చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని ఓ షాప్ లో దొంగతనం జరిగింది.
చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని ఓ షాప్ లో దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే మహాలక్ష్మీ పాన్బ్రోకర్(వడ్డీవ్యాపారి) షాపులో మంగళవారం రాత్రి 2 కేజీల బంగారాన్నిఎత్తుకెళ్లారు. దుకాణానికి వెనక వైపు రంధ్రం చేసి లోపలకి వెళ్లిన దుండగుల 2 కేజీల బంగారాన్ని అపహరించారు. దుకాణ యజమాని రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్టీం ఆధారాలను సేకరిస్తోంది.