'కలవరపడుతున్న చంద్రబాబు' | C Ramachandraiah takes on chandrababu naidu govt | Sakshi
Sakshi News home page

'కలవరపడుతున్న చంద్రబాబు'

Published Wed, Feb 4 2015 3:23 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'కలవరపడుతున్న చంద్రబాబు' - Sakshi

'కలవరపడుతున్న చంద్రబాబు'

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే బీజేపీకి ఆగ్రహం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు కలవరపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య బుధవారం హైదరాబాద్లో ఆరోపించారు. అందుకోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీ సర్కార్పై బాబు ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. అలాగే కేంద్రంలోని బీజేపీ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు ఉందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారన్నారు.

రాష్ట్రంలోని తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు  రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలనేది ప్రధాని మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అజెండా అని సి.రామచంద్రయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement