గాల్లో దీపాల్లా పిల్లల ప్రాణాలు | 32 students injured in school bus mishap | Sakshi
Sakshi News home page

గాల్లో దీపాల్లా పిల్లల ప్రాణాలు

Published Mon, Aug 25 2014 9:03 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

32 students injured in school bus mishap

విశాఖపట్నం: ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యానికి పిల్లల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. వరుస ప్రమాదాలతో విద్యార్థులు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నా యజమాన్యాలకు చీమకుట్టినట్టు కూడా ఉండడం లేదు. రాష్టంలో రోజూ జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురై 32 మంది చిన్నారులు గాయపడ్డారు. గొలుగొండ మండలం రావణాపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిషి వ్యాలీ స్కూల్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన చిన్నారులంతా 3 నుంచి12 ఏళ్లలోపు వారు. క్షతగాత్రులను గాయపడినవారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement