కృతిక గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాధారణంగా మణిపూర్ వధువులు ఈ దుస్తులను ధరిస్తారు. పాట్లోయ్ అనేది వారి సంప్రదాయంలోని ప్రత్యేకమైన, ఐకానిక్ డ్రెస్.క్లిష్టమైన వర్క్స్థూపం, డ్రమ్ ఆకారపు స్కర్ట్ని పాట్లోయ్ అంటారు. మణిపురి బ్రైడల్ని ప్రత్యేకంగా చూపే వాటిలో ఇది అత్యంత ముఖ్యమైనది. మందపాటి ఫైబర్, వెదురుతో డ్రమ్ ఆకారం చేసి, శాటిన్ క్లాత్ని చుడతారు. దానిని థ్రెడ్వర్క్, సీక్విన్స్, అద్దాలతో భారీగా అలంకరిస్తారు. స్కర్ట్పైన చేసే వారి హస్తకళ చాలా క్లిష్టమైనది. ఒక పాట్లోయ్ని పూర్తి చేయడానికి కొన్ని రోజుల పాటు కృషి చేస్తారు. దీనికి అలంకరణగా నడుము పట్టీ, వధువు తలమీదుగా కప్పే షీర్ వీల్, మోచేతులవరకు ఉండే జాకెట్టుతో ఈ డ్రెస్కు పూర్తి లుక్ వస్తుంది. ఇతర అలంకరణలో లేయర్డ్ నెక్లెస్లు, కోక్గీ లీటెంగ్గా పిలిచే కేశాలంకరణ ఆభరణాలు ప్రత్యేకమైనవి.పాట్లోయ్ చరిత్రపాట్లోయ్ మూలాలు మెయిడింగు భాగ్యచంద్ర మహారాజ్ (1763–1798) పాలనలో గుర్తించినట్టు చారిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అతను శాస్త్రీయ రాస్–లీలా నృత్యానికి ఈ దుస్తులను పరిచయం చేశాడు. కాలక్రమేణా ఇది మెయిటీ వధువుల సంప్రదాయ వివాహ దుస్తులలో భాగమైంది. దీంతో వీరికి పాట్లోయిస్ సృష్టించే కళ తరతరాలుగా సంక్రమించింది. అధికారిక సంస్థల కంటే కుటుంబాలలో నేర్చిన నైపుణ్యాలతో పాట్లోయ్ను రూపొందించడం అనేది శ్రమతో కూడుకున్న ప్రక్రియ. దీని తయారీలో చాలా మంది కళాకారులు పాల్గొంటారు. అందుకే, దీనిని సామూహిక సమాజ ప్రయత్నంగా చెబుతారు. తన వేషధారణ ఎంపిక ద్వారా, ఊర్వశి ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా మణిపూర్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకురావడంలో సహాయపడింది.డిజైనర్ రాబర్ట్రాబర్ట్ నౌరెమ్ ఈశాన్య భారతదేశంలోని సాంప్రదాయ ఫ్యాషన్ను హైలైట్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. అతను గతంలో సుస్మితా సేన్, హర్నాజ్ కౌర్ సంధు, లారా దత్తా వంటి ప్రముఖ వ్యక్తులకు ఇన్నాఫీ, ఫనెక్ వంటి సాంప్రదాయ మణిపురి దుస్తులలో మెరిపించాడు. ఇన్నాఫీ అనేది బ్లౌజ్పై ధరించే తేలికపాటి మస్లిన్ శాలువా. ఫనెక్ అనేది మణిపురి మహిళలు సాధారణంగా ధరించే చారలతో కూడిన చీరలాంటి వస్త్రం. ఈ ఏడాది గ్లోబల్ ఫ్యాషన్ ఫెస్టివల్లో మొదటిసారిగా ఊర్వశి రౌతేలా చేత మణిపురి బ్రైడల్ డ్రెస్ను ధరింపజేసి అంతర్జాతీయ ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. (చదవండి: అత్యంత సంపన్న మేకప్ ఆర్టిస్ట్..ఎంత చార్జ్ చేస్తాడంటే..?) -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
ఆస్పత్రిలో బాలీవుడ్ భామ.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవల ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన చేతి వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. "నా కోసం ప్రార్థించండి" అంటూ నోట్ రాసుకొచ్చింది. అయితే చిన్న గాయానికే ఇంత బిల్డప్ అవసరమా అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. ఎర్రటి గులాబీలతో ఉన్న ఫోటోను ఇన్స్టాలో పంచుకుంది. తన డైహార్డ్ ఫ్యాన్స్ లక్ష గులాబీలు పంపించారంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాను కోలుకోవాలంటూ కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది ముద్దుగుమ్మ. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డైహార్డ్ అభిమానులను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయ నటి అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.కాగా.. చివరిసారిగా గుస్పైథియా అనే చిత్రంలో ఊర్వశి రౌతేలా నటించింది. అంతకుముందు తెలుగులో వాల్తేరు వీరయ్య, అఖిల్ మూవీ ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరిసింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
అందుకే రిషబ్ భయ్యా పెళ్లి చేసుకోవడం లేదు.. ఊర్వశిపై దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఊర్వశి చివరిసారిగా బాలీవుడ్లో గుస్పైతియా చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రంలో కనిపించనుంది ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా.. తాను ఆస్పత్రిలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ తన కోసం ప్రార్థించండి అంటూ పోస్ట్ చేసింది.అయితే ఊర్వశి రౌతేలా పోస్ట్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అంత చిన్న మైనర్ గాయానికి ఆస్పత్రిలో ఎందుకు అడ్మిట్ అయ్యారని నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ వీడియోపై ఒకరు స్పందిస్తూ.. వేలికి చిన్న గాయంతో ఆసుపత్రిలో చేరిన మొదటి భారతీయ మహిళ అని ఫన్నీగా కామెంట్స్ చేశాడు. మరొకరు అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ ఊర్వశి అని రాసుకొచ్చాడు. ఇంత చిన్న గాయానికి ఏకంగా ఆక్సిజన్ తీసుకుంటున్నారా? అసలేంటి నాన్సెన్స్ అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి ప్రవర్తన కారణంగానే రిషబ్ భాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదంటూ ఓ నెటిజన్ రాశారు. అయితే నెటిజన్ల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో బాలీవుడ్ భామ ఆశ్చర్యపోయింది.అంతేకాకుండా తనపట్ల మీడియాలో వస్తున్న వార్తలపై ఊర్వశి రౌతేలా మండిపడింది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు చెప్పే బదులు.. తనపై అన్ని హద్దులు దాటి ప్రవర్తించడంతో నిరాశకు గురయ్యానని తెలిపింది. ఇటువంటి విపరీతమైన, అగౌరవపరిచే సంస్కృతి సమాజంలో అత్యాచారం లాంటి దారుణమైన చర్యలకు పునాదిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ వార్త ప్రచురించిన క్లిప్ను కూడా షేర్ చేసింది ముద్దుగుమ్మ. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
వీడియో లీక్పై స్పందించిన ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో లీక్ అయిందంటూ ఒక క్లిప్పింగ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఆమె తన మేనేజర్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా లీక్ అయింది. ఆ వీడియో ఎలా బయటకొచ్చిందంటూ ఊర్వశి మాట్లాడిన మాటలు ఆన్లైన్లోకి రావడంతో ఈ టాపిక్ పెద్ద దుమారమే రేపింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన డ్యాన్స్ వేసిన ఈ బ్యూటికి తెలుగులో కూడా పాపులారటీ ఉంది. ఆయితే, ఆమె పర్సనల్ వీడియో అంటూ వైరల్ అయిన క్లిప్పింగ్ గురించి ఊర్వశి తాజాగా రియాక్ట్ అయింది.అందరూ అనుకునేలా ఆ వీడియో లీక్ అవడం నిజమేనని ఊర్వశి రౌతేలా ఇలా చెప్పుకొచ్చింది. 'నేను బాలీవుడ్లో గుస్పేటియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో భాగంగా ఓ సీన్ కోసం అలా నటించాను. కానీ, అది ఇటీవల నెట్టింట లీక్ కావడంతో నేను చాలా బాధపడ్డాను. కనీసం సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.. అప్పుడు ఇలా వీడియోలు, ఫోటోలు లీక్ కావడం విచిత్రంగా ఉంది. అయితే, నేను అందరికీ చెప్పేది ఒక్కటే.. ఆ వీడియో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. మరోకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకూడదని ఆశిస్తున్నాను.' అని ఊర్వశి చెప్పుకొచ్చింది.ఈ విషయంపై ఊర్వశి రౌతేలాపై నెటిజన్లు మండి పడుతున్నారు. వీడియో లీక్ అయింది సరే.. మేనేజర్తో మాట్లాడిన కాల్ ఎలా లీక్ అయిందంటూ వారు ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు చెప్పుకొస్తున్నారు. బాత్రూమ్ వీడియో లీక్ చేసుకుంటూ సినిమా ప్రమోషన్ చేసుకునే స్థాయికి చేరావా..? అంటూ ఊర్వశి రౌతేలాను తిట్టిపోస్తున్నారు. ఆమె నటించిన గుస్పేటియా చిత్రం ఆగష్టు 9న విడుదల కానుంది. అక్షయ్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించగా.. సూషి గణేషన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలో కూడా ఊర్వశి నటిస్తుంది. -
హీరోయిన్ ఆడియో క్లిప్ లీక్.. మండిపడుతున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్లో మెరిసింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బీకే 109లోనూ కనిపించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే మరో తెలుగు సినిమా కూడా ఆమె చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్లో ఆమెజేఎన్యూ: జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ చిత్రంలో నటిస్తోంది.అయితే తాజాగా ఊర్వశి రౌతేలా తన మేనేజర్తో మాట్లాడుతున్న కాల్ ఆడియో నెట్టింట వైరల్గా మారింది. తన మేనేజర్తో ఇటీవల బాత్రూమ్ వీడియో లీక్ కావడంపై ఆమె మాట్లాడింది. అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఆ వీడియో మీరు చూశారా? అని ఊర్వశి రౌతేలా ప్రశ్నించింది. దీనిపై మేనేజర్ స్పందిస్తూ.. మన టీమ్ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కాల్ రికార్డ్ సైతం నెట్టింట లీక్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. వీడియోతో పాటు కాల్ రికార్డింగ్ కూడా బయటకు రావడంతో మరింత హాట్ టాపిక్గా మారింది.అయితే ఇదంతా ఊర్వశి రౌతేలా పబ్లిషిటీ స్టంట్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీప్గా పబ్లిషిటీ స్టంట్స్ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. త్వరలోనే జేఎన్యూ మూవీ రిలీజ్ ఉండడంతో ఇదంతా ప్రమోషన్లలో భాగమేనని భావిస్తున్నారు. అయితే ఆడియో లీక్ కావడంపై ఊర్వశి రౌతేలా ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తెలుగు సినిమా షూటింగ్లో గాయపడ్డ హాట్ బ్యూటీ ఊర్వశి!
హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గాయపడింది. బాలీవుడ్లో ఇప్పటికే నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతంలో 'వాల్తేరు వీరయ్య' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం అటు హిందీ, ఇటు తెలుగులో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న ఈమెకు ఓ సీన్లో భాగంగా తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: వంటలక్కకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? వీడియో వైరల్)బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్లో మొదలైంది. ఇందులో రీసెంట్గానే ఊర్వశి రౌతేలా జాయిన్ అయింది. తాజాగా ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా.. కాలికి ఫ్రాక్చర్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేర్చినట్లు ఈమె టీమ్ చెప్పుకొచ్చింది. అయితే గాయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాలో బాలయ్యతో పాటు చాందిని చౌదరి, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ పరిస్థితుల బట్టి రిలీజ్ డేట్ అటు ఇటు కావొచ్చని కూడా తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేవరలో మరో బాలీవుడ్ భామ.. ఫ్యాన్స్కు ఇక పూనకాలే!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సముద్రం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. గ్లోబల్ స్టార్ తారక్ ఎంతో వినయంగా ఉంటారని తెలిపింది. మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయమని జూనియర్ను కొనియాడింది. త్వరలోనే మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఊర్వశి రౌతేలా దేవర చిత్రంలో ప్రత్యేక సాంగ్లో కనిపించనుందా? అంటూ కామెంట్స్ చేశారు. గతంలో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి.. దేవరలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉది. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్-2 షూటింగ్లో జాయిన్ అయ్యారు. @tarak9999 garu our beloved true #GlobalSuperstar —exceptionally disciplined, honest, and refreshingly straightforward, yet so wonderfully humble. Thanks a million for your kindness and the motivation. Your lion-hearted 🦁 personality is truly admirable. Can’t wait to work with… pic.twitter.com/iysWzhpOYY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) April 15, 2024 -
ఊర్వశి రౌతేలా అలాంటి కామెంట్స్.. మండిపడ్డ నెటిజన్స్!
బాలీవుడ్ భామ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలో ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో జేఎన్యూ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్తో ఈ భామ డేటింగ్లో ఉందంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. రిషబ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సైతం ఊర్వశి పోస్ట్ చేయడంతో రూమర్స్ మరింత వైరలయ్యాయి. వీరిద్దరు చాలాసార్లు ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, పార్టీల్లో కనిపించడంతో డేటింగ్లో ఉన్నారని ఫ్యాన్స్ భావించారు. కానీ వీటన్నింటినీ రిషబ్ పంత్ కొట్టి పారేశాడు. ప్రస్తుతం రిషబ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఊర్వశి తాజాగా ఓ వాణిజ్య ప్రకటనలో మెరిసింది. ఓ మ్యాట్రిమోనీ సైట్కు సంబంధించిన ప్రకటనలో నటించింది. అయితే ఇందులో 'ఎవరు కూడా నా అంత ఎత్తు కలిగిన వారు దొరకడం లేదంటూ' నటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రకటనలో భాగంగా చెప్పుకొచ్చింది. కానీ ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఆమె రిషబ్ పంత్ను ఉద్దేశించి అలా మాట్లాడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ను అవమానించిందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై ఊర్వశి తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. అయితే యాడ్ స్క్రిప్ట్ తనకు ఆ కంపెనీ అందించిందేనని.. తన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేయలేదని స్పష్టం చేసింది. దయచేసి పాజిటివ్ తీసుకోవాలని సూచించింది. ఒక బాధ్యతగల వ్యక్తిగా బ్రాండ్ అంబాసిడర్గా నా వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోగలను అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఊర్వశి ప్రస్తుతం జేఎన్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
కలర్ఫుల్ డ్రెస్లో మెగా కోడలు.. హోలీ వేడుకల్లో బాలీవుడ్ భామ చిల్!
కలర్ఫుల్ డ్రెస్లో కనిపించిన మెగా కోడలు.. హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. బ్లాక్ డ్రెస్లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్... గ్రీన్ శారీలో తళుక్కుమన్న అమృత అయ్యర్.. వైట్ డ్రెస్లో నోరా ఫతేహీ అలాంటి లుక్స్.. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
ఐటం సాంగ్స్తో రఫ్ఫాడించిన బ్యూటీ.. రాజకీయాల్లోకి?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా పార్టీ స్థాపించారు. తాగాజా ఊర్వశి రౌతేలా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో పలు పార్టీలు సినీతారలకు టికెట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇన్స్టంట్ బాలీవుడ్తో మాట్లాడిన రౌతేలా, "నాకు ఇప్పటికే టిక్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి" అని అన్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయాలని వెల్లడించింది. ఊర్వశి రౌతేలాకు ఎలక్షన్ టికెట్ ఇచ్చారని వెల్లడించింది. కానీ.. ఏ పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి రావాలని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బర్త్డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్గా గడుపుతారు. రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు. (Image Courtesy:Instagram) ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్డే. ఈ సందర్భంగా గొల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ భామ. (Image Courtesy:Instagram) ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy:Instagram) -
అలాంటి అవుట్ఫిట్లో దేవర భామ.. వాలెంటైన్ డే వైబ్లో ఊర్వశి రౌతేలా!
రెడ్ డ్రెస్లో మత్తెక్కిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్.. వాలెంటైన్ ప్రపోజ్ డే మూడ్లో ఊర్వశి రౌతేలా.. యోగాసనాలతో మైమరిపిస్తోన్న శ్రద్ధాదాస్.. గ్రీన్ డ్రెస్లో రవీనా టాండన్ హోయలు.. హాట్ ట్రీట్ ఇస్తోన్న బాలీవుడ్ భామ నిక్కి తంబోలి.. రెడ్ డ్రెస్లో రీతూ చౌదరి పోజులు.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
బాలీవుడ్లో టాప్ 15 అత్యంత అందమైన నటీమణులు వీరే (ఫొటోలు)
-
ఊర్వశి రౌతేలా షేర్ చేసిన వీడియో.. ట్రోల్ అవుతున్న రిషబ్ పంత్
భారత్లో క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. అన్ని చోట్లా వరల్డ్ కప్ ఫీవర్ ఎక్కువైంది. ఈసారి భారత్ కూడా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఓటమి అనేది లేకుండా భారత్ తనదైన ప్రదర్శనదో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. భారత్ గెలుస్తుంటే, వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఈ జట్టులో చాలా మంది మిస్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ వీడియో చేసి సర్ ప్రైజ్ చేసింది. ఆ వీడియో చూసిన జనాలు రిషబ్ పంత్ని గుర్తుచేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు సంవత్సరం నుంచి క్రికెట్కు రిషబ్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఊర్వశి రౌతేలా, భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ కూడా భారీగానే నడిచింది. అప్పట్లో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని తర్వాత కొన్ని గొడవల వల్ల విడిపోయారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఎవరూ ఖండిచలేదు. తాజాగా ఊర్వశి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాగే తనకు అనిపించిన విషయాన్ని సూటిగా చెప్పే నటి. ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ స్టోర్ట్స్ డ్రెస్లో వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో అది. దీనితో పాటు 'కొత్త అధ్యాయం, కొత్త సినిమా' అని రాసి ఆమె పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ‘కీడా కోలా’ మూవీ రివ్యూ) ఆ వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా చుట్టు ఎప్పుడూ కొంత వివాదం ఉన్న మాట నిజం. అందులో రిషబ్ పంత్తో వివాదం కూడా ఒకటి. ఆ వ్యక్తి (రిషబ్) తనకు చాలాసార్లు ఫోన్ చేశాడని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం ఊర్వశి కూడా క్షమాపణలు చెప్పింది. మళ్లీ తాజాగా కొత్త సినిమా కోసమే అంటూ.. వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో రిషబ్ పంత్ గొడవను మళ్లీ తెరపైకి తెస్తుందా..? అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. ఊర్వశి రౌతేలా తన వికెట్ కీపింగ్ వీడియోలో కీపర్ ఉపయోగించాల్సిన గ్లౌజులు కాకుండా బ్యాటింగ్ గ్లౌజులను ఉపయోగించింది. దీనిని గమనించిన నెటిజన్లు ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. 'ఆమె బ్యాటింగ్ గ్లౌజులతోనే ఆట ఆడుతుంది.. ఎందుకంటే ఆమెకు ధైర్యం ఉంది' అంటూ ఫన్నీగా అని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. మరోకరు రిషబ్ పంత్ రీప్లేస్ మెంట్ దొరకలేదా..? అంటూ కామెంట్ చేస్తే.. 'రిషబ్ పంత్ లైట్ వెర్షన్' అని మరొకరు వ్యాఖ్యానించారు ఊర్వశి పోస్ట్ చేసిన వీడియోతో రిషబ్ పంత్కు ఎలాంటి సంబంధం లేకున్నా ఆయన ట్రోల్ అవుతున్నాడు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
ఊర్వశి రౌతేలా చేసింది ఆరు సినిమాలు.. ఆస్తి రూ. 300 కోట్లు ఎలా?
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరు ఊర్వశి రౌతెలా.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరుస్తూ యువతలో మంచి క్రేజ్ను అందుకుంది.. ఉత్తరాఖండ్కు చెందిన ఈ బ్యూటీ 15 సంవత్సరాల వయస్సులోనే తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అలా మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్ను కూడా గెలుచుకుంది. చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్ను కూడా గెలుచుకుంది, ఈ పోటీలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అలా 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్పంతి, మరెన్నో చిత్రాలలో నటించి అలరించింది. కానీ ఆమెకు పెద్దగా సినిమా ఛాన్స్లు దక్కలేదు. దీంతో చేతిలో అంతగా డబ్బులేదు.. సినిమా ఛాన్స్లు ఇస్తామని ఆమెను మోసం చేసిన వారే ఎక్కువ కావడంతో అలా ఆమె సినీ కెరీయర్ ముగిసిపోయిందని అనుకుంది. (ఇదీ చదవండి: తప్పని పరిస్థితిలో నేడు మీడియా ముందుకు హీరో రవితేజ) సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి భారత క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో పరిచయం కావడమే కాకుండా ఆయనతో డేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో సినిమా ఛాన్స్ల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్తో కూడా ఆమె డేట్ చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఆమె కంటే సమీర్ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాల కోసం ఆయనతో టచ్లో ఉండేదని సమాచారం. కానీ అతను మాత్రం ఆమెకు ఛాన్స్లు ఇస్తానంటూ కాలయాపన చేస్తున్నట్లు గ్రహించిన ఊర్వశి నెమ్మదిగా అతనికి గుడ్బై చెప్పేసింది. ఎలాగైనా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్తో లైఫ్లో సెటిల్ కావచ్చని ఆమె కలలు కనేది. అలా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆయన ఊర్వశికి పాగల్ పంథీ సినిమాలో ఒక హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలా ఆయనతో కూడా ఊర్వశి డేట్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. సినిమా గ్లామర్ ఫీల్డ్లో ఎంజాయ్ చేస్తున్న ఆమెకు రిషబ్ పంత్ ఒక ఫంక్షన్లో పరిచయం కావడం ఆపై కొంత కాలం డేట్ చేసినట్లు వార్తలు వచ్చినా రిషబ్ తిప్పికొట్టాడు. మొదట రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేయడంతో వీరిద్దరూ మీడియాలో ప్రధాన వార్తలుగా మిగిలారు. తర్వాత కొద్దిరోజుల పాటు ఇద్దరూ పరోక్షంగా ఒకరిపైమరొకరు సోషల్ మీడియాలో కామెంట్లు,స్టేటస్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమేనని వార్తలు వచ్చాయి. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఊర్వశి రౌతెలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్గా కేవలం 6 సినిమాలు మాత్రమే చేసింది. అవి కూడా అంతగా చెప్పుకోతగినవి కాదు. అడపాదడపా ఐటమ్ సాంగ్స్లలో కనిపించేది. దీంతో ఆమెకు పెద్దగా ఇన్కమ్ సోర్స్ కనిపించలేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 11 ఏళ్లలోనే ఆమె రూ. 150 కోట్లు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొనింది. ఈ డబ్బంతా దుబాయ్,యూకే,కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్తో కొల్లగొట్టిందని ప్రచారం ఉంది. అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు దుబాయ్లో ఎక్కువ క్రేజ్ అట. అక్కడి షేక్స్ కూడా ఎక్కువగా వారినే ఇష్టపడి ట్రాప్ చేస్తారట. అలా అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిల్ని దక్కించుకునేందుకు వారు ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారట. ఇలా ఊర్వశి కేవలం 11 ఏళ్ల సినిమా కెరియర్లో సంపాదించలేనిది కేవలం రెండు సంవత్సరాల్లోనే సుమారు రూ. 300 కోట్లు వెనుకేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సినిమా ఛాన్స్ల కోసం ఆమె శ్రీదేవి భర్త బోణీ కపూర్తో డేట్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్లు అంటూ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. -
ఫోన్ ఇచ్చేస్తా అంటూ ఊర్వశి రౌతేలాకు కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాలలో ప్రత్యేక సాంగ్తో అలరించిన ఈ మ్యూటీ తెలుగువారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటా ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'లో బిగ్బాస్-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్) దీంతో పోలీస్స్టేషన్లో కూడ ఫిర్యాదు చేసింది. కానీ తన ప్రయత్నంగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా చేసిన ట్వీట్కు ఫలితం దక్కింది. ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. 'మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడంలో సాయం చేయండి.' అని ఆ వ్యక్తి కండీషన్ పెట్టాడు. దీంతో ఊర్వశి రౌతేలా కూడా సరే అనేలా థంబ్స్ అప్ గుర్తు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మరీ ఒప్పందం ప్రకారం ఆ అజ్ఞాతవాసి ఆమెకు ఫోన్ తెచ్చి ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్లోనూ ప్రత్యేక సాంగ్తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్) అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ ) 📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023 -
IND Vs Pak మ్యాచ్: గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు పెద్ద కష్టమే వచ్చింది. శనివారం నాడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లిందీ బ్యూటీ. ఈ క్రమంలో సదరు స్టేడియంలో తన ఫోన్ పోగొట్టుకుంది. అది 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన గోల్డ్ ఐ ఫోన్ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దొరికినవాళ్లు దయచేసి తనకు తిరిగివ్వాలని కోరింది. ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేసింది. మరి ఆ జనసంద్రంలో ఊర్వశి పోగొట్టుకున్న ఐ ఫోన్ తిరిగి దొరుకుతుందో, లేదో చూడాలి! కాగా నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్లో పాక్కు వరుసగా ఎనిమిదోసారి ఓటమి రుచి చూపించింది. ఇక ఊర్వశి రౌతేలా విషయానికి వస్తే.. 'సింగ్ సాబ్ ద గ్రేట్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె సన్నీడియోల్కు జంటగా నటించింది. సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంతి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఐటం సాంగ్స్ ద్వారానే సుపరిచితురాలైంది. 'వాల్తేరు వీరయ్య'లో బాస్ పార్టీ, 'ఏజెంట్'లో వైల్డ్ సాలా, 'బ్రో'లో మై డియర్ మార్కండేయ, 'స్కంద'లో కల్ట్ మామా.. ఇలా వరుసగా ఐటం సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం ఊర్వశి హిందీలో 'దిల్ హై గ్రే' అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి కింగ్ ఆఫ్ కొత్త హిందీ వర్షన్.. ఎప్పుడు? ఎక్కడంటే? -
నిమిషానికి రూ.కోటి రెమ్యునరేషన్.. నటి రియాక్షన్ అదిరిపోయింది!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోనూ ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఇటీవలే ఫ్రాన్స్లోని పారిస్లో ఈఫిట్ టవర్ను వన్డే వరల్డ్ కప్ను ఆవిష్కరించిన ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇలాంటి అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక నటిగా స్థానం దక్కించుకుంది. అయితే తాజాగా ఒక్క నిమిషానికి రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ వసూలు చేస్తోందని గత కొద్ది రోజులుగా ఆమెపై రూమర్స్ వస్తున్నాయి. అంతే కాదు ఆమెపై నెటిజన్స్ సైతం ట్రోల్స్ కూడా చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఊర్వశికి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీరు ఒక నిమిషానికి రూ. కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు? దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. నాలాంటి సెల్ఫ్ మేడ్ నటులు ఎవరైనా సరే ఇలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఇందతా అబద్ధమంటూ నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ చేశారు. ఊర్వశి రౌతేలా సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన నటించింది. ఆ తర్వాత సనమ్ రే, హేట్ స్టోరీ- 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: కేవలం రూ.7 కోట్ల సినిమా.. బాక్సాఫీస్ను షేక్ చేసేసింది!) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
అరుదైన ఛాన్స్ కొట్టేసిన రౌతేలా.. ఆ విషయంలో తొలి నటి ఆమెనే!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు అభిమానులను మెప్పించింది. బాస్ పార్టీ అంటూ సాగే సాంగ్తో ఉర్రూతలూగించింది. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే తాజాగా ఈ భామ అరుదైన అవకాశాన్ని అందుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'స్నానం చేస్తుండగా వీడియోలు తీసేవాడు'.. హీరోయిన్ తీవ్ర ఆరోపణలు! ) ఇండియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ముందు ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించింది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచింది. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ ముందు ఫోటోలకు పోజులిచ్చింది. పంచుకుంది. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఊర్వశిపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా..' అంటూ కామెంట్స్ చేశాడు. మరో నెటిజన్ ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. రిషభ్ పంత్తో డేటింగ్ రూమర్స్ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. కాగా.. గతంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్తో ఊర్వశి రౌతేలా డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరీ ఈ ఫోటో చూసిన రిషబ్ పంత్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. డిప్రెషన్లో నటుడు.. 10 ఏళ్ల బంధానికి స్వస్తి!) -
లుక్ మార్చేసిన కృతి.. తెలుగు పిల్ల వయ్యారాలు
టెంప్టింగ్ పోజుల్లో కృతిశెట్టి వయ్యారాలు ఒలకబోస్తున్న తెలుగు పిల్ల మోడ్రన్ డ్రస్లో ఈషా హ్యాపీ మోడ్ ఒరకంట చూస్తు నవ్వుతున్న రీతూ 'ఖుషి' ఈవెంట్ ఫొటోలు.. సామ్ స్మైల్ టైట్ డ్రస్లో హీట్ పెంచుతున్న అనన్య బిగ్ బాస్ దివి వానలో క్యూట్ స్టిల్స్ View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
చిరిగిన జీన్స్లో ఐటం బ్యూటీ, పెంపుడు కుక్క బర్త్డేకు పార్టీ ఇచ్చిన ఊర్వశి
► చిరిగిన జీన్స్లో ఐటం బ్యూటీ ► డ్యాన్స్తో ఇరగదీసిన శ్వేతానాయుడు ► సిడ్నీ నగరాన్ని చుట్టేస్తోన్న అరియానా గ్లోరీ ► ఆమ్స్టర్డామ్ యాత్రలో యాంకర్ నేహా చౌదరి ► కుక్కకు నెక్లెస్ వేసి బర్త్డే పార్టీ చేసిన ఊర్వశి రౌతేలా View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
Urvashi Rautela: వైట్ డ్రెస్లో పాలరాతి శిల్పంలా మెరుస్తోన్న ఐటం బ్యూటీ (ఫొటోలు)
-
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!
హీరోలతో సమానమైన పారితోషికం మాకెక్కడిది? అని పెదవి విరిచే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నిజమే, హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హీరోయిన్లు తీసుకున్నంత పారితోషికాన్ని హీరోలు కూడా అందుకోలేరు.. అవును, సినిమా మొత్తానికి ఓ సాధారణ హీరో రూ.2 కోట్లు తీసుకున్నా అందులో ఐటం సాంగ్ చేసిన హీరోయిన్కు అంతకన్నా ఎక్కువే ముట్టజెపుతారు నిర్మాతలు. వారు అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడరు. ఐటం సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన ఊర్వశి రౌతేలా కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న ఈమె వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటం సాంగ్ బాస్ పార్టీలో తళుక్కుమని మెరిసింది. ఈ చిత్రానికి గానూ ఆమెకు రెండు కోట్లు ముట్టాయట. ఈ మూవీ, ఆ పాట రెండూ బ్లాక్బస్టర్ హిట్ కొట్టడంతో బ్యూటీకి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత ఏజెంట్లో వైల్డ్ సాలా పాటలో తన ఒంపుసొంపులను ప్రదర్శించింది. అలాగే పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్ల బ్రో సినిమాలోనూ మై డియర్ మార్కండేయ అంటూ స్పెషల్ సాంగ్లో స్టెప్పులేసింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని స్కంధ సినిమాలో కూడా ఓ పాటలో మెరుపు తీగలా వచ్చిపోనుంది. అయితే ఈ చిత్రంలో మూడు నిమిషాల పాటకుగానూ మూడు కోట్లు డిమాండ్ చేసిందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకుందన్నమాట! ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ కాలం కలిసొచ్చినప్పుడే కోట్లు కూడబెట్టుకోవాలి అనే ఫార్ములాను ఊర్వశి గట్టిగానే ఫాలో అవుతోందంటున్నారు అభిమానులు. చదవండి: అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి రౌతేలా -
అల్లర్ల మధ్య హోటల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి!
వాల్తేరు వీరయ్య 'బాస్ పార్టీ'తో బాగా ఫేమస్ అయింది ఊర్వశి రౌతేలా. ఐటం సాంగ్లతోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టే ఈ బ్యూటీకి తాజాగా పారిస్లో చేదు అనుభవం ఎదురైంది. పారిస్ ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న ఆమె అక్కడ ఓ హోటల్లో బస చేసింది. అయితే పారిస్ నగరంలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, హోటల్ గది నుంచి బయటకు రావాలంటేనే భయం వేస్తోందంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది నటి. తన గది కిటికీ నుంచి తీసిన ఈ వీడియోలో.. వీధుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావారణం స్పష్టంగా కనిపిస్తోంది. గన్ పేల్చిన శబ్ధాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో ఊర్వశి చిక్కుకోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తను వీలైనంత త్వరగా తన పని ముగించుకుని క్షేమంగా ఇండియాకు తిరిగిరావాలని కోరుకుంటున్నారు. ఇకపోతే బాలీవుడ్లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్ పంటి లాంటి చిత్రాల్లో తళుక్కుమని మెరిసిన ఊర్వశి 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్ను కైవసం చేసుకుంది. ఇటీవల 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్ను కూడా గెలుచుకుంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) చదవండి: 61 ఏళ్ల వ్యక్తితో శృంగారం.. స్పందించిన హీరోయిన్ బుల్లితెర నటుల ఇంట్లో చోరీ.. లక్ష విలువైన.. -
పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకాన్ స్టార్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప పార్ట్-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొట్టగా.. ఈ చిత్రం అంతకుమించి ఉంటుందని తెలుస్తోంది. పుష్పలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటా మావ.. ఉఊ అంటావా మావ' క్రేజ్ మామూలుగా లేదు. ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అంతలా సినీ ప్రేక్షకులను ఊపేసింది. (ఇది చదవండి: భార్య కోసం ఏకంగా ఆస్పత్రినే బుక్ చేసిన స్టార్ హీరో! ) అయితే పుష్ప-2లోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటమ్ సాంగ్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కనిపించనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ మీడియా కథనం ప్రకారం ఈ మూడు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్లు వసూలు తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఊర్వశి కూడా అంతకంటే ఎక్కువే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా.. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈచిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. గతంలో బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పుష్ప-2 గ్లింప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) -
Paris Fashion Week: బ్లాక్ నెట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా (ఫోటోలు)
-
వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్ సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్తో అదరగొట్టింది. అంతే కాకుండా రిషబ్ పంత్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. బాలీవుడ్లో హేట్ స్టోరీ-4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పాగల్ పంటి లాంటి చిత్రాల్లో పనిచేసింది. అంతే కాకుండా 2015లో 'యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్' టైటిల్ను కైవసం చేసుకుంది. తాజాగా 'వరల్డ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్' టైటిల్ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: టూమచ్ ఓవరాక్షన్ అని చెడామడా తిట్టాడు, రాత్రంతా నిద్రపోలే: నటుడు) ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాలో రాస్తూ.. 'ప్రపంచంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలొరెట్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ఐడబ్ల్యూఎం బజ్ సంస్థకు నా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన ప్రేమ, కలలు సాకారమయ్యే క్షణాలను ఇలా జరుపుకుంటూనే ఉంటాం. ' అంటూ పోస్ట్ చేసింది. నెటిజన్స్ ట్రోల్స్ ఊర్వశి రౌతేలాకు అవార్డ్ రావడంతో ఆమె కొన్ని ఫోటోలను గ్లామరస్ పిక్స్ తన ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలను బాగానే ఎడిట్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో ఐఐటీ, ఐఐఎంలో చదివిన మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ఫోటోలను అత్యుత్తమంగా ఎడిట్ చేశారంటూ ఎద్దేవా చేశారు. మరొకరు రాస్తూ ప్రపంచంలోనే అత్యంత భ్రమలు కలిగించే వుమెన్ ఊర్వశినే అంటూ రాసుకొచ్చాడు. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
ఫ్లైట్లో పోగొట్టుకున్నా.. ప్లీజ్ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు హీటెక్కిస్తుంది ఈ బీ టౌన్ చిన్నది. ఈ నటి ఇటీవలే ప్రపంచంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవార్డును కూడా అందుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది. తాజాగ మరోసారి సోషల్ మీడియాలో ఆమె చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఇటీవల విమానంలో దూర ప్రయాణం చేసిన ఊర్వశి తన వద్దనున్న రెండు ఐఫోన్లను ఫ్లైట్లోనే మరచిపోయి వచ్చేసిందట. అది వెతికేందుకు సహాయం కోరుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ను ఇలా పెట్టింది. 'డియర్ విస్తారా నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మరచిపోయాను. వాటి వాల్ పేపర్లో మా తల్లిదండ్రుల ఫొటో ఉంటుంది. దయ చేసి మీరు దాన్ని వెతికేందుకు సహాయం చేస్తారా' అంటూ రాసుకొచ్చింది. కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరు సరసన 'బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ' అంటూ స్టెప్పులేస్తూ.. యూత్ ఫాలోయింగ్ను పెంచుకుంది . ప్రస్తుతం ఆమె లో బోయపాటి-రామ్ పోతినేని సినిమాతో పాటు 'బ్రో' లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరవనుంది. (ఇదీ చదవండి: రాధికా ఆప్టేతో రోమాన్స్ చేసిన ఈ నటి గురించి తెలుసా?) -
ఐఐటీయన్గా హీరోయిన్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బీ టౌన్తో పాటు టాలీవుడ్కు కూడా సుపరిచితమే. మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్లో అదరగొట్టింది. వేర్ ఈజ్ ది పార్టీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్లోనూ స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) సినీ తారలపై ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఊర్వశి రౌతేలా మరోసారి ట్రోల్స్కు గురైంది. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో ఐఐటీయన్ అని పేర్కొనడంపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు కొత్త కారు, కొత్త ఇల్లు ఉండొచ్చు.. కానీ ఆమె ఐఐటీయన్ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా ఆమె గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బయోలో ఐఐటీయన్గా పేర్కొంది. ఇది చూసిన కొందరేమో ఆమె అప్పట్లో ఐఐటీలో చేరాలనుకున్నది అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఐఐటీయన్ అన్న ట్యాగ్ను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. కానీ ఆమె అధికారిక వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ ఐఐటీయన్గానే చూపిస్తోంది. కాగా.. గతంలో ఊర్వశి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది. అంతే కాకుండా ఐఐటీ ఎంట్రన్స్ను క్లియర్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తాను ఐఏఎస్ కోసం కూడా సిద్ధమైనట్లు వివరించింది. చివరికీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది.. కానీ ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సన్నీ డియోల్, అమృతా రావుతో కలిసి సింగ్ సాబ్ ది గ్రేట్తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) -
ఐటం పాప బాగా రిచ్.. ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే గుడ్లు తేలేస్తారు!
బాస్ పార్టీతో టాలీవుడ్ను ఓ ఊపు ఊపిన గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా ఈ మధ్య అస్సలు తగ్గడం లేదుగా! వరుస ఐటం సాంగ్స్తో కోట్లు పోగేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే రూ.190 కోట్లు పెట్టి బంగ్లా సొంతం చేసుకుంది. అక్కడిదాకా ఎందుకు.. బర్త్డే సెలబ్రేషన్స్కే రూ.93 లక్షలు ఖర్చు పెట్టింది. దుస్తులకు, నగలకు, మేకప్కు కూడా లెక్కలేనంత ఖర్చు పెడుతూ ఉంటుంది. గ్లామర్ ఫీల్డ్ అన్నాక ఆమాత్రం మెయింటెన్ చేయకపోతే ఎలా అన్నట్లుగా స్టైలిష్గా కనిపించేందుకే ఉన్నదంతా ఖర్చు పెడుతోంది. అయితే మరీ విచిత్రంగా నైట్ డ్రెస్ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడమే కాస్త విడ్డూరంగా ఉంది. తాజాగా ఊర్వశి రౌతేలా ఓ తెలుగు సినిమా కోసం హైదరాబాద్కు వచ్చింది. ఎయిర్పోర్టులో ఆమె పింక్ కలర్ నైట్ సూట్లో దర్శనమిచ్చింది. నైట్ డ్రెస్సే కదా వందల్లో ఉంటుందనుకుంటే పొరపాటే! ఆమె ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ.91,000 ఉంటుందట! ఈ విషయం తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు. 'అంత సింపుల్గా ఉన్న డ్రెస్ కోసం దాదాపు లక్ష దాకా పెట్టావా? మహాతల్లి.. నువ్వు నిజంగా గ్రేట్', 'మీరు డబ్బున్నోళ్లు మేడమ్' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రో సినిమాలో ఓ ఐటం సాంగ్ చేసేందుకు ఊర్వశి రెడీ అయిందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె హైదరాబాద్కు వచ్చింది. ఈ సాంగ్కు గణేశ్, భాను కొరియోగ్రాఫర్లుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నా ముఖం బాగోలేదని సర్జరీ చేయించుకోమన్నారు: నటి -
ఆ నిర్మాత ఇంటి పక్కనే బంగ్లా కొన్న ఊర్వశి రేటెంతో తెలుసా..!
-
రూ.190 కోట్లతో లగ్జరీ బంగ్లా కొన్న గ్లామర్ క్వీన్, ఆ నిర్మాత ఇంటిపక్కనే!
గ్లామర్ క్వీన్ ఊర్వశి రౌతేలా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఫ్యాషన్, లగ్జరీకి పెట్టింది పేరైన ఈ అమ్మడు తాజాగా దిమ్మదిరిగే విలువతో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసిందిట. దీని విలువ రూ. 190 కోట్లు ఉంటుందని పలుమీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. (అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? ) అది కూడా సినీ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే , బ్రహ్మాండమైన ఎమినిటీస్తో విలాసవంతమైన బంగ్లాకు ఊర్వశి రౌతేలా షిష్ట్ అయినట్టు తెలుస్తోంది. యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ది యూనివర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నతరువాత, 2013లో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇకఅప్పటినుంచి గ్లామరస్ లుక్స్తో, సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. (రూ.749 కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?) తాజా నివేదికల ప్రకారం అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లాలో నాలుగు అంతస్తులున్నాయి. పర్సనల్ జిమ్ విశాలమైన బాల్కనీ గార్డెన్, తదితర లగ్జరీ సౌకర్యాలున్నాయి. వందల కోట్ల విలువైన ఈ బంగ్లాకు దానికి తగ్గట్టుగానే అద్భుతమైన ఇంటీరియర్స్, ఖరీదైన పెయింటింగ్స్, క్లాసీ లుక్లో అదిరిపోతోందట. కేవలం 15 సంవత్సరాల వయస్సులో, ఊర్వశి విల్స్ లైఫ్స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్లో అదరగొట్టింది. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పటికీ, హనీ సింగ్ మ్యూజిక్ వీడియో లవ్ డోస్తో సూపర్ పాపులారిటీ సంపాదించింది. యాక్టింగ్ కంటే కూడా లావిష్ లైఫ్ స్టయిల్తో హెడ్లైన్స్లో నిలుస్తూ వస్తోంది. రూ. 40 కోట్ల గోల్డెన్ గౌను ,భారీ జాకెట్ తోపాటు, ఫిల్మ్ఫేర్ రెడ్ కార్పెట్ ఈవెంట్లో తన ఫేవరెట్ డిజైనర్ మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పర్ఫెక్ట్ స్టైల్ బాడీకాన్ డ్రెస్లో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. ఈ డ్రెస్ ధర దాదాపు రూ. 60 లక్షలు. (అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్వర్త్ గురించి తెలుసా?) ఇటీవల కొద్ది రోజుల క్రితం ఊర్వశి తన 29వ పుట్టినరోజును ప్యారిస్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 93 లక్షలు వెచ్చించిందంటేనే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో 100 వజ్రాలు పొదిగిన గులాబీల 24 క్యారెట్ల గోల్డ కప్ కేక్లు డైమండ్ కేక్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. ఇటీవలి ఫ్రాన్స్ కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తళుక్కున మెరిసిన ఈ భామ మంచి సందడి చేసిన సంగతి విదితమే. అంతేనా 10 ఏళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి బాలీవుడ్ నటిగ కూడా ఊర్వశి రౌతేలానే. -
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్తో దారుణ ట్రోల్స్కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అత్యంత చెత్త ఫ్యాషన్తో దారుణంగా ట్రోల్స్కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్షీట్, కర్టెన్ క్లాత్ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
వామ్మో 276 కోట్ల..ఒక్క సారిగా షాక్ ఇచ్చిన ఊర్వశి
-
ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!
ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్తో పాటు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తళుక్కున మెరిసింది. అయితే ఈ వేడుకల్లో ఆమె ధరించిన క్రోకోడైల్ నెక్లెస్పైనే అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న నెక్లెస్ ధర ఎంతై ఉంటుందని నెటిజన్స్లో తెగ చర్చిస్తున్నారు. దీంతో తాజాగా ఆమె టీమ్ నెక్లెస్ ధరను వెల్లడించింది. (ఇది చదవండి: 'డింపుల్తో డీసీపీ ర్యాష్గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కొత్త డ్రెస్సులు, తన అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.అయితే ఆమె ధరించిన మొసలి నెక్లెస్పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. పింక్ కలర్ గౌనులో మెరిసిన ఊర్వశి రౌతేలా.. ఫేక్ నెక్లెస్ పెట్టుకుని వెళ్లిందని ట్రోల్స్ కూడా చేశారు. View this post on Instagram A post shared by Brut India (@brut.india) (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?) అయితే ఈ ట్రోల్స్పై నటి బృందం క్లారిటీ ఇచ్చింది. నెక్లెస్ ధర తెలుపుతూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదు. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుంది. అది ఆమె ఫ్యాషన్ నిదర్శనం.' అని పేర్కొంది. ప్రస్తుతం దీని ధర చూసి అందరూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నెక్లెస్ అంత ధర ఉంటుందా? జోక్ బాగుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆడిపాడిన ఊర్వశి.. ఇటీవల అఖిల్ ఏజెంట్లోనూ కనిపించింది. -
కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి.. నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆమె ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ఈ వేడుకల్లో సినీతారలు ప్రత్యేక దుస్తుల్లో తళుక్కున్న మెరిశారు. ఐశ్వర్యారాయ్తో పాటు మరో నటి ఊర్వశి రౌతేలా సైతం రెడ్ కార్పెట్లో డిఫరెంట్ లుక్లో కనిపించింది. అయితే ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ధరించిన డ్రెస్పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి వెండి గౌన్లో తళుక్కున మెరిసింది. ఆమె ధరించిన ఈ వెండి డ్రెస్పై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మీరు డిజైనర్ను మార్చండి అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ ఐశ్వర్యారాయ్ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సోషల్మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా ధరించిన నెక్లెస్పై కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పింక్ కలర్ డ్రెస్లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం మొసలి డిజైన్తో తయారు చేసిన నెక్లెస్ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘ఆ నెక్లెస్ కిందపడితే నిజంగా మొసలి అనుకొని భయపడతారేమో జాగ్రత్త అని కామెంట్స్ చేశారు. బ్లూ కలర్ లిప్స్టిక్ వేసుకున్న ఊర్వశి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
వైభవంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్: రెడ్ కార్పెట్పై మెరిసిన ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)
-
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023.. తారల సొగసులు
ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో భారత సినీ తారలు మెరుస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ వేడుకలు 27 వరకు జరుగుతాయి. ఇప్పటికే కాన్స్ రెడ్ కార్పెట్పై సారా అలీఖాన్, ఈషా గుప్తా, ఊర్వశీ రౌతేలా క్యాట్ వాక్తో ఆకట్టుకున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ తాజాగా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, ఖుష్భూ, అమీ జాక్సన్, దర్శక–రచయిత, నిర్మాత, నటుడు విఘ్నేష్ శివన్, దర్శక–నటుడు ప్రదీప్ రంగ నాథన్లు పాల్గొన్నారు. ఇక మృణాల్ ఠాకర్, ఐశ్వర్యా రాయ్ అద్భుతమైన అవుట్ఫిట్స్లో రెడ్ కార్పెట్పై మెరిశారు. మొత్తానికి కాన్స్లో దేశీ హంగామా బాగానే కనబడుతోంది. -
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు. -
ఊర్వశి వస్తేనే DCకి ఊపొస్తుందా?
-
షూటింగ్లో నటితో అసభ్యంగా ప్రవర్తించిన అఖిల్? అసలు విషయమిదే!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తాను సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్పుకునే వివాదస్పద సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను చేసిన ఫేక్ ట్వీట్పై ఊర్వశి ఫైర్ అయింది. ఇలాంటి ఫేక్ పోస్ట్ చేసినందుకు అతనిపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. అసలు ట్వీట్లో ఏముంది? అఖిల్ అక్కినేని.. ఊర్వశి రౌతేలాతో ఏజెంట్ మూవీ షూట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ను చూసిన బాలీవుడ్ భామ ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతటితో వదలకుండా అతనిపై విమర్శల దాడి చేసింది. నువ్వు జర్నలిస్టే కాదంటూ చురకలంటించింది. ఇలాంటి ఫేక్ వార్తలు తమ కుటుంబానికి చాలా అసౌకర్యంగా కలిగించాయని ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా అభిమానులు మద్దతుగా నిలిచారు. #AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc — Umair Sandhu (@UmairSandu) April 18, 2023 View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
విడ్డూరంగా ఉంది.. విజయాన్ని ఆమెతో ముడిపెట్టడమేంటి?
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం కేకేఆర్తో మ్యాచ్లో 128 పరుగుల లక్ష్యాన్ని కిందా మీదా పడి ఎలాగోలా చేధించింది. ఒక దశలో కేకేఆర్ మ్యాచ్ విజయం సాధిస్తుందా అన్న అనుమానం కూడా వచ్చింది. కానీ చివరి వరకు నిలబడిన అక్షర్ పటేల్ జట్టును గెలిపించాడు. అయితే కొందరు మాత్రం ఢిల్లీ విజయాన్ని బాలీవుడ నటి ఊర్వశి రౌతేలా క్రెడిట్లో వేయడం ఆసక్తి కలిగించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మ్యాచ్లో బాలీవుడ నటి ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. పసుపు కలర్ మిడ్డీలో వచ్చిన ఆమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిందనే చెప్పొచ్చు. ఊర్వశి రౌతేలా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని ఆమెతో ముడిపెట్టడం ఏంటని కొందరు అభిమానులు పేర్కొన్నారు. ''ఆమెదో మ్యాచ్ చూడడానికి వచ్చింది. అలా అని ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఊర్వశి అనడం కరెక్ట్ కాదు.. ఇది వినడానికే విడ్డూరంగా ఉంది.. ఇంకెంతకాలం ఊర్వశి రౌతేలా జపం చేస్తారు..'' అని కామెంట్ చేశారు. Reason of Delhi Capitals performance Today 🔥 Urvashi Rautela🥵 pic.twitter.com/D0ggfAMuvw — K L Rahul (@klrahul___) April 20, 2023 చదవండి: 'అవును మేమింతే' అంటున్న కోహ్లి, మ్యాక్స్వెల్ -
ఈసారి అఖిల్ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్
‘ఏజెంట్’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ స్పై ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. అఖిల్, ఊర్వశీల మాస్ స్టెప్స్తో ఈ పాట అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ..’ అనే స్పెషల్ సాంగ్లో తన డ్యాన్స్తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. -
ఎంట్రీతోనే బిగ్ డిజాస్టర్.. అయినా తగ్గట్లేదుగా హీరో!
ప్రముఖ బిజినెస్మెన్ అరుల్ శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ది లెజెండ్'. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అప్పట్లో హీరోగా శరవణన్ ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అయితే తాజాగా కొత్త లుక్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు శరవణన్. ట్రోలర్స్కు చెక్ పెట్టేందుకే న్యూ లుక్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో గడ్డం, మీసాలతో శరవణన్ కాస్తా డిఫెరెంట్ లుక్లో కనిపించారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలంటే శరవణన్కు పిచ్చి బిజినెస్మెన్ అయిన శరవణన్కు సినిమాలంటే పిచ్చి. తెరపై కనిపించాలన్నదే ఆయన కోరిక. అందువల్లే శరవణ స్టోర్స్ యాడ్లో కూడా తానే నటించాడు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బిజినెస్ బ్రాండ్లకు పబ్లిసిటీ ఇస్తుంటారు. గతేడాది జులైలో విడుదలైన ది లెజెండ్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్గా నిలిచినా శరవణన్ ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజా లుక్ చూస్తే మరోసారి స్క్రీన్పై ప్రేక్షకులను అలరించేందకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ది లెజెండ్ సినిమాలో ఆయన నటించడంపై నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు. కాగా.. ది లెజెండ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. New Transition… Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/gws9HR7j8O — Legend Saravanan (@yoursthelegend) March 13, 2023 -
పంత్ త్వరగా కోలుకోవాలి: ఊర్వశి రౌతేలా
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంట్లోవాళ్లను సర్ప్రైజ్ చేద్దామని ఒంటరిగా ఢిల్లీ నుంచి సొంత గ్రామానికి బయల్దేరాడు. అయితే ఢిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై రూర్కీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి పంత్కు పలు సర్జరీలు నిర్వహించారు. ప్రస్తుతం పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకునేందుకు ఆరు నుంచి తొమ్మిది నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పంత్ ఈ ఏడాది క్రికెట్కు పూర్తిగా దూరమైనట్లే. ఇటీవలే పంత్ వాకింగ్స్టిక్స్ సాయంతో తాను నడుస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా భాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రార్థిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా పంత్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించింది. శనివారం ముంబై ఎయిర్పోర్ట్లో ఊర్వశి ప్రత్యక్ష్యం కావడంతో ఫోటోగ్రాఫర్స్ ఆమెను చుట్టుముట్టారు. ఈ సమయంలో పంత్ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ.. ''పంత్ మన దేశానికి పెద్ద ఆస్తి. అతను టీమిండియాకు ఆడడం దేశానికి గర్వకారణం. పంత్ త్వరగా కోలుకోవాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అంటూ పేర్కొంది. గతంలో పంత్, ఊర్వశి రౌతేలా మధ్య లవ్ట్రాక్ నడుస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా వీరిద్దరి విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు దృశ్యా ఆమె వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. -
కాంతార-2 హీరోయిన్గా ఊర్వశీ రౌతేలా? వైరల్ అవుతున్న ఫోటో
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు ఇటీవలె మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంతార-2 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కూడా నటించనుంది. ఈ మేరకు స్వయంగా ఆమె తన ఇన్స్టా స్టోరీలో డైరెక్టర్ రిషబ్ శెట్టితో కలిసి ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘కాంతారా2’లోడింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఊర్వశీ హీరోయిన్గా నటిస్తుందా లేక కీలక పాత్రలో చేయనుందా అన్న సందేహం నెలకొంది. ప్రస్తుతం ఊర్వశీ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
మూడు నిమిషాలు.. రెండు కోట్లు.. ఊర్వశి రౌతేలా షాకింగ్ రెమ్యూనరేషన్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ చిరు అభిమానులను ఊర్రూతలూగించింది. బాస్ పార్టీ సాంగ్ ఈ మూవీలో హైలెట్గా నిలిచింది. ఎందుకంటే ఆ సాంగ్లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. మెగాస్టార్తో కలిసి తన డ్యాన్స్తో అందరకొట్టింది బాలీవుడ్ భామ. అయితే ఈ సాంగ్కు ఆమె తీసుకున్న పారితోషికంపై నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. నటి ఊర్వశి రౌతేలా 'బాస్ పార్టీ' పాట కోసం భారీ మొత్తంలో వసూలు చేసిందని సమాచారం. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మూడు నిమిషాల పాట కోసం ఆమె దాదాపు రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విలన్గా నటించిన ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకోగా.. ఊర్వశి పారితోషికంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. 2023లోనే అత్యంత ఖరీదైన పాట? వాల్తేరు వీరయ్య చిత్రంలోని ఊర్వశి, చిరంజీవీల 'బాస్ పార్టీ' పాట చిత్రీకరణకు రూ.30 కోట్లు ఖర్చయిందని వార్తలొచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను నకాష్, అజీజ్, డీఎస్పీ, హరిప్రియ ఆలపించారు. కాగా.. తదుపరి ఊర్వశి రౌతేలా రామ్ పోతినేనితో కలిసి కనిపించనుంది. ఆమె 'ఇన్స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సహనటిగా కూడా నటించనుంది. ఆ తర్వాత మిచెల్ మోరోన్తో కలిసి హాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. గ్లోబల్ మ్యూజిక్ సింగిల్లో ఆమె జాసన్ డెరులోతో కలిసి కనిపించనుంది. -
'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఊర్వశి రౌతేలా (ఫొటోలు)
-
పంత్ ఉన్న ఆస్పత్రికి ఊర్వశి.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు మరోసారి ఊర్వశి రౌతేలాను ట్రోల్ చేస్తున్నారు. డెహ్రడూన్లో చికిత్స పొందిన పంత్ను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. దీంతో రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఫోటోను ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఊర్వశి నిజంగా పంత్ను కలిసిందా అని ఆశ్చర్యపోతున్నారు. దిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి వస్తుండగా టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అభిమానులు షాక్ కు గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవలే ఊర్వశి మదర్ మీరా రౌతేలా సైతం రిషబ్ పంత్ కోసం సోషల్ మీడియాలో ప్రార్థించింది. ఈ మేరకు రిషబ్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. -
'పంత్ కోసం ప్రార్థించండి'.. ఊర్వశి రౌతేలా మదర్ పోస్ట్ వైరల్
టీంఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అభిమానులు షాక్ కు గురయ్యారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఊర్వశి మదర్ మీరా రౌతేతా సైతం రిషబ్ పంత్ కోసం సోషల్ మీడియాలో ప్రార్థించింది. ఈ మేరకు రిషబ్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది మరియు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. (ఇది చదవండి: పంత్ కోసం కాదట .. ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా..!) మీరా రౌతేలా ఇన్ స్టాలో రాస్తూ..' ఒక వైపు మీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తరాఖండ్కు పేరు తీసుకొచ్చారు. మీకు సిద్ధ బలిబాబా విశేష ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉంటాయి. పంత్ కోసం అందరూ ప్రార్థించండి.' అంటూ పంత్ ఫోటో పోస్ట్ చేశారు మీరా. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో అత్తమ్మ స్పందించారంటూ కామెంట్ చేయగా.. మరికొందరు ఊర్వశి, పంత్ గురించి ఇక మీ అనుమానాలు క్లియర్ అయినట్లే ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Meera Rautela (@meera_rautela) -
రిషభ్ పంత్కు ప్రమాదం.. ప్రార్థిస్తున్నా అంటూ ఊర్వశీ రౌతేలా పోస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషభ్ పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం డెహ్రాడూన్లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇక పంత్ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా నటి ఊర్వశీ రౌతేలా సైతం పంత్ యాక్సిడెంట్ప తనదైన శైలిలో స్పందించింది. పేరు ప్రస్తావించకుండా.. ప్రార్థిస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేసింది. ఊర్వశీ పోస్ట్పై చాలామంది ఫ్యాన్స్ పంత్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఊర్వశీ-రిషభ్ పంత్ మధ్య గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కోల్డ్వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. తనకోసం ఓ హోట్లో ఆర్పీ చాలా సేపు ఎదురుచూశాడని ఊర్వశీ పేర్కొనగా.. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడతారని, ఇలాంటి వాళ్లనే చేస్తే జాలేస్తుందని రిషభ్ పంత్ ఊర్వశీని ఉద్దేశిస్తూ ఆ మధ్య పోస్ట్ చేసిన సంగతి విధితమే. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
‘వాల్తేరు వీరయ్య’ తొలి పాట వచ్చేసింది.. ‘బాస్ పార్టీ’ అదిరిపోయింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాస్ పార్టీ సాంగ్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని తెలియజేసేలా రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశాడు. నకాష్ అజీజ్, హరిప్రియ అద్భుతంగా ఆలపించారు. మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్సులతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. కలర్ఫుల్ చొక్కా, లుంగీ, చెవి పోగు, మెడలో గొలుసు, గడియారం, షూస్.. మాస్ అప్పీల్లో ఫ్యాన్స్ని ఫిదా చేస్తున్నారు చిరంజీవి. ఊర్వశి రౌతేలా చిరంజీవి ఎనర్జీకి తగ్గట్టుగా ప్రయత్నించి విజయం సాధించింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. శ్రుతీ హాసన్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
అందమైన భామలు.. అదిరిపోయే స్టెప్పులు
సినిమా సీరియస్గా సాగుతున్నప్పుడు జరగాలి ఓ మ్యాజిక్. స్పెషల్ సాంగ్ ఆ మ్యాజిక్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. అందుకే విడుదలవుతున్న ప్రతి సినిమాలోనూ దాదాపు ఓ స్పెషల్ సాంగ్ ఉండటం కామన్ అయింది. అలా రానున్న రోజుల్లో సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి, ఆ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అందమైన భామల గురించి తెలుసుకుందాం. తెలుగు మాస్ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హిందీ భామ ఊర్వశీ రౌతేలా. ‘భాగ్ జానీ’, ‘కాబిల్’ వంటి హిందీ చిత్రాల్లో ఇప్పటికే స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. చిరంజీవి టైటిల్ రోల్లో, రవితేజ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’లో ఊర్వశి స్టెప్స్ చూడనున్నాం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. ఈ చిత్ర సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన స్పెషల్ సాంగ్లో చిరంజీవితో కలిసి సూపర్ స్పెషల్ స్టెప్పులేశారు ఊర్వశి. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఊర్వశి చేసిన మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో రామ్తో కలిసి స్టెప్పులేశారు ఊర్వశి. ఊర్వశీ రౌతేలా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కానుంది. ఇక ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా రిలీజ్కు సిద్ధం అవుతోంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథ అందించారు. మరోవైపు బుల్లితెర ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్ స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్ను ‘బోళా శంకర్’ చిత్రంలో చూడొచ్చు. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. అప్సరా రాణి ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ స్పెషల్ సాంగ్కి డ్యాన్స్ చేశారు రష్మీ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు భారత మాలాలు ఉన్న ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణతో కలిసి స్పెషల్ డ్యాన్స్ వేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ‘వీరసింహా రెడ్డి’. చిత్ర సంగీతదర్శకుడు తమన్ స్వరపరచిన స్పెషల్ సాంగ్లో బాలకృష్ణతో కలసి చంద్రికా రవి మాస్ స్టెప్పులేశారు. చంద్రికా రవి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్ ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్లో మెరిసిన హెబ్బా పటేల్ ‘శాసన సభ’లో కూడా తళుక్కుమననున్నారు. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ సినిమాకు వేణు మడికంటి దర్శకుడు. ఈ సినిమాలో ‘నన్ను పట్టుకుంటే...’ అనే పాటలో నర్తించారు హెబ్బా పటేల్. ఈ సినిమాకు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడు. ఇక గత ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’లో ‘బూమ్ బద్దల్’ అంటూ సిల్వర్ స్క్రీన్ని షేక్ చేసిన అప్సరా రాణి గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ఇప్పుడు ‘హంట్’ చిత్రంలో సుధీర్బాబుతో కలిసి ‘పాపతో పైలం’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. సుధీర్ బాబు హీరోగా శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. మహేశ్ సూరపనేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతదర్శకుడు. వీళ్లే కాదు.. ఇంకా స్పెషల్ సాంగ్స్లో మెరవనున్న తారలు కొందరున్నారు. సినిమాకి స్పెషల్గా నిలిచే ఈ సాంగ్స్ అందాల తారల కెరీర్లోనూ స్పెషల్గా నిలిచిపోతాయి. అందుకే శ్రుతీహాసన్, తమన్నా వంటి అగ్ర తారలు కూడా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. -
వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్! క్లారిటీ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్ ఖరారు చేసిన ఈ మూవీ నుంచి తాజా ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. తాజాగా చిత్ర బృందం విడదల చేసిన ఓ ఫోటోతో ఈ వార్తలపై స్పష్టత వచ్చేసింది. సినిమాలో ఐటెం సాంగ్కు చిరుతో కలిసి ఆమె స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. చదవండి: బర్త్డే సర్ప్రైజ్.. వర్షకు కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్! ఇటీవల ఈ పాటకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేశ్ బర్త్డేను వాల్తేరు వీరయ్య సేట్లో సెలబ్రేట్ చేశారు. మూవీ సెట్లో ఆయనతో కేక్ కట్ చేయించిన ఫొటోను డైరెక్టర్ బాబీ ట్విటర్లో షేర్ చేస్తూ ఆయన పుట్టిన రోజును వాల్తేరు వీరయ్య సెట్లో నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మెహర్ రమేశ్ ఇతర క్రూడ్తో పాటు నటి ఊర్వశి రౌతేల కూడా దర్శనమించింది. దీంతో ఈ చిత్రంలో ఆమెతో అదిరిపోయే స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేశారని స్పష్టమైందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కబోయే ఓ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ Wishing dearest @MeherRamesh Anna a very happy birthday 🎂 🎉 Super happy to Celebrate your birthday on our #WaltairVeerayya sets along with Boss @KChiruTweets 😍 May you be blessed with best of everything, have a Blockbuster year ahead. ❤️#HBDMeherRamesh pic.twitter.com/OoIMSrue31 — Bobby (@dirbobby) November 6, 2022 -
ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి: విరాట్ హోటల్ రూమ్ వీడియో లీక్పై అనుష్క తీవ్ర ఆగ్రహం) ఈ ఘటనపై కింగ్ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. -
రామ్ సినిమాలో ఊర్వశీ రౌతేలా.. ఫోటోతో క్లారిటీ
యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సాగనుంది. పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది.. శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్లో కనిపించనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్ని నిజం చేస్తూ హీరో రామ్తో సెట్స్లో దిగిన ఓ ఫోటోను ఊర్వశీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్లో నటించనుందనే న్యూస్ కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. ఇక అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. @ramsayz 🌹♥️ #RP pic.twitter.com/t9eCNweftY — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 27, 2022 -
పంత్తో పరాచకం.. ఊర్వశి, ఊర్వశి అంటూ ఆటపట్టించారు
టీ20 వరల్డ్కప్-2022లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు బౌండరీ లైన్ బయట నిల్చున్న రిషబ్ పంత్తో పరాచకాలాడారు. ఊర్వశి.. ఊర్వశి అంటూ కేరింతలు పెడుతూ అతన్ని ఆటపట్టించారు. ఆకతాయిల అల్లరిని పంత్ వినీ విననట్లు వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తమ అభిమాన క్రికెటర్ను టీజ్ చేయడంపై పంత్ అభిమానులు మండిపడుతున్నారు. అసలే జట్టులో స్థానం దక్కక బాధలో ఉన్న పంత్ను ఇలా ఏడ్పించడం సబబు కాదని అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన వ్యక్తితో ఇలా ప్రవర్తించడం దేశాన్ని అవమానించడం లాంటిదని స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు. pic.twitter.com/vMdCJ9g4Fm — Out Of Context Cricket (@GemsOfCricket) October 24, 2022 కాగా, రిషబ్ పంత్, బాలీవుడ్ అప్కమింగ్ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో పంత్ ఈ వ్యవహారాన్ని లైట్గా తీసుకుని ఆటపై దృష్టి పెడుతున్నా.. ఊర్వశి మాత్రం అతన్ని ఏదో ఒకలా గెలుకుతూనే ఉంది. వరల్డ్కప్ ఆడేందుకు పంత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంటే.. లవ్ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసి పంత్ను గెలికే ప్రయత్నం చేసింది. ఊర్వశి చేసిన ఈ పోస్ట్కు పంత్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటరిచ్చారు. స్టాకర్ (వ్యక్తి ఇష్టం లేకుండా వెంట పడటం) అంటూ ఆటాడుకున్నారు. కొందరైతే మా వాడిని ప్రశాంతంగా వదిలేయమ్మా అంటూ బ్రతిమలాడుకున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే, అక్టోబర్ 23న పాక్తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించి టీమిండియాకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. టీమిండియా యాజమాన్యం వికెట్కీపర్ కోటాలో దినేశ్ కార్తీక్ను ఎంపిక చేసింది. అయితే ఆ మ్యాచ్లో డీకే విఫలమయ్యాడు. దీంతో నెదర్లాండ్స్తో రేపు (అక్టోబర్ 27) జరుగబోయే మ్యాచ్లో పంత్కు అవకాశమిస్తారని అంతా భావిస్తున్నారు. చదవండి: పంత్ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..! -
పంత్ కోసం కాదట .. ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా..!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఈ భామ టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అయితే ఊర్వశి కూడా అక్కడికే చేరుకోవడంతో కచ్చితంగా పంత్ కోసమే వెళ్లిందంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇటీవల ఊర్వశి రౌతేలా విడుదల చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. అది కూడా పంత్ కోసమేనని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దానిపై క్లారీటీ ఇచ్చింది బాలీవుడ్ భామ. (చదవండి: స్టాకింగ్ అంటూ ఊర్వశిపై రిషబ్ ఫ్యాన్స్ ఫైర్, ఘాటుగా స్పందించిన నటి) తన ఇన్స్టా రాస్తూ..' ఆ వీడియోపై మళ్లీ క్లారిటీ ఇస్తున్నా. అది కేవలం నటనకు సంబంధించి చేసింది మాత్రమే. అందులోని డైలాగ్ కూడా ఎవరినీ ఉద్దేశించి కాదు. అలాగే ఎలాంటి వీడియో కాల్ కాదు' అంటూ రాసుకొచ్చింది ఈ భామ. అంతకుముందు ఆ వీడియోలో ఆమె ఊర్వశి మాట్లాడుతూ..' మీరు ఐ లవ్ యూ చెప్పండి. ముందు మీరే ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి చెప్పండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఆ వీడియోపై ఆ బాలీవుడ్ భామ ఎవరి ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చింది. Bollywood Actress Urvashi Rautela Valentine Day drama viral on the social media and captioned This Valentine Week Delhi girls be like: Aap bolo I LOVE YOU bas ek baar bol do 🤣😂 #UrvashiRautela #valentine #day #valentineday #bollywood #actress pic.twitter.com/c78TvrHJX9 — Hungama Bollywood (@mirchi_blog) February 13, 2020 -
స్టాకింగ్ అంటూ ఊర్వశిపై రిషబ్ ఫ్యాన్స్ ఫైర్, ఘాటుగా స్పందించిన నటి
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కొద్ది రోజులుగా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలుస్తుంది. టిమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఊర్వశిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను స్టాకర్ (వ్యక్తి ఇష్టం లేకుండా వెంట పడటం) అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల ఆమె ఆస్ట్రేలియా వెళ్లడమే. కాగా కొద్ది రోజుల కిందట పంత్-ఊర్వశి మధ్య జరిగిన మాటల యుద్దం గురించి తెలిసిందే. అయితే ఊర్వశి పంత్కు సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందనుకున్నారు. కానీ ఇంతలో ఊర్వశీ.. పంత్ను ఉద్ధేశిస్తూ చేసి పోస్ట్పై అతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రస్తుతం టిమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆమె కూడా ఆస్ట్రేలియాకు పయనమైంది. దీంతో పంత్ను ఫాలో అవుతూ ఆమె ఆస్ట్రేలియా వెళ్లిందని, ఓ వ్యక్తి ఇష్టం లేకున్నా ఎలా ఫాలో అవుతారంటూ క్రికెట్ అభిమానులు ఊర్శశిని నిందిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న నెగిటివిటిపై తాజాగా ఊర్వశి రౌతేలా స్పందించింది. తన ఇన్స్టాగ్రామ్లో వరుస పోస్ట్స్ షేర్ చేస్తూ ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘ఒకప్పుడు ఇరాన్, ఇప్పుడు ఇండియా. ఇది నాకే జరుగుతుంది. అందరు నన్నే నిందిస్తున్నారు. ఎందుకంటే నేనేప్పుడు ఎవరికి వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేయకపోవడం వల్లే. ఇకనైనా నన్ను నిందించడం ఆపండి’ అంటూ స్టాప్బుల్లింగ్ఉమెన్ అనే హ్యాష్ ట్యాగ్ను జత చేసింది. అలాగే మరో పోస్ట్లో ఇండియన్ మీడియా స్టాకర్ అనే పదానికి అసలైన అర్థం తెలుకోవాలంటూ స్టాకర్ పదం నిర్వచనానికి సంబందించిన స్క్రిన్షాట్ షేర్ చేసింది. అనంతరం ఆస్ట్రేలియా మ్యాప్ షేర్ చేస్తూ.. ఇది ఇండియన్ మీడియా కోసం.. ఆస్ట్రేలియా దేశం ఎంత పెద్దగా ఉందో చూశారా?’ అంటూ భారత మీడియాను ఉద్దేశిస్తూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా టిమిండియా ఆస్టేలియా వెళ్లిన మరసటి రోజే ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియా పయనమైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వెళుతూ ఫ్లైట్లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘ప్రేమ ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి’ అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసి పంత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
పంత్ కోసమేనా ఇన్ని పాట్లు.. ఊర్వశి రౌతేలాపై దారుణంగా నెటిజన్ల ట్రోల్స్
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా రోజుకో కొత్త లుక్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియా చెక్కేసిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్లో పిక్స్తో అదరగొడుతోంది. అయితే ఆమె ఫోజులపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కోసమే ఇదంతా చేస్తున్నారని ట్రోల్స్ తెగ వైరలవుతున్నాయి. ఇటీవల ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్లో గ్రీన్ లెహెంగా ధరించి ఫోటోను షేర్ చేసింది. తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ..' ఎలా మర్చిపోగలను. మరణం మనుషులకే వస్తుంది. జ్ఞాపకాలకు కాదు." అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..' పంత్ కోసమే ఆమె తన ఫోటోలు ఎడిటింగ్ చేస్తున్నారని ట్రోలింగ్ చేశారు. తన నడుము చూపించేందుకే నానా తంటాలు పడుతోందని మరో నెటిజన్ కాస్త ఘాటుగా కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) ఆస్ట్రేలియాకు వెళ్లిన బాలీవుడ్ బ్యూటీ రోజుకో కొత్త స్టైల్లో ఫోటోలతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. అదేస్థాయిలో ఆమెపై నెటిజన్లు ట్రోలర్స్తో కౌంటరిస్తున్నారు. తాజాగా నుదుట సింధూరం ఉన్న ఓ ఫోటోను షేర్ చేయగా తెగ వైరలవుతోంది. ఇన్స్టాలో ఇలా రాస్తూ..' ప్రేమలో ఉన్న వారికి సింధూరం కంటే గొప్పది ఏముంటుంది. నేను నీతో జీవితాంతం కలిసుండాలనుకుంటున్నా' అంటూ లన్ సింబల్తో' క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. మరీ ఈ భామ ప్రేమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో.. ఆమెపై వస్తున్న రూమర్స్కు ఎప్పుడు చెక్ పడుతుందో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
పంత్ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..!
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ అప్కమింగ్ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల కిందట ఊర్వశి.. పంత్కు సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. ఈలోపే ఊర్వశి.. పంత్ను మరోసారి గెలికింది. పంత్ టార్గెట్గా.. లవ్ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ వయ్యారంగా ఓ ప్రైవేట్ జెట్లో కూర్చొన్న ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఊర్వశి నుంచి ఊహించని ఈ చర్యతో నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రేమ కోసం (పంత్) చిన్నది సప్త సముద్రాలు దాటి వెళ్తుందని కొందరు.. ఈమె పంత్ను ప్రశాంతంగా బ్రతకనిచ్చేట్లు లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే పంత్ పాత్ర చాలా కీలకమని, దయ చేసి అతన్ని వదిలేయమ్మా.. డిస్టర్భ్ అవుతాడని మరికొందరు ఊర్వశిని ఉతికి ఆరేస్తున్నారు. ఇంకొందరైతే ఊర్వశి ఇటీవల పాక్ యువ పేసర్ నసీం షాతో కలిసి ఉన్నట్లు యానిమేట్ చేసిన పోస్ట్ను ట్యాగ్ చేస్తూ.. అమ్మడు మనకు మంచే చేయడానికి వస్తుంది. వరల్డ్కప్లో పాక్కు నసీం షా కీలక బౌలర్. అమ్మడు వాణ్ణి తగులుకుంటే మన పని ఇంకా సులువవుతుందని చర్చించుకుంటున్నారు. నువ్వు నిజంగా భారతీయురాలివైతే మెగా టోర్నీకి ముందు టీమిండియాలోని కీలక సభ్యున్ని ఇలా గెలకవని కొందరు తూర్పారబెడుతుండగా.. ఏదిఏమైనా వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్కు ముందు ఊర్వశి ఇలాంటి మూడ్ డైవర్ట్ అయ్యే పోస్ట్లు పెట్టకూడదని, మీకు మీకు ఏమైనా ఉంటే మ్యాచ్ల్లేని సమయాల్లో చూసుకోవాలని ఇంకొందరు సూచిస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్కప్ ఆడేందుకు రిషబ్ పంత్ టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: సారీ చెప్పింది పంత్కు కాదు.. నా ప్రియమైన వారికి.. మాట మార్చిన రౌతేలా -
టీమిండియా యంగ్ క్రికెటర్కు బాలీవుడ్ నటి బర్త్డే విషెస్.. వీడియో వైరల్!
గతంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె అతనికి సారీ కూడా చెప్పింది. అయితే తాజాగా పంత్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో షేర్ చేసింది. తన ఇన్స్టాలో 'హ్యాపీ బర్త్డే' అంటూ ఎవరీ పేరు చెప్పకుండానే పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్తా వైరలవడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ పంత్ బర్త్డే కావడంతో అతనికే విషెస్ చెప్పారంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: Rishabh Pant: లైట్ తీసుకున్న పంత్.. సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్!) ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రెడ్ కలర్ డ్రెస్లో ఆమె నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అందులోనే పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ. ఆమె ఎవరికీ చెప్పిందో పేరును ప్రస్తావించనప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ వీడియో రిషభ్ పంత్ కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ టీమిండియా క్రికెటర్ పంత్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
సారీ చెప్పింది పంత్కు కాదు.. నా ప్రియమైన వారికి.. మాట మార్చిన రౌతేలా
Urvashi Rautela-Rishbah Pant: బాలీవుడ్ అప్కమింగ్ నటి ఊర్వశి రౌతేలా, టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ల మధ్య సోషల్మీడియా వార్ బ్రేకులు పడ్టట్టే పడి మళ్లీ మొదటికొచ్చింది. నిన్న (సెప్టెంబర్ 13) ఓ బాలీవుడ్ రిపోర్టర్ ఊర్వశిని పలకరిస్తూ.. మీరు ఆర్పీ (రిషబ్ పంత్)కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అని అడగ్గా.. తొలుత కాస్త ఇబ్బంది పడ్డ ఊర్వశి ఆతర్వాత ఐయామ్ సారీ అంటూ చేతులు జోడించి మరీ సమాధానం చెప్పింది. దీంతో ఊర్వశి-పంత్ల మధ్య వివాదం సమసిపోయిందని అంతా భావించారు. అందుకనుగునంగా కొందరు సోషల్మీడియాలో కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఊర్వశి ఈ విషయమై ఇవాళ మాట మార్చింది. నేను సారీ చెప్పింది పంత్కు కాదు.. నా ఫ్యాన్స్కు అంటూ షాకిచ్చింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఈ రోజుల్లో కొన్ని అధికారిక న్యూస్ ఆర్టికల్స్, సో కాల్డ్ మీమ్ పేజెస్ (వరస్ట్ మార్కెటర్స్) సినిమాలు, టీవీ షో ల కంటే ఎక్కువ డ్రామాను రచిస్తున్నారు. నేను సారీ చెప్పింది నా ఫ్యాన్స్ కోసం.. నా ప్రియమైన వారికోసం అంటూ తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొస్తూ తగ్గేదేలేదన్న సంకేతాన్ని పంపింది. దీంతో పాటు ఊర్వశి.. వై ద న్యూస్ ఈజ్ నాట్ ట్రూత్, ఫాల్స్ మిస్ లీడింగ్ లైట్, గ్రేట్ స్క్రిప్ట్, ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ కాపీరైటెబుల్ అనే హ్యాష్ ట్యాగ్ లను తన స్టోరీస్లో జతపరిచింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఊర్వశి ఏమాత్రం తగ్గుతలేదని, ఆర్పీతో తనకు ఎక్కడో పెద్ద ఇష్యూయే జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. వీరి గొడవ మున్ముందు ఏ స్థాయికి వెళ్తుందోనని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, పంత్-రౌతేలా మధ్య గత కొద్ది రోజులుగా సోషల్మీడియా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు నెట్టింట ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ వివాదాన్ని పెద్దది చేసుకున్నారు. ఊర్వశి అయితే మధ్యలో పాక్ బౌలర్ నసీమ్ షాను కూడా లాగింది. అయితే అతను తనకు ఊర్వశి ఎవరో తెలీదనటంతో ఆ ఎపిసోడ్కు బ్రేక్ పడింది. నిన్న ఊర్వశి సారీ చెప్పడంతో ఆర్పీతో వివాదానికి కూడా బ్రేక్ పడిందని అంతా అనుకున్నారు. అయితే ఊర్వశి సారీ చెప్పింది ఆర్పీకి కాదంటూ బాంబు పేల్చింది. -
Rishabh Pant: లైట్ తీసుకున్న పంత్.. సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్!
Rishabh Pant- Urvashi Rautela: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదానికి తెరపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వీడియోలో ఊర్వశి.. పంత్కు సారీ చెబుతూ కనిపించడం ఇందుకు నిదర్శనం. కాగా టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆర్పీ అనే వ్యక్తి తన కోసం ఎయిర్పోర్టులో గంటల తరబడి ఎదురుచూశాడంటూ ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. ఇందుకు స్పందించిన పంత్.. కొందరు ఫేమస్ కావడానికి అబద్ధాలు ఆడతారంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు.. అక్కా నన్ను వదిలెయ్ అంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఇందుకు బదులుగా ఊర్వశి సైతం.. ‘‘తమ్ముడూ నువ్వు ఒక పిల్ల బచ్చా.. బ్యాట్, బంతితో ఆటకే పరిమితమవ్వు’’ అని ప్రతి విమర్శ చేసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022 ఈ మేరకు ఇన్స్టా వేదికగా స్పందించింది. ఇక ఊర్వశి పోస్టు నేపథ్యంలో పంత్ సైతం.. ‘‘నీ ఆధీనంలో లేని అంశాల గురించి నువ్వు ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదు’’ అంటూ ఓ కోట్ షేర్ చేశాడు. తద్వారా ఊర్వశిని లైట్ తీసుకుంటున్నా అని చెప్పకనే చెప్పాడు. పంత్కు సారీ చెప్పిన బాలీవుడ్ నటి ఊర్వశి ఈ నేపథ్యంలో తాజాగా ఊర్వశికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్స్టాంట్ బాలీవుడ్ రిపోర్టర్ ఊర్వశిని పలకరిస్తూ.. ‘‘ఆర్పీకి మీరు మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? నేను మీకోసం వెదికాను.. సూటిగా ఈ విషయం అడుగుతున్నాను’’ అని పేర్కొన్నాడు. ఇందుకు కాస్త తికమక పడ్డ ఊర్వశి.. ‘‘నేను ఏం చెప్పాలనుకుంటున్నాననంటే.. అవునూ ఏం చెప్పాలనుకుంటున్నా? నాకే తెలియదు.. అయితే.. ఒక్క విషయం సారీ.. ఐయామ్ సారీ’’ అంటూ చేతులు జోడిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పంత్ ఆమెను లైట్ తీసుకుని.. తన పని తాను చేసుకుపోతున్నాడు.. అందుకే ఆమే ఇలా దిగి వచ్చి క్షమాపణలు కోరింది.. అతడితో స్నేహం కోరుకుంటుందేమో అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. ఇక పంత్ ఫ్యాన్స్ మాత్రం.. ఆర్పీతో అట్లుంటది మరి అన్నట్లుగా సరదాగా పేర్కొంటున్నారు. కాగా 24 ఏళ్ల పంత్ ఇటీవలే ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆసియా కప్-2022 టోర్నీలో టీమిండియాకు ఆడిన పంత్.. ప్రపంచకప్-2022 జట్టుకు సైతం ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ ఐసీసీ మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. మరి ఊర్వశి సారీ చెప్పడంపై పంత్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి! అని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. చదవండి: శ్రీలంక కష్టమే! ఆసీస్ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్- పాకిస్తాన్! తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా ఘనత! View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
'ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదు'
పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా ఊర్వశి రౌతేలా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఊర్వశి రౌతేలా ఎవరో కూడా తెలియదని.. ఆమెతో కనీసం ముఖ పరిచయం కూడా లేదని పేర్కొన్నాడు. సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్తో లవ్ అఫైర్ ఉందంటూ వార్తల్లోకి వచ్చింది ఊర్వశి రౌతేలా. అప్పటి నుంచి వార్తలో ఉన్న ఊర్వశి యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ల్లో దర్శనమిచ్చింది. రిషబ్ పంత్ బ్రేకప్ చెప్పిన తర్వాత కొత్త తోడు కోసం చూస్తున్న ఊర్వశి రౌతేలా, పాక్ క్రికెటర్ నసీం షా కోసమే పాకిస్తాన్ ఆడే మ్యాచ్లకు వస్తోందంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఊర్వశి రౌతెలా స్పందించలేదు. కానీ అఫ్గాన్తో మ్యాచ్లో ఆఖర్లో రెండు సిక్సర్లు బాది హీరోగా మారిపోయిన నసీం షాకి దీని గురించి ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్ 2022 ఫైనల్ మ్యాచ్కి ముందు నసీం షాను ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేశాడు.''పాకిస్తాన్ ఆడే మ్యాచులకు ఊర్వశి రౌతేలా వస్తోంది. అయితే ఆమె మీకోసమే వస్తుందని చాలా మంది అంటున్నారు దీనిపై మీరేమంటారని'' ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నసీం షా... ''నాకు ఊర్వశి ఎవరో కూడా తెలీదు. అందుకే నవ్వు వచ్చింది. కొందరు నాకు వీడియోలు పంపుతూ ఉంటారు. నాకు అవన్నీ పట్టించుకోను. నాలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. నా ఫోకస్ అంతా క్రికెట్పైనే. క్రికెట్ చూసి నన్ను ప్రేమించే, గౌరవించే వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా'' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Naseem shah smiles ones again on question about Urvashi Rautela @UrvashiRautela @BCCI #NaseemShah pic.twitter.com/RvpWxajnYX — Haseeb Arslan (@haseebArslanUK) September 10, 2022 చదవండి: Road Safety World Series: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోర Suresh Raina: సురేశ్ రైనా తిరిగి వస్తున్నాడు.. -
Urvashi Rautela: పంత్తో చెడింది.. పాక్ యువ పేసర్పై మనసు పారేసుకుంది..!
Pant-Urvashi Rautela-Naseem Shah: బాలీవుడ్ అప్ కమింగ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవలి కాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్తో కొద్ది రోజుల పాటు ప్రేమాయణం నడిపిన రౌతేలా.. తాజాగా అతనికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆసియా కప్కు ముందు పంత్-రౌతేలా సోషల్మీడియా వేదికగా మాటల యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని తొలుత రౌతేలానే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022 ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రౌతేలా మాట్లాడుతూ.. ఆర్పీ (పంత్ను ఉద్దేశిస్తూ) అనే ఓ సెలబ్రిటి తన కోసం 16 గంటల పాటు పడిగాపులు కాశాడని వివాదానికి తెరలేపింది. దీనికి ప్రతిగా పంత్ సైతం తనదైన స్టయిల్లో స్పందించాడు. కొంతమంది పేరు, ప్రఖ్యాతల కోసం ఎంతకైనా దిగజారుతారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తారని, ఫైనల్గా.. ప్లీజ్ అక్క, నన్ను వదిలేయ్ అంటూ రౌతేలాకు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చాడు. పంత్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న రౌతేలా.. పంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పంత్ ఓ కౌగర్ హంటర్ (తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో లైంగిక సంబంధం కోరుకునే వ్యక్తి) అని.. చోటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందుకు ప్రతిగా పంత్ మరో కౌంటరిచ్చాడు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు అక్కా అంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఈ మాటల యుద్ధానికి పుల్స్టాప్ పడింది. అయితే రౌతేలా ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది. అసలు క్రికెట్ అంటేనే నచ్చదు అన్న ఆమె.. ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలామంది పంత్పై ప్రేమను చంపుకోలేక రౌతేలా మ్యాచ్ చూసేందుకు వచ్చిందని కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ విషయం వేరున్నట్లు ఆలస్యంగా తెలిసింది. రౌతేలా మ్యాచ్కు వచ్చింది పంత్ను చూసేందుకు కాదని, పంత్తో చెడటంతో ఆమె పాక్ యువ బౌలర్ నసీమ్ షాతో ప్రేమలో పడిందని, అతన్ని ఎంకరేజ్ చేసేందుకే మ్యాచ్కు వచ్చిందని పలు కథనాల ద్వారా తెలిసింది. Aj pata Chala hamare NASEEM ko kiski Nazar lagi hai#UrvashiRautela pic.twitter.com/kllpMbbN6E — Muhammad Ibrahim (@Muhmmd_here) September 6, 2022 ఈ విషయాన్ని రౌతేలా కూడా పరోక్షంగా అంగీకరించిందని సమాచారం. నషీమ్ షా, తన ఫోటోలను కలిపి ఓ అభిమాని ఎడిట్ చేసిన వీడియో రీల్ను రౌతేలా తన ఇన్ట్స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో సదరు కథనాల్లో నిజం లేకపోలేదని క్రికెట్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన రీల్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. అటు భారత అభిమానులే కాకుండా పాక్ ఫ్యాన్స్ సైతం రౌతేలాను ఆటాడుకుంటున్నారు. పంత్ను భ్రష్ఠు పట్టించావు.. ఇప్పుడు మా వాడిని సంక నాకిద్దామని వచ్చావా అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. Hath jorr k kehta hai dor rahy hmary larky se phly hi usky jawani may cramps parte hein..#NaseemShah #UrvashiRautela pic.twitter.com/31WhuEf6t8 — RoMeoo (@RomanRaza4) September 6, 2022 చదవండి: క్రికెట్ నచ్చదంటూనే స్టేడియంలో ప్రత్యక్షమైన బాలీవుడ్ బ్యూటీ! -
క్రికెట్ నచ్చదంటూనే స్టేడియంలో ప్రత్యక్షమైన బాలీవుడ్ బ్యూటీ!
పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు.. క్రికెట్ లవర్స్ రోమాలు నిక్కబొడుస్తాయి. కప్పు కన్నా కూడా పాక్తో మ్యాచ్ గెలవడమే ముఖ్యం బిగిలూ అన్నట్లుగా ఉంటారు. అలాంటి మ్యాచ్ ఆదివారం దుబాయ్లో జరిగింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో జరిగిన పాక్-భారత్ మ్యాచ్ను వీక్షించేందుకు లైగర్ హీరో విజయ్ దేవరకొండ స్టేడియంలో అడుగుపెట్టాడు. మరోపక్క క్రికెట్ అంటే పెద్దగా నచ్చదన్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సడన్గా క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు తనే ఓ ఫొటోను షేర్ చేస్తూ ఇండియా వర్సెస్ పాక్ అని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు.. 'అదేంటి? క్రికెట్ అంటే నచ్చదన్నావ్, అసలు చూడనన్నావ్ కదా!', 'ఇదిగో ఈ మహాతల్లి ఉన్నందుకే రిషభ్ పంత్ ఆడలేదు' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెను చూశాక పంత్ రియాక్షన్ ఇదే అంటూ పలు మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా ఊర్వశి ఇటీవల ఫ్యాన్స్తో జరిపిన చిట్చాట్లో నేను క్రికెట్ చూడను, కాబట్టి పెద్దగా క్రికెటర్లు ఎవరూ తెలీదు. కాకపోతే సచిన్, విరాట్ సర్ అంటే నాకెంతో గౌరవం అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే! ఇదిలా ఉంటే 2018లో ఊర్వశి, రిషభ్ పంత్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. వీరు డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ అంతలోనే ఇద్దరూ వాట్సప్లో కూడా ఒకరినొకరిని బ్లాక్ చేసుకున్నారట. ఆ మరుసటి ఏడాదే రిషభ్ ఈ రూమర్లకు చెక్ పెడుతూ ఇషా నేగి అనే అమ్మాయిని తన గర్ల్ఫ్రెండ్గా ప్రకటించాడు. అయితే ఊర్వశి మాత్రం ఓ ఇంటర్వ్యూలో RP అనే వ్యక్తి తనకోసం గంటల తరబడి వేచి చూశాడంటూ కామెంట్లు చేసింది. దీనిపై రిషభ్ పంత్ స్పందింస్తూ 'కొంతమంది పేరు కోసం అబద్ధాలు ఆడుతూ అవతలి వ్యక్తులను ఇబ్బందులో పడేస్తారు. ప్లీజ్ అక్క నన్ను వదిలెయ్' అంటూ పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ఊర్వశి నువ్వో పిల్ల బచ్చావి అని ఘాటుగా వ్యాఖ్యానించగా నీ ఆధీనంలో లేని విషయాల గురించి మరీ ఎక్కువ ఒత్తిడికి లోనవ్వద్దు అంటూ కౌంటర్లు వేశాడు పంత్. If doglapan had a face. #PKMKB #INDvPAK #UrvashiRautela pic.twitter.com/GWx5eSWaML — Chika Pikka Rikka (@imdhokla) August 28, 2022 Urvashi some Urvashi Days before Today ☕😂 On insta#INDvsPAK #UrvashiRautela pic.twitter.com/IikhZMgTt8 — MUSKAN 🇵🇰 (@Musskkaan) August 28, 2022 #UrvashiRautela#IndiaVsPakistan#INDvPAK During timeout Rishabh pant 😂😅 pic.twitter.com/8gCELKMR65 — Gautam Dhenwal (@Gautam56110455) August 28, 2022 I can't 😂🤣😭😭🤣#INDvPAK #Urvashirautela & #RishabhPant pic.twitter.com/NSRzvOYu64 — Kangana Ranaut 🇮🇳 (@kanganaRanautFP) August 28, 2022 చదవండి: ప్రభుదేవా మైడియర్ భూతం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే! మరోసారి పబ్లిక్గా నటితో ముద్దులాట.. అమ్మో అమ్మ చూస్తుందేమో! -
Rishabh Pant: ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు: పంత్ కౌంటర్ మామూలుగా లేదు!
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇద్దరూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వరుస పోస్టులతో పరస్పరం విరుచుకుపడుతున్నారు. కాగా తన కోసం ఆర్పీ అనే వ్యక్తి ఎయిర్పోర్టులో గంటల తరబడి వేచి చూశాడంటూ ఊర్వశి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన ఫోన్ కాల్ కోసం పిచ్చివాడిలా ఎదురుచూశాడని, అయితే అతడి పేరును మాత్రం వెల్లడించలేనని చెప్పుకొచ్చింది. దీంతో ఆర్పీ అంటే రిషభ్ పంతేనంటూ ఊర్వశి వ్యాఖ్యలను హైలెట్ చేశారు నెటిజన్లు. ఇందుకు స్పందించిన రిషభ్ పంత్.. కొందరు ఫేమస్ అవడానికి అబద్ధాలు ఆడతారని అక్కా ప్లీజ్ నన్ను వదిలెయ్ అంటూ పరోక్షంగా ఊర్వశిని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్లో కౌంటర్ ఇచ్చాడు. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022 ఇందుకు బదులుగా.. ఊర్వశి సైతం.. ‘‘తమ్ముడూ.. నువ్వో పిల్ల బచ్చా.. బ్యాట్, బాల్కే అంటే ఆటకే పరిమితమవ్వు’’ ఘాటుగానే స్పందించింది. ఊర్వశి పోస్టుతో చిర్రెత్తిపోయాడో ఏమో గానీ రిషభ్ పంత్.. ‘‘నీ ఆధీనంలో లేని విషయాల గురించి నువ్వు మరీ ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వద్దు’’ అంటూ కౌంటర్ వేశాడు. ఈ మేరకు ఇన్స్టా స్టోరీలో తన ఫొటోను షేర్ చేస్తూ కోట్ యాడ్ చేశాడు. దీనిపై స్పందించిన పంత్ అభిమానులు.. ‘‘భయ్యా.. ఇలాంటివి పట్టించుకోవద్దు. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత నీది. అనవసర విషయాల మీద శ్రద్ధ పెట్టకు. కేవలం ఆట మీదే దృష్టి సారించు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీమిండియాలో కీలక సభ్యుడైన 24 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విదేశీ గడ్డ మీద టెస్టుల్లో భారత్ను ఒంటిచేత్తో గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవలే అతడు ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమితుడయ్యాడు. ఆసియా కప్-2022 ఆడే భారత జట్టులోనూ చోటు దక్కించుకున్న పంత్.. మెగా ఈవెంట్కు సన్నద్ధం అవుతున్నాడు. చదవండి: Asia Cup 2022 : కోహ్లి ఫామ్లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్కు ఆ దేశ మాజీ కెప్టెన్ వార్నింగ్! Ind Vs Zim: కోహ్లి, రోహిత్ లేరు.. టీమిండియాను 2-1తో ఓడిస్తాం: జింబాబ్వే బ్యాటర్! ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు భయ్యా! -
రిషబ్పై ఊర్వశి రీకౌంటర్, ‘కౌగర్ హంటర్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు
బాలీవుడ్ ఊర్వశి రౌతేలా, యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్లు సోషల్ మీడియా వేదికగా మాటల దాడికి దిగారు. ఓ ఇంటర్య్వూలో ఊర్వశి చేసి కామెంట్స్పై రీసెంట్గా పంత్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పంత్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ అతడికి రీకౌంటర్గా ఓ పోస్ట్ వదిలింది ఊర్వశి. అసలేం జరిగిందంటే గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్ పంత్ ఎయిర్ పోర్ట్లో గంటల తరబడి వేచి చూశాడని, వీరిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఊర్వశి తన కోసం ఆర్పీ(RP) అనే వ్యక్తి ఎయిర్పోర్ట్లో గంటల తరబడి వేచి చూశాడని చెప్పింది. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్ కన్నుమూత అయితే తను షూటింగ్కు వెళ్లి అలసిపోవడం వల్ల జర్నీలో పడుకుండిపోయానంది. లేచి చూసేసరికి అతని నుంచి 16 నుంచి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్పీ ఎవరని అడగ్గా తాను పేరు చెప్పలేనని తెలిపింది. దీంతో అందరు అది రిషబ్ పంత్ అని అభిప్రాయపడ్డారు. ఇక ఊర్వశి కామెంట్స్ వైరల్ కావడంతో రిషబ్ స్పందిస్తూ ఆమె పేరు ప్రస్తావించకుండానే తనపై కామెంట్స్ను తిప్పి కొట్టాడు. కొంతమంది ఫేమ్ కోసం అబద్ధాలు ఎలా అడతారో అర్థం కాదని, వారి స్వలాభం కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తారన్నాడు. అంతేకాదు ప్లీజ్అక్క నన్ను వదిలేయంటూ హ్యాష్ ట్యాగ్తో ఊర్వశికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. చదవండి: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. దుల్కర్కు వెళ్లింది!: నాగార్జున ఇక రిషబ్ పోస్ట్పై ఊర్వశి రౌతేలా మండిపడింది. అంతేకాదు పరోక్షంగా పంత్ను కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అందమైన అమ్మాయిలతో లైంగిక సంబంధం కోరుకునే పురుషుడు)గా అంటూ పంత్కు చురకలు అంటించింది. ఈ మేరకు గురువారం ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘చొటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఈ పోస్ట్కు రక్షాబంధన్ శుభాకాంక్షలు, ఆర్పీ భాటుభయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్ట్యాగ్లను జత చేసింది. దీంతో ఊర్వశి పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. -
బాలీవుడ్ హీరోయిన్కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్
ప్రేమకు ఎవరు అతీతులు కారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఏదో ఒక దశలో ప్రేమలో మునిగి తేలిన వాళ్లే. క్రికెటర్లు అందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్తో క్రికెటర్లు నడిపిన ఎఫైర్స్కు లెక్కే లేదు. కొన్ని పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోతే.. మరికొన్ని ప్రేమలు మాత్రం సక్సెకు దారి తీసి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. షర్మిలా ఠాగూర్- మన్సూర్ అలీఖాన్ పటౌడీ, విరాట్ కోహ్లి- అనుష్క శర్మ, హర్భజన్ సింగ్-గీతా బస్రా, యువరాజ్ సింగ్- హాజెల్కీచ్, రవిశాస్త్రి- అమృతాసింగ్, మమ్మద్ అజారుద్దీన్-సంగీతా బిజలాని ఈ కోవకు చెందిన వారే. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కల్పిత కథలు అల్లి క్రికెటర్లతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా చెప్పుకుంటారు. కొన్నిసార్లు అవి కలిసొచ్చినా.. కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. తమ పేరు, ప్రఖ్యాతలు పెంచుకోవడానికే ఇలాంటివి చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా- టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం ఇదే అంశాన్ని గుర్తుచేస్తుంది. గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్ పంత్ ఎయిర్ పోర్ట్లో 16 గంటల పాటు ఎదురుచూశాడంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న ఊర్వశి రౌతేలా పంత్తో ప్రేమ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేసింది. తనను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడని.. నేనంటే పడి చచ్చిపోతున్నాడంటూ.. నన్ను కలవడానికి వెయిట్ చేస్తున్నాడని... అతని పేరు చెప్పను గానీ షార్ట్ఫామ్లో మాత్రం ''ఆర్పీ(RP)'' అని పేర్కొంది. దీంతో ఊర్వశి మరోసారి రిషబ్ పంత్ పేరు ప్రస్తావించిందంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొన్నారు. ''ఆర్పీ'' అంటే కచ్చితంగా రిషబ్ పంత్ అయి ఉంటాడని చెవులు కొరుక్కున్నారు. దీనికి ఊతమిస్తూ.. ''గతంలో నేను వారణాసిలో షూటింగ్ ముగించుకొని ఒక షో కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ దాదాపు 10 గంటల పాటు షూటింగ్ జరిగింది. దీంతో చాలా అలిసిపోయి ఇంటికెళ్లాను. అప్పటికే మిస్టర్ ఆర్పీ(RP) మా ఇంటికొచ్చి నాకోసం లాబీలో వెయిట్ చేస్తున్నాడని తెలిసింది. దీంతో అతని కోసం రెడీ అవ్వాలనుకున్నా. కానీ రోజంతా పని చేయడంతో బాగా అలిసిపోయిన నాకు వెంటనే నిద్ర పట్టేసింది. ఈ సమయంలో నా ఫోన్కు చాలా కాల్స్ వచ్చాయి. కానీ ఫోన్ లేపలేకపోయా. లేచి చూస్తే దాదాపు 16-17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి'' అంటూ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది. ఊర్వశి రౌతేలా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తనపై వస్తున్న తప్పుడు వార్తలపై స్వయంగా రిషబ్ పంత్ రంగంలోకి దిగాడు. తన ఇన్స్టాగ్రామ్లో పోస్టును షేర్ చేస్తూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ''ఇంటర్య్వూల్లో కొంతమంది తమ పేరు, ప్రఖ్యాతల కోసం ఎంత స్థాయికైనా దిగజారుతుంటారు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. దేవుడు వారిపై కాస్త కరుణ చూపించాలి.. #merapichachorhoBehen #jhutkibhilimithotihai.. ప్లీజ్ అక్క.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అబద్దాలు ఆడడానికైనా ఒక లిమిట్ ఉంటుంది'' అంటూ కాప్షన్ జత చేశాడు. మరి పంత్ చేసిన వ్యాఖ్యలపై ఊర్వశి రౌతేలా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022 చదవండి: హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్ చేసిన రిషబ్ పంత్ ! నలుగురు పిల్లలున్న ఆ సింగర్ పెళ్లికి ప్రపోజ్ చేశాడు: హీరోయిన్ -
అప్పటికే ఇద్దరు భార్యలు, అయినా హీరోయిన్కు సింగర్ పెళ్లి ప్రపోజల్
Urvashi Rautela Says Egyptian Singer With 2 Wives Proposed Her: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల 'ది లెజెండ్' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు ఊర్వశీ ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. తెలుగులో 'బ్లాక్ రోజ్' సినిమాలో నటించిన ఈ గ్లామర్ క్వీన్ తాజాగా తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా 'మీకు ఎప్పుడైన ఇబ్బందికర మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందా?' అని అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యే సమాధానం ఇచ్చింది ఊర్వశీ. 'నాకు చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. అందులో మీరు చెప్పినటువంటి ప్రతిపాదన ఒకటి ఉంది. దుబాయ్లో ఈజిప్ట్కు చెందిన స్టార్ సింగర్ ఒకరిని కలిశాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది మన సాంస్కృతికి, సాంప్రదాయానికి విరుద్ధం. మనం మన కుటుంబం గురించి ఆలోచించగలగాలి. అలాగే ఒక మహిళ తన జీవితం గురించిన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు' అని తెలిపింది. చదవండి: ఆ హీరోయిన్కు రూ. 20 కోట్ల పారితోషికం !.. నేనేం తప్పు చేశానని అరుస్తున్నారు.. మీడియాతో తాప్సీ వాగ్వాదం అయితే ఈజిప్టు సింగర్ పేరును ఊర్వశీ రౌటేలా చెప్పలేదు. కానీ ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో 'అతని పేరు మహ్మద్ రమదాన్' అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఎందుకంటే 2021లో విడుదలైన 'వెర్సాస్ బేబీ' అనే మ్యూజిక్ వీడియోలో ఈజిప్షియన్ యాక్టర్, సింగర్ మహ్మద్ రమదాన్తో కలిసి ఊర్వశీ నటించింది. ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రకారం ఈ మ్యూజిక్ వీడియోలో ఊర్వశీ అత్యంత ఖరీదైన దుస్తులు వేసుకుందని సమాచారం. ఆమె దుస్తులకు రూ. 15 కోట్లు ఖర్చు అయ్యాని టాక్. చదవండి: చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ -
ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్!
Urvashi Rautela Charged Rs 20 Crores For The Legend Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకంటే హీరోలు అధిక పారితోషికం తీసుకోవడం సాధారణమే. హీరోలకు సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకునే ముద్దుగుమ్మలు మాత్రం చాలా అరుదు. అయితే స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా రెమ్యునరేషన్ను ఓ హీరోయిన్ తీసుకుందన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ 2015 మిస్ యూనివర్స్ దివా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకుంది. ఊర్వశీ రౌటేలా తాజాగా 'ది లెజెండ్' సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్ 51 ఏళ్ల వయసులో హీరోగా నటించాడు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి జేడి-జెయర్ ద్వయం దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హరీశ్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా జులై 28న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందే విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించినందుకు ఊర్వశీ రౌటేలా రూ. 20 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుందని ఇటు కోలీవుడ్లో, అటు బాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకు ఏ తమిళ హీరోయిన్కు అందని పారితోషికం ఊర్వశీకి తీసుకుందన్న విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ వార్తలను ఊర్వశీ రౌటేలా టీమ్ సన్నిహితం వర్గం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవమని, ఊర్వశీ రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే తమిళ ఇండస్ట్రీలో అత్యంత భారీ పారితోషికాన్ని అందుకున్న హీరోయిన్గా ఊర్వశీ రికార్డుకెక్కేది. కాగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార తన రాబోయే చిత్రాలకు రూ. 10 కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం. -
హీరోగా మారిన సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్..
‘‘చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్స్టైల్, బిజినెస్ వేరు. బిజినెస్లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను’’ అని శరవణన్ అన్నారు. శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్’. జేడీ–జెర్రీ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా హీరోయిన్గా నటించారు. ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శరవణన్ మాట్లాడుతూ.. ‘‘ఓ కామన్మేన్ ఎలా లెజెండ్గా ఎదిగాడు ? జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ? అన్నదే లెజెండ్ కథ’’ అని తెలిపారు. ‘‘శరవణన్గారు సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. అయితే ఒక నటుడిగా ఆయన కమిట్మెంట్ ఎంత బాగుందనేది స్క్రీన్పై చూస్తారు’’ అన్నారు దర్శకద్వయం జెడీ, జెర్రీ. ‘‘తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ను ఎప్పుడూ ఆదరిస్తారు. ‘ది లెజెండ్’ కథ కొత్తది. ఒక సక్సెస్ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్ చేసిన క్రికెటర్ రిషబ్ పంత్ !
Cricketer Rishabh Pant Weight For 16 Hours To Meet Urvashi Rautela: హీరోహీరోయిన్ల మధ్య ప్రేమయణాలు, విడుపోవడాలు, గాసిప్స్ బాలీవుడ్ ఇండస్ట్రీకి సర్వసాధారణమే. చిత్ర పరిశ్రమకు చెందినవారినే కాకుండా క్రికెటర్లు, వ్యాపారవేత్తలతో డేటింగ్ చేసి తర్వాత పెళ్లీ పీటలు ఎక్కిన హీరోయిన్లను కూడా చూశాం. కాగా కొందరి సెలబ్రిటీల్లో వచ్చిన ప్రేమ, పెళ్లి గాసిప్స్ సైతం పుకార్లులానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, భారత క్రికెటర్ రిషబ్ పంత్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరికి సంబంధంచిన ఒక విషయం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. ఊర్వశి రౌతేలాను కలవడం కోసం రిషబ్ పంత్ సుమారు 16 గంటలు ఎదురు చూసినట్లు సమాచారం. ఊర్వశి తన సినిమా ప్రాజెక్ట్లలో ఒకదాని కోసం వారణాసిలో షూటింగ్ చేస్తుందట. అత్యంట టైట్ షెడ్యూల్లో ఊర్వశి ఉందట. అప్పుడు ఊర్వశి షూటింగ్లో ఉండటం తెలుసుకున్న రిషబ్, ఊర్వశిని కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలా వెళ్లిన రిషబ్ ఆమెకోసం సుమారు 16-17 గంటలు నిరీక్షించినట్లు బీటౌన్ వర్గాల నుంచి సమాచారం. కాగా వీరిద్దరికి కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే ఊర్వశి, రిషబ్ నిజంగా ప్రేమలో ఉన్నట్లయితే వారిద్దరూ కలిసి ఉన్న ఒక్క ఫొటో అయినా బహిర్గతం అయ్యేది కదా! అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయట. -
నితిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలాను సంప్రదించారు. స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. -
బ్యూటీ క్వీన్ మెడపై 'ప్రేమ గాటు'.. ఆగ్రహించిన నటి!
Urvashi Rautela Angry Over Love Bite News: నటీనటులు కనిపిస్తే చాలు కెమెరాలు వారిని రౌండప్ చేస్తాయి. కళ్లకు కాటుక ఎక్కువైనా, డ్రెస్ కలర్ తక్కువైనా, శరీరం కొంత బొద్దుగైనా.. ఏదైనా సరే అన్నింటినీ కెమెరాల్లో బంధించేస్తాయి. అయితే ఇటీవల క్లిక్మనిపించిన కొన్ని ఫొటోల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇంకేముంది.. ఓ వెబ్సైట్ హద్దులు దాటి మరీ ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ రాసేసింది. ఇది చూసిన నటికి చిర్రెత్తిపోయింది. సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్షాట్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అగ్గిమీద గుగ్గిలమైంది. 'హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్ లిప్స్టిక్, మాస్క్ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్ లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్ న్యూస్లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?' అని ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ అసత్య ప్రచారం చేసినందుకుగానూ తనకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేసింది. కాగా ఊర్వశి 2013లో సింగ్ సాబ్ ద గ్రేట్ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా వర్జిన్ భానుప్రియ సినిమాలో కనిపించింది. -
మిస్ యూనివర్స్-2021 ఈవెంట్లో బాలీవుడ్ నటికి అరుదైన గుర్తింపు
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా హాట్టాపిక్గా మారింది. ఇందుకు కారణం ఆమె మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడమే కాకుండా ఈవేడుకలో ఆమె ధరించిన ఫ్రాక్ ఖరీదుతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు మిస్ యూనివర్శర్గా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె అదే వేదికకు జడ్జీగా వ్యవహరించడం నిజంగా విశేషమే. దీంతో ఆమె ప్రస్తుతం వార్తల్లో హాట్టాపిక్ మారింది. మోడల్గా కెరీర్ను ఆరంభించిన ఊర్వశి 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్ పంతీ’, ‘వర్జిన్ భానుప్రియ’సినిమాల్లో నటించి మెప్పించింది. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. త్వరలో ‘బ్లాక్రోజ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుందీ ఈ భామ. ఈ క్రమంలో 2015లో భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఇటీవల ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ‘మిస్యూనివర్స్ -2021’ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ యూనివర్స్ గ్రాండ్ ఈవెంట్కు భారత్ తరపున వెళ్లి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన అతిపిన్న వయస్కురాలిగా ఊర్వశీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఈ పోటీల్లో మన దేశానికే చెందిన హర్నాజ్ సంధు విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Pushpa Movie: విడుదలకు కొద్ది గంటలే, బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ఈవెంట్ ముగిసిన అనంతరం ఈ బాలీవుడ్లో ఫ్యాషన్ దివా ముంబై విమానాశ్రయంలో బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించి కనిపించింది. ఈ సందర్భంగా కెమెరా కళ్లు ఆమెను క్లిక్మనిపించాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా తను ధరించిన డ్రెస్ ధర, విశేషాలు తెలుసుకొని చాలామంది అవాక్కయ్యారు. ఊర్వశి ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 5లక్షల వరకు ఉంటుందని, ఈ ప్రాక్లో డైమండ్లను కూడా పొందుపరచినట్లు తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఆమె ధరించిన చెవి రింగులు కూడా వజ్రాలతో తయారైనవే. కాగా ఇలా వెరైటీ డ్రెస్లు, అవుట్ఫిట్లతో వార్తల్లో నిలవడం ఊర్వశికి మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఓ మూవీ ఈవెంట్లో ఆమె ధరించిన రెడ్ ఫ్రాక్తో వార్తల్లో నిలిచింది. చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్పై మాధవిలత షాకింగ్ కామెంట్స్ View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳 (@urvashirautela) -
హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు, నవ్విన బిగ్బాస్ బ్యూటీ
ఆమె నమ్మిందే చేస్తుందంటూ చీర ఫొటో షేర్ చేసిన జెనిలియా ‘శివగామి’కి హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు బ్లాక్ అండ్ వైట్లో ఇలియానా, ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా.. ఇంకా ఎటిఎమ్కు వెళుతున్నారా అంటూ వీడియో షేర్ చేసిన శ్రీముఖి View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
నీళ్లలో పడిపోయిన హీరోయిన్, చిట్కా చెప్పిన తమన్నా
♦ అలిసిపోయా, కానీ మీకోసం నవ్వేస్తున్నానంటోన్న అనుపమ పరమేశ్వరన్ ♦ బ్యాలెన్స్ అంటే ఇదీ అంటోన్న కీర్తి సురేశ్ ♦ ఎవరైనా నా దగ్గరికొస్తే ఆరా భరించదంటోన్న రష్మిక మందన్నా ♦ హ్యాపీ బర్త్డే బంగారూ అంటూ వీడియోలు షేర్ చేసిన నిహారిక కొణిదెల ♦ ఇన్స్టాగ్రామ్లో 39 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఊర్వశి రౌతేలా ♦ చిట్కాలు చెప్తోన్న తమన్నా ♦ నీళ్లలో పడిపోయిన రితికా సింగ్ View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) -
అది రిలేషన్ కాదన్న నటి, బెదిరించిన మంచు లక్ష్మి
► చబ్బీ లుక్లో అనుపమ పరమేశ్వరన్ ► ఫిష్ కట్ గౌనులో అషూ రెడ్డి అందాలు ► రిలేషన్షిప్ మూడు నెలలకన్నా ఎక్కువ కాలం నిలవలేదంటే దాన్ని ఇంటర్న్షిప్ అని పిలవండంటోన్న ఊర్వశి రౌతేలా ► అద్దంలో కనిపించే వాళ్లే మీకు పోటీ అంటున్న అఖిల్ సార్థక్ ► బ్లాక్ డ్రెస్లో కవ్విస్తోన్న పాయల్ రాజ్పుత్ ► గొడ్డలి పట్టుకుని బెదిరిస్తున్న మంచు లక్ష్మీ ► ఒక వీడియోలో నవ్విస్తూ మరో వీడియోలో ఏడిపిస్తోన్న మెహబూబ్ దిల్సే ► చెన్నైక్ టాటా చెప్పేసి ముంబై చేరుకున్న శ్రద్దాదాస్ ► పూల చీరలో సాక్షి అగర్వాల్ పరువాలు ► క్యూట్గా అనిపిస్తోందంటోన్న హంసా నందిని View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by ANMOL CHAUDHARY (@anmolchaudharyofficial) -
హల్చల్ : కత్రినా క్యూట్ లుక్స్.. ఊర్వశి మెరుపులు
♦ గోల్డెన్ డ్రెస్లో మెరిసిపోతున్న ఊర్వశి ♦ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో శిల్పారెడ్డి ♦ ఆ హుక్ స్టెప్ నా ఫేవరేట్ అంటున్న శిల్పా శెట్టి ♦ సంతోషంగా ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలంటున్న హరితేజ ♦ రీల్స్తో అదరగొడుతున్న టిక్టాక్ స్టార్స్ ♦ రీల్స్ పోస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్ ♦ అకీరాతో ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్ ♦ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఝాన్సీ ♦ ఈ వారం అద్భుతంగా ఉండబోతుందన్న ఉపాసన ♦ నో మేకప్లుక్ ఫోటో షేర్ చేసిన నటి షెఫాలి View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Shefali Jariwala 🧿 (@shefalijariwala) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..
► లాంగ్ ఫ్రాక్లో సింగర్ సునీత ► హాఫ్ సారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న అందాల ఊర్వశి రౌతేలా ► రెడీ అయ్యాను, కానీ ఎక్కడికీ వెళ్లడం లేదంటున్న అల్లు శిరీష్ ► ఫొటో దిగిన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్ ► ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా ఉంచుతున్న వైద్యులకు కృతజ్ఞతలు చెప్పిన అనుష్క శెట్టి ► వీకెండ్ బ్యాలెన్స్ అంటోన్న మలైకా అరోరా ► మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయి గుర్రం బొమ్మ ఎక్కి ఆడుకోవాలనుందంటోన్న ఆండ్రియా ► కొత్త యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన సుమ కనకాల ► అందాల వల వేస్తున్న శ్రద్ధా దాస్ ► పచ్చని చెట్ల మధ్య శ్రీముఖి హొయలు View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) -
హల్చల్: అమీషా ఫ్లయింగ్ కిస్, హెబ్బా రాకింగ్ లుక్స్
► చిరునవ్వుల చిలక నజ్రియా ► అభిమానులకు అమీషా పటేల్ ఫ్లయింగ్ కిస్ ► చీరకట్టుతో చంపేస్తోన్న ఊర్వశి రౌతేలా ► యోగాసనం వేసిన కృతి కర్బందా ► జలకాలాట ఆడుతున్న శ్రియా ► వీకెండ్లో ఏం చేస్తుందో వీడియోతో సహా చెప్పేసిన రాశీ ఖన్నా ► మేడ మీద కీర్తి సురేశ్ యోగాసనాలు ► పక్క టేబుల్ మీద స్నాక్స్ ఉన్నాయంటూ దానివంకే చూస్తున్న హెబ్బా పటేల్ ► రష్యా వీధుల్లో చీరకట్టుతో తాప్సీ చక్కర్లు View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం నానా తంటాలు పడుతుంటారు. కొందరు కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ని వాడడం వల్ల మరింత అందంగా కనిపిస్తారు. లేదంటే మరికొంతమంది సహజసిద్దంగానే బ్యూటీఫుల్గా కనిపించాలనుకుంటారు. అందం విషయంలో శ్రద్ధ వహించే వారిలో హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. మత్తేక్కించే చూపులతో పదునెక్కించే ఈ భామలు తమ అందాన్ని మరింత మెరుగుపరచుకునేందుకు ఎప్పుడూ ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే బ్యూటీ ఊర్వశి రౌతేలా శరీరం మరింత నిగారింపుగా మారేందుకు వినూత్నంగా ఆలోచించింది. బురదలోకి దిగి ఒళ్లంగా మట్టి పూసుకొని మడ్ బాత్ చేసింది. ఈ ఫోటోను ఊర్వశి నా ఫేవరెట్ మత్ బాత్ స్పా’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనిని చూసిన నెటిజన్స్ విగ్రహం అనుకున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కలిగే లాభాలను కూడా వెల్లడించారు ఊర్వశి. "బాలేరిక్ బీచ్ ఎర్రరేగడి మట్టిని ఆస్వాదిస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది. ఇది రోమన్ ప్రేమ దేవత రోమన్ దేవతల సౌందర్య రహస్యం ఇదేనని చెప్పారు. అందాన్ని మరింత మెరుగుపరచుకోవడంతో పాటు శరీరంపై ఉన్న విషపూరిత కణాలు తొలగించుకోవడానికి చాలా కాలం నుండి ఇలా చేస్తున్నానని తెలిపారు. శరీరం మొత్తం రేగడి మట్టి పూసుకొని కూర్చుంటే శరీరంతో పాటు మనసుకు ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇక ఇటీవల జిమ్ వర్కవుట్ వీడియో ఒకటి షేర్ చేయగా, ఇందులో జిమ్ ట్రైనర్తో కడుపులో పిడి గుద్దులు గుద్దించుకున్న విషయం తెలిసిందే.. తన తర్వాతి సినిమా యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆ సినిమా కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ కడుపులో ట్రైనర్ పిడిగుద్దులు.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
హీరోయిన్ కడుపులో ట్రైనర్ పిడిగుద్దులు.. వీడియో వైరల్
ముంబై: సినిమాలో నటించేవాళ్లు కొందరైతే,జీవించేవాళ్లు మరికొందరు ఉంటారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చెయ్యడానికైనా వెనుకాడరు. కొన్ని పాత్రల కోసం ముందే రోజుల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా(యూనివర్స్) ఊర్వశి రౌటేలా మరో అడుగు ముందుకేసింది. తన తదుపరి చిత్రం కోసం ఏకంగా బాక్సింగ్ పంచులను సైతం భరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ యాక్షన్ ఫిల్మ్ కోసం ఊర్వశీ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె ట్రైనర్ కడుపులో పిడి గుద్దులు కురిపిస్తుంటే, ఆ నొప్పిని భరిస్తూ ట్రైనర్ పనితనాన్ని దగ్గరినుంచి గమనిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ..నో పెయిన్.. నో గెయిన్ అనే క్యాప్షన్ను జోడించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఊర్వశీ డెడికేషన్ను మెచ్చుకుంటున్నారు. సినిమా కోసం ఇంత కష్టపడుతున్న ఊర్వశీకి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్ రోజ్"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్లోనూ నటించనుంది. హీరో శరవణన్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడాతో "ఇన్స్పెక్టర్ అవినాష్" అనే వెబ్ సిరీస్ చేస్తోంది. "మర్ జాయేంగే" మ్యూజిక్ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత క్రికెట్ చూడను కానీ సచిన్, కోహ్లి అంటే.. -
నటి వజ్రాల మాస్కు: ధర చూస్తే దిమ్మ తిరగాల్సిందే!
హిందీ ఐటమ్సాంగ్స్కు తనదైన స్టైల్లో ఆడిపాడి జనాలకు కిక్కెక్కించే భామ ఊర్వశి రౌతేలా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలని తహతహలాడే ఈ మిస్ ఇండియా బ్యూటీ తాజాగా ఓ వెరైటీ మాస్క్తో జనాలకు షాకిచ్చింది. అదేంటీ.. మాస్కు మంచిదే కదా.. అందులో షాకింగ్ ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నాం.. సాధారణంగా మాస్కు రూ.10 ఉంటుంది. లేదంటే వందల్లో ఉంటుంది. కరీనా కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే వేలు ఖర్చుపెట్టి మాస్కులు కొనుక్కుంటారు. కానీ ఊర్వశి మాత్రం వందలు, వేలు, లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లు విలువైన మాస్కు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ముక్కు, నోటికి కాకుండా తల మొత్తాన్ని కప్పివేస్తున్నట్లుగా ఉంది. ఈ డైమండ్ మాస్క్ ధర రూ.3 కోట్ల రూపాయలట. ధరే కాదు దాని బరువు కూడా ఎక్కువగానే ఉందని క్యాప్షన్ ఇచ్చింది ఊర్వశి. ఈ మేరకు ఓ చిన్నపాటి వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఇదిలా వుంటే ఊర్వశి ప్రస్తుతం "ద బ్లాక్ రోజ్"లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం "తిరుట్టు పాయలే 2" హిందీ రీమేక్లోనూ నటించనుంది. హీరో శరవణన్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తూ తమిళంలోనూ ఎంట్రీకి రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరో రణ్దీప్ హుడాతో "ఇన్స్పెక్టర్ అవినాష్" అనే వెబ్ సిరీస్ చేస్తోంది. "మర్ జాయేంగే" మ్యూజిక్ వీడియోలో గురు రంధవాతో ఆడిపాడనుంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) చదవండి: -
ప్రముఖ మోడల్తో పంత్ డేటింగ్.. పాత గర్ల్ఫ్రెండ్తో బ్రేకప్..?
న్యూఢిల్లీ: కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్న టీమిండియా యువ డాషింగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్.. అదే ఫామ్ను రియల్ లైఫ్లోనూ కొనసాగిస్తున్నాడు. పాత గర్ల్ఫ్రెండ్, బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలాతో రిలేషన్షిప్కు బ్రేకప్ చెప్పి, ప్రముఖ మోడల్ఇషా నేగితో డేటింగ్ చేస్తున్నాడు. ఇటీవల రౌటేలా వ్యాట్సాప్ను బ్లాక్ చేసిన పంత్.. తాజాగా ఇషా నేగితో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ బహిర్గతమైంది. ఈ పోస్ట్లో పంత్.. ఇషాను ఎంత ఇష్టపడుతున్నాడో స్పష్టంగా తెలియజేశాడు. నిన్ను నేనెప్పుడూ హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను.. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండటానికి నువ్వే కారణమంటూ తన పోస్టులో రాశాడు. View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) View this post on Instagram A post shared by Isha Negi (@ishanegi_) మరోవైపు ఇషాకు కూడా పంత్పై అమితమైన ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పంత్తో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. నువ్వే నా మగాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్వి, నా జీవితానికి నువ్వే ప్రేమవంటూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్పై ప్రేమను ఒలకబోసింది. వృత్తి రిత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన ఇషా.. అమిటీ యూనివర్శిటీ నుంచి బీఏ హానర్స్ డిగ్రీ పొందింది. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రౌటేలా మాట్లాడుతూ.. పంత్ గురించి తనకు తెలీదని, క్రికట్ను తానంతగా ఇష్టపడనని, సచిన్..కోహ్లి అంటే తనకు గౌరవమని పేర్కొనడం విశేషం. చదవండి: మరోసారి కేఎల్ రాహుల్ విధ్వంసం ఖాయం: పంజాబ్ కోచ్ -
క్రికెట్ చూడను కానీ సచిన్, కోహ్లి అంటే..
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఇన్స్టాగ్రామ్ లో తన అభిమాని అడిగిన ప్రశ్నకు వింతగా సమాధానమిచ్చింది. ‘మిస్ ఇండియా’ గా ప్రజలకు పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో నటించిన తర్వాత బాగానే పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్వశీ ఇన్స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఊర్వశీ ఇన్స్టాలో తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వడం గమనార్హం. ‘నేను క్రికెట్ అస్సలు చూడను, కాబట్టి నాకు ఏ క్రికెటర్ తెలియదు. కానీ సచిన్ సార్, విరాట్ సార్ అంటే మాత్రం అమితమైన గౌరవం’ అని జవాబిచ్చింది. ఏడాది క్రితం టీమ్ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్తో కలిసి ఊర్వశీ రౌతేలా భోజనం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. బహుశా ఆమె పంత్ ప్రియురాలేమోనని అప్పట్లో గుసగుసలు కూడా వినపడ్డాయి. ( చదవండి: పెళ్లి తర్వాత నటించన్నావ్.. మరి ఇదేంటి?! ) -
కోహ్లి ఫోటో షేర్ చేయడంలో ఆమె ఉద్దేశం ఏంటో..?
ముంబై: బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా(యూనివర్స్) ఊర్వశి రౌటేలా తన తల్లి పంపిన ఓ ఫోటో యొక్క ఉద్దేశం కనుక్కోవడం కోసం తన ఫాలోవర్స్ సాయాన్ని కోరింది. తల్లి మీరా రౌటేలాకు తనకు మధ్య ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిన ఓ సంభాషణలో తల్లి మీరా ఆమెకు ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి చిన్నతనంలో తల్లికి వంటింట్లో సాయపడుతూ కనిపిస్తాడు. అయితే తన తల్లి ఆ ఫోటోను తనకెందుకు పంపిందో, అందులో ఆమె ఉద్దేశం ఏంటో, అసలు తన తల్లి తన నుంచి ఏం కోరుకుంటుందో అర్ధంకావడం లేదని.. ఈ విషయంలో సాయపడాలని ఆమె సోషల్ మీడియా వేదికగా తనకు అభిమానులు అభ్యర్ధించింది. తల్లికి తనకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన గ్లిమ్సస్ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు అర్ధమైంది తనకు వ్యక్తపరచాలని కోరింది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) అయితే ఊర్వశి షేర్ చేసిన కోహ్లి ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరైతే.. అందులో నీకు అర్ధంకాకపోయ్యేంత మిస్టరీ ఏముందో అంటూ వ్యంగ్యంగా సమాధానమివ్వగా, మరికొందరేమో.. నీ తల్లి కిచెన్లో నీ సాయం కోరుకుంటుందని, అందుకే ఆమె కోహ్లి.. తల్లికి సాయపడుతున్న ఫోటోను పంపిందని సందేశాలు పంపారు. తల్లి పంపిన ఫోటోకు ఫాలోఅప్గా ఊర్వశి మరో ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె తన తల్లి ఉద్దేశాన్ని గ్రహించి, కిచెన్లో సాయపడటానికి వస్తున్నానంటూ.. తను వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లే ఫోటోను పంపింది. కాగా, 2019 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కోహ్లి మైనపు బొమ్మతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
‘పుష్ప’ స్పెషల్ సాంగ్లో బాలీవుడ్ భామ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మండన్న నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ తొలిసారి పూర్తిస్థాయి మాస్ రోల్లో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటోంది. (ఆ హీరోయిన్ నా లక్కీ చామ్: అల్లు అర్జున్) కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో నటించేందుకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాని చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఊర్వశి సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. (బర్త్డే స్పెషల్: రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలు) -
సర్కారు వారితో పాట
మహేశ్బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్టెప్ వేయబోతున్నారని తెలిసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు, కీర్తీ సురేశ్ జంటగా రూపొందనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్కు ఊర్వశీ రౌటేలాను సంప్రదించారట. తమన్ అందించిన ఈ మ్యాస్ ట్యూన్కి మహేశ్, ఊర్వశి స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయని టాక్. -
డ్యాన్సింగ్లో అల్లుఅర్జున్ స్ఫూర్తిని చెప్పిన ఊర్వశీ
-
ఆ వార్తలు పూర్తి అవాస్తవం: ఆదిపురుష్ టీం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన్హాజీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ప్రతినాయకుడి రావణ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర సీత. ఈ క్యారెక్టర్లో ఏవరూ నటిస్తున్నారనేది ఆది నుంచి ఆసక్తికరంగా మారింది. మొదట్లో సీత పాత్రలో కీర్తి సురేష్, కియారా అద్వాణీ పేర్లు వినిపించగా, ఇటీవల మరో నటి ఊర్వశి రౌతేలాను సంప్రదించిన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వదంతులపై చిత్ర బృందం స్పందించింది. (అటవీ భూమిని దత్తత తీసుకున్న ప్రభాస్) ఆదిపురుష్ సినిమా కోసం ఊర్వశిని సంప్రదించినట్లు వచ్చిన వార్తలను చిత్ర యూనిట్ ఖండించారు. ‘ఆదిపురుష్లో ప్రధాన పాత్ర పోషించడానికి ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు వస్తున్న కథనాలు, నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి. అవాస్తవాలు.’ అని స్పష్టంచేశారు. అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు కేవలం ప్రభాస్, సైఫ్ పాత్రలను మాత్రమే అధికారికంగా ఖరారు చేశారు. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయనున్నారు. 3డీలో తెరకెక్కనున్న ఈ మూవీపై ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఆదిపురుష్లో ఆయనే రావణుడు) -
నల్ల గులాబీ
‘మిస్ ఇండియా’ ఊర్వశీ రౌతేల హీరోయిన్గా సంపత్ నంది క్రియేట్ చేస్తున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఊర్వశీ రౌతేల మా కథ విని, ఇంప్రెస్ అయ్యి ‘బ్లాక్ రోజ్’ చేయడానికి అంగీకరించారు. ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయనున్నాం’’ అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘షేక్స్పియర్ రచించిన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్గా ‘బ్లాక్ రోజ్’ తీస్తున్నాం. ‘విచక్షణ, యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ను జోడిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ. -
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా హాట్ ఫోటోలు
-
మళ్లీ అడ్డంగా దొరికిన నటి, ఇదిగో ఫ్రూఫ్..
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి కాపీ, పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఆస్కార్ అవార్డు పొందిన పారాసైట్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతూ మంగళవారం ట్వీట్ చేసింది. తీరా అది ఈ అమ్మడు సొంత తెలివి కాదని తెలిసి నెటిజన్లు ఈమెపై ఫైర్ అవుతున్నారు. న్యూయార్క్ రచయిత జేపీ బ్రామర్ పారసైట్ సినిమా గురించి రాసిన ట్వీట్ను ఉన్నదున్నట్లు దించేసి వివాదంలో చిక్కుకుంది. ‘పారసైట్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అబద్దాలు చెప్పి ఉద్యోగాలు సంపాదించినా, వాళ్ల నటనకు నేను ఫిధా అయ్యా. తెలివితేటలున్నా, పేద కుటుంబం కావడంతో వాళ్ల వాస్తవాలను దాచిపెట్టి చివరకు ఓ ధనిక కుటుంబం చేతనే తమ ప్రతిభతో ఉద్యోగం సంపాదిస్తారు’ అని ఊర్వశీ మంగళవారం ట్వీట్ చేసింది. ఊర్వశీ ట్వీట్పై జేపీ బ్రామర్ స్పందించారు. కాపీ పేస్ట్ చేసేటప్పడు కనీసం గ్రామర్ తప్పులు కూడా సరిచేసుకోకుండా ఉన్నదున్నట్లు కాపీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘ఎవరిదైనా ట్వీట్ కాపీ చేసేటప్పుడు అందులో మార్పులు చేయాలి. కనీసం గ్రామర్ తప్పులు లేకుండా చూసుకోవాల’ని ఆయన హితవు పలికారు. ఈ ట్వీట్ల వ్యవహారంపై ఊర్వశీ ఫాలోవర్స్ కూడా ఆమెపై గుర్రుమంటున్నారు. ఆమెకు అసలు బ్రెయిన్ లేదని కొందరు స్పందిస్తుంటే, మరికొందరేమో ఇది ఊహించిందే అని అంటున్నారు. గతంలోనూ మోడల్ జిగి హడీడ్, ప్రధాని మోదీ ట్వీట్లను కూడా కాపీ, పేస్ట్ చేసి ఆమె వివాదాలపాలయ్యారు. -
తనకు తానే బర్త్ డే విషెష్ చెప్పుకుంది!
సెలబ్రెటీల పుట్టిన రోజు అంటే అభిమానులు లేదా ప్రముఖులు వారి గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారు. లేకపోతే వారికి సంబంధించి కొత్త సినిమా లేక ఏదో ఒక కొత్త విషయాన్ని పుట్టిన రోజున అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తన పుట్టిన రోజు పోస్టును షేర్ చేసి అభిమానుల చేత ఔరా అనిపించుకుంటున్నారు. మంగళవారం ఈ బ్యూటీ క్వీన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ భామ తనకు తానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోమవారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో తన తాజా చిత్రాన్ని షేర్ చేశారు. View this post on Instagram Today the sun shined a little extra, just for me. #HappyBirthday to the most amazing person on earth which is me! Thanks for the extra special birthday wishes feeling the most loved. My birthday should be a holiday ♥️🧡💙💚💛💜🖤🤍🤎💖 🎂🧁🤩🥳💃🏻🌈🍦🍭🥛🍪🌰🍷🍸💎🧿🎈🎁🎀🎉🎊 . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on Feb 24, 2020 at 10:03am PST ఫిల్మ్ఫేర్లో ఆస్కార్ గౌను ‘నా కోసం ఈ రోజు సూర్యుడు కాస్తా అదనంగా ప్రకాశించాడు. ఈ భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు(సూర్యుడు తనకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా). ఈ ప్రత్యేక బర్త్డే విషెస్కు ధన్యవాదాలు. ఈ అనుభూతి చాలా అందంగా ఉంది. నా పుట్టిన రోజు సెలవు దినం అయి ఉండాలి’ అంటూ #HappyBirthday అనే హ్యాష్ ట్యాగ్తో తనకు తానుగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక ఈ భామ పోస్టుకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. తన పోస్టుకు ఇప్పటికి వరకు లక్షల్లో లైక్లు రాగా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ఊర్వశి ఇన్స్టాగ్రామ్లోనే కాక ట్విటర్, మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్స్లో #UrvashiRautela టాప్ ట్రెండ్ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఊర్వశి హిందీ రీమేక్లో వస్తున్న తమిళ సూపర్ హిట్ మూవీ ‘తిరుటు పాయలే 2’లో నటిస్తున్నారు. -
ఫిల్మ్ఫేర్లో ఆస్కార్ గౌను
ఆస్కార్ వేడుకల్లో ఎరుపు రంగు తివాచీ రిచ్గా కనిపిస్తుంది. ఆ తర్వాతి ‘రిచ్’దనమంతా నటీమణుల ఎర్ర గౌన్లదే. ఇటీవలి మన ఫిల్మ్ఫేర్ సినిమా అవార్డుల వేడుకల్లో కూడా ఆస్కార్ కళ కనిపించింది! కొంచెం వాళ్లని ఫాలో అయినట్లున్నారు మనవాళ్లు. గౌహతిలోని ఇందిరాగాంధి అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన ఈ ఏడాది ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానోత్సవానికి నటి ఊర్వశీ రౌటేలా ఎర్రరంగు గౌను వేసుకుని వచ్చారు. ఒక్కక్షణం అక్కడివారికి ఇది హాలీవుడ్డో, బాలీవుడ్డో అర్థం కాలేదు. ఊర్వశి వేసుకొచ్చిన గౌను వేదికకు ఆస్కార్ కళను తెప్పించింది. ఆ గౌనుతో ఆడియెన్స్ మధ్యలో కూర్చోడానికి ఆమెకు నాలుగు సీట్లు అవసరం అయ్యాయి. ఆమెకు ఒక సీటు, ఆమె గౌను అంచులు మడతలు పడకుండా ఉండేందుకు మూడు సీట్లు! కూర్చున్నాక అంతపెద్ద గౌను ఎక్కడో ఒకచోట మడత పడకుండా ఉంటుందా? ఆ మడతల్ని సరిచేయడానికి ఒక టీము. గౌనుకు ఎంత ఖర్చయిందో తెలీదు కానీ.. గౌన్ కుట్టడానికి మాత్రం 730 గంటలు పట్టిందట! అంటే నెలకు పైగానే. ఈ వివరాలన్నీ అప్పుడు బయటికి రాలేదు. ఈవెంట్ అయ్యాక కాస్త ఆలస్యంగా బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో గౌను విశేషాలన్నిటినీ కుప్పపోశారు ఊర్వశి. ఊర్వశి హరిద్వార్ అమ్మాయి. వయసు 25. ఏడేళ్లుగా సినిమాల్లో ఉన్నారు. తొలి సినిమా ‘సింగ్ సాబ్ ది గ్రేట్’. ఇటీవలి సినిమా ‘పాగల్పంతీ’. మధ్యలో ఏడు సినిమాలు. ఈసారి ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రదానంలో ప్రతిభను పక్కన పెట్టారన్న విమర్శలు చాలా వచ్చాయి. వాటి గురించి ఊర్వశి ఏమీ మాట్లాడడం లేదు. అవార్డొచ్చి, ఆ అవార్డును తీసుకోడానికి వెళ్లలేదు ఆమె. ఆహ్వానం వస్తే వెళ్లింది. కాసేపు అలా కూర్చొని వచ్చింది. వివాదాలకు దూరంగా ఉండేవాళ్లెప్పుడూ సంతోషంగా ఉంటారు. నాలుగు కుర్చీలలో ఊర్వశీ రౌటేలా -
మోదీ ట్వీట్ కాపీ చేసిన హీరోయిన్!?
బాలీవుడ్ సెలబ్రిటీలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో నెటిజన్ల చేత ట్రోల్ చేయబడుతారన్నవిషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు హీరో, హీరోయిన్లు సున్నితమైన సామాజిక అంశాలపై అతిచేయటం, అనుచిత, వివాదాస్పత వ్యాఖ్యలు చేయటం వల్ల ట్రోల్కు గురవుతారు. కానీ తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెలా విచిత్రంగా సోషల్ మీడియాలో ట్రోల్ను ఎదుర్కొంటున్నారు. శనివారం అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆస్పత్రిలో ఉన్న షబానా అజ్మీని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. షబానా రోడ్డు ప్రమాదం తనను బాధకు గురిచేసిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఊర్వశీ రౌతెలా కూడా షబానా త్వరగా కోలుకోవాలని తన ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ చేసిన ట్వీట్లో ఒక్క అక్షరం పొల్లుపోకుండా ఊర్వశీ ట్వీట్ ఉండటంతో.. ఆమెపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఊర్వశీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. ‘మీరు ప్రధాని మోదీ ట్వీట్ను ఎందుకు కాపీ చేశారు’అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అదేవిధంగా ‘చాలా చక్కగా మోదీ ట్వీట్ను కాపీ చేశారు’ అని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. ‘కట్ కాపీ పేస్ట్’ చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. చదవండి: ఆ హీరోయిన్ని వాట్సాప్లో బ్లాక్ చేసిన పంత్ -
ఆ హీరోయిన్ని వాట్సాప్లో బ్లాక్ చేసిన పంత్
గతకొద్ది రోజులుగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సెలబ్రిటీలపై రూమర్స్ కామన్గానే వస్తుంటాయి. ఇక క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే ఆ వార్త హాట్ టాపిక్ కావాల్సిందే. కోహ్లీ-అనుష్క, జహీర్-సాగరిక, హర్భజన్-గీతా, యువీ-హజెల్ వంటివారు కొద్దికాలం ప్రేమలో విహరించి తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి బాటలోనే యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఇషా నేగీతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాడు. జనవరి 1న ఇన్స్టాగ్రామ్లో ఇషాతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. నీతో కలిసున్నప్పుడు నన్ను నేను మరింత ఇష్టపడతా అని క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే.. ఇటీవల పంత్తో టచ్లోకి వచ్చేందుకు మాజీ ప్రియురాలు ఊర్వశి చాలాసార్లు ప్రయత్నించినా.. పంత్ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడటంలేదని తెలుస్తోంది. దీంతో పదేపదే విసిగిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ ఆమె నంబర్ను వాట్సాప్లో బ్లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నాకే నంబర్లు బ్లాక్ చేసుకున్నారని ఊర్వశి సన్నిహితులు చెప్తుండటం విశేషం. View this post on Instagram I like me better when I’m with you 🧡🤷🏻♂ A post shared by Rishabh Pant (@rishabpant) on Jan 2, 2020 at 10:52am PST -
హార్దిక్కు కాబోయే భార్య గురించి..
ముంబై: సెర్బియా నటి నటాషా స్టాన్వికోవిచ్ మంచి మనిషి అని హార్దిక్ పాండ్యా మాజీ ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి రౌతేలా అన్నారు. నటాషాను ఒక్కసారి మాత్రమే ముఖాముఖి కలిశానని ఆమె వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్లో మంగళవారం మోడల్ నటాషా స్టాన్కోవిచ్, పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఊర్వశి రౌతేలా ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాగల్పంటి సినిమా ప్రమోషన్లో ఒకసారి నటాషాను కలిశానని, ఆ సమయంలో తామిద్దరం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదని ఊర్వశి రౌతేలా వెల్లడించారు. నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు చెప్పారు. అంతేకాదు వారిద్దరికీ అవసరమైనప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధం ఉన్నానని భరోసాయిచ్చారు. హార్దిక్, నటాషాలకు క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నటాషా మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని కూడా హార్ట్సింబల్ను (ఎమోజీ) పోస్ట్ చేసి విషెస్ చెప్పాడు. హార్దిక్, నటాషా పెళ్లెప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. -
హార్ధిక్కు మాజీ ప్రియురాలి విషెష్!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి నటాషా స్టాన్వికోవిచ్లు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనున్నారు. గత కొద్ది రోజులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ అధికారంగా ప్రకటించారు. దీంతో పాండ్యా నిశ్చితార్థం విషయం తెలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రముఖ క్రికెటర్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. అయితే శుభాకాంక్షలు తెలిపే సెలబ్రిటీలలో పాండ్యా ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఉండటం విశేషం. ఉర్వశి ‘మీ జంటకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీ బంధం ఎప్పుడూ ప్రేమతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ పాండ్యా పోస్టుకు కామెంటు పెట్టింది. గతంలో వీరిద్దరూ ప్రేమాయణం నడిపినట్లు బి టౌన్లో గుసగుసలు వినిపించాయి. దీంతో వీరి ప్రేమ గురించి తెలిసిన సన్నిహితులను ఉర్వశి కామెంటు ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాలో నటాషా వేలుకు రింగ్ తొడుగుతున్న పోటోలకు ‘నా మెరుపుతీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను’ అనే క్యాప్షన్తో షేర్ చేశాడు. హార్దిక్ వెంట బోట్లో అతని సోదరుడు కృనాల్ పాండ్యా, అతని భార్య పంఖురి కూడా ఉన్నారు. 27 ఏళ్ల నటాషా 2012లో సెర్బియా నుంచి ముంబైకి వచ్చింది. కొన్ని విఖ్యాత బ్రాండ్లకు చెందిన వాణిజ్య ప్రకటనల్లోను నటించింది. 2013లో ప్రకాశ్ ఝా దర్శకత్వంలో ‘సత్యాగ్రహ’ సినిమాలో నటించింది. View this post on Instagram Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jan 1, 2020 at 4:02am PST -
బాలీవుడ్ భామతో రిషభ్ డేటింగ్!
ముంబై: భారత క్రికెట్ జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతూ వస్తున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పుడు ఒక నటితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో పంత్ డేటింగ్ జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వెస్టిండీస్తో మూడో టీ20కి ముందురోజు రాత్రి.. ఊర్వశీ రౌతేలాతో ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో డిన్నర్ చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది. దాంతో ఊర్వశితో అతడు డేటింగ్ చేస్తున్నట్టు అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది. మరొకవైపు టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను రిషభ్ పంత్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘ నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం’ అని రిషభ్ క్యాప్షన్ జోడించాడు. మరి ఇక్కడ ఇషా నేగీతో ఫొటోను రిషభ్ పంత్ పోస్ట్ చేయడమే కాకుండా ఇలా ఎందుకు రాశాడో అతనికే తెలియాలి. వరుస వైఫల్యాలతో సతమవుతున్న రిషభ్ పంత్కు ఈ తరహా వ్యవహరాలు అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విండీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో టీ20లో ఫర్వాలేదనిపించిన రిషభ్.. ఆఖరి మ్యాచ్లో ఫస్ట్డౌన్లో వచ్చి డకౌట్ అయ్యాడు.కేవలం రెండు బంతులే ఆడి పొలార్డ్ బౌలింగ్లో హోల్డర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. View this post on Instagram I just want to make you happy because you are the reason I am so happy ❤️ A post shared by Rishabh Pant (@rishabpant) on Jan 16, 2019 at 7:42am PST -
‘ఆయన జెంటిల్మ్యాన్.. విమర్శలు మానండి’
అప్పుడప్పుడు మనం చాలా సాధరణంగా చేసే పనులే మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. మన తప్పేం లేకున్నా విమర్శలు స్వీకరించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్. ఓ వివాహ వేడుకు హాజరైన బోనీ కపూర్ అక్కడ నటి ఊర్వశి రౌతెలాతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఆ తర్వాత ఈ ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన అభిమానులు వీరి మీద విరుచుకుపడుతున్నారు. బోనీ కపూర్ సదరు నటితో అసభ్యంగా ప్రవర్తించాడని ఇది ఆయనకు తగదని కామెంట్ చేస్తున్నారు. ‘బోనీ కపూర్ స్థానంలో ఓ సాధరణ వ్యక్తి ఉండి.. ఇలానే బిహేవ్ చేస్తే ఆ నటి ఊరుకునేదా. కానీ అక్కడ ఉన్నది ఓ బడా నిర్మాత కావడంతో ఆమె కిక్కురుమనడం లేద’ని కామెంట్ చేశారు. దీనిపై పేపర్లో వార్తా కథనాలు కూడా వచ్చాయి. వీటిపై స్పందించిన ఊర్వశి రౌతెలా ఓ పేపర్లో వచ్చిన ‘ఊర్వశిని బోనీ పట్టుకోబోయారు. అప్పుడు ఆమె ‘డోన్ట్ టచ్’ అని వార్నింగ్ ఇచ్చారు’ అనే న్యూస్ ఐటమ్ని స్ర్కీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘ఇది ఇండియాలో చాలా ప్రసిద్ధి చెందిన న్యూస్ పేపర్. దీనిలో వచ్చిన వార్త ఇది. మహిళల్ని గౌరవించడం రాని మీరు ఇంకెప్పుడు స్త్రీ స్వేచ్ఛ, మహిళా శక్తి గురించి మాట్లాడకండి. బోనీ కపూర్ ఒక జెంటిల్మ్యాన్. ఆయనతో ఫోటో దిగడం గౌరవంగా భావించాను. ఇకనైనా విమర్శిచడం ఆపండి’ అంటూ ట్వీట్ చేశారు. I felt appalled and beyond shocked this morning when i saw social media flooded with trolls of me in a video with respected @BoneyKapoor Sir. He is a true Gentleman and it makes me feel extremely unhappy and miserable because the social sites/media don't even think twice before pic.twitter.com/VIzuCeeObV — URVASHI RAUTELA (@UrvashiRautela) April 2, 2019 -
ఆమెతో పాండ్యా బ్రేకప్.. ఈమెతో షికార్లు..!
ముంబై : క్రికెటర్లు, హీరోయిన్ల బంధం తరతరాలుగా కొనసాగుతోంది. గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు ఇదే కోవకు చెందుతారు. అయితే ఇటీవల నటి నిధి అగర్వాల్- క్రికెటర్ కేఎల్ రాహుల్లపై వదంతులు రాగా, తాము కేవలం స్నేహితులమేనని.. ఎప్పటినుంచో తమకు పరిచయం ఉందని వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్వీడన్ మోడల్-నటి ఎల్లీ అవ్రామ్ జోడీ బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హార్ధిక్ అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ అందరికీ తెలిసింది. అయితే వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ‘హేట్ స్టోరీ 4’ నటి ఊర్వశి రౌతెలా. పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటినుంచీ వీరి రిలేషన్ మొదలుకావడంతో ఎల్లీ అవ్రామ్, పాండ్యా నుంచి దూరంగా ఉందంటూ ఊహాగానాలున్నాయి. ఐపీఎల్-11 సమయంలో హార్ధిక్-ఊర్వశి రౌతెలా ఫొటోలు నెట్లో దర్శనమిచ్చాయి. గతంలో ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్పోర్టులో డ్రాప్ చేసి వెళ్లినప్పుడు కెమెరా కంటికి చిక్కగా.. ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే బ్రేకప్ వదంతులపై హార్ధిక్ పాండ్యాగానీ, ఎల్లీ అవ్రామ్ స్పందించలేదు. -
హీరోయిన్ నకిలీ ఆధార్తో రూమ్ బుకింగ్
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించి ఐదు నక్షత్రాల హోటల్లో గదిని బుక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సబర్బన్ బాంద్రాలోని ప్లష్ హోటల్లో జరిగింది ఈ సంఘటన. ‘కాబిల్’, ‘హేట్ స్టోరీ 4’ ఫేం ఊర్వశి రౌతెలా ఒక కార్యక్రమానికి హాజరవడం కోసం ప్లష్ హోటల్కు వచ్చింది. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా హోటల్ సిబ్బంది వచ్చి మీ పేరుతో గది బుక్ చేశారని చెప్పారు. రౌతెలా తన సెక్రటరీని పిలిచి అడగ్గా తాను ఏ గది బుక్ చేయలేదన్నాడు. ఆమె వెంటనే హోటల్లోని బుకింగ్ రికార్డును పరిశీలించగా తన పేరుతో ఉన్న నకిలీ ఆధార్కార్డు సాయంతో ఎవరో గదిని బుక్ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం గురించి ఆమె బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 468 (ఫోర్జరీ), ఐటీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్లో రౌతెలా పేరుతో ఉన్ననకిలీ ఆధార్కార్డుతో హోటల్ గదిని బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. -
ఆ హీరోయిన్ను భరించటం వల్ల కావట్లేదు!
సాక్షి, సినిమా : మోడల్ కమ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ సమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆమె మెయింటెనెన్స్ బిల్లు తడిసి మోపెడవుతుండటంతో భరించటం మా వల్ల కాదు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. స్పోర్ట్బాయే కథనం ప్రకారం... ‘సనమ్ రే’ ఫేమ్ ఊర్వశి ప్రస్తుతం భానుప్రియా అనే ఓ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ ప్రారంభమై కొద్ది రోజులే అవుతోంది. అయినప్పటికీ అప్పుడే ఆమె వ్యవహారంతో యూనిట్ సభ్యులు విసిగిపోతున్నారంట. షూటింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరిన సమయంలోనే ఆమె అసిస్టెంట్లు ఫోన్ ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారంట. అది అంతా ఇంతా కాదు. దాదాపు యూనిట్ సభ్యులకు సరిపడేంత. అందులో ఆమె, సహయక సిబ్బంది కాస్త మాత్రమే తిని.. మిగతాది ఆమె ఇంటికి పంపిచేస్తున్నారంట. ఊర్వశి వ్యవహారం రోజు రోజుకీ శృతి మించిపోతోందని.. షూటింగ్ మీరా రోడ్లో జరిగితే.. ఎక్కడో జూహులో ఉన్న కాస్ట్ లీ రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేస్తోందని.. ఈ వ్యవహారంలో ప్రొడక్షన్ మేనేజర్తో ఆమె గొడవ పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమెపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మరీ ఆరోపణలపై హేట్ స్టోరీ-4 బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మోస్ట్ వైరల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
ముంబై: మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా అరుదైన ఘనత దక్కించుకుంది. ఈ ఏడాది మోస్ట్ వైరల్ సెలబ్రిటీగా ఎంపికైంది. ఇటీవల జరిగిన రిలయన్స్ డిజిటల్ ఎగ్జిబిట్ టెక్ అవార్డులు 2016లో వేడుకలో ఈ పురస్కారం అందుకుంది. యమహా ఫాసినో మిస్ దివా- 2015 మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి పలు సినిమాల్లో నటించింది. ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. ఈ సినిమా రిలీజ్కు 17 రోజుల ముందే ఇంటర్నెట్ లో వచ్చేయటంతో కలకలం రేగింది. ఫలితంగా ఈ సినిమా వసూళ్లు ఊహించిన దానికన్నా చాలా తక్కువగా వచ్చాయి. దీనిపై అప్పట్లో ఊర్వశి కన్నీళ్లు పెట్టుకుంది. ‘సినిమా చూసిన వారందరూ సూపర్బ్గా చేశానని ప్రశంసించారు. నాకు సంతోషించాలో బాధపడాలో కూడా తెలియటం లేదు. ఇది హత్య చేయడం కన్నా ఎక్కువ' అంటూ ఏడ్చేసింది. -
ఆ హీరోకి నేను ఫీమేల్ వెర్షన్: నటి
ముంబై: మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా ఒకరు. యాక్షన్-రొమాన్స్ మేలవింపుతో సింగ్ సాబ్ ద గ్రేట్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'లో నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. యమహా ఫాసినో మిస్ దివా 2015- మిస్ యూనివర్స్ ఇండియా కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితురాలు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుంది. థైక్వాండో, జిమ్నాస్టిక్స్ లలో శిక్షణ తీసుకుంటానని చెప్పిన ఊర్వశీ.. తాను అక్షయ్ కుమార్ ఫిమెల్ వెర్షన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నట్లు పేర్కొంది. అక్షయ్ ని స్ఫూర్తిగా తీసుకుని మార్షల్ ఆర్ట్స్ లో పట్టు సాధిస్తానంటోంది. ప్రస్తుతం టీ సిరీస్ తో మూడు మూవీల కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఈ అందాల భామ ఆ పనిలో బిజీగా ఉన్ననని చెప్పింది. 'గాల్ బాన్ గాయి' అనే సాంగ్ లో తాను భాగస్వామిని అయ్యానని దీంతో గ్రేట్ సింగర్ సుఖ్ బిర్ తో పనిచేయాలన్న తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. తనకు యాక్షన్ మూవీలలో నటించడమంటే ఎంతో ఇష్టమని.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆ తరహా సినిమాలు చేయాలనుందని తెలిపింది.