Top Stories
ప్రధాన వార్తలు

ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. కాగ్ లెక్కలతో వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని చెప్పారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా కాగ్ నివేదికలను బయటపెట్టారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ, ఇది అబద్దమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించింది. 2024 ఏప్రిల్తో పోల్చితే 2025 ఏప్రిల్లో ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గింది.ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందనీ, అందువలన జీఎస్టీ ఆదాయాలు తగ్గాయని ప్రకటించింది. నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతనే నికర జీఎస్టీని లెక్కగడతారు. కానీ, జీఎస్టీ ఆదాయాల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను చేస్తోంది.టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్దంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉంది. గతేడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయి. పన్నేతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరింత ఆందోళన కలిగించే అంశం’ అని చెప్పుకొచ్చారు. April 2025 fiscal performance indicates further distressThe CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the State finances. On 1st May, the Government made a press release suggesting that the… pic.twitter.com/oGwLzKXzQZ— YS Jagan Mohan Reddy (@ysjagan) June 7, 2025

‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్ను ఉద్దేశిస్తూ ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరు రాజకీయ వేత్త. మరొకరు వ్యాపార వేత్త. నిన్నమొన్నటి వరకు వాళ్లిద్దరూ ఆప్తమిత్రులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. ట్రంప్ ఏ ముహూర్తాన బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారో నాటి నుంచి వాళ్లిద్దరి మధ్య సఖ్యత దెబ్బ తింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఆ పిచ్చోడితో నేను మాట్లాడేంది అని ట్రంప్ అంటుంటే.. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ మస్క్ బాంబు పేల్చారు. సంబంధిత ఆధారాల్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొద్ది సేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్తో మస్క్ రాజీకి సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారా? ట్రంప్తో రాజీకి రెడీ అయ్యారా?. అంటే అవుననే అనిపిస్తున్నాయి మస్క్ చర్యలు.జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఫైల్స్ను మస్క్ డిలీట్ చేశారు. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో తన పేరు ఉండడం వల్లే ఆ డాక్యుమెంట్ను ట్రంప్ బహిర్ఘతం చేయడం లేదంటూ మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్ కొద్ది సేపటిక్రితం ఆ పోస్టును డిలీట్ చేశారు. దీంతో మస్క్ వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది.టెస్లాలో భారీ నష్టాలు, స్పేస్ ఎక్స్లో ప్రాజెక్ట్లపై ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ట్రంప్తో విభేదాల విషయంలో మస్క్ ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు నేను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అమెరికాకు అధ్యక్షుడు అయ్యే వారు కాదు. కొత్త పార్టీ పెడతానంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు.Trump responds that he has been too busy to think about Elon Musk but added “I just wish him well.”The President is showing so much class, restraint and grace. pic.twitter.com/CfYCqH3aKN— Cassie N (@cass_nguyen_) June 6, 2025 మస్క్ చేసిన వ్యాఖ్యల్ని ఏబీసీ మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. మీపై మస్క్ ఆరోపణలు గుప్పిస్తున్నారు కదా. మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. మీరు మాట్లాడేది ఆ పిచ్చోడి గురించేనా. ప్రత్యేకంగానే కాదు. అసలు మాట్లాడేందుకే నేనే ఇష్టపడడం లేదు. ఒకవేళ మస్క్ నాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు నేను సుముఖంగా లేనన్నారు. ఈ క్రమంలో మస్క్- ట్రంప్ వార్ ఎటుకి దారి తీస్తుందోనని రాజకీయ వేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్,మస్క్లు మళ్లీ ఏం కొంపముంచుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.500 నోట్లు మళ్లీ రద్దవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే..
రూ.500 నోట్లు మరోసారి రద్దవుతాయంటూ సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రూ.500 నోటును రద్దు చేస్తారంటూ వచ్చిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు దీనిపై స్పష్టత ఇచ్చింది.2026 మార్చి నుంచి రూ.500 నోట్లను దశలవారీగా రద్దు చేస్తామని పేర్కొంటూ గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఓ వీడియో వైరల్ కావడంతో కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై భయాందోళనలు మొదలయ్యాయి. క్యాపిటల్ టీవీ అనే ఛానెల్లో అప్లోడ్ చేసిన 12 నిమిషాల నిడివిగల ఈ వీడియో జూన్ 2 నుంచి ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలపై స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి ప్రకటన చేయలేదు. ప్రజలు ఎటువంటి తప్పుడు సమాచారానికి గురికావద్దని భారత ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ సూచించింది. ‘రూ.500 నోట్లను రద్దు చేయలేదు. చట్టబద్ధంగానే ఉన్నాయి. వార్తలను నమ్మి.. షేర్ చేసే ముందు అధికారిక సోర్స్లను ఎప్పటికప్పుడు సందర్శించి నిర్ధారించుకోండి’ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పీఐబీ పోస్ట్ పేర్కొంది.కొత్త రూ.500 నోట్లు ఎప్పుడొచ్చాయంటే..2016 నవంబర్ లో పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 నోట్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత నోటు 66 మిమీ x 150 మిమీ కొలతల్లో స్టోన్ గ్రే కలర్ లో ఉంటుంది. దీని వెనుక భాగంలో భారతీయ వారసత్వ ప్రదేశాల థీమ్ కు అనుగుణంగా ఎర్రకోట చిత్రం ఉంటుంది.

తహసీల్దార్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత
శ్రీసత్యసాయి జిల్లా, సాక్షి: శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మంత్రి సవిత దురుసు ప్రవర్తన హాట్ టాపిగ్గా మారింది. పెనుకొండ తహసీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరేశారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఘటన చోటు చేసుకుంది. అయితే, మంత్రి సవిత తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సవిత బొకేని విసిరేసిన దృశ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బొకే ఇస్తే తీసుకోవాలి. లేదంటే పక్కకు పెట్టాలి. లేదంటే తనతోపాటు ఉన్నవారికి ఇవ్వాలి. అంతే గాని ఇలా విసిరేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.మంత్రి సవిత దురుసు ప్రవర్తన.. పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను విసిరేసిన మంత్రి సవిత..! @MinisterSavitha సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలో ఘటన!#AndhraPradesh @ncbn @PawanKalyan @naralokesh pic.twitter.com/6fniceqmql— ap-leaks (@ap_leaks) June 7, 2025ఇలా మంత్రి సవిత దురుసు ప్రవర్తన కొత్తేమీ కాదు. గతేడాది నవంబర్లో జరిగిన శాసన మండలిలో సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.జగన్మోహన్రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాంతించక పోవడంతో మండలిని వాయిదా వేశారాయన.

IND-A vs ENG: 348 పరుగులకు భారత్-ఎ ఆలౌట్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు బ్యాటర్లు రాణించారు. టాస్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్-ఎ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్ను ముగించింది. ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 116 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.మరో 13 రోజుల్లో..ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. తొలి టెస్టు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండా ఇంగ్లండ్కు వెళ్లిన టీమిండియా.. ప్రత్యర్ధి జట్టును ఎలా ఎదుర్కొంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి
ఛత్తీస్గఢ్: బీజాపూర్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రత బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తెలుగు నేతలే టార్గెట్గా ఆపరేషన్ కొనసాగుతుంది. మూడో రోజు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటన స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో మూడు రోజులుగా మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. భద్రత బలగాల హిట్ లిస్టులో తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక నేతలు బండి ప్రకాష్, దామోదర్, మల్లోజుల వేణుగోపాల్, రామన్న, వాసుదేవరావు ఉన్నారు. మరోవైపు మావో కీలక నేతలు బండి ప్రకాష్ , దిలీప్లకు ప్రాణహాని ఉందని పౌర హక్కుల సంఘాల నేతలు అంటున్నారు.ఎన్కౌంటర్ పేరుతో హతమార్చే ప్రమాదం ఉందని పౌర హక్కుల సంఘం నేతలు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు నంబాల కేశవరావు, సుధాకర్ ప్రాణాలు కోల్పోయారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయారు.ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు సహా పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో సెర్చింగ్ జరుగుతుంది. పాము కాటు, తేనెటీగల దాడిలో కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్తో మరి కొందరు జవాన్లకు అస్వస్థతకు గురయ్యారు. బలగాల ఆపరేషన్ ముగిసిన తర్వాత సమగ్ర సమాచారం తెలియ చేస్తామని బీజాపూర్ ఎస్పీ పేర్కొన్నారు.

పవన్కు ఝలక్.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు
సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి ,బీసీ నుంచి వాకిటి శ్రీహరి ,ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా.. ప్రస్తుతం స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
పెళ్లికి ముందు ప్రేమలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. అయితే ఎన్ని లవ్స్టోరీలు ఉన్నా సరే పెళ్లి దగ్గరపడేసరికి వాటిన్నింటికీ ముగింపు పలికేసి కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది! ఎంతోమంది హీరో, హీరోయిన్లు అనేక లవ్వాయణాల తర్వాతే వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.పెళ్లికి ముందు ప్రేమాయణంస్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. నటుడు హర్మాన్ బవేజా, షాహిద్ కపూర్, షారూఖ్ కపూర్ను ప్రేమించినట్లు భోగట్టా! ఆ తర్వాతే అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనస్ (Nick Jonas)తో ప్రేమలో పడగా ఈసారి దాన్ని పెళ్లిదాకా తీసుకెళ్లింది. అయితే నిక్ కూడా గతంలో అమెరికన్ సింగర్, నటి మిలే సైరస్ను ప్రేమించాడు. వీరిద్దరూ 2006- 2009 వరకు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పి ప్రియాంకను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు.నన్ను దూరం పెట్టాడుతాజాగా తన ప్రేమపురాణం గురించి సైరస్ (Miley Cyrus) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నాకు నిక్ అంటే చాలా ఇష్టం. నన్ను తన మ్యూజిక్ టూర్లో జాయిన్ చేసుకోనప్పుడు ఎంతో బాధపడ్డాను. ఏడ్చాను. తను నన్ను నెమ్మదిగా దూరం పెడుతున్నాడని అర్థమైంది. ఎందుకు నన్ను వదిలేస్తున్నావ్? అని నిలదీశాను. కలిసుందామని వేడుకున్నాను. కానీ ఫలితం లేకపోయింది.వెధవ.. నన్ను వదిలేశాడునా బయోగ్రఫీలో కూడా నిక్ మంచివాడు కాదు, వెధవ.. నన్ను వదిలేశాడని బూతులు రాయాలనుకున్నాను. కానీ నా టీమ్ అతడ్ని తిడుతూ రాసేందుకు ఒప్పుకోలేదు. అయితే నిక్ ఇప్పటికీ దారితప్పిన పిల్లాడిలాగే కనిపిస్తాడు అని నవ్వేసింది. ఇకపోతే సైరస్ 2021 నుంచి మాక్స్ మొరండోతో డేటింగ్లో ఉంది. నిక్ విషయానికి వస్తే.. ప్రియాంకను పెళ్లి చేసుకోగా వీరికి సరోగసి ద్వారా మూడేళ్ల కూతురు మాల్తీ మారీ జన్మించింది.చదవండి: మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్!

Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
అక్కినేని కుటుంబం మొత్తానికి అఖిల్ అక్కినేని , జైనాబ్ రవ్జీ మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల, సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను వైభవంగా జరిపించారు. అఖిల్-జైనాబ్ వెడ్డింగ్ పిక్స్ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే పెళ్లి ముస్తాబులో మొత్తం డైమండ్ నగలనే ఎంచుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్ లుక్ను తీర్చిదిద్దుకుంది. రెడ్ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్ చైన్, మూడు లేయర్ల డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు, ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్తో తళుక్కున మెరిసింది. అటు కొత్త పెళ్లికొడుకు అఖిల్ కూడా శ్వేత వస్త్రాల్లో సింపుల్గా అందంగా కనిపించాడు.జైనబ్తో తన రిలేషన్షిప్ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్ డైమండ్ రింగ్ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు.
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ ప్లేయర్.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..
తహసీల్దార్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత
'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు
'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్ కోసం మరో సినిమా..?
‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్ను ఉద్దేశిస్తూ ట్రంప్
రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
IND-A vs ENG: 348 పరుగులకు భారత్-ఎ ఆలౌట్
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
బతికి ఉన్నంత వరకు అలా మాట్లాడను'.. నటుడు రాజేంద్రప్రసాద్
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
దాచటం దేశభక్తిని చాటడమా?
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ ప్లేయర్.. కపిల్ దేవ్ రికార్డు బద్దలు
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..
తహసీల్దార్ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత
'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు
'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్ కోసం మరో సినిమా..?
‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్ను ఉద్దేశిస్తూ ట్రంప్
రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
IND-A vs ENG: 348 పరుగులకు భారత్-ఎ ఆలౌట్
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
దాచటం దేశభక్తిని చాటడమా?
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
ఈ రాశి వారికి శుభవర్తమానాలు.. ఆస్తిలాభం
నీ మంచితనం నాకు తెలుసు.. తీవ్ర దుఃఖంలో లావణ్య త్రిపాఠి
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
సినిమా

90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో తల్లి!
90 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ స్టార్ హీరో తల్లి మాత్రం వృద్ధాప్యంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) తల్లి జీనత్ ఖాన్ (Zeenat Khan) ఓ సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమిర్ స్వయంగా వెల్లడించాడు. బ్లాక్బస్టర్ సినిమా సీక్వెల్లో..'2007లో వచ్చిన తారే జమీన్ పర్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే! దానికి సీక్వెల్గా సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par Movie) రాబోతోంది. ఈ మూవీలో అమ్మ ఓ చిన్న పాత్రలో కనిపించనుంది. నిజానికి తనకు సినిమాలంటే పెద్దగా ఇష్టముండదు. నాతో సెట్స్కు ఎప్పుడూ వచ్చేది కాదు. కానీ, సడన్గా ఓ రోజు నా మూవీ షూటింగ్ ఏ ప్రదేశంలో జరుగుతోంది? అని ఆరా తీసింది. అది విని నేను ఆశ్చర్యపోయాను. తనకు సెట్కు రావాలనుందని చెప్పింది.మొట్టమొదటిసారి కెమెరాముందుకు..దాంతో నా సోదరి అమ్మను వీల్చైర్లో నేనున్న లొకేషన్కు తీసుకొచ్చింది. ఆ రోజు పెళ్లి సెలబ్రేషన్స్పై పాట షూట్ చేస్తున్నాం. దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్నకు అప్పుడే ఓ అద్భుతమైన ఐడియా తట్టింది. మీ అమ్మను కూడా పాటలో కనిపించేలా చేస్తే ఎలా ఉంటుంది? అని అడిగాడు. కానీ, తను ఒప్పుకుంటుందా? అని ఆలోచించాను. ఏదైతే అది అయిందని అమ్మను అడిగితే ఆమె వెంటనే ఓకే చెప్పి నాకే సర్ప్రైజ్ ఇచ్చింది. ఫ్యామిలీతో కలిసి..కొన్ని షాట్స్లో ఆమె కనిపిస్తుంది. తను నటించిన ఏకైక సినిమా ఇదే కావడంతో ఈ మూవీ నాకెప్పుడూ ఓ అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోనుంది. నా సోదరి కూడా తొలిసారి నాతో కలిసి నటించింది. భవిష్యత్తులో కూడా తనతో మరోసారి కలిసి యాక్ట్ చేస్తానేమో.. అని ఆమిర్ చెప్పుకొచ్చాడు. సితారే జమీన్ పర్ సినిమాలో అరోష్ దత్త, గోపీ కృష్ణ వర్మ, వేదాంత్ శర్మ, రిషబ్ జైన్, ఆశిష్ పెండ్సే.. తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!

పాన్ వరల్డ్ హీరోయిన్ రీఎంట్రీ..
మలయాళంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అదే ఏడాదిలో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సినీ ఇండస్ట్రీలో సమస్యలు: 30 మందితో కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వెలవెలబోతున్న థియేటర్లు, నెలరోజుల్లోనే ఓటీటీ (OTT)లోకి సినిమాలు, సినిమా రిలీజ్ కష్టాలు.. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్.. అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విభాగాల నుంచి పది మంది చొప్పున సభ్యులుగా తీసుకుంది. మొత్తం 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నారు.ఏ విభాగంలో ఎవరున్నారంటే?నిర్మాతల విభాగం: దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియడిస్ట్రిబ్యూటర్ విభాగం: భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరిఎగ్జిబిటర్ విభాగం: రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!

టాలీవుడ్పై సూర్య ఫోకస్.. స్టార్ డైరెక్టర్తో సినిమా క్యాన్సిల్?
హీరో సూర్యకు గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ అనేదే లేదు. 'విక్రమ్' మూవీలో రోలెక్స్ అనే అతిథి పాత్ర తప్పితే చెప్పుకోదగ్గ మూవీస్ రావట్లేదు. గత రెండు చిత్రాల్లో 'కంగువ' అట్టర్ ఫ్లాప్ కాగా, గత నెలలో వచ్చిన 'రెట్రో'.. తమిళంలో మాత్రం కలెక్షన్ సాధించింది. ఇది తప్పితే హిట్ కాదు. ఇలా కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సూర్య.. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి మూవీపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అలానే టాలీవుడ్పైనే గట్టిగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రభాస్కి నో-బన్నీతో ఫిక్స్.. దీపిక ప్లాన్ ఏంటి?)ప్రస్తుతం తెలుగు దర్శకులతో పనిచేసేందుకు సూర్య ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ క్రమంలో గతంలో కమిట్ అయిన 'వడివాసల్' అనే చిత్రాన్ని పక్కనబెట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్.. సూర్యతో ఈ సినిమా తీయాలని అనుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఏమైందో ఏమో గానీ ఈ ప్రాజెక్ట్ అలా సైడ్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇంకా పూర్తిస్థాయిలో సెట్ కాకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.మరోవైపు పాన్ ఇండియా ట్రెండ్లో పలువురు టాలీవుడ్ దర్శకులు ముందు వరసలో ఉన్నారు. దీంతో సూర్య ఇప్పుడు ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపై పెట్టాడని తెలుస్తోంది. ఈ రూమర్స్ బట్టి చూస్తుంటే త్వరలో సూర్య.. స్ట్రెయిట్ తెలుగు మూవీస్ మరిన్ని చేస్తాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ సినిమాలు సెట్ కావట్లేదు. సూర్యని ప్రస్తుత తరం తమిళ దర్శకులు సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ కారణంతోనే ఇకపై యువ దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని సూర్య అనుకుంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

అలా జరిగితే కోహ్లి రిటైర్మెంట్ వెనక్కి: మైఖేల్ క్లార్క్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు విరాట్ తన నిర్ణయాన్ని వెల్లడిండాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.అతడి స్ధానంలో కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. కోహ్లి, రోహిత్ శర్మ వంటి ఇద్దరూ దిగ్గజాల లేకుండానే భారత జట్టు ఇంగ్లండ్కు పయనమైంది. కేఎల్ రాహుల్, జడేజా, బుమ్రా మినహా పెద్దగా అనుభవం ఉన్న ఆటగాళ్లు ప్రస్తుత భారత టెస్టు జట్టులో లేరు. దీంతో ఇంగ్లండ్పై గిల్ సారథ్యంలోని భారత జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి రిటైర్మెంట్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్టు సిరీస్లో టీమిండియా ఘోరంగా ఓడిపోతే విరాట్ తిరిగి తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు."ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భారత జట్టు 5-0 తేడాతో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొటే, కచ్చితంగా విరాట్ కోహ్లి తిరిగి రావాలని అంతా కోరుకుంటారు. ఆ సమయంలో కెప్టెన్, అభిమానులు, సెలక్టర్లు అభ్యర్దిస్తే కోహ్లి కచ్చితంగా తన మనసును మార్చుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ను ప్రేమిస్తున్నాడు. ఆ ఫార్మాట్పై అతనికి ఎంత మక్కువ ఉందో అందరికీ తెలుసు. విరాట్ ఇప్పటికీ మెరుగైన క్రికెట్ ఆడుతున్నాడు. అయితే విరాట్ రిటైర్మెంట్ గల కారణాలంటో మనకు తెలియదు. కానీ ప్రతీ ఒక్కరూ తమ కెరీర్ను ఏదో ఒక చోట ముగించికతప్పదు" అని బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. తన కెరీర్లో 123 టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి, 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?

అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్పై జైశ్వాల్ ఫైర్! వీడియో వైరల్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 17పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.క్రిస్ వోక్స్ బౌలింగ్లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి జైశ్వాల్ ప్యాడ్కు తాకింది. వెంటనే కీపర్తో పాటు బౌలర్ ఎల్బీకి అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో అంపైర్ నిర్ణయం పట్ల జైశ్వాల్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. జైస్వాల్ కొన్ని సెకన్ల పాటు క్రీజులోనే నిలబడి అలా షాక్లో ఉండిపోయాడు. బంతి స్టంప్స్ను మిస్స్ అవుతుంది, ఎలా ఔట్ ఇస్తావు అన్నట్లు అంపైర్ వైపు చూస్తూ జైశ్వాల్ సైగ చేశాడు. అయితే ఈ అనధికారిక టెస్ట్లో డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో, జైశ్వాల్ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శతక్కొట్టిన రాహుల్..ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు ముందు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్ (168 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో విజృంభించాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకగా... జట్టులో అందరికంటే సీనియర్ రాహుల్కు ఈ మ్యాచ్ ద్వారా చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’జట్టు 83 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాహుల్తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?Won’t be the only time Woakes gets Jaiswal this summer.pic.twitter.com/UwT23WycGr— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 6, 2025

రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటికి.. ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో అందరిని ఆకట్టుకున్నాడు. తన అద్బుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ను పదేళ్ల తర్వాత ఫైనల్కు చేర్చాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ దుమ్ములేపాడు.దీంతో అయ్యర్కు అంతర్జాతీయ క్రికెట్లో రివార్డు లభించినట్లు తెలుస్తోంది. ఇండియన్స్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా వైట్బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గత కొంతకాలంగా కేవలం వన్డేలకే పరిమితైన అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్సీ రేసులో శ్రేయస్..శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో తన అద్బుత ప్రదర్శన తర్వాత అయ్యర్ టీ20 సెటప్లోకి కూడా వచ్చే అవకాశముంది. అంతేకాకుండా అయ్యర్ ఇప్పుడు వైట్కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు అని ఓ బీసీసీఐ అధికారి ది ఇండియన్స్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం భారత జట్టు టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. రోహిత్ శర్మ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఇటీవలే నియమితుడయ్యాడు. అయితే మూడు ఫార్మాట్లకు వెర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించికపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశముంది. ఈ క్రమంలో అయ్యర్కు వన్డే పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: ENG vs WI: జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్

జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన బట్లర్.. విండీస్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 59 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బట్లర్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 96 పరుగులు చేశాడు. అతడితో పాటు యువ ఓపెనర్ జేమీ స్మిత్(38), జాకబ్ బెతల్(23) రాణించారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, రస్సెల్, ఛేజ్ తలా వికెట్ సాధించారు.తిప్పిసేన డాసన్..అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ స్పిన్నర్ లియాస్ డాసన్ ధాటికి కరేబియన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. డాసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశాడు.అతడితో పాటు జాకబ్ బెతల్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక విండీస్ ఇన్నింగ్స్లో ఎవిన్ లూయిస్(39) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా ఆదివారం జరగనుంది.చదవండి: Bengaluru stampede: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో ఇద్దరి రాజీనామా
బిజినెస్

గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1500, రూ.1630 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1630 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1500 దిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1630 తగ్గి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు శనివారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. శుక్రవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,18,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

వెర్రి పనులు చేస్తారు.. కానీ వెర్రి ఉండదు
డబ్బుతో కొంత మంది వెర్రిపనులు చేస్తారు. కానీ ఎవరికీ వెర్రి ఉండదు. కొందరు అప్పు చేసి మరీ మనీని లగ్జరీ వస్తువులకు వాడుతుంటారు. ఖరీదైన వాహనాలు, బట్టలు, పర్యటనలు.. ఇలా అన్నింటిని అప్పుతో కానిచ్చేస్తుంటారు. ఇంకొందరు ఎంత మిగులు డబ్బున్నా ఆర్భాటాలకు పోకుండా పొదుపుపైనే దృష్టి సారిస్తూ అత్యవసరం అయితే తప్పా డబ్బును ఖర్చు చేయకుండా జాగ్రత్త పడుతారు. తర్వాతి తరాలకు సంపదను పోగు చేసి ఇస్తారు. పొదుపు, ఖర్చులకు సంబంధించి మనుషుల్లో విభిన్న మనస్తత్వాలుంటాయి. అందుకు చాలా కారణాలున్నాయి.వివిధ తరాల మనుషులు వేర్వేరు ఆదాయాలు, విభిన్న విలువలు, వేరైన పరిస్థితుల్లో పెరిగిన వారు ఉంటారు. వాళ్ళందరూ ప్రపంచంలో విభిన్న ప్రదేశాలకు చెందినవారు. వేర్వేరు ఆర్థిక పరిస్థితుల్లో జన్మించినవారు. వారి ఉద్యోగ, సామాజిక స్థితులు భిన్నంగా ఉండవచ్చు. దానితోపాటు వారికి కలిగే ప్రేరణలు, అవకాశాలు కూడా విభిన్నంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో వారు నేర్చుకునే జీవిత, ఆర్థిక పాఠాల్లో చాలా తేడాలుంటాయి.ప్రపంచంలో డబ్బుకు సంబంధించి ప్రతి ఒక్కరి అనుభవం విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఎవరో చెబితే విన్నదానికంటే ప్రత్యక్ష అనుభవానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బు విషయంలో ప్రత్యేకమైన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నాం. ఒకరి అభిప్రాయాలకు మరొకరి అభిప్రాయాలతో పొంతన ఉండకపోవచ్చు. ఎదుటివారి పనులు చాలా మందికి తలతిక్కగా కనిపించవచ్చు. అయితే డబ్బు విషయంలో అంతిమంగా వ్యక్తులు ఎంత పోగు చేస్తున్నారు.. ఎంత ఖర్చు చేస్తున్నారనే దానిపైన ప్రధానంగా దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒకటో తేదీ వచ్చిందంటే వణుకుస్వీయ అనుభవంతోనే అంతా నేర్చుకోవాలని చూస్తే జీవితకాలం సరిపోదని గుర్తుంచుకోవాలి. డబ్బుకు సంబంధించి ఎదుటి వ్యక్తుల అనుభవాలు, అందుకు మీ పొదుపు ఆలోచనలు జోడించి ముందుకు సాగాలని సూచిస్తున్నారు. డబ్బును గౌరవించి సమర్థంగా పొదుపు, ఖర్చు చేస్తేనే అది కాపాడుతోందని చెబుతున్నారు.

ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు
ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీ పని వాతావరణం నచ్చకో.. మరింత వేతనం ఆశించో.. ప్రమోషన్ కోసమో.. ఇలా విభిన్న కారణాలతో వేరే సంస్థకు మారాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీ వేతనం ఇచ్చిన తేదీ రోజున లేదంటే తర్వాత రోజున ఉద్యోగులు అధికంగా రాజీనామా పత్రాలను సమర్పిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ ‘పిట్@గో జీరో’ వ్యవస్థాపకురాలు కిరణ్ షా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.‘ఉద్యోగులకు తాము చేస్తున్న కంపెనీలు నచ్చలేదంటే.. సరిగ్గా వేతనం పడే రోజున లేదా పడిన మరుసటి రోజున రాజీనామా చేస్తున్నారు. ఇది కొన్ని యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా అన్ని కంపెనీల్లో ఒకటో తేదీన జీతాలు ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని యాజమాన్యాలకు చుక్కలే. తమ ఉద్యోగులు ఎక్కడ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉంటారోననే ఆందోళన చెందుతుంటాయి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో కంపెనీలకు విదేయతతో ఉండాలి. తమ డిమాండ్లు ఏమిటో ముందుగా కంపెనీతో చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: 30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు‘ఉద్యోగులు నిజంగా కంపెనీ నుంచి తప్పుకోవాలనుకుంటే హుందాగా తప్పుకోండి. తప్పా కంపెనీ వేతనం పడిన వెంటనే కొలువు నుంచి వైదొలగడం సరికాదు. అప్పటివరకు ఉద్యోగికి ఇచ్చిన బాధ్యతలు వెంటనే మరో వ్యక్తికి అసైన్ చేయాలంటే సంస్థకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పుకుండా నోటీస్ పీరియడ్ చేయాలి. జీతం వేసిన వెంటనే మీ యజమానిని భయభ్రాంతులకు గురిచేయకండి’ అని తెలిపారు.

30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు
యువత చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలనే ధోరణి మంచిదే. అయితే కొలువు సంపాదించాకా కార్పొరేట్ వాతావరణానికి అలవాటుపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారి సగటు వయసు 40 కంటే తక్కవే కావడం ఆందోళన కలిగిస్తుంది.సమస్యలు షురూ..దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయసు బాగా తగ్గిపోతోంది. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 35 మాత్రమేనని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.వ్యయ భారం ఇలా..కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం ఆయా కుటుంబ సభ్యులను ఆందోళకు గురిచేస్తోంది. ఇది దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యాఏం చేయాలంటే..కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కొద్దిమంది ఉద్యోగులే పాల్గొంటున్నారు. చాలా కొద్ది కంపెనీలే ఉద్యోగుల ఆరోగ్యానికి అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రస్తుత పని ప్రణాళిల్లో మార్పులు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు కంపెనీ అందించే బీమా ఉపయోగపడొచ్చు. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా ఉండడం ఉత్తమం. సంపాదన మొదలు పెట్టిన వెంటనే ఆర్థిక నిపుణులు సలహాతో మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి.
ఫ్యామిలీ

స్లిమ్గా మారిన నర్సు..బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పెరుగు..
ఈ వెయిట్ లాస్ స్టోరీ వింటే అవాక్కవ్వుతారు. బాబోయ్ ఇవేం ఫుడ్ అలవాట్లు.. అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యకరమైన అలవాట్లతోనే స్లిమ్గా మారింది, కానీ బరువు తగ్గాలనుకునే వారు తీసుకోకూడని హెవీ ఫుడ్స్తోనే ఆమె బరువు తగ్గడం విశేషం. నోటిని కట్టడి చేయకుండా.. కడుపు నిండుగా తింటూ బరువు తగ్గి చూపించింది. పైగా అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ..హాయిగా రుచికరమైన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలాగో చూపించింది. మరి ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా జరిగిందో సవివరంగా చూద్దామా.!.కెనడాకు చెందిన మెలనీ కోజ్(21) తన పనివేళల కారణంగా బర్గర్లు, ఫ్రైస్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేదట. దాంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొందట. చిన్న వయసులోనే అంత బరువు ఉండటంతో చాలా ఇబ్బందులు పడేది కూడా. పైగా వయసుకి మించిన అధిక బరువు ప్రమాదమని హెచ్చరించడంతో బరువు తగ్గేందుకు ఉప్రక్రిమించిందట. అందుకోసం పలు రకాల వర్కౌట్లు, యోగా, వ్యాయమాలు వంటివి ఎన్నింటినో చేసి.. దాదాపు రెండేళ్లు పూర్తిగా విఫలమైంది. ఇక లాభం లేదనుకుని..డైట్లోనే ఏదైనా మార్పు చేయాలి.. లేదంటే కష్టమే బరువు తగ్గడం అని అర్థమైంది మెలోనికి. దాంతో న్యూట్రిషియన్ కోర్సులో చేరి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో సవివరంగా తెలుసుకుంది. ఇక అప్పటి నుంచి అధిక ప్రోటీన్తో కూడిన ఆహారాలు తినడం ప్రారభించింది. ముఖ్యంగా ఉదయం బ్రేక్ఫాస్ట్గా అధిక ప్రోటీన్తో కూడిన గిన్నెడు పెరుగు తోపాటు తాజా పండ్లను జోడించి తీసుకునేదట. ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించి చాలాసేపటి వరకు ఫుడ్ తినాలనే కోరికను నివారించేదట. అలాగే అనారోగ్యకరమైన చిరుతిండ్లన్నింటికి పూర్తిగా దూరంగా ఉండేదట. దాంతో తన బరువులో అనుహ్యమైన మార్పుల మొదలయ్యాయట. అలా 44 కిలోలక వరకు తగ్గానని, ప్రస్తుతం 69 కిలోలు ఉన్నట్లు తెలిపింది. అయితే తన డైట్లో తక్కువ ఫ్యాట్ కలిగిన చీజ్, చికెన్, చేపలు వంటి ఉన్నాయట. అలాగే తనకు ఇష్టమైన స్వీట్స్ కూడా తినేదాన్ని అంది. అది కూడా హెల్దీ స్వీట్స్ తప్ప..ప్రాసెస్ చేసినవి కావట. ప్రస్తుతం ఈ నర్స్ వెయిట్ లాస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్గా మారింది. అధిక ప్రోటీన్తో కూడిన ఆహారం బరువు తగ్గిస్తుందా..ఇది కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి.. అధికంగా ఫుడ్ తీసుకోవాలనే ఆలోచనను నివారిస్తుంది. అలాగే మంచి బలాన్ని అందించి..బరువు తగ్గాలనే లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుంది. తద్వారా కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే..చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉంటే..కఠినమైన డైట్ల జోలికి పోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. సరైన విధంగా తీసుకుంటే..ఆహారమే ఆరోగ్యం అని, అతిగా తీసుకుంటే విషంగా మారి అనర్థాలకు కారణమవుతుందని చెప్పారు. పూర్తిగా చెడు ఆహారపు అలవాట్లను నివారించి హెల్దీ ఫుడ్కి ప్రాముఖ్యత ఇస్తే బరువు తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంటుందట. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !)

రొటీన్ వాకింగ్ కంటే అలా చేస్తే..బోలెడన్ని ప్రయోజనాలు.. !
వాకింగ్ అంటే అందరు కామన్గా చేసేదే. అయితే ఈ వాకింగ్ మాత్రం చాలా విభిన్నమైనది. సంప్రదాయ వాకింగ్ కంటే మంచి ఫలితాలను పొందగలగుతారట. దీన్ని జపనీస్ వాకింగ్ అనిపిలుస్తారు. మరి ఆ నడక వ్యాయామం విశేషాలేంటో చూద్దామా..!. జనీస్ వాకింగ్ వ్యాయామం అంటే..దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ (ఐడబ్ల్యూటీ) లేదా జపనీస్ వాకింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యామ్నాయ విరామాలను కలిగి ఉంటుంది. మూడు నిమిషాల వేగవంతమైన నడక, మరో మూడు నిమిషాలు స్లో వాకింగ్. ఇలా కనీసం ఐదు విరామాల సెట్తో కూడిని వాకింగ్ చేస్తారు. మంచిదేనా అంటే..ఇలా వేగవంతంగా, మళ్లీ చాలా నెమ్మదిగా చేసే వాకింగ్ విధానం గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. శారీరక ధృఢత్వాన్ని మెరుగుపరచడంలో, కండర బలాన్ని, గ్లైసెమిక్ నియంత్రణను అందిస్తుందట. వ్యాయామం చేయలేకపోతున్నా అని బాధపడేవారికి.. ఇది మరింత మేలు. అన్ని వయసుల వారికే కాదు వృద్ధులు సైతం హాయిగా ఈ విధానంలో వాకింగ్ చెయ్యొచ్చట. అంతేగాదు ఇది మంచిదేనా? కాదా అని జపనీస్ నిపుణులు సుమారు 63 సంవత్సరాల వయస్సు గల దాదాపు 200 మందిపై అధ్యయనాన్ని నిర్వహించగా మెరుగైన ఫలితాలను కనిపంచాయి. అందువల్ల ఇది సురక్షితమైనదని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే బాగా వేగంగా వాకింగ్ చేసేటప్పుడు గాయాలు అయ్యే ప్రమాదం లేకపోలేదనేది కొందరి పరిశోధకులు వాదన. కలిగే లాభాలు..రక్తపోటు తగ్గుతుందిరక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎలా చేయాలంటే..ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అనేది సరిగా సాధనం చేయడంపైనే మెరుగైన ఫలితాలు అనేవి ఉంటాయట. మొదట సాధారణ వేగంతో నడిచి..ఆ తర్వాత ఓ 20 నుంచి 30 సెకన్లు వేగంగా నడవాలట. మళ్లీ బ్రేక్ ఇచ్చి స్లోగా ఇలా ..కనీసం మూడు నుంచి ఐదు సెట్ల చొప్పున చేయాలట. ప్రారంభంలో 30 నిమిషాలు కేటాయించి.. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధానాన్ని పెంచుకోవాలట. అదీ కూడా మన బాడీ తత్వానికి అనుగుణం చేయాలట. ముఖ్యంగా సౌకర్యవంతమైన బూట్లను ధరించి చేయాలట. అంతేగాదు ఒకవేళ ఈ క్రమంలో తలనొప్పి, వికారం వంటివి వచ్చినట్లయితే వెంటనే ఆపేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చాలామటుకు దీన్ని పిట్నెస్ నిపుణుల సమక్షంలో ఈ విధానాన్ని ప్రయత్నించడం మంచిదని చెప్పారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..)

రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం

వ్యాపారవేత్తతో నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!
బాలీవుడ్ నటి, మోడల్ షాజాన్ పదమ్సీ (Shazahn Padamsee) తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాని (Ashish Kanakia) పెళ్లాడింది. గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ముంబైలోని కోర్ట్ యార్డ్ బి మారియట్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో షాజాన్ పదమ్సీ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. షాజాన్ - ఆశిష్ పెళ్లి ఫోటోలను షాజన్ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొత్త జీవితానికి శుభాకాంక్షలు అంటూ అభిమానులంతా ఈ కొత్త జంటకు విషెస్ అందిస్తున్నారు.37 ఏళ్ల షాజాన్ పదమ్సీ - ఆశిష్ కనకియా ఎప్పటినుంచో డేటింగ్లో ఉన్నారు. గత ఏడాది నవంబరులో నిశితార్థం చేసుకున్నారు. తాజాగా అత్యంత గోప్యంగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. షాజన్ స్నేహితులు పెళ్లి వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే ఇన్స్టాస్టోరీలో ఒక వీడియోను షాజన్ కూడా పోస్ట్ చేసింది. కనకియా గ్రూప్ యాజమాన్యంలోని ముంబైలోని కోర్ట్ యార్డ్ బై మారియట్లో రెండు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారట. రేపు (జూన్ 7న) గ్రాండ్గా పార్టీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.సొగసైన ఐవరీ లెహెంగా, ఆఫ్వైట్ షేర్వానీషాజాన్ పాస్టెల్ , బ్లష్ పింక్ కలర్ ఐవరీ లెహంగాలో పెళ్లికూతురి ముస్తాబైంది. దానికి మ్యాచింగ్ స్లీవ్లెస్ బ్లౌజ్తో జత చేసింది, తలపైనుంచి మ్యాచింగ్ దుపట్టాను అందంగా అలంకరించుకుంది. డైమండ్, నెక్లెస్, మాంగ్ టీకా, చెవిపోగులు, హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో తన బ్రైడల్ లుక్ను పూర్తి చేసింది. మరోవైపు, ఆశిష్ సాంప్రదాయ ఆఫ్-వైట్ టెక్స్చర్డ్ ఎంబ్రాయిడరీ షేర్వానీ ధరించాడు.హౌస్ఫుల్ 2', 'ఆరెంజ్', 'కనిమోలి', 'మసాలా', 'పాగల్పన్ నెక్స్ట్ లెవల్', 'డిస్కో వ్యాలీ' తదితర బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. 2010లో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆరెంజ్ సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజన్. షాజాన్ భర్త ఆశిష్ కనకియా గ్రూప్ డైరెక్టర్ , మూవీ మాక్స్ సినిమా సీఈఓ. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగిన వీరి పరిచయం ప్రేమ,పెళ్లికి దారి తీసాయి.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం
ఫొటోలు
అంతర్జాతీయం

పెద్దన్నల పోట్లాట
వాషింగ్టన్: ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధినేత. బెదిరించి పనులు చక్కబెట్టుకోవడంలో, అవసరం తీరిందనుకుంటే ఎంతటి వారినైనా సరే దూరం పెట్టడంలో, భావోద్వేగాలకు తావన్నదే లేకుండా స్వీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడంలో ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోరు. అలాంటి వాళ్లు పరస్పరం తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఎలాన్ మస్క్ , డొనాల్డ్ ట్రంప్ తాజా రగడ మాదిరిగానే ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మొదలైన వారి బ్రొమాన్స్ ట్రంప్ గద్దెనెక్కాక కూడా బ్రహా్మండంగా కొనసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా మస్క్ ను ఇంద్రుడు చంద్రుడంటూ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసేందుకు సృష్టించిన డోజ్ విభాగపు సారథ్యం అప్పగించారు. దాని ముసుగులో కీలకమైన ప్రభుత్వ డేటాను మస్క్ చేజిక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో, అధికారిక విమానం ఎయిర్ఫోర్స్వన్లో, కేబినెట్ సమావేశాల్లో... ఇలా ఎక్కడ చూసినా మస్కే. వైట్హౌస్ను చివరికి మస్క్కు అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్పై విపక్షాలు దుమ్మెత్తిపోసేదాకా వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్, మస్క్ సాన్నిహిత్యానికి మూడు రోజుల క్రితం అనూహ్యంగా, అర్ధాంతరంగా తెరపడింది. అంతే! ఒక్కసారిగా అంతా తల్లకిందులైంది. అసలే మొండితనంలోనూ, నోటి దురుసులోనూ ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోని బాపతు కావడంతో పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలతో ‘తగ్గేదే లే’అంటూ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. మస్క్ కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తానని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ , దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాలు విసిరారు. నాసాకు అతి కీలకమైన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపేస్తానంటూ బెదిరించారు. అంతేగాక, ‘‘అసలు నావల్లే ట్రంప్ అధ్యక్షునిగా గెలిచారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మైనర్లతో సెక్స్ కార్యకలాపాల ‘ఎప్స్టీన్ కుంభకోణం’లో ట్రంప్ పేరూ ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ ఉదంతంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోస్యం చెప్పారు. వారి వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్గా మారిపోయింది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా మొదలైంది... నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.ఏమిటీ ఎప్స్టీన్ కుంభకోణం? మైనర్ బాలికలతో పాటు మహిళలను లైంగికంగా వేధించినట్టు ఎప్స్టీన్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఎదుగుదల కోసం వారిని సన్నిహితులైన రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు ఎరగా వేశాడని అభియోగాలు నమోదయ్యాయి. జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, పలు దేశాల ప్రధానులు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు తదితరులున్నారు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. సంబంధిత ఫైళ్లను బయట పెడతానని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.మస్క్ కు ఎదురుదెబ్బలు విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్కు ‘బ్యూటిఫుల్’ బిల్లులో భారీ కోతలు ప్రతిపాదించారు. అందులోని పలు అంశాలు తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవి కావడం మస్క్ కు మంటెక్కించింది. అంతకుముందు అమెరికా వైమానిక వ్యవస్థ తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టం సేవలను వాడుకునేలా ఒప్పించేందుకు ప్రయతి్నంచినా కుదరలేదు. మస్క్ సన్నిహితున్ని నాసా చీఫ్ పదవికి పరిగణించొద్దని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్తో రగడ నేపథ్యంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.ట్రంప్ గద్దె దిగుతారు: మస్క్అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు సంబంధాలున్నట్టు మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్స్టీన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉంది. అందుకే వాటిని ఆయన బయట పెట్టడం లేదు’’అంటూ ఆరోపించారు. ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ను సమరి్థంచారు. వాన్స్ను అధ్యక్షున్ని చేయాలన్న పోస్ట్ను రీ పోస్ట్ చేస్తూ ‘అవు’నని కామెంట్ చేశారు. ‘‘ట్రంప్ అధ్యక్షునిగా ఉండేది మహా అయితే మూడున్నరేళ్లు. నేను మాత్రం కనీసం ఇంకో 40 ఏళ్ల దాకా ఉంటాను’’ అన్నారు. అమెరికన్లలో కనీసం 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ పెట్టారు. నాసాకు డ్రాగన్ సేవలు ఆపేయబోనంటూ కాస్త వెనక్కు తగ్గారు.మస్క్ తో మాట్లాడను: ట్రంప్ మస్క్ వంటి వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘బ్యూటిఫుల్ బిల్లు’లో టెస్లాకు మస్క్ ఆశించిన లబ్ధి కని్పంచకపోవడంతో తనపై నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు. కొంతకాలం ఆయనతో మాట్లాడబోను’’అని సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ‘‘పాపం మస్క్ . అతనికేదో సమస్య ఉన్నట్టుంది! బహుశా మతి చలించినట్టుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసేందుకు సులువైన మార్గం ఒకటుంది. మస్క్ సంస్థలకు అందుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలను తెగ్గోస్తే చాలు!’’అంటూ గురువారం ట్రూత్ సోషల్లో వరుస పోస్టులు పెట్టారు.

బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.2025లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్హసీనా దేశం విడిచిపెళ్లిపోయిన దరిమిలా ఆ దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ, రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాగా గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్ను కోరింది.ఇది కూడా చదవండి: ‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్

తరుముకొస్తున్న మరో మహమ్మారి?.. శాస్త్రవేత్తల హెచ్చరిక
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. దీని బారినపడి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ కోవిడ్-19 ప్రపంచ దేశాలను పూర్తిగా వీడనే లేదు. అయితే ఇంతలోనే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ముంచెత్తనున్న మరో ముప్పుపై హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, కాల్టెక్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా బృందాలు తమ పరిశోధనలో మెర్బెకోవైరస్లలోని ఉప వేరియంట్ అయిన హెచ్కేయూ5 వైరస్లపై దృష్టి సారించారు. ఇవి 2019లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్కు కారణమైన సార్స్-కోవ్తో సంబంధం కలిగినవి. ఇవి సుమారు 34 శాతం మరణాల రేటును కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.హెచ్కేయూ5 వైరస్లపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని, అయితే తమ పరిశోధన ప్రకారం అవి మానవులకు సోకే సామర్థ్యానికి కొంత దూరంలో ఉండవచ్చని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లెట్కో తెలిపారు. కోవిడ్-19 వెనుక ఉన్న వైరస్ అయిన సార్స్ కోవ్-2 మాదిరిగా ఈ బ్యాట్ వైరస్లు కణాలపై దాడి చేయడానికి స్పైక్ ప్రోటీన్లను ఉపయోగిస్తాయన్నారు. ప్రస్తుతానికి హెచ్కేయూ5 వైరస్లు గబ్బిలాలలో మాత్రమే ఏసీఈ2తో అనుసంధానమై ఉన్నాయని, అయితే అవి చిన్నపాటి జన్యు మార్పుతో మానవులలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు ఈ స్పైక్ ప్రోటీన్లు ఎలా అభివృద్ధి చెందుతాయనేది తెలుసుకునేందుకు అత్యాధునిక ఏఐ సాధనం ఆల్ఫాఫోల్డ్ 3ని ఉపయోగించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి అంకురార్పణ

‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఏ అంశంలోనూ తన తీరు మార్చుకోవడం లేదు. తన దుందుడుకు చర్యలతో ఉద్రిక్తతతలను రేకెత్తిస్తూనే ఉంది. నాటి సిమ్లా ఒప్పందం విషయంలోనూ ఒకసారి నోరు జారి, తిరిగి మాటమార్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 1972 సిమ్లా ఒప్పందాన్ని ‘చనిపోయిన పత్రం’ అని పేర్కొన్నారు. అయితే ఇది జరిగిన మర్నాడే ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ, తాము భారతదేశంతో ఉన్న ఏ ద్వైపాక్షిక ఒప్పందాలను, రద్దు చేసే దిశగా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.తాజాగా జరిగిన ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశం ఏకపక్ష చర్యలు చేపడుతున్నదని, ముఖ్యంగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు సిమ్లా ఒప్పందాన్ని వాడుకలో లేకుండా చేసిందని విమర్శించారు. సిమ్లా ఒప్పందం విఫలమయ్యిందని, భవిష్యత్తులో ఇరు దేశాల వివాదాలను అంతర్జాతీయ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే మరుసటి రోజే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఆసిఫ్ వాదనను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేయడానికి సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందంతో సహా ఇరుదేశాల మధ్య అన్ని ఒప్పందాలు అమలులోనే ఉన్నాయని పేర్కొన్నారు.నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ- పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య 1972, జూలై 2న సిమ్లా శాంతి ఒప్పందం కుదిరింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది జరిగింది. ఫలితంగా భారత్ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే బంగ్లాదేశ్ ఏర్పడింది. కాగా ద్వైపాక్షిక చర్చల ద్వారా లేదా శాంతియుత మార్గాల ద్వారా విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయనేది ఈ ఒప్పందంలోని ప్రధాన నిర్ణయం.ఇది కూడా చదవండి: ‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలకు చెక్
జాతీయం

మానవత్వంపై పాక్ దాడి
కాట్రా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్పై మరోసారి విరుచుకుపడ్డారు. పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవత్వంపై, కశ్మీర్ గుర్తింపుపై దాడి చేసిందని నిప్పులు చెరిగారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, కశ్మీర్ ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టి నోటిదగ్గర ముద్ద లాగేసుకోవడమే పాకిస్తాన్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్లో రియాసీ జిల్లాలోని కాట్రాలో పర్యటించారు. రూ.46,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 272 కిలోమీటర్ల ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వేలింక్(యూఎస్బీఆర్ఎస్) ప్రాజెక్టులో భాగమైన చినాబ్ రైల్వే బ్రిడ్జితోపాటు అంజి వంతెన ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్రివర్ణ పతాకం చేతబూని చినాబ్ బ్రిడ్జిపై కాసేపు నడిచారు. అనంతరం వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు. చినాబ్, అంజి వంతెనలపై వందేభారత్ రైలులో ప్రయాణించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కాట్రాలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మన పొరుగు దేశం మానవత్వం, సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధికి ముమ్మాటికీ వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు పిడికెడు అన్నం తినడం కూడా ఆ దేశానికి ఇష్టం లేదని విమర్శించారు. పర్యాటక రంగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుందని తెలిపారు. పర్యాటక రంగాన్ని నాశనం చేసి, కశ్మీర్ ప్రజల పొట్టకొట్టాలని చూసిందని పాకిస్తాన్పై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. జమ్మూకశ్మీర్లో శాంతి సౌభాగ్యాలు ‘‘రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. జమ్మూకశ్మీర్ ప్రగతిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ పదేపదే కుట్రలు సాగిస్తోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తుండడం పొరుగు దేశానికి కంటగింపుగా మారింది. అందుకే పహల్గాంలో దాడులకు పాల్పడింది. ఇక్కడ పర్యాటక రంగం కుప్పకూలితే స్థానికులు ఉపాధి కోల్పోతారు. పర్యాటకంపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడతాయి. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అదిల్ హుస్సేన్ షా ధైర్యంగా ఎదుర్కొంనేందుకు ప్రయత్నించాడు. గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్తూ వచి్చన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొనే ఆ యువకుడు ముష్కరుల దాడిలో బలైపోవడం నన్ను కలచివేసింది. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బుద్ధి చెప్పాం. ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్కు సిగ్గుచేటైన పరాజయమే గుర్తుకొస్తుంది. బడి పిల్లలపై బాంబు దాడులా? పహల్గాంలో ఉగ్రవాద దాడి జరగ్గానే వేగంగా స్పందించాం. మనం తీసుకున్న చర్యలను పాకిస్తాన్ సైన్యం గానీ, ఉగ్రవాద ముఠాలు గానీ ఊహించలేకపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిమిషాల వ్యవధిలోనే శిథిలాలుగా మార్చేశాం. దశాబ్దాలపాటు నిర్మించుకున్న స్థావరాలను నేలమట్టం చేశాం. మన సైనిక శక్తిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం ఆక్రోశంతో పూంచ్తో పాటు సరిహద్దు జిల్లాల్లో దాడులకు దిగింది. స్కూల్కు వెళ్లే పిల్లలపై బాంబులు విసిరింది. స్కూళ్లు, ఆసుపత్రులు, ఆలయాలు, మసీదులు, గురుద్వారాలపై దాడులకు పాల్పడింది. మన దేశంలో ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారు. పాకిస్తాన్ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యోగాలు కలి్పస్తాం. ఆర్థిక సాయం అందిస్తాం. బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లిస్తాం. యువత కలలు సాకారం జమ్మూకశ్మీర్లో ప్రజలు గతంలో ఉగ్రవాదానికి అలవాటు పడిపోయారు. ఎంతో మంది తమ కలలు వదిలేసుకోవాల్సి వచ్చింది. హింసాకాండను అంతా తమ తలరాత అనుకున్నారు. కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్ యువత మళ్లీ కలలు కంటున్నారు, వాటిని సాకారం చేసుకుంటున్నారు. జనంతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు, సందడితో వెలిగిపోతున్న షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను ప్రత్యక్షంగా చూస్తూ సంబర పడుతున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు 500 నుంచి 1,300కు చేరాయి. పహల్గాం లాంటి దాడులతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్మూకశ్మీర్ యువత కలలను ఛిద్రం చేయాలనుకుంటే అంతకంటే ముందు మోదీని ఎదుర్కోవాలన్న సంగతిని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాదానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని జమ్మూకశ్మీర్ యువత నిర్ణయించుకున్నారు. ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు నూతన, సాధికార జమ్మూకశ్మీర్కు ప్రతీక. భారత నవశక్తికి ఉదాహరణ. చినాబ్, అంజి వంతెనలు జమ్మూకశ్మీర్ సౌభాగ్యానికి గవాక్షాలుగా నిలుస్తాయి. ఇక్కడి మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాళ్లు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి అని తరచుగా అంటుంటాం. రైల్వే ప్రాజెక్టుతో అది వాస్తవ రూపం దాలి్చంది’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతం.. చినాబ్ వంతెన → జమ్మూకశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లలో ఈ వంతెన నిర్మించారు. → ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా అని చెప్పొచ్చు. చినాబ్ నదీ గర్భం నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు అధికం.→ చినాబ్ బ్రిడ్జి పొడవు 1.32 కిలోమీటర్లు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, బాంబు పేలుళ్లు, భీకర గాలులను తట్టుకోగలదు. 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి 2002లో అనుమతి లభించింది. 2017లో పనులు మొదలయ్యాయి. → ఈ వంతెన నిర్మాణం కంటే ముందే 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు, 400 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు. → చినాబ్ బ్రిడ్జితో జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. దీని జీవిత కాలం 120 ఏళ్లు. తీగల వంతెన అంజి బ్రిడ్జి → అంజి వంతెనకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. చినాబ్ బ్రిడ్జి తర్వాత ఇది రెండో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి. ఇండియాలో అత్యంత ఎత్తయిన కేబుల్ రైల్వే బ్రిడ్జి ఇదే. నదీ గర్భం నుంచి దీని ఎత్తు 196 మీటర్లు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైంది. → చినాబ్కు ఉప నది అయిన అంజి నదిపై నిర్మించారు. ఇది తీగలతో అనుసంధానమైన వంతెన. నిర్మాణానికి పూర్తిగా ఉక్కు ఉపయోగించారు. → దీని మొత్తం పొడవు 725 మీటర్లు. ప్రధాన వంతెన పొడవు 473 మీటర్లు. 82 మీటర్ల నుంచి 295 మీటర్ల పొడవైన 96 ఉక్కు తీగలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆయనకు ప్రమోషన్, నాకు డిమోషన్ జమ్మూకశ్మీర్కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీని కోరారు. కాట్రా సభలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. గతంలో పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూకశ్మీర్కు వచ్చారు. కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభించారు. అప్పట్లో నేను జమ్మూకశ్మీర్కు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా. మోదీ ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో మనోజ్ సిన్హా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎదిగారు. మనోజ్ సిన్హాకు ప్రమోషన్, నాకు డిమోషన్ లభించాయి. నాకు త్వరలో పదోన్నతి కలి్పస్తారని ఆశిస్తున్నా’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలకు చెక్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి, ఈ సదస్సుకు ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్లో జరిగే జీ7 సమ్మిట్కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ 15-17 తేదీలలో ఆల్బెర్టాలోని కననాస్కిస్ రిసార్ట్లో నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్నాథ్కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్

పనికి ముంబై వెళ్లిన భర్త.. మరిదిని పెళ్లాడిన భార్య
లక్నో: భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం.. అవి విపరీత పరిణామాలకు దారి తీయడం మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు దంపతులు విచిత్ర నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటివి చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ పరిధిలోని హరిహర్పూర్ నగర పంచాయతీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది ఇప్పుడు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై, వైరల్గా మారింది.వివరాల్లోకి వెళితే యూపీలోని గోరఖ్పూర్లోగల సహజన్వాకు చెందిన ఖష్బూకు ఆరు నెలల క్రితం హరిహర్పూర్కు చెందిన కల్లూతో వివాహం జరిగింది. నెల్లాళ్ల తరువాత కల్లూ పని కోసం ముంబైకి వెళ్లాడు. అప్పటి నుంచి ఖుష్బూ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ నేపధ్యంలో ఆమెకు మరిది అమిత్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇది ఇరు కుటుంబాలకు తెలిసింది. అలాగే చుట్టుపక్కల వారి నోళ్లలోనూ నానింది. దీంతో ఖుష్బూ, అమిత్లు ఇంటి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు వారికోసం తమకు తెలిసిన అన్ని ప్రాంతాల్లోనూ వెదికి, చివరికి వారిని పట్టుకున్నారు. అయితే వారు తాము భార్యాభర్తలుగా ఎప్పటికీ కలిసివుంటామని అందరిముందు తేల్చిచెప్పారు.విషయం హరిహర్పూర్ నగర పంచాయతీ చైర్మన్ రవీంద్ర ప్రతాప్ షాహి వరకూ చేరింది. ఆయన ఖుష్బూ, అమిత్లతో ఈ సంబంధం సరైనది కాదంటూ, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు తాము విడిగా ఉండలేమని పెద్దలందరి ముందూ స్పష్టం చేశారు. దీంతో ఇరు కుటుంబాల్లోని వారు ఖుష్బూ, అమిత్లకు వివాహం చేయాలని నిశ్చయించారు. పంచాయతీ కార్యాలయంలో ఖుష్బూ, అమిత్ల వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే వీరి వివాహానికి ఖుష్భూ భర్త కల్లూ హాజరు కాలేదు. తనకు ఇకపై ఖుష్బూతో ఎటుంటి సంబంధం లేదని కల్లూ తేల్చిచెప్పాడు.ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్నాథ్కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్

తరతరాలు మెచ్చేలా.. రాజ్నాథ్కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్
మలిహాబాద్: ‘రాజ్నాథ్ మామిడి’... రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరుతో కొత్త మామిడి రకం ఉత్పత్తి అయ్యింది. ఉద్యానవనాలు, పండ్ల తోటల పెంపకంలో ప్రత్యేక కృషి చేసి, అందుకు ప్రతిగా ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న కలిముల్లా ఖాన్ ఇప్పుడు మరో మామిడి రకాన్ని ఉత్పత్తి చేశారు. దానికి రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మామిడి అని పేరు పెట్టారు‘మ్యాంగో మ్యాన్’గా పేరొందిన కలిముల్లా ఖాన్, తాజాగా తన తన మలిహాబాద్(ఉత్తరప్రదేశ్) తోటలో సిగ్నేచర్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ని ఉపయోగించి, పండించిన కొత్త రకపు మామిడికి ‘రాజ్నాథ్ ఆమ్’ అని పేరు పెట్టారు. గతంలో ఈయన తాను ఉత్పత్తి చేసిన మామిడి రకాలను సచిన్ టెండుల్కర్, ఐశ్వర్య రాయ్, అఖిలేష్ యాదవ్, సోనియా గాంధీ, నరేంద్ర మోదీ, అమిత్ షా తదితర ప్రముఖ భారతీయుల పేర్లు పెట్టారు. ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘దేశానికి అర్థవంతమైన సేవ చేసినవారి పేర్లను తాను తన మామిడి రకాలుకు పెట్టుకుంటానని, ఈ రకాలు తరతరాలుగా నిలిచి ఉండాలని కోరుకుంటానని అన్నారు.ప్రజలు కొంతకాలానికి ప్రముఖులను మరిచిపోతుంటారు. అయితే తాను ఉత్పత్తి చేసిన ఈ మామిడి రకాలు ప్రముఖులను గుర్తుచేస్తాయని ఖాన్ అన్నారు. పాకిస్తాన్తో ఇటీవల జరిగిన పోరులో రక్షణమంత్రి రాజ్నాథ్ యుద్ధం కాకుండా, శాంతిని కోరుకున్నారని కలిముల్లా ఖాన్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ దురాక్రమణకు నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన లక్నోలోని మలిహాబాద్ గురించి ఆయన మాట్లాడుతూ 1919లో ఈ ప్రాంతంలో 1,300 మామిడి రకాలు ఉండేవని, అయితే కాలక్రమేణా అవి మార్కెట్ నుండి అదృశ్యమయ్యాయన్నారు. అయితే తాను మామిడి రకాలను పునరుద్ధరించడానికి కృషి చేశానని ఇప్పుటి వరకూ 300కుపైగా మామిడి రకాలను అభివృద్ధి చేశానని అన్నారు. తన జీవిత లక్ష్యం గురించి ఖాన్ మాట్లాడుతూ తాను ఈ భూమి మీద నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా జనం తాను రూపొందించిన మామిడి రకాలను రుచి చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: కురచ దుస్తులతో వస్తే సెల్ఫీలివ్వను: బీజేపీ మంత్రి
ఎన్ఆర్ఐ

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం
సొమ్ము భద్రం, భవితం స్వర్ణం అనుకుంటూ సాధారణ ప్రజలనుంచి గొప్ప గొప్పోళ్ల దాకా బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటారు. కాయకష్టం చేసి, కడుపు మాడ్చుకుని మరీ పొదుపు చేసిన సొమ్మను ఎంతో విశ్వాసంతో ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచుఫల్ ఫండ్స్ రూపంలో దాచుకుంటారు. తమ డబ్బు సురక్షితంగా ఉందని భావిస్తారు. బ్యాంకుల అభివృద్ధి, పెట్టుబడికి గట్టి సపోర్ట్ ఇస్తారు. కానీ బ్యాంకు వినియోగదారుల సొమ్మును అక్రమంగా వాడుకుంటూ కొంతమంది అధికారులు, ఉద్యోగులు, బ్యాంకు వ్యవస్థకే చెడ్డపేరు తీసు కొస్తున్నారు. అంతేకాదు యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. తాజా ఒక అధికారి నిర్వాకం గురించి తెలుసుకుంటే... షాక్ అవ్వక తప్పదు. నెట్టింట చర్చకు దారి తీసిన ఈ వివరాలను తెలుసుకుందాం రండి! ఎన్డీటీ కథనం ప్రకారం రాజస్తాన్లోని కోటలోని ఒక బ్యాంకుకు చెందిన ఒక మహిళా అధికారి రూ. 4 కోట్లకు పైగా కస్టమర్లను మోసం చేసింది. ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకులో రిలేషన్షి మేనేజర్గా పనిచేస్తున్న సాక్షి గుప్తా బ్యాంకు యూజర్ల FDల నుండి కోట్ల రూపాయలను తస్కరించింది. వీటిని స్టాక్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇలా రూ. 4.58 కోట్లు అక్రమాలకు పాల్పడింది. అంతేకాదు లావాదేవీల సందేశాల గురించి వారికి తెలియ కుండా ఉండటానికి , ఖాతాలతో లింక్ చేయబడిన కస్టమర్ల మొబైల్ నంబర్లను కూడా మార్చేసింది.కస్టమర్లను ముంచేసి..తానూ ..'యూజర్ FD (ఫిక్స్డ్ డిపాజిట్)' లింక్ను దుర్వినియోగం చేసి, 2020 - 2023 సంవత్సరాల మధ్య 41 మంది కస్టమర్ల 110 ఖాతాల నుండి రూ. 4.58 కోట్లు కొట్టేసింది. స్టాక్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ సొమ్ము ఆర్జించాలనే లక్ష్యంతో ఈ చర్యకు పూనుకుంది. రెండేళ్ల పాటు తన అక్రమాలు ఎవరి కంట కనపడకుండా కొనసాగించింది. దీంతో బ్యాంకు అధికారులెవరూ దీన్ని గమనించలేదు. అటు స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు రావడంతో డబ్బును తిరిగి ఖాతాల్లో జమ చేలేకపోయింది. అలా అత్యాశకుపోయి, కస్టమర్లను ముంచేసి, తాను కూడా మునిగిపోయింది. ఒక కస్టమర్ తన FD గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న బ్యాంక్ పోలీసులపై కేసు నమోదైంది. రంగంలోకి పోలీసులు గత రాత్రి ఆమె సోదరి వివాహంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇదీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఈ ఖాతాలకు లింక్ చేసి రూ. 4 కోట్లకు పైగా విత్డ్రా చేసిందనీ, ఖాతాదారులకు తన పన్నాగం గురించి తెలియకుండా ఉండటానికి ఆమె తన సిస్టమ్లో OTP లను పొందడానికి ఉపయోగించే వ్యవస్థను కూడా రూపొందించిందని దర్యాప్తు అధికారి ఇబ్రహీం ఖాన్ అన్నారు. అయితే దీనిపై బ్యాంకు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ప్రభావితమైన కస్టమర్లకు నష్టాన్ని భర్తీ చేస్తామని బ్యాంకు వర్గాలు తెలిపాయి.బ్యాంకులో మోసం గురించి తెలుసుకున్న తర్వాత, తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి కస్లమర్లు బ్యాంకుకు రావడం మొదలైంది."మన డబ్బు ఎక్కడ ఉంచాలి? ఇంట్లో ఉంచుకోలేం, ఇప్పుడిక బ్యాంకులో ఉంచుకోలేం ఏమి చేయాలి?" అంటూ బ్యాంకు కస్టమర్ మహావీర్ ప్రసాద్ వాపోయారు. చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!

వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు.