అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సరిహద్దులోని కొడికొండ వాణిజ్యపన్నుల చెక్పోస్టులో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
చిలమత్తూరు: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం సరిహద్దులోని కొడికొండ వాణిజ్యపన్నుల చెక్పోస్టులో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా లెక్క చూపని రూ11.150 లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.