ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మురం చేశారు. అందులోభాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని దొనబండ చెక్పోస్టు వద్ద గురువారం ఉదయం వాహనాలను సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో ఓ కారులో దాదాపు 100 కేజీలకు పైగా బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని,సీజ్ చేశారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బంగారంపై ప్రశ్నిస్తున్నారు. అయితే బంగారం పట్టుకున్న విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.