10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మెల్యే గోపిరెడ్డి | 6 killed in quarry blast: ysrcp mla gopireddy srinivas reddy demands Rs 10 lakh as ex gratia for victims' kin | Sakshi
Sakshi News home page

‘రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి’

May 27 2017 3:34 PM | Updated on Jul 11 2019 8:34 PM

మైనింగ్‌ బ్లాస్ట్‌ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

గుంటూరు : ఫిరంగిపురం కొండల్లో మైనింగ్‌ బ్లాస్ట్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం క్వారీలో శనివారం మధ్యాహ్నం  అక్రమ బ్లాస్టింగ్‌ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు దుర్గాంజనేయులు, చిన్న బాలశౌరి, నాగేశ్వరరావు, రాయప్ప, శరవణలుగా గుర్తించారు.

నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి... మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి,క్రిస్టినా తదితరులు సందర్శించి, ఘటనపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement