c. ramachandraiah
-
ఇది మాత్రమే అభివృద్ధి కాదు!
76 ఏళ్ల స్వతంత్ర భారతదేశం సాధించిన ఘనతల పరంపరలో తాజాగా ‘చంద్రయాన్–3’ వచ్చి చేరడం కేంద్రంలోని పాలక పార్టీ బీజేపీకి కలిసొచ్చే అంశమే. ఇస్రో శాస్త్రవేత్తలు సల్పిన నిర్వరామ కృషి ఎన్డీఏ ప్రభుత్వ విజయంగా మారింది. కొన్ని దశాబ్దాల క్రితం రాకెట్లను ఎడ్ల బండ్లపై తీసుకెళ్లిన ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా... తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు వారు నిస్వార్థంగా కృషి చేస్తూనే ఉన్నారు. చంద్రయాన్–3 విజయం భారత్ ప్రతిష్ఠను అమాంతం ఆకాశం అంత ఎత్తుకు పెంచేసింది. చంద్రయాన్–3 తర్వాత సూర్యయాన్ వైపు ఇస్రో శాస్త్రవేత్తలు తమ కృషిని సాగించడమూ భారతీయులందరికీ గర్వకారణమే. అయితే, దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ఈ ఘనత, అభివృద్ధి అన్ని రంగాలలో ప్రతిఫలిస్తు న్నాయా? అనివార్యంగా వేసుకోవలసిన ప్రశ్న ఇది. అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు కొలమానంగా మానవాభివృద్ధి సూచిక, శిశు మర ణాల రేటు, పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ అంశాల ఆధారంగా భారత్తోపాటు ఇంచుమించుగా అదే సమయంలో స్వాతంత్య్రం పొందిన దేశాలు, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిని బేరీజు వేసుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు వెల్లడించిన అభివృద్ధి నివేదికలలో పలు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలు; జీ7 కంట్రీస్గా పిలవబడే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డవ్ు, యునైటెడ్ స్టేట్స్లు; ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలైన అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, హంగరీ, ఇండోనేషియా, ఇరాన్, మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలెండ్, సౌదీ అరేబియా, థాయ్లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోపాటు భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సాధించిన ర్యాంకింగ్ల ఆధారంగా అక్కడి స్థితిగతులు అర్థమవు తాయి. పైన పేర్కొన్న దేశాల జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని పరిశీలిస్తే, 1960 నుంచి 2022 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో భారత్ది అడుగు నుంచి మూడవ స్థానం. కేవలం పాకిస్తాన్, నేపాల్ మాత్రమే భారత్ కంటే దిగువన ఉన్నాయి. 1950 నుంచి 2021 మధ్య కాలంలో 31 దేశాల మానాభివృద్ధి సూచికలను పరిశీలించినప్పుడు భారత్ 1950లో 26వ స్థానంలో ఉండగా, 2021 నాటికి 29వ స్థానానికి పడిపోయింది. 32 దేశాల్లో శిశు మరణాలకు సంబంధించి 1960–1975 మధ్య కాలంలో, ఆ తర్వాత 2021 వరకు నమోదైన గణాంకాలను పరి శీలిస్తే... 1960–1975 మధ్య అత్యధిక శిశు మరణాలు నమోదైన దేశాలలో భారత్ 7వ స్థానంలో ఉంది. ఆ తర్వాత 2021 నాటికి ఆ స్థానం మరింత దిగజారి కింది నుంచి 3వ స్థానానికి చేరుకొంది. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం అంశంలో 31 దేశాలలో 1997 నుంచి 2022 మధ్యకాలంలో భారత్ది 21వ స్థానం. 1997–98లో భారత్ పార్లమెంట్లో మహి ళల ప్రాతినిధ్యం 7 శాతం ఉండగా, 2022 నాటికి అది 14.9 శాతంకు పెరిగింది. 140 దేశాల కంటే భారత్ పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఎక్కడైతే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందో, ఆ దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నా యని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక.. విద్యుత్, ఇంటర్నెట్ సేవల రంగాలలో మాత్రం భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. 1993–2000 మధ్య కాలంలో దేశంలో 50 శాతం జనాభాకు మాత్రమే విద్యుత్ సౌకర్యం అందు బాటులో ఉండగా, ప్రçస్తుతం దేశంలో 99 శాతం మందికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక, ఇంటర్నెట్ సేవల రంగాన్ని పరిశీ లిస్తే, 2020 నాటికి భారత్లో 43 శాతం జనాభాకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత్ పౌరహక్కులు, లింగ సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలలో ఎంతో వెనుకబడింది. మానవా భివృద్ధి సూచికల్లో ప్రధానమైన అంశంగా పౌరహక్కులను పరిగణిస్తారు. పౌరహక్కులలో భారత్ స్థానం 92గా ఉంది. అంటే, భారత్ కంటే 91 దేశాలు మెరుగైన పరిస్థి తుల్లో ఉన్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పలు రాజ్యాంగ వ్యవస్థలు దోహదం చేస్తాయి. అయితే, గత కొంతకాలంగా దేశంలోని పలు రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరిచే ప్రయత్నాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అతి ముఖ్యమైన అంశం. ఆ బాధ్యతను నిర్వహించే స్వతంత్ర సంస్థ ‘భారత ఎన్నికల కమిషన్’నే పూర్తిగా తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నాలను కేంద్రంలో అధికా రంలో ఉన్నవారు చేయడం ఆశ్చర్యకరం. భారత ఎన్నికల కమిషన్ తరఫున చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు బాధ్యతలు నిర్వహిస్తారు. వారి నియామ కాలను చేపట్టే విధానాన్ని సమూలంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి బదులుగా ఒక కేంద్ర మంత్రి నియమితులవుతారు. ఆ కేంద్రమంత్రిని ప్రధాన మంత్రే సభ్యుడిగా నియమిస్తారు. ఈ చట్టం అమలులోకి వస్తే ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు పూర్తిగా మారి పోతాయి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం అన్నది ఇకపై ఉండకపోవచ్చు. ఇది దేశ ప్రజా స్వామ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే చట్టం. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఐటీని, సేవల రంగంలోని అభివృద్ధినీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అందుబాటులోకి వచ్చిన అభివృద్ధినీ చూపి ఇదే దేశాభివృద్ధిగా చాటుకుంటే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. అభివృద్ధికి నిర్వచనం మార్చేసి మేడిపండు లాంటి అభివృద్ధి చూపి అదే అభివృద్ధి అని ప్రచారం చేస్తే ఎలా? ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నమని వేరే చెప్ప వలసిన అవసరం లేదు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
బడ్జెట్లో సంక్షేమ మార్గం పడతారా? భారత్కు ఈ ఘనత ఎలా సాధ్యపడింది?
కేంద్రం ప్రతియేటా ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ కారణంగా ప్రభావితం అయ్యే వర్గాల ప్రజలలో బడ్జెట్ ముందు సహజంగానే కొంత ఉత్కంఠ నెలకొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్లో పెద్ద ఎత్తున సంక్షేమ పథ కాలు ఉండొచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత 8 ఏళ్లుగా వల్లె వేస్తున్నారు. అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం తమ లక్ష్యం అని చెప్పుకొంటూ వస్తున్నారు. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ గ్యాస్ సిలిండర్ల సరఫరా, నగదు బదిలీ పథకాలు, రైతాంగానికి పెట్టుబడి సాయం (పీఎం కిసాన్), వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్ భారత్, పేదలకు ఉచిత రేషన్ తదితర పథకాలన్నీ తమ సంక్షేమ విధానానికి చిహ్నంగా బీజేపీ అభివర్ణించుకొంటున్నది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని అంది స్తున్నప్పుడు ‘సబ్ కా వికాస్’ ఆచరణలోకి రావాలి కదా! దేశ జనాభాలో 1 శాతం మంది ధనికుల చేతుల్లో 40 శాతం దేశ సంపద చిక్కుకుని ఉందనీ; 50 శాతం జనాభా అంటే... 65 నుంచి 70 కోట్ల మంది ప్రజల చేతుల్లో కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉన్నదనీ తాజా గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క ఈ 8 ఏళ్లల్లో బ్యాంకుల 14.38 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేశారు. అయినప్పటికీ ఇంకా బ్యాంకుల నిరర్థక ఆస్తుల గ్రాస్ రేటు 6.5 శాతంగా ఉంది. పెట్రో ధరల పెరుగుదల చరిత్రలో లేనంతగా ఈ 8 ఏళ్లల్లో పెరిగింది. డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం, గ్యాస్ సిలిండర్లపై 185 శాతం భారం మోపారు. అన్ని వస్తువులపై గరిష్ఠంగా వేస్తున్న జీఎస్టీ, గృహనిర్మాణ వస్తువుల ధరల పెరుగుదల... తదితర భారాలతో పోల్చితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ఎందుకూ కొరగాకుండా ఉంది. ఉద్యోగాల సృష్టి చేయలేని ఆర్థికాభివృద్ధి వల్ల ఎటువంటి లాభం లేదని గత కొన్నేళ్ల అనుభవాలు తెలియ జేస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగాలు లేకుండా ఉన్న యువత సంఖ్య 21.8 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తు న్నాయి. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలకు రైలు రవాణా విస్తరించాల్సి ఉండగా, దేశంలోని ఎగువ మధ్యతరగతి వారి కోసం ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టారు. రైల్వే ట్రాక్ల సామర్థ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో పటిష్ఠపర్చకుండా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ రైళ్లను ఒక్కొక్కటి రూ. 120 కోట్ల వ్యయంతో దశల వారీగా మొత్తం 475 ప్రారంభించాలని సంకల్పించడం ఆశ్చర్యం కలిగించకమానదు. 2014లో అధికారంలోనికి వచ్చిన బీజేపీ ఈ 8 ఏళ్లలో సంక్షేమబాట నుంచి క్రమంగా వైదొలుగుతూ వస్తోంది. 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొన్న రెండు ప్రధాన నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని అతలా కుతలం చేశాయి. మొదటిది పెద్లనోట్ల రద్దు; రెండోది జీఎస్టీ అమలు. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చి వేస్తామని చెప్పి కార్యాచరణ చేపట్టకపోవడంతో రైతులు రెట్టింపు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. దానివల్ల ఆహార ధాన్యాల నిల్వలు పడిపోతు న్నాయి. గోదాముల్లో ఇప్పుడు కేవలం 4.92 కోట్ల మెట్రిక్ టన్నుల గోధుమలు, బియ్యం మాత్రమే నిల్వ ఉన్నట్లు భారత ఆహార సంస్థ తెలియజేసింది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యరంగంపై కొంతమేర అనివార్యంగా వ్యయాన్ని పెంచింది. టీకాల కొనుగోలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పెంపుదల వంటి మౌలిక సదుపాయాలపై గణనీయంగా ఖర్చు చేసింది. అయినప్పటికీ, ఆ మొత్తం.. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 2 శాతానికి మించలేదు. ఇక, విద్యారంగాన్ని పరిశీలిస్తే, 2012–13లో యూపీఏ ప్రభుత్వం జీడీపీలో 3.36 శాతం నిధుల్ని కేటాయించగా, ఎన్డీఏ వచ్చిన ఈ 8 ఏళ్లల్లో విద్యారంగంపై చేస్తున్న వ్యయంలో నామమాత్రపు పెరుగుదల మాత్రమే ఉంది. నూతన విద్యా విధానాన్ని ఘనంగా ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచలేదు. మధ్యాహ్న భోజన పథకానికి (ప్రధాన మంత్రి పోషణ్) వెచ్చిస్తున్న నిధుల్లో గత 7 ఏళ్లుగా ఎలాంటి పెరుగుదలా లేదు. కీలకమైన విద్యారంగంలో కేటాయింపులు పెంచకుండా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లగలరు? ఎంతో కీలకమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) రంగంలో ఇతర దేశాలు 3 శాతం మేర కేటాయింపులు చేస్తుంటే భారత్ కేటాయింపులు గత దశాబ్ద కాలంగా 1 శాతం మించడం లేదు. 2008, 2009 సంవత్సరాలలో భారత్ అత్యధిక స్థాయిలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల్ని, 2.5 శాతం జీడీపీ మేర ఆకర్షించింది. కానీ, ఆ మొత్తం క్రమంగా తగ్గిపోతూ 2021 నాటికి 1.4 శాతానికి చేరింది. నిరుద్యోగిత పెరుగుదల వల్ల ప్రజల పొదుపు గణనీయంగా పడిపోయింది. క్యాపిటల్ ఫార్మేషన్లో కీలకమైన పొదుపు మొత్తాలు సన్నగిల్లడంతో... కేంద్ర ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు వివిధ మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకొంటోంది. ఈ 8 ఏళ్లల్లో కేంద్రం కొత్తగా చేసిన అప్పులు రూ. 91 లక్షల కోట్లు దాటాయి. అయితే, బ్రిటన్ను పక్కకు తోసి భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇదెలా సాధ్యపడింది? ఇందులో కేంద్ర ప్రభుత్వం చొరవను సమీక్షించినట్లయితే, గత 20 సంవత్సరాలలో, ఇతర దేశాలకంటే భారత్ ఐటీ రంగంలో వడివడిగా ముందుకుసాగింది. ఐటీ ఆధారిత సేవలు, ఉత్పత్తుల రంగంలో భారత్ అగ్రగామిగా ఉంది. ఈ రంగం అభివృద్ధికి కేంద్రం చేసింది నామ మాత్రమే. సేవల రంగంలో కూడా మిగతా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. (క్లిక్ చేయండి: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి) క్లుప్తంగా చెప్పాలంటే, దేశ ఆర్థికాభివృద్ధికి ఐటీ, సేవల రంగాలు మాత్రమే గణనీయంగా దోహదం చేస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు ఎక్కువగా ఐటీ, సేవల రంగాల్లోనే వస్తున్నాయి. ఇతర కీలక రంగాలలో ఎఫ్డీఐలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉత్పత్తిరంగంలో వృద్ధి ఆశాజనకంగా లేదు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం పట్ల ఇంతకు ముందు మాదిరిగానే చిన్నచూపు చూస్తున్నారు. ‘మేకిన్ ఇండియా’ ఎందుకు చతికిల పడిందో ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో 15 కోట్ల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఇ) ఊతం కల్పించాలి. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ వ్యయం ఇంకా పెరగాలి. ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించి దేశీయ రైతాంగాన్ని మరింత ప్రోత్సహించాలి. నూతన వార్షిక బడ్జెట్లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా? - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్. -
‘గడప గడపకు ప్రభుత్వం’ ఫలితాలు షురూ
‘గడప గడపకు ప్రభుత్వం’ అన్నది ఓ విశిష్ట కార్యక్రమం. దీనిని నిరంత రాయంగా అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం ఆహ్వానించదగినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు అందుతాయి. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పని తీరుతోపాటు పార్టీ నేతల భాగ స్వామ్యం, అప్పగించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో వారు చూపుతున్న శ్రద్ధ తదితర అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షించడమేకాక, తన అభి ప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. పనితీరు సరిగాలేని పార్టీ నేతల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. పనితీరు మార్చుకోకుంటే తప్పిస్తానని నిష్కర్షగా చెబు తున్నారు. ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సరి కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలలో 97 శాతం మేర నెరవేరు స్తున్నందున ప్రజలలో సంతృప్తి స్థాయిలు ఎక్కువగా ఉంటా యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనా. అయితే, ప్రజల సంతృప్తి అన్నది మొత్తంగా ప్రభుత్వంపైనా, తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధి పనితీరు పైనా, అధికార యంత్రాంగం స్పందనపైనా ఆధారపడి ఉంటుంది. అందువల్ల తానొక్కణ్ణే కష్టపడితే సరిపోదనీ, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏముంది? ఎన్ని పనులు చేసినా ఇంకా చేయాల్సి నవి ఉంటూనే ఉంటాయి. అలాగే సమన్వయ లోపంతో కొన్ని పనులు జరగడం ఆలస్యం అవుతుంది. ‘గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం’లో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు ప్రజల నుండి నిరసన వ్యక్తం అవుతున్న మాట నిజమే. అయితే, దాని గురించి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఏ పాలకుడి వద్ద రాత్రికిరాత్రే అద్భుతాలు సృష్టించే మంత్ర దండం ఉండదు. కష్టపడాల్సిందే. అందరి సహకారం స్వీకరించాల్సిందే. అప్పుడే ఫలితాలు అందుతాయి. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘నవరత్నాల’ను ఒక్క ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగించలేరని కొందరు జోస్యం చెప్పారు. కానీ, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ రథ చక్రాలు ఆగలేదు. ఏ ఒక్క పథకమూ కుంటు పడలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో 97 శాతం పైగా అమలు చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు. ఒకట్రెండు హామీల విష యంలో వాటిని యుధాతథంగా అమలు చేయ డానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించే స్థితిలో లేనందువల్ల వాటిని మెరుగైన విధానంలో అమలు చేస్తామని ధైర్యంగా, నిజాయితీగా చెప్పగలగడం కూడా గతంలో లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి రాష్ట్రంలో సంపద సృష్టి జరగడం లేదన్నది. ఆంధ్రప్రదేశ్లో 2 ఎకరాల భూమి విలువకు ప్రస్తుతం తెలంగాణలో 1 ఎకరం భూమి మాత్రమే వస్తుందట. ఈ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రదేశ్లో భూముల విలువ పడిపోయిందంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి, ఇదొక డొల్ల వాదన. వీరి దృష్టిలో సంపద అంటే కేవలం రియల్ ఎస్టేట్. తెలం గాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో స్థిరపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి ప్రాంతంలో కోట్లు కుమ్మ రించి భూములు కొన్నారు. వాస్తవిక అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్ వాల్యూ) లేకుండా కేవలం ప్రచారార్భాటంతో విలువను పెంచి అదే సంపద సృష్టిగా చెప్పుకొన్నారు. నిజానికి అసలైన అభివృద్ధి ఏమిటన్నది ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమా ణాలు మెరుగుపర్చడమే సంపద సృష్టి అని నిరూపించారు. పెట్టుబడిదారీ విధానంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తాయి. లాభాలు కోసం వెంపర్లాడతాయి. అదికూడా తమ ప్రయోజనాలు కాపాడే వర్గాల కోసం. కానీ, జగన్ విధానం వ్యక్తిగతమైన లాభాలు అందించే వ్యవస్థను ప్రోత్సహించడం కాదు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి దశాబ్దాలుగా అణగారి ఉన్న వర్గాలను బాగు చేయడం. వారిని ఆర్థికంగా, సామా జికంగా, రాజకీయంగా సాధికా రుల్ని చేయడం. నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద సృష్టి అంటే అదే. కానీ, ఈ అభివృద్ధి నమూనాను కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమను తాము ఎలీట్ వర్గాలుగా భావిస్తూ సమాజంలో ఉన్నత విద్య, వైద్య సదుపాయాలు అనుభవించడం తమ జన్మహక్కుగా, అన్ని రంగాలలో పైచేయి తమదే ఉండాలన్న ఫ్యూడల్ మనస్తత్వంతో... పేదలు, బడుగు బలహీన వర్గాలవారు సామాజిక, ఆర్థిక నిచ్చెనమెట్ల ద్వారా పైకి చేరుకొంటుంటే చూచి సహించ లేకపోతున్నారు. ఎలీటెస్ట్ థియరీ (శ్రేష్టవర్గ సిద్ధాంతం) ప్రకారం వారు తమకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదించు కొంటారు. వారు ఇతర వర్గాల ప్రజలతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. కానీ, ఆ వర్గాల ఓట్లతోనే అధికారం సంపాదిం చాలని చూస్తారు. ఉదాహరణకు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ఎలీట్ వర్గాలు నిరాకరించాయి. రాజ ధాని ప్రాంతాన్ని కూడా ఓ గేటెడ్ కమ్యూనిటిలా తయారు చేయాలనుకొన్నారు. అందువల్లనే... అమరావతిలో పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ‘సామాజిక సమతుల్యత’ దెబ్బతింటుందని పేదలను, బలహీన వర్గా లను అవమానపర్చే విధంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అన్నది కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పని చేయాలా? లేక జగన్ విధానంలో లాగా పేదల కోసం పని చేయాలా? రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి అన్నది కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు పరిమితం చేయాలా? లేక అన్ని వర్గాల ప్రజలకూ అందించాలా? గత 3 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ విజయాలు చెప్పు కోవడానికి చాలానే ఉన్నా... అన్నింటిలోకెల్లా భూమిలేని నిరుపేదలకు 36 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది ఓ చారిత్రాత్మక విజయం. స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ లేదు. ఇపుడు రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాకేంద్రక అభివృద్ధి నమూనాకు మద్దతు పలకడం. సామాన్యులు, పేదలూ 2024లో కూడా వైసీపీనే గెలిపించాలి. పెట్టుబడిదారీ వర్గా లకు మరోసారి కోలుకోలేని గుణపాఠం నేర్పాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
కరిమింగిన వెలగపండులా దేశ ఆర్థిక వ్యవస్థ
దేశంలో ఈ 8 ఏళ్లల్లో బిలియనీర్ల సంఖ్య అనూహ్యంగా పెరగడం, వారి కారణంగా దేశ స్థూల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమించడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పు కొంటోంది. ఓ దశాబ్దం క్రితం వరకు భారత్ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ఇప్పుడది 5వ స్థానా నికి ఎగబాకింది. అది కూడా కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి, అప్పటివరకు ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్ను వెనక్కు నెట్టి ఆ స్థానంలో నిలబడింది కనుక అది విజయంగా ఎన్డీఏ భావిస్తోంది. దేశంలో అదుపు తప్పిన ధరలు, నిరుద్యోగం, దిగుమతులలో వృద్ధి, ఎగుమతులలో క్షీణత, రూపాయి పతనం, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు... ఇన్ని సమస్యల నేపథ్యంలో దేశం ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న విషయం విస్మరించరానిది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటడం అన్నది నిజానికి ప్రస్తుత యూరప్ సంక్షోభ పరిస్థితులలో గొప్ప విజయమేమీ కాదు. బ్రిటన్లో చాలాకాలంగా ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. బ్రిటన్లోని అన్ని వర్గాల ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే కార్మికులు, రేవు కార్మికులు, పోస్టల్ కార్మికులు అధిక వేతనాలను డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. తమ కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిన దృష్ట్యా వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు. ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, చివరకు వైట్ కాలర్ ఉద్యోగులుగా పేర్కొనదగ్గ ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో ఇది వరకు ఎన్నడూలేని రీతిలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క బ్రిటన్ లోనే కాదు.. స్పెయిన్, జర్మనీ, బెల్జియం తదితర సంపన్న యూరోపియన్ దేశాలలో పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. జర్మనీలో ఇటీవల పైలెట్లు సమ్మె చేయడంతో వంద లాది విమానాల రాకపోకలు నిలిచిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగింది. భారతదేశంలో చాలాకాలం క్రితమే పలు కార్మిక చట్టాలను రద్దు చేశారు. లాభాలలో నడుస్తున్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి కార్మికులు, రాజకీయ పార్టీలవారు ఏమీ చేయలేని నిస్సహా యస్థితిలో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగినా ప్రజలు మౌనంగానే భారాన్ని మోస్తున్నారు. నిర్మాణరంగంలో ఇసుక, స్టీలు, సిమెంటు ధరలు 40 శాతం కంటే మించి పెరిగాయి. ఇక జీఎస్టీని అత్యధికంగా దాదాపు అన్ని వస్తువులపై విధించడంతో పేద ప్రజలు సైతం ధరాఘాతానికి గురవుతున్నారు. కొన్ని రకాలైన ఎరువుల ధరలు 40 నుంచి 80 శాతం మేర పెరగడంతో రైతులపై అదనపు భారం పడింది. దేశ ఆర్థికాభివృద్థి రేటును, స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను బ్రిటన్తో పోలుస్తున్న కేంద్ర ప్రభుత్వం... మానవాభివృద్ధి సూచికలలో మనం ఏ స్థానంలో ఉన్నామో ఎందుకు వెల్లడించడం లేదు? ఐక్యరాజ్యసమితి తాజాగా వెలువరించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ స్థానం 132 కాగా, బ్రిటన్ది 18వ స్థానం. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 22 శాతం ప్రజల సగటు ఆదాయం రోజుకు రూ. 160 మాత్రమే. దేశ జనాభాలో 27.9 శాతం మంది ఇంకా పేదరికంతో విలవిల లాడుతున్నారని తాజా సర్వే వెల్లడించింది. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. దేశంలోని 21.7 శాతం సంపద కేవలం ఒక శాతంగా ఉన్న బిలియనీర్ల చేతుల్లో ఉండగా, 19.8 శాతం సంపద మాత్రమే 40 శాతం మంది దేశ ప్రజల్లో ఉన్నట్లు సర్వేలో తేలింది. అసమానతలు అన్నవి ఆర్థికంగానే కాక ఇంకా లింగ (జెండర్) అసమానతలు, సామాజిక (సోషల్) అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ నాణేనికి రెండో వైపు ఉన్న పార్శ్వం. ఇక డాలర్తో రూపాయి విలువ క్షీణత ఇంత సుదీర్ఘంగా సాగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఇందుకు కారణం వాణిజ్యలోటు భారీగా పెరగడమే. గత సెప్టెంబర్లో 2020– 21 వాణిజ్యలోటు 11.7 బిలియన్ల డాలర్లు ఉండగా, ఈ ఆగస్ట్ 2022 నాటికి 28.7 బిలియన్ల డాలర్లకు చేరింది. అంటే లోటు వృద్ధిరేటు దాదాపు 250 శాతం. దిగుమతుల్లో వృద్ధి నానాటికీ పెరిగిపోతుండగా ఎగుమతుల వృద్ధిరేటులో క్షీణత నమోదవుతోంది. తాజా రాజకీయ కారణాలతో దేశం నుంచి ఎగుమతి అయ్యే బాస్మతియేతర, నాన్ పారాబాయిల్డ్ బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించడం ద్వారా బియ్యం ఎగుమతిని కేంద్రం నియంత్రించింది. మరోపక్క, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచంలోని పలు దేశాలు భారత్ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటో మొబైల్ విడిభాగాలు మొదలైన వాటిని దిగుమతి చేసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఎగుమతుల ద్వారా లభించే విదేశీ మారక ద్రవ్య ఆదాయం తగ్గింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేమిటన్నది నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘ఆర్థిక సర్వే 2022’లోనే వెల్లడైంది. అధిక ధరల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజల పొదుపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క ఏడాది కాలంలో, అంటే గత ఏడాదిలో ధనవంతులు 13 లక్షల కోట్ల సంపద ఆర్జించగా, 15 కోట్లమంది పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం 53 శాతం తగ్గిపోయినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఆర్ధికాభివృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో 39 శాతం పెట్టుబడులు కీలక రంగాలలో పెట్టాలి. కానీ, ఈ రంగాలలో వస్తున్న ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చే ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం’కు కేటాయించే నిధులలో ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న వివిధ పథకాలలో కోత పడుతోంది. ఇదికాక, పేదలకు అందిస్తున్న గృహ నిర్మాణ పథకం మందగించింది. ఈ పరిణామాలన్నీ దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల, రైతుల జీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైకి నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్నా లోపల డొల్లమాదిరిగా ఉంది. మరోరకంగా చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ‘కరి మింగిన వెలగపండు’లా ఉంది. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
నినాదాలు కాదు, విధానాలు కావాలి
దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి మాటలలో వివరించలేనంత ఆందోళనకర స్థాయిలో ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 80కి చేరింది. రూపాయి పతనాన్ని ఆపడానికి 1.5 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని కుమ్మరించినా పరిస్థితిలో ఎటువంటి మెరుగుదలా లేదు. ముడిచమురు, బొగ్గు, ఆహార ధాన్యాలు వంటివాటి దిగుమతులు గణనీయంగా పెరిగి దేశం నుండి జరిగే ఎగుమతులు తగ్గాయి. దాంతో, విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకు పోతోంది. విదేశీ రుణం రికార్డు స్థాయికి చేరింది. ఫలితంగా విదేశీ చెల్లింపుల సమతౌల్యం దెబ్బతిని కరెంట్ ఖాతా లోటును నిర్వహించడంలో ఆర్థిక శాఖ సతమతం అవుతోంది. దేశంలో చిల్లర విపణి ధరలు, వంట గ్యాస్, కిరోసిన్, బొగ్గు ధరలు అదుపు తప్పాయి. అన్ని సరుకుల టోకు ధరల సూచీ 15 శాతం పైకి ఎగబాకింది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది కేంద్రం, రాష్ట్రాలు చేస్తున్న అప్పుల గురించే మాట్లాడుతున్నారుగానీ... కుటుంబాలు చేస్తున్న అప్పుల గురించి మాట్లాడ్డం లేదు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి గత్యంతరం లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు అప్పుల ఊబిలో దిగిపోయారు. దేశం ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక దుస్థితి హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అలాగని కరోనా దెబ్బతోనూ, రష్యా ఉక్రెయిన్ల యుద్ధంతోనూ పూర్తిగా ఈ స్థితి దాపురించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి స్థిరమైన ఆర్థిక విధానం లోపించడమే దీనికి ప్రధాన కారణం. ప్రధాని నరేంద్రమోదీ 2014లో అధికారం చేపట్టేనాటికి దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.4 శాతం వృద్ధిరేటుతో ఆరోగ్యకరంగానే ఉంది. పైగా, 2014 తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు అంటే 2018 వరకు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా... కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. కానీ, ఈ అనుకూలతను ఆర్థిక రంగ పటిష్టతకు విని యోగించుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలం అయింది. 2016 నవంబర్లో నల్లధనం అరికట్టడం లక్ష్యంగా హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఓ విఫల కార్యక్రమంగా మిగిలి పోయింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని అసంఘటిత రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది. నిరు ద్యోగం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత సన్నగిల్లడంతో అనేక మంది డిపాజిట్దారులు తమ డబ్బును బ్యాంకుల నుండి ఉపసంహరించుకొని డాలర్ల రూపంలో విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. అంటే, భారత బ్యాంకుల్లో ఉండాల్సిన డిపాజిట్లు విదేశాలకు తరలడం వల్ల ‘రూపాయి’పై భారం పెరగడమే కాక.. దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టుగా పరిణమించింది. కోట్లాదిమందికి ఉపాధి కల్పించే దేశీయ అసంఘటిత రంగాలను దెబ్బతీయడమే పెద్దనోట్ల రద్దు విజయంగా మిగిలి పోయింది. స్థిరమైన పెట్టుబడులు మాత్రమే ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేస్తాయి. కానీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలనే తాపత్రయంతో నిబంధనలను పూర్తిగా సరళీకృతం చేశారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50 శాతం నుంచి 90 శాతం వరకు అనుమతి ఇస్తున్నారు. మరో పక్క స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్ఐఐలు) ప్రోత్సహి స్తున్నారు. అయితే ఎప్పుడైతే రూపాయి విలువ క్షీణిస్తుందో... అప్పుడు స్టాక్ మార్కెట్ల నుండి ఎఫ్ఐఐల ఉపసంహరణ ఊపందుకుంటుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్ప గూలడం అనేకసార్లు చూశాం. డాలర్తో రూపాయి మారకం విలువ వేగంగా పతనం కావడంతో అనేక రంగాలలో ఈ దుష్ఫలితాలు కనపడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కు వగా అమెరికన్ డాలర్ చుట్టూ పరిభ్రమించడం వల్లనే ఈ దుస్థితికి ప్రధాన కారణం. అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బంగారం, ఇతర విలాస వస్తువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది. ఇక, దేశాన్ని పన్ను ఉగ్రవాదం నుండి విముక్తం చేయడమే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) లక్ష్యం అని చెప్పుకున్న ఎన్డీఏ ప్రభుత్వం హేతుబద్ధత లోపించిన ఆచరణతో ప్రజలపై పెనుభారం మోపింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు కొండలా పెరిగిపోయాయి. 2014 జూన్ నాటికి దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ప్రస్తుతం 10 లక్షల కోట్లకు చేరాయన్న నివేదికలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడతాయి. మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటే అర్థం.. ఆర్బీఐ తన బాధ్య తను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నదనే. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్తలను వెనక్కి రప్పించి వారి ఆస్తులను జప్తు చేయించడంలో కూడా కేంద్రం విఫలం అయింది. కాగా, నష్టాల్ని తగ్గించు కోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టడం అనేక విమర్శలకు గురైంది. తాజాగా, ఎస్బీఐ మినహా దేశంలోని అన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరిస్తే కలిగే అనర్థాలు అనేకం. ఉద్యోగ భద్రత లోపించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవు. ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజన్ గ్రోత్’ వంటి పసలేని నినాదాలకు తాత్కాలికంగానైనా స్వస్తి పలికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. జీఎస్టీని సరళతరం చేయాలి. రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలి. నల్లధనాన్ని వెనక్కు రప్పించాలి. అధిక వ్యయంతో కూడిన దిగుమతులను నిలుపుదల చేసి వైవిధ్యభరితమైన ఎగుమతులపై దృష్టి పెట్టాలి. దేశంలోని మానవ వనరులను సద్వినియోగ పర్చుకొని పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడంపైనే దృష్టి పెట్టాలి. రాష్ట్రాలను కలుపుకొని ఉమ్మడిగా దేశం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి స్థిరమైన ఆర్థిక విధానాలతో తగిన కార్యాచరణ రూపొందించాలి. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
పడిలేచిన కెరటం... ‘పోలవరం’
‘పోలవరం’ ప్రాజెక్టు తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం. 2005లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో 1941 నుంచి కాగితాలకు, శంకుస్థాపన లకు పరిమితం అయిన పోల వరంకు చలనం కలిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా కేంద్రంలో తనకున్న పరపతిని ఉపయోగించి... వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొని... వారు వెలిబుచ్చిన అన్ని అభ్యంతరాలకు సమాధానాలు అందించి 14 అనుమతులు సాధించి... పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టించింది వైఎస్సారే. 2009 సెప్టెంబర్లో డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమా దవశాత్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో... పోలవరంకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో... పోలవరం మళ్లీ తెరపైకి వచ్చింది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా... మొత్తం ఖర్చును కేంద్రమే భరించేటట్లు ఒప్పందం కుదిరింది. కానీ, 2014లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు దాదాపు ఏడాదిన్నర వరకు పోలవరంను పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతలు చేపట్టారు. అంతేకాదు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలునని ఒప్పుకొన్న చంద్రబాబు... కేంద్రం కట్టాల్సిన పోలవరంను తన భుజాలకెత్తుకొని తప్పు చేశారు. కేంద్రం ఏదయితే 2014 నాటి అంచనాల ప్రకారం రూ. 16,000 కోట్లు మాత్రమే ఇస్తానన్నదో దానికి తలూపి ఒప్పుకొన్నారు. అందుకే ప్రస్తుతం కేంద్రం పోలవరంకు రూ. 29,027 కోట్లు మాత్రమే ఇస్తానంటోంది. కానీ, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017–18కి సంబంధించిన ధరల ప్రకారం మొత్తం రూ. 55,656 కోట్లు ఇవ్వాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. తానొక విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు పోలవరం నిర్మాణంలో చేసిన తప్పులు పోలవరంకు ప్రతికూలంగా మారాయి. ఆయన కాలంలో ఒకవైపు స్పిల్వే పని పూర్తి చేయకుండానే మరోవైపు కాఫర్ డ్యామ్లను కట్టడం ప్రారంభించారు. దాంతో, వరదనీళ్లు దిగువకు పోవడానికి అవకాశమే లేకుండా పోయింది. మధ్యలో కొచ్చేసరికి ముంపు గ్రామాలు మునిగిపోతాయని అర్థం కావడంతో ఆ పనుల్ని మధ్యలో ఆపేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్ల వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సారీ నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోంది. అంతే కాదు... ఎగువ కాఫర్ డ్యామ్ను 2,340 మీటర్ల వెడల్పుతో కట్టాలి. కానీ, ఒకచోట 480 మీటర్లు, రెండోచోట 400 మీటర్ల గ్యాప్ మేర కట్టకుండా వదిలేశారు. దీనివల్ల ఆర్థికంగా నష్టంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రణాళికబద్దంగా పనులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలవరం పనులు గాడిలో పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు అతి తక్కువ కాలంలోనే పూర్తి అయ్యాయి. గత యేడాది (2021) జూన్ 11న గోదావరిని విజయవంతంగా స్పిల్వే మీదుగా మళ్లించారు. దాంతో, మెయిన్ డ్యామ్ పనులు చాలా వేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమం అయింది. డిజైన్స్కు అనుమతి రావడమే తరువాయి... పనులు మొదలవుతాయి. వరద కారణంగా మెయిన్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో పడ్డ భారీ గుంతలను ఎలా పూడ్చాలన్న దానిపై ఈ నెలాఖరులోగా డిజైన్లు ఖరారు అవుతాయని కేంద్రం చెప్పడం ఒక శుభవార్త! తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ప్రాధాన్యతా క్రమంలో నిర్వాసితులకు పునరా వాసం కల్పిస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 373 జనావాస ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే, ఇప్పటికి 27 జనావాస ప్రాంతాలను పునరావాస కాలనీలకు తరలించడం జరి గింది. ప్రస్తుతం, ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయిన నేపథ్యంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది కనుక... తొలుత 20,496 కుటుంబాలను తరలించాలని అధికారులు లెక్క వేశారు. అందులో ఇప్పటికే 7,962 కుటుంబాలను తరలిం చడం జరిగింది. వన్టైం సెటిల్మెంట్ క్రింద 3,228 కుటుం బాలకు పునరావాసం కల్పించారు. మరో 17,268 కుటుం బాలకు పునరావాసం కల్పించేందుకు ఇళ్లను వేగంగా కట్టిస్తున్నారు. కేంద్రం నిర్వాసిత కుటుంబాలకు రూ. 6.50 లక్షల పరిహారం ఇస్తుంటే, దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 3.50 లక్షలు చేర్చి మొత్తం రూ. 10 లక్షలు అందిస్తోంది. ఇక పనుల్లో ప్రగతిని చూసినట్లయితే... చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా వదిలేసిన స్పిల్వేను, స్పిల్వే చానెల్ను జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. అప్రోచ్ చానెల్ను సేఫ్ లెవల్కు పూర్తి చేశారు. స్పిల్ చానెల్లో 48 గేట్లు అమర్చారు. ప్రధాన డ్యామ్ లో గ్యాప్ 3ను పూర్తి చేశారు. అన్నిటికీ మించి కీలకమైన ఎగువ కాఫర్ డ్యావ్ును పూర్తి చేశారు. నదిని స్పిల్వే మీదుగా మళ్లించడం పూర్తయింది. దిగువ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా, హైడల్ పవర్ (జల విద్యుత్) ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. కీలక టన్నెల్ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఎడమ, కుడి కాలువకు కనెక్టివిటీ పనులు కొనసాగుతున్నాయి. (చదవండి: పోలవరం తొలిదశకు లైన్ క్లియర్) కేంద్ర ప్రభుత్వ సహకారం లభిస్తే వచ్చే ఖరీఫ్ నాటికి ‘పోలవరం’ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఖాయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన తండ్రి డా. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేయడం ఆయనకు లభించిన గొప్ప అవకాశం. ‘పోలవరం’ నిర్మాతలుగా వారిద్దరూ చరిత్రలో, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. పడిలేచిన కెరటంలా పోలవరం పరుగులు తీయడం అన్నివిధాలుగా శుభ పరిణామం! (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర క్రియాశీలకంగా ఉండాలి. కానీ అది విశృంఖలంగా మారిన పుడు సమస్యలు జటిలం అవు తాయి. అధికారంలో ఉన్నవారు తీసుకొనే నిర్ణయాలను ప్రతిపక్షం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి కూడా! కానీ, ప్రతిపక్షం అదేపనిగా ప్రభుత్వం తీసుకొనే ప్రతి చర్య ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ ఏకపక్షంగా తీర్పులివ్వడం, వాటిపై శ్రుతి మించిన ఆందోళనలు చేయడం; ప్రజలను కుల, మత, ప్రాంత ప్రాతిపదికన రెచ్చగొట్టడం ఏ విధంగా సమంజసం? జరగని తప్పులు జరిగాయని, అడ్డగోలుగా దోచు కొంటున్నారని, రాష్ట్రం దివాళా తీసిందని... ఇలా రకరకా లుగా దుష్ప్రచారం సాగిస్తూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం చేస్తున్న యాగీ వల్ల... ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అధికారకాంక్షను అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షం బాధ్యత ఏమిటంటే, ఏదైనా ఒక అంశాన్ని తీసుకొంటే.. దానిని ఒకస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలలో చర్చ జరిగేందుకు ఆస్కారం ఇవ్వాలి. దానిపై మంచి చెడుల్ని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, నేడు రాష్ట్రంలో జరుగు తున్నదేమిటి? ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడమే! ప్రతి పథకంలో అవినీతి ఉందని దుష్ప్రచారం చేయడమే! చంద్రబాబు ఒక్కడికే పాలన చేతనవుతుందని, ఆయనొ క్కడే రాజకీయ వ్యవస్థలో ‘సుద్దపూస’ అనే ప్రచారాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా అదేపనిగా సాగిస్తోంది. బాబు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదు? (చదవండి: రంధ్రాన్వేషణే... ప్రతిపక్షం పనా?) చంద్రబాబు తన జీవితంలో మేనేజ్మెంట్ పాలిటిక్స్ నడిపారే తప్ప కేసీఆర్ మాదిరిగా, మమతా బెనర్జీ లాగా పోరాటాలు చేశారా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా ప్రజల్ని మెప్పించి అధికారంలోకి వచ్చారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మీద యుద్ధం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏం చేశారు? తనకున్న పలుకుడిని ఉపయోగించి ఢిల్లీలోని ఆంధ్రభవన్కు కొంతమంది జాతీయ పార్టీల నేతలను పిలిపించుకొని ఓ సభ పెట్టి, వారితో మోదీపై విమర్శలు చేయించారు. నల్ల బెలూన్లు ఎగరేశారు. దానిని పోరాటం అనగలమా? ఈవీఎంలను మోదీ హ్యాక్ చేయించి అడ్డదారుల్లో విజయం సాధిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేయడమే కాక... దానిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని బాబు సవాళ్లు విసరడం ఎవరు మర్చి పోగలరు? ఏమయిందా న్యాయ పోరాటం? మోదీ తిరిగి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చారు కనుక భయ పడ్డారా? కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి మోదీ నియంతృత్వం మీద పోరాటం చేస్తానని రాహుల్గాంధీ నివాసం ‘10 జన్పథ్’ ముందు నిలబడి జాతీయ మీడియా సాక్షిగా శపథం చేశారు కదా? ఏమైంది? 2019 ఎన్నికల తర్వాత తటస్థవైఖరి అని ఎందుకు వెనక్కి తగ్గినట్లు? తను దేశంలో లేని సమయంలో తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు... బీజేపీలో విలీనం అయిన పుడు చంద్రబాబు ఏమని ప్రకటించారు? న్యాయ పోరాటం చేస్తానన్నారు కదా! సుప్రీం కోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? తెలుగుదేశం రాజ్యసభాపక్షం మొత్తం బీజేపీ రాజ్యసభాపక్షంలో విలీనం అయినట్లు రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత... తెలుగుదేశం తరఫున సభ్యుడిగా కనక మేడల రవీంద్రకుమార్ ఎలా కొనసాగుతున్నట్లు? ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు? (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) చంద్రబాబు చేసే పోరాటాలన్నీ చాటుమాటు వ్యవహారాలే. సొంత మీడియాను అడ్డుపెట్టుకొని, ఇతర పార్టీలలో తన ప్రయోజనాలను కాపాడే వ్యక్తులతో కలిసి ఆడే డ్రామాలే ఆయన సాగించే పోరాటాలు. చంద్రబాబు అనుసరించే ‘మోడస్ ఆపరేండీ’ ఎలా ఉంటుందంటే... సీఎం వైఎస్ జగన్ మీదనో లేక ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక నిర్ణయానికి వ్యతిరేకంగానో... తన సొంత మీడియాలో ముందుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలను ఆధారంగా చేసుకొని ముందుగా ఇతర పార్టీలవారితో విమర్శలు, ఆరోపణలు చేయిస్తారు. ఆ పార్టీల వారి విమర్శలకు బలం ఎక్కువని, వాటిని ప్రజలు తేలిగ్గా నమ్ముతారన్నది బాబు దురాలోచన. ఆ తర్వాతనే తన పార్టీ వారిని రంగంలోకి దించుతారు. అలాగే తన మీడియాను, సామాజిక మాధ్యమాలను వారికి వెన్నుదన్నుగా మోహరిస్తారు. రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోయినట్లు కలరింగ్ ఇస్తారు. అదే సమయంలో చంద్రబాబును దూరం చేసుకొని ప్రజలు ఘోరమైన తప్పిదం చేశారంటూ ఇంకోవైపు నుండి మరోరకమైన ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఇతరత్రా ప్రచార సామగ్రిని రాష్ట్ర కార్యాలయం నుండే పంపుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సామాన్య పార్టీ నేతల వల్ల సాధ్యం కాదు కనుక... భూతద్దం వేసి ఎవరు డబ్బు బాగా ఖర్చు పెడతారో కనిపెడతారు. వారిని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. సదరు నాయకులు పార్టీ టిక్కెట్లు తమకే వస్తాయన్న ఆశతో... కోట్లు తగలేసుకొంటారు. చివరికొచ్చే సరికి ఇంకా బిగ్ ఫిష్ల కోసం చంద్రబాబు ఎదురు చూస్తుంటారు. చంద్రబాబు దైనందిన రాజకీయ జీవితంలో ఇదంతా ఓ భాగం. ఆయనకు వ్యక్తుల పట్ల మమకారం ఉండదు. వ్యవస్థల పట్ల గౌరవం ఉండదు. ప్రతిదీ రాజకీయమే! అధికారపక్షంలో బలంగా గొంతుక విన్పించే కొడాలి నాని వంటి వారిని టార్గెట్ చేయడానికి కారణం ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ తీయాలన్న కుటిల వ్యూహమే. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ తేల్చిందట. పార్టీ పరంగా... ప్రత్యర్థి పార్టీ మీద కమిటీ వేయడం ఏమిటి? ఆ కమిటీ ఏమి తేలుస్తుందో ప్రజలు అర్థం చేసుకోరా? ఆయన చేసే ప్రతి పనీ ఇలాగే ఉంటుంది. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో తగిన విధంగా ఆయనకు గుణపాఠం చెబుతారు. - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా
నిరంతర ప్రక్రియగా కొనసాగే ప్రజాచైతన్యం తోడైతే తప్ప కేవలం చట్టాలతో వ్యవస్థలను సమూలంగా మార్చడం సాధ్యం కాదన్న పరమసత్యం ఆలస్యంగానైనా ప్రధాని మోదీకి బోధపడినట్లుంది. పార్లమెంట్ ఆమోదిం చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రధాని ఉపసంహరిం చుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. ఏడాదికి ముందు హడావుడిగా కేంద్రం తెచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయని ఇప్పటికీ ప్రధాని భావించడం చూస్తే, కిందపడినా పైచేయి తమదేనని చెప్పుకోవడంగా కనిపిస్తుంది. వ్యవసాయ చట్టాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒంటెత్తుపోకడ పోయింది. ‘వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం కనుక.. ఈ రంగంలో కీలక చట్టాలు చేసేముందు ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించి ఉండాలి. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆ చొరవ చూపలేదు. రైతులతో, రైతు ప్రతినిధులతో ముసాయిదా బిల్లుల్లోని అంశాలకు సంబంధించిన మంచి చెడులపై సమగ్రంగా మాట్లాడలేదు. పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టినపుడు వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఈ అంశంపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షాలు రాజ్యసభలో డిమాండ్ చేస్తున్నప్పటికీ.. మూజువాణి ఓటుతో ప్రభుత్వం బిల్లుల్ని ఆమోదింపజేసుకొంది. (చదవండి: అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు) ఈ చట్టాల లక్ష్యం కర్షకులకు మేలు చేయడానికి, వారి ఆదాయం పెంచడం కోసమేనని చెబుతూ వచ్చారు. మరి వాటిపై చర్చ జరగడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటన్నది ప్రశ్న. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగితే.. బడా కార్పొరేట్ల నుంచి, దళారుల నుంచి రైతులకు రక్షణ ఎలా లభిస్తుందనే అంశంపై బీజేపీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ సమంజసమైన వివరణ ఇవ్వలేకపోయాయి. అందుకే ఈ చట్టాల ఉపసంహరణ కోసం ఉత్తరాది ప్రాంత రైతులు రోడ్డెక్కి చారిత్రాత్మక పోరాటం చేశారు. 700 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో ఆశువులు బాసారు. ఉద్యమాన్ని అణచివేసేం దుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఉద్యమ సెగ చల్లారలేదు సరికదా.. మరింత ఉవ్వెత్తున సాగింది. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో.. దేశ రైతాంగానికి కొత్త శక్తి వచ్చినట్లయింది. తాజాగా వారు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధతతో కూడిన కనీస మద్దతు ధర కోసం పట్టుబడుతున్నారు. పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర పొందడం అన్నది తమకు చట్టబద్ధ హక్కుగా సంక్రమించాలనేది రైతాంగం కోరిక. ఎప్పట్నుంచో రైతాంగం కోరుతున్నది, ఆశిస్తున్నదే. పస్తుతం కేంద్ర ప్రభుత్వం 14 పంట లకు కనీస మద్ధతు ధర ప్రకటిస్తోంది. ఈ పంటల ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గినపుడు ప్రభుత్వ ఏజన్సీలు జోక్యం చేసుకొని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. అయితే.. రైతులు 23 ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతున్నారు. దేశ ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. సంప్రదాయకంగా విస్తృతంగా పండిస్తున్న వరి, గోధుమలకు డిమాండ్ తగ్గుతోది. సిరి ధాన్యాలుగా పిలుస్తున్న మిల్లెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని, పౌష్టికతను పెంచే పంటల పెంపకాన్ని ప్రోత్సహించవలసిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలాగే, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలను దిగుమతులు చేసుకోవడం తగ్గించి వాటి ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. అందుకు రైతులు సిద్ధం కావాలంటే వారు డిమాండ్ చేస్తున్నట్లు 23 ప్రధాన పంటలకు చట్టబద్ధంగా కనీస మద్ధతు ధరలను ప్రకటించాలి. రానున్న కాలంలో రైతాంగ సమస్యల పరిష్కారమే రాజకీయ పార్టీలకు ప్రధాన ఎజెండా కానున్నది. ఇదొక శుభపరిణామం కూడా. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే భయంతోనే భారతీయ జనతాపార్టీ 3 వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం ఇందుకు ఓ ప్రధాన సంకేతం. 2004లోనే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతాంగ సమస్యల్నే ప్రధాన ఎన్నికల ఎజెండాగా తీసుకొన్నారు. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాల మాఫీ.. ఈ రెండు వాగ్దానాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాయి. అంతేకాదు.. వ్యవసాయం దండగమారి అని, ఉచిత విద్యుత్ ఇస్తే.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన ఎన్నికలలో బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చినందునే చంద్రబాబు స్వల్ప వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. ఆ హామీని నిలబెట్టుకోనందుకే 2019లో తగిన మూల్యం చెల్లించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా నేడు రైతాం గంలో ఎనలేని చైతన్యం వెల్లివిరిస్తోంది. వ్యవసాయ రంగాన్ని విస్మరించే, దెబ్బతీసే రాజకీయ పార్టీలకు రైతాంగం శాశ్వతంగా దూరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంస్కరణలపేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేసేవారిని, లాండ్ పూలింగ్ పేరుతో వ్యవసాయ భూముల్ని సేకరించి వాటితో రియల్ వ్యాపారం చేయాలనుకొన్న చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ నాయకులకు ఇకపై చీకటి రోజులే. రైతాంగానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని వారు.. ఇకపై జరిగే ఎన్నికలలో రైతుల ఓట్లు పొందడం దుర్లభం. వ్యవసాయరంగ ప్రగతి మీదనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మి.. అందుకు అనుగుణంగా వ్యవసాయరంగం మెరుగుదలకు పటిష్టమైన కార్యాచరణ చేపడతారో.. వారినే రైతులు ఆదరిస్తారు. నేడు ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. రైతు సంక్షేమమే ప్రాధాన్యాంశంగా చేసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి రైతుల ఎజెండాయే ప్రధానాంశం అవుతుంది. రైతు వ్యతిరేకులకు రాజకీయ మనుగడ శూన్యం. ఉత్తరాది రైతులు సాగించిన ఉద్యమం తెలియబర్చిన వాస్తవం ఇదే. - సి. రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు -
బడుగులపై ఈ బండలేమిటి ‘బాబూ’
మాట మీద నిలబడే నిబద్ధత, నిజాలు పలికే నిజాయితీ రెండూ లేని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల తన ‘మనసులోని మాట’ను దాచుకోలేక ‘అమరావతి 2 లక్షల కోట్ల రూపాయల సంపదకు కేంద్రంగా మారేది’ అని అసలు నిజాన్ని బయటకు వెళ్లగక్కారు. తను పక్కా వ్యూహంతో.. రాజధాని ప్రకటనకంటే ముందే తన అనుయాయులు, బినామీలతో వందల ఎకరాలు కొనుగోలు చేయించిన భూములకు రెక్కలొచ్చే విధంగా వేసిన ప్రణాళిక దెబ్బతినడంతో రూ. 2 లక్షల కోట్లు దక్కకుండా పోయిందని చంద్రబాబు బాధ పడుతున్నారు. అమాయక రైతులను ఆశల పల్లకీలో ఊరేగించి ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని తెచ్చి సేకరించిన 32,000 ఎకరాలతో వ్యాపారం చేయాలని చంద్రబాబు తలపోశారు. అందులో భాగంగానే అమరావతిని విపరీతంగా పైకెత్తారు. హైప్ క్రియేట్ చేశారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్లను తలదన్నేవిధంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు ప్రత్యేక విమానాలలో ప్రపంచ దేశాలను చుట్టి రావడం ప్రజలు గమనించారు. అలా ఐదేళ్లూ వృథాగా కాలక్షేపం చేసిన చంద్రబాబుపై అమరావతి రైతులు పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యమే! (చదవండి: మీరు చేస్తే అప్పు! వీరు చేస్తే తప్పా?) అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన సొంత మనుషులకు ప్రయోజనం కల్పించడం అన్నది హైదరాబాద్ విషయంలో కూడా జరిగింది. 9 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు వేసిన పాచికలు పారాయి. ఆ సమయంలో చంద్రబాబు హైదరాబాద్లో అత్యధికంగా సంపన్నులు నివాసం ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాలలో ముందుగానే తన బినామీలతో పెద్ద ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కొనిపించారు. ఆ తర్వాత ఐటీ పేరుతో అనేక సంస్థలకు భారీ రాయితీలు కల్పించి ఒకేచోట ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయించారు. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం) చంద్రబాబు తొలిసారిగా సీఎం కాగానే ఆయన బినామీలు కొందరు రియల్టర్లుగా మారారు. ఓ సినీ నటుడు స్వతహాగా రియల్టర్ కానప్పటికీ.. చంద్రబాబుకు బినామీగా అప్పటికప్పుడు రియల్టర్గా మారి కొన్ని వందల ఎకరాలను హైటెక్ సిటీ, మరికొన్ని ఐటీ కంపెనీలు రాకముందే కొనుగోలు చేశారు. ఆ సినీ నటుడు కొనుగోలు చేసిన స్థలాలకు సమీపంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. దాంతో ఒక్కసారిగా ఆ సినీనటుడి భూముల విలువ వేల కోట్లకు చేరింది. ఆశ్చర్యం ఏమంటే.. ఆ సినీనటుడు రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కనపడదు. మామూలుగా అయితే.. వందల కోట్ల నిధులు ఒక్క ప్రాంతంలోనే ఖర్చు చేస్తే.. సమాధానం చెప్పడం కష్టం కనుక తెలివిగా గచ్చిబౌలి స్టేడియంలో ఏడాది వ్యవధిలో రెండు ప్రధాన క్రీడోత్సవాలు.. 1) జాతీయ క్రీడలు, 2) ఆఫ్రోఏసియన్ క్రీడలు నిర్వహించి అందులో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు, ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించే సాకుతో విశాలమైన రోడ్లు, లైటింగ్, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున ఏర్పరిచారు. క్రీడల నిర్వహణ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా ఖర్చుపెట్టేశారు. అదే ప్రాంతంలో ‘ఫార్ములావన్ రేసు’ను కూడా నిర్వహించాలని విఫల ప్రయత్నాలు చేశారు. నిజానికి, చంద్రబాబు కంటే ముందు పరిపాలించిన ఏ సీఎం కూడా తమ భూముల విలువను పెంచుకోవడం కోసం తమతమ ప్రాంతాలలో కంపెనీలు, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు హైదరాబాద్లో ఏర్పాటైన అనేక అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలను నగరం నాలుగు దిక్కులా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదం చేశారు. కానీ, చంద్రబాబు ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించాలను కోవడానికి కారణం తన, తన అనుయాయుల భూములు, ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే. సైబరాబాద్లో అమలు చేసిన విధానాన్నే అమరావతిలో కూడా అమలు చేయాలని చూశారు. ముందుగా ఆ ప్రాంతంలో భూముల్ని కారుచౌకగా కొనిపించారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో అన్ని సంస్థలు, కార్యాలయాలు అక్కడే వచ్చేవిధంగా ప్రణాళిక అమలు చేశారు. ఒకపక్క ప్రజల రాజధాని అమరావతి అని పైకి చెబుతూ.. దానిని సంపన్నుల స్థావరంగా మార్చాలనుకొన్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయగలగాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఆ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం ఉపాధి తదితర మౌలిక సదుపాయాలను విస్తృతంగా లభించేటట్లు చర్యలు తీసుకుంటేనే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయి. కానీ, చంద్రబాబుకు ఆ సామాజిక దృష్టి కోణం లేదు. ఎంతవరకూ.. ఒక ప్రాంతం, ఒక వర్గం అభివృద్ధి చెందాలన్న తపన, ఆరాటమే ఆయనలో కన్పిస్తుంది. ప్రజలు ఛీకొట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా.. కొన్ని మీడియా సంస్థల దన్నుతో అమరావతిలోనే రాజధాని కట్టాలని, అభివృద్ధి మొత్తం అక్కడే జరగాలని ఒత్తిడి చేస్తూ కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారు. ప్రతి రోజూ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఇంకా మిగతా ప్రాంతాలలో ఉన్న మెట్టప్రాంతాలు.. వీటి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. అధికార వికేంద్రీకరణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న కృత్రిమ ఉద్యమం సంపన్న వర్గాల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి.. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారులను చేసేందుకు కృషిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లభించని అవకాశం పేద బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్ రూపంలో లభించింది. నిజానికి చంద్రబాబు సాగిస్తున్న అధర్మపోరాటం సీఎం జగన్పై కాదు.. పేద బడుగు బలహీన వర్గాలపైనే! రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. డబ్బులు పంచిపెడుతున్నారంటూ.. బడుగుల పట్ల అక్కసు చూపుతున్నారు. వారి నోటికి అందే లబ్ధిని లాగేయాలని చూస్తున్నారు. న్యాయస్థానాలలో కేసులు వేయిస్తున్నారు. అప్పులు పెరుగుతున్నాయని దుష్ప్రచారం సాగిస్తున్నారు. కానీ చరిత్రలో అధర్మపోరాటం విజయం సాధించిన ఉదంతాలు ఎక్కడా లేవు. బడుగులపై బండలు వేయడం చంద్రబాబు మానుకోవాలి. నేడు కాకుంటే రేపైనా అమరావతి రైతులు తమకు ద్రోహం చేసింది చంద్రబాబేనన్న వాస్తవాన్ని గ్రహిస్తారు, తనపై తిరుగుబాటు చేస్తారు. ఇది తథ్యం. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
చట్టం కంటే ప్రజాచైతన్యం ముఖ్యం
ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం ఏడు దశా బ్దాల స్వతంత్ర భారతంలో పదేపదే రుజువైనప్పటికీ, ఆయా వర్గాలను సంతృప్తి పర్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల గొప్ప మేలు కలుగుతుం దని కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, రైతులు సాను కూలంగా స్పందించడం లేదు. ఎన్డీఏ తెచ్చిన పలు చట్టాలపై ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘జనాభా నియంత్రణ’పై చట్టం తేవడానికి అధికార బీజేపీ అడుగులు వేయడం మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియం త్రణ బిల్లులను తమ శాసనసభల్లో ప్రవేశపెట్టాయి. ‘ఉత్తర ప్రదేశ్ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021’ ముసాయిదాను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజానీకం ముందుంచి, వారి సలహాలు, సూచనలను ఆహ్వా నించింది. కాగా, యూపీ తరహాలోనే జనాభా నియంత్రణ బిల్లును తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకు సంబంధించి 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేదీ తమకు లేదనీ, వివిధ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటును కనిష్టంగా 2.1 శాతం సాధించే క్రమంలో ఉన్నామనీ తెలిపింది. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానం ఇంత విస్పష్టంగా ఉన్నదని తెలిసినప్పటికీ, పార్లమెం టులో కొందరు అధికార బీజేపీ నేతలు ప్రైవేటు మెంబర్స్ బిల్ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబడటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత భారత్ జనాభా ప్రపంచ జనాభాలో 6వ వంతు. దేశంలో ప్రతి 20 రోజులకు లక్ష చొప్పున జనాభా పెరుగుతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న చైనాను దాటడా నికి ఎక్కువ సమయం పట్టదు. స్వాత్రంత్యం లభించిన తొలినాళ్లల్లోనే దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడున్న 30 కోట్ల జనాభాకు తిండిగింజలను విదేశాల నుండి దిగు మతి చేసుకొన్నది. అటువంటి నేపథ్యంలోనే, నెహ్రూ ప్రభుత్వం 1951లో కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే, దీన్ని బల వంతంగా అమలు చేయలేదు. తర్వాతి ప్రభు త్వాలు కూడా ప్రజలపై నిర్బంధంగా రుద్ద లేదు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే చెదురుమదురుగా బలవంతపు ఆపరేషన్లకు పాల్పడిన అమానుష సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ‘మేమిద్దరం– మాకిద్దరు’ అనే నినాదంతో సాగిన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలు సత్ఫలితాలు అందించాయి. ఫలితంగానే, 1950–55 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, అది క్రమంగా 4 శాతా నికి, తదుపరి 3 శాతానికి తగ్గుతూ 2.2 శాతం వద్ద స్థిరపడింది. 2025 నాటికి 1.93 శాతంకు తగ్గిం చేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘అన్ని సమస్యలకు మూలం అధిక జనా భాయే’ అనే భావన ఒకప్పుడు ఉండేది. తర్వాత ‘అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది జనాభాయే’ అనే సిద్ధాంతం ఊపిరి పోసుకుంది. మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించు కొనే దిశగా సమర్థమైన కార్యాచరణ అమలు చేసిన తర్వాతనే చైనా ఆర్థిక వ్యవస్థ బలీయమైన శక్తిగా రూపొందింది. అంతకుముందు ‘ఒకే బిడ్డ’ విధా నాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో చైనాలో యువత సంఖ్య గణనీయంగా తగ్గి, వైద్య ఆరోగ్య సౌకర్యాలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగ డంతో తన విధానాన్ని సవరించుకొంది. ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదు పాయాల కల్పన, ప్రతి ఒక్కరికి అర్హతలను అను సరించి నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించడం, అభి వృద్ధి కార్య కలాపాలను వికేంద్రీకరించడం, తది తర చర్యలను తీసుకొన్నట్లయితే పెరుగుతున్న జనాభా విలువైన వనరుగా రూపొందుతుంది. యూపీ, అస్సాం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కుటుంబ నియంత్రణ చట్టాలు రూపొందించి, కొన్ని వర్గాల జనాభాను నియం త్రించాలనుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా సంఖ్యను దాటుకొని ముస్లింల జనాభా పెరిగి పోతోందని కొంతకాలంగా చాంధసవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న కారణంగానే ఆ రాష్ట్రం చట్టం ద్వారా జనాభాను నియంత్రించా లనుకొం టోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. యూపీ మోడల్ను జాతీయ స్థాయిలో అనుసరించి నట్లయితే, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు బిడ్డల విధానం వల్ల, ఆడపిల్లలను పిండ దశలోనే తొలగించి వేసే అవకాశం ఉంది. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ‘జనాభా నియంత్రణ బిల్లు’పై విçస్తృతమైన చర్చ జరగాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం చేయాలి. ‘చట్టం కంటే ప్రజా చైతన్యం’ ముఖ్యం. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య విమర్శించారు. సంక్షేమం అనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని దుయ్యబట్టారు. అధికార పార్టీపై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని నిప్పులు చేరిగారు. చంద్రబాబు గాలి మాటలు చెబుతూ జూమ్లో కాలక్షేపం చేస్తున్నారని, మోదీని విమర్శించాలంటే చంద్రబాబుకు భయమని ఎద్దేవా చేశారు. -
పెట్రోలు ధరలు తగ్గాలంటే...
పెట్రో ధరలు ఎవరి నియంత్రణలో లేనట్టు పెరిగిపోవడం దేశ ప్రజల్ని అసహ నానికి గురి చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలియం ధరల పెరుగుదలను ఓ ధర్మ సంకటంగా అభివర్ణించారు. పెట్రోధరల నియం త్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వ యంతో పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఆ చొరవ ఎవరు తీసుకోవాలి? ఈలోపు పెట్రోల్, డీజిల్ ధరలు రెండూ సెంచరీ మార్కు దాటేశాయి. ఇటీవల కోవిడ్ ఔషధాలను తక్కువ శ్లాబ్లోకి చేర్చడానికి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశాన్ని ఎవ్వరూ చర్చించలేదు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రస్తావన ఇరువైపుల నుండి రాలేదు. పెట్రో ధరల దూకుడుకు కళ్లెం వేయడానికి కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేనట్లు అర్థమవుతున్నది. కరోనా దెబ్బతో రాబడులు తగ్గి ఆర్థికంగా సతమతమవుతూ వైద్య ఆరోగ్యరంగంలో, సంక్షేమ రంగంలో అదనంగా నిధులు ఖర్చుపెట్టాల్సిన నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై తమవంతు భారం వేశాయి. కేంద్రం ఏకపక్షంగా పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల సెస్సులు విధిస్తూ తద్వారా సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు దామాషా ప్రకారం వాటా ఇవ్వకుండా మొత్తాన్ని తమ ఖజానాలో జమ చేసుకొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మరో ప్రత్యామ్నాయం ఏముంది? పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించకుండా కారణాలు ఏమి చెప్పినా అవి ప్రజలను సంతృప్తి పర్చలేవు. భారత్కు ముడి చమురు ఎగుమతి చేస్తున్న కొన్ని దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించి డిమాండ్ను పెంచుకున్న మాట వాస్తవమే. కరోనా నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యరంగంలో అధిక నిధులు ఖర్చు పెట్టాల్సిరావడం కూడా నిజమే. అందుకు పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధించి సామాన్యులను దొంగ దెబ్బ తీయడం సహేతుకం కాదు. కరోనా బెడద ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. భారత్తో పోల్చితే సాపేక్షంగా ఆర్థికంగా బలహీనమైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఒకవైపు కరోనాతో యుద్ధం చేస్తూనే తమ ప్రజలపై అదనపు భారం మోపకుండా పెట్రో ధరల్ని నియం త్రణలో ఉంచాయి. భారత్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటిన దశలో నేపాల్లో లీటర్ రూ.51, శ్రీలంకలో రూ.55 మాత్రమే. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్’ నివేదిక ప్రకారం వివిధ దేశాలలో పెట్రోల్ స్థూల ధరపై జర్మనీలో 65%, ఇటలీలో 62%, జపా¯Œ లో 45%, అమెరికాలో 20% పన్నులు ఉండగా భారత్లో 260% మేర ఉన్నాయి. దీనిని ఎవరు సమర్థించగలరు? స్థూలంగా చూస్తే లీటర్ పెట్రోల్ రూ.100 ఉంటే అందులో రూ.59 పన్నుల రూపంలో పోతోంది. ప్రతియేటా దేశంలో అవసరమయ్యే పెట్రో ఉత్పత్తులు సగటున 211.6 మిలియన్ల టన్నులు కాగా, ఏటా 3.9% మేర ముడిచమురు వాడకం పెరుగుతోంది. దేశ అవసరాలలో 83% ముడిచమురును దిగుమతి చేసుకొంటున్న భారత్ అందుకు తన జీడీపీలో 4% నిధుల్ని ఖర్చు చేస్తోంది. ముడిచమురుకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిం చాలన్న లక్ష్యాలు నెరవేరకపోవడం వల్లనే ముడిచమురు అవసరాలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్, ఇథనాల్, మిథనాల్, విద్యుత్, సౌర విద్యుత్, బయోడీజిల్ మొదలైన వాటిని ఉపయోగించు కోలేకపోతున్నాం. ఇందుకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరే. ఉదాహరణకు ఇథనాల్, మిథనాల్లను పెట్రోల్లో 10% మేర కలిపి వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడమేకాక, దిగుమతుల బిల్లులో దాదాపు రూ. 50,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. కానీ, దశాబ్దకాలంలో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 8% మించలేదు. తాజాగా 2025 నాటికి ఇథనాల్ మిశ్రమం 20%కు పెంచాలని, తద్వారా ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. చెరకు, మొక్కజొన్న, ఇతర రకాల వ్యవసాయ వ్యర్థాల నుండి ఇథనాల్, మిథనాల్లను తయారు చేస్తారు. కనుక చెరకు, మొక్కజొన్న పండించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని, వీటి ఉత్పత్తుల కోసం అదనపు భూమిని సాగులోకి తేవాలన్న సూచనలు గతంలోనే అందాయి. సాగునీటి సదుపాయాలను పెంచడం కోసం దేశంలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అందుకు అవసరమయ్యే నిధులను పబ్లిక్, ప్రైవేటు సంయుక్త రంగం నుండి సేకరించాలని నిపుణులు సూచించారు. దీనిపై పార్లమెంట్లో కూడా అనేక సందర్భాలలో చర్చలు జరిగాయి. కానీ, ఆ దిశగా తగిన చొరవ కనపడలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్టస్థాయికి పడిపోయినప్పుడు కూడా ఆ అనువైన పరిస్థితుల్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. కారణం దేశంలో ముడిచ మురును నిల్వ చేసుకొనే మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండటమే. దేశంలో ప్రస్తుతం 23 ముడిచమురు శుద్ధి ప్లాంట్లు, ముడిచమురును దిగుమతి చేసుకోవడానికి 12 పోర్టులు, ముడి చమురు తెచ్చుకోవడానికి 10,406 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే దేశ అవసరాలకు 14 రోజులపాటు సరిపోయే ముడిచమురును మాత్రమే నిల్వ చేసుకోవడం సాధ్యపడుతుంది. ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు విఫలం చెందాయి. ఇంధన విధానంపై అనుసరించాల్సిన మార్గసూచీని 2020లో నీతి ఆయోగ్ అందిం చింది. నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదు. ముడిచమురు చౌకగా దిగుమతి చేసుకోవడానికి కొత్త మార్కెట్లను అన్వేషించాలి. భారత్కు ముడిచమురు ఎగుమతి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి కృత్రిమ డిమాండ్ను సృష్టించడం ద్వారా అనుచిత లబ్ధి పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షల కారణంగా చౌకగా ముడిచమురు సరఫరా చేసే ఇరాన్, వెనిజులా దేశాల్ని భారత్ దూరం చేసుకొంది. ఇపుడు, అమెరికాలో అధికారం ట్రంప్ నుండి జో బైడెన్కు దక్కిన నేపథ్యంలో తిరిగి ఇరాన్, వెనిజులాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించు కోవచ్చు. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలి. దేశంలో ‘ఆయిల్ సప్లయ్ ఎమర్జెన్సీ’ విధానం లేకపోవడాన్ని ఇంధన రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై విధించే సర్చార్జీ నిధులను కేంద్రం ఆ రంగంపైనే ఖర్చు చేయాల్సి ఉండగా వాటిని దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులపై సెస్సులు విధించడం ఎన్డీఏ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. దేశవ్యాప్తంగా కరోనా రెండోవేవ్ తగ్గుముఖం పడుతూ, ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన ధరల్ని నియంత్రించగలిగితేనే ఆర్థికరంగం గాడిన పడుతుంది. ముఖ్యంగా ఒకవైపు ఉపాధి, ఆదాయాలు కోల్పోయి ఇంకోవైపు వైద్య ఖర్చులు పెరిగిన ఈ కీలక దశలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కోలుకోవాలంటే పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలి. ఆ ధరలు తగ్గితేనే ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర కార్యాచరణ ప్రకటించాలి. దేశ ప్రజలపై పెట్రో భారాన్ని వదిలించాలి. సి. రామచంద్రయ్య – వ్యాసకర్త శాసన మండలి సభ్యులు – ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
సందేహం లేదు... ముమ్మాటికీ ఇది కుట్రే!
ప్రపంచ దేశాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ఏడాదికి పైబడి అలుపెరగకుండా పోరాడు తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత 15 నెలలుగా కరోనా వైరస్తోను, రెండేళ్లుగా కరోనా భూతాన్ని మించిన శక్తులతో, వ్యక్తులతో ఒకలాంటి యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ఇందులో కొన్ని ప్రత్యక్షంగానే దాడికి పూనుకోగా, మరికొన్ని స్లీపర్సెల్స్ తరహాలో ముసుగులు ధరించి ఆపరేట్ చేస్తున్నాయి. ఈ శక్తులన్నింటి వెనుక ఉండి మార్గదర్శనం చేసేది మరెవరోకాదు, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడే. ఆయన కుటిల వ్యూహాలను అమలుపరుస్తున్న వారిలో ఇతర పార్టీలలో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు, ఓ వర్గం మీడియా, కొందరు పారిశ్రామిక వేత్తలు, పలువురు ఎన్నారైలు, విశ్లేషకుల ముసుగులో టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మేధావులు కనిపిస్తారు. వీరందరి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక విధానాలలో కూలదోయడం, వీలైనంత త్వరగా చంద్రబాబునాయుణ్ణి గద్దెనెక్కించడం. ఈ క్రమంలోనే చంద్రబాబు విసిరిన పాచికలలో ‘రఘురామ కృష్ణంరాజు’ ఒకరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికలపై వాటిని ప్రస్తావించవచ్చు. అయితే, పార్టీ అంతిమంగా తీసుకునే నిర్ణయాలకు పార్టీలోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. వ్యతిరేకంగా మాట్లాడటం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లే అవుతుంది. అధికార పార్టీలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు ప్రభుత్వ విధానాలను విభేదించాల్సి వస్తే వారు పార్టీని వీడి బయటకు పోవడం మినహా రెండో మార్గం లేదు. కానీ, రఘురామ కృష్ణంరాజు ఏం చేశారు? అధికారపార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే ప్రభుత్వ నిర్ణయాలను అనుచితంగా విమర్శించడం, చివరకు సీఎంని వ్యక్తిగతంగా దూషించడం వరకు వెళ్లారు. కులాలు, మతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్న జగన్కి కులాన్ని, మతాన్ని అంటగట్టి దుర్భాషలాడటం ఆయనకు రివాజుగా మారింది. ప్రధాన స్రవంతి ఛానెళ్లు ఏవీ ఇప్పటివరకూ ఏ నాయకుడి బూతుల్ని, తిట్లను ప్రసారం చేయలేదు. కానీ రెండు ఛానెళ్లు రఘురామకృష్ణంరాజు అన్ పార్లమెంటరీ భాషను, చేష్టలను యధాతథంగా ప్రసారం చేయడం, అదే అంశాలపై డిబేట్లు నిర్వహించడం ఓ నిరంతర కార్యక్రమంగా మారిపోయింది. పత్రికా స్వేచ్ఛ, విలువల గురించి పేజీల కొద్దీ వ్యాసాలు రాసేవారు ఆయన ఏ విమర్శలు చేసినా అందుకు సంబంధించిన వివరణ తీసుకోకుండానే ప్రచురించడం ప్రజలందరూ గమనిస్తూవచ్చారు. ఓ లోక్సభ సభ్యుడికి సాధారణంగానైతే అంత ‘స్పేస్’ ఇవ్వరు. కానీ, ఆయన చేసే విమర్శలు వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవి కనుక అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. నిజానికి, ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగా, లోపాయికారి ఒప్పందాల ప్రకారమే సాగిందన్నది బహిరంగ రహస్యమే. రోజు వారీ తిట్ల పురాణాన్ని యధాతథంగా ప్రసారం చేయడం ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, సోషల్ మీడియాకు తేడా లేకుండా చేసి మీడియా ప్రమాణాల్ని దిగజార్చేంత వరకు వెళ్లడంలో తమ ఇంట్రెస్ట్ ఏమిటో ఈ మీడియా యాజమాన్యాలు ప్రజలకు వివరించగలవా? కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తుంటే ఈ మీడియా సంస్థలు అందుకు ప్రాచుర్యం కల్పించడం వెనుక ఉన్నది కుట్రకోణంకాక మరేమిటి? ప్రత్యేకించి ఓ కులాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదంటూ నిరాధార ఆరోపణలు చేసి ఆ కులంపై మిగతా కులాలను ఎగదోసేందుకు ప్రయత్నించడం కుట్రకాక మరేమిటి? ఓ మతాన్ని, ఆ మతస్థుల ఆచార వ్యవహారాలను, కించపరిచేటట్లు వెక్కిరించడం ఎంత అనాగరికం, అమానవీయం? అతని దిగజారుడు ప్రవర్తనను యధాతథంగా మీడియా ఛానెళ్లు ప్రసారం చేయడం అభ్యంతరకరం, చట్టవ్యతిరేకం. సమాజంలో కులాల మధ్య చిచ్చురేపడానికి ప్రమాద కరమైన రాజకీయ క్రీడకు తెర లేపారు. దీనిని రాజద్రోహం గానే పరిగణించాలి. ‘కావాలని ఎవరు పుడతారు ఎస్సీల్లో’ అంటూ వ్యాఖ్యానించడమేకాక బీసీలు న్యాయమూర్తుల పదవులకు పనికిరారు అంటూ రాతపూర్వకంగా తెలియ జేసిన వ్యక్తి నేడు రాష్ట్రంలో కులాల కుంపట్లను రాజేస్తు న్నారు. కులాల కళ్లద్దాల నుంచే ప్రతి అంశాన్ని దర్శించే వ్యక్తి నేడు సీఎంకి కులం రంగు పులమడానికి, మతం ముసుగు తొడగడానికి తన మీడియా ద్వారా, రఘురామకృష్ణంరాజు వంటి వ్యక్తుల ద్వారా కుట్ర పన్నడం సుస్పష్టం. మీడియాకు స్వేచ్ఛ ఉంది. సద్విమర్శ చేసే హక్కు ఉంది. కానీ, ప్రజా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రపన్నే వెసులుబాటు భారత రాజ్యాంగం మీడియాకు కల్పించ లేదు. ప్రభుత్వాల తప్పొప్పులను ఎత్తి చూపడం మీడియా బాధ్యతే. కానీ, ఆ బాధ్యతను చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ మీడియా ఎందుకు చేయలేదు? పార్టీ ఫిరాయిం పులకు పాల్పడి 29 మంది నాటి ప్రతిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని తమలో కలిపేసుకొని, అందులో నలుగుర్ని మంత్రులుగా చేసినప్పుడు ఇదే మీడియా ఓ చిన్న విమర్శ కూడా చేయలేకపోయింది. పాలనలో దారితప్పిన చంద్రబాబును, మెజారిటీ మీడియా ఏ సందర్భంలోనూ విమర్శించకపోవడం వల్లనే ఆ ఐదేళ్లూ ప్రజాస్వామిక వ్యవస్థలు, విలువలు కొడిగట్టాయి. ‘యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్’ అన్నది మీడియా రంగానికి కూడా వర్తిస్తుంది. జగన్పై గత 9 ఏళ్లుగా అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాను మించిన ఈ ఉపద్రవం నుండి ఆయన్ని కాపాడి అధికారం అప్పజెప్పింది ప్రజలే. ఇప్పుడు రక్షణ కవచంగా నిలిచేది కూడా ప్రజలే. – సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
కరోనాను మించిన వైరస్ చంద్రబాబు
గాంధీ టోపీలు ధరించిన వారందరూ గాంధీలు ఎలా కాలేరో.. మానవత్వం ముసుగులు ధరించి.. సోషలిజం పలుకులు పలికినంతమాత్రాన వారు పేదల పక్షపాతి కాలేరు. అవకాశం వచ్చినప్పుడు వారు మానవత్వం చూపించగలిగారా? పేదలకు న్యాయం చేయగలిగారా? అన్నదే కొలమానం. అవును మనం ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నాం. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఈ అనిశ్చిత పరిస్థితిలో కూడా బాబు తన చౌకబారు రాజకీయాలకు స్వస్తిపలకడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు పట్టలేదు. సామాన్యుల వెతలు విన్పించలేదు. సబ్సిడీలన్నా, సంక్షేమమన్నా రుచించలేదు. అలాంటి బాబు ఈ ప్రభుత్వానికి సంక్షేమ పాఠాలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన బాబు ఆ ఐదేళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చినప్పటికీ.. రైతాంగానికి మాఫీ చేస్తానన్న రుణాలలో (రైతుల రుణాల మొత్తం రూ. 1 లక్షా 25 వేల కోట్లు కాగా.. అనేక షరతులు పెట్టి చివరకు తేల్చిన మొత్తం రూ. 24,000 కోట్లు మాత్రమే) రూ. 11,000 కోట్ల మేర ఎగనామం పెట్టారు. రైతులతోపాటు డ్వాక్రా మహిళలకు చేస్తామన్న రుణమాఫీ చేయనేలేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఇవ్వనేలేదు. దశలవారీగా చేస్తామన్న మద్యపాన నిషేధం హామీని అటకెక్కించారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రతిపక్షంలోకి రాగానే ఆయన మానవతామూర్తి అవతారం ఎత్తారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ‘‘రైతులకు ప్యాకేజీ ప్రకటించండి, గీత కార్మికుల్ని ఆదుకోండి, పేదకుటుంబాలకు నెలకు రూ. 10,000 ఇవ్వండి’’.. అంటూ ఆయా వర్గాల పట్ల తనకేదో సానుభూతి ఉన్నదన్నట్లు బాబు ఎడాపెడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు సంధిస్తున్నారు. కరోనాను సాకుగా చేసుకొని ప్రతిరోజూ ప్రెస్మీట్లు పెట్టి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం, తమ నాయకులతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి.. ఆ సమాచారాన్నంతా మీడియాకు అందించడం చేస్తున్నారు. పైగా, అదే సమాచారాన్ని అటూ, ఇటూ మార్చి తమ పార్టీ నేతలతో తిరిగి మాట్లాడించడం, పత్రికా ప్రకటనలు విడుదల చేయించడం రివాజుగా చేసుకున్నారు. వీరి ప్రకటనలలో నిర్మాణాత్మక సూచనలేమైనా ఉన్నాయా? అంటే కాగడాపెట్టి వెతికినా ఒక్కటీ కనపడదు. తను ఏమి చెప్పినా ఎదురు ప్రశ్నించకుండా చూపించడానికి కొన్ని టీవీ చానెళ్లు; ప్రచురించడానికి కొన్ని దినపత్రికలు ఉన్నాయి కనుక బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. పేదవాడి సంక్షేమం గురించి, రైతుల ప్రయోజనాల గురించి చంద్రబాబు ఈ రోజు కొత్తగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి పాఠాలు చెప్పడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రకటించిన ‘నవరత్నాలు’ చంద్రబాబు చెబితే చేసినవా? ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే అమలు చేస్తున్న ఈ వినూత్న సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ చంద్రబాబు చెబితే చేస్తున్నవా? గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానిని అవహేళన చేసిన బాబు.. నేడు కరోనా వ్యాప్తి నిరోధానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిం చుకోండంటూ చెప్పడం ఎంత హాస్యాస్పదం? మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కాలంలో.. బాబు తనదైన ముద్రగలిగిన ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేయగలిగారా? ఏపీలో పేదల కోసం అమలు చేసిన సబ్సిడీ బియ్యం పథకం ఎవరిది? ఎన్టీఆర్ ప్రవేశపెట్టింది కాదా? బాబుతోసహా ఎంతోమంది సాధ్యం కాదని చెప్పినప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్ను విజయవంతంగా అందించిన ఘనత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డిది కాదా? చంద్రబాబు రైతులు, పేదల సంక్షేమానికి చేసిందేమిటి? అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అందించే సబ్సిడీల్లో భారీ కోతలు పెట్టడం నిజం కాదా? పాతిక కేజీల సబ్సిడీ బియ్యాన్ని 20 కేజీలకు తగ్గించింది బాబు కాదా? రూ. 2 ల బియ్యాన్ని అధికారంలోకి రాగానే రూ. 5.50కి పెంచిన విషయం బాబు మరిచారా? సంస్కరణల పేరుతో గృహ విద్యుత్ చార్జీలను అమాంతం పెంచడమే కాకుండా చార్జీలను తగ్గించమని ఆందోళన చేసిన ఉద్యమకారులపై కాల్పులు జరిపించి వారి ఉసురు తీసిందెవరు? కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాసి వారికి భారీ రాయితీలు అందించి పేదవాడిని హీనంగా చూసిన బాబు.. నేడు ప్రతిపక్షంలో కూర్చొని తానేదో గొప్ప మానవతామూర్తి మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఇది చేయండి.. అది చేయండి’అంటూ ఉచిత సలహాలతో ఆడుతున్న డ్రామా వెనుక అసలు పరమార్థం గ్రహించలేని వెర్రివాళ్లా ప్రజలు? అదేనిజమైతే.. తాను ఎందుకు చిత్తుగా ఓడిపోవాల్సివచ్చిందో ఆలోచించుకోవాలి. నిజానికి, ప్రపంచ మానవాళికి ముప్పుగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. తెలుగు ప్రజలు ముందుగా గుర్తు చేసుకోవల్సిన వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎన్టీఆర్, రెండు వైఎస్సార్. సబ్సిడీ బియ్యం పథకం ప్రవేశపెట్టి నిరుపేదలకు పోషకాహారాన్ని అందించిన వారు ఎన్టీఆర్ కాగా; పేదలు ప్రాణాంతక జబ్బుల బారినపడి వారు ఆర్థికంగా, భౌతి కంగా చితికిపోయే పరిస్థితుల నుంచి తప్పిస్తూ ‘ఆరోగ్యశ్రీ’ వంటి గొప్ప పథకాన్ని, ఫీజుల రీయింబర్స్మెంట్ పథకంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకొనే అవకాశాన్ని కల్పించి.. వీటితోపాటు అందరికీ అన్నం పెట్టే రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా.. వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, రుణాలమాఫీ కల్పించిన మానవతామూర్తి వైఎస్సార్. మన దేశ, రాష్ట్ర కాలమాన పరిస్థితులకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రెండూ కీలకం అని నమ్మిన వైఎస్సార్ అధికారంలోకి రాగానే వాటి అభివృద్ధికై అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన హయాం లోనే చిన్న, మధ్య, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికై ‘జలయజ్ఞం’ మొదలైన కారణంగానే నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో.. సాగునీటి ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు పండుతున్నాయి. గత తొమ్మిది నెలలుగా బాబు ప్రతిపక్షనేతగా కూడా విఫలమయ్యారు. కరోనా మహమ్మారిని మించిన వైరస్ నేడు ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉంది. దీనికి ఏకైక ఔషధం ప్రజల విజ్ఞతే. ప్రజలు బాబు ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజా సమస్యలపట్ల పూర్తి అవగాహన ఉంది. వాటిని పరిష్కరించే చిత్తశుద్ధి ఉంది. ప్రజల సహకారంతో తాత్కాలికంగా ఏర్పడిన ఈ ఇబ్బందులను విజయవంతంగా అధిగమించే ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
ఇంత ఆక్రోశం ఎందుకు బాబూ?
ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు. అమరావతిలో కొల్లగొట్టిన బినామీల భూములకు విలువ పెరగాలన్నదే చంద్రబాబు పంతం. విజన్ 2020 నుంచి రాజధాని వరకు ప్రతి దశలోనూ ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా బాబు పనిచేస్తూవచ్చారు. అమరావతిలో కూడా హైదరాబాద్ ఫార్ములా అమలు చేయడానికి ప్లాన్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కారు చౌకగా సుమారు నాలుగున్నర వేల ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. దాన్ని కాపాడుకోవడానికి రాజధాని రైతులను అడ్డంపెట్టుకుని కృత్రిమ ఉద్యమానికి గొడుగుపడుతున్నారు. విజ్ఞులైన ప్రజలు అన్నీ గ్రహిస్తారు! తెలుగునాట ‘సాక్షి’ మీడియా, సోషల్ మీడియా సామాన్యులకు అందుబాటులోకి రాని రోజుల్లో చంద్రబాబు అనుకూల మీడియా వ్యూహాత్మకంగా వ్యాప్తి చేసిన అనేక మిథ్యలలో ‘చంద్రబాబు గొప్ప పరిపాలనాదక్షుడు’ అనేది ఒకటి. ఈ భుజకీర్తిని తగి లించుకొనే 2014లో చంద్రబాబు స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల చంద్రబాబు పాలన ప్రజలకు ఓ పీడకలగా మారి ఆయన పరిపాలన దక్షతలోని డొల్లతనం ప్రజలకు తెలిసొచ్చింది, అనేక వర్గాల ప్రజలకు చేదు అనుభవాలను అందించింది. ఇందులో.. రాజధానికి భూములిచ్చిన రైతులూ ఉండటం విషాదం. కానీ ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు అహంకారం తగ్గలేదు. జ్ఞానోదయం కాలేదు. ప్రజలను వంచించానన్న పశ్చాత్తాపం ఏ కోశానా కనపడటం లేదు. ఇంకా తన ‘విజన్’ గొప్పదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడం తనకొక్కడికే సాధ్యం అంటూ.. ఇటీవల ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి గంటలకొద్దీ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు. పరిపాలనాదక్షత అంటే పేద, సామాన్య, బడుగు బలహీన వర్గాలు, రైతాంగానికి ప్రయోజనం చేకూర్చడం. అంతేతప్ప.. స్వప్రయోజనాలు, స్వపక్ష ప్రయోజనాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదు. జిమ్మిక్కులతో ‘కృత్రిమ ఇమేజ్’ 1995 ఆగస్ట్లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను గద్దెదింపి అడ్డదారిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబుకు అత్యవసరంగా తాను ఎన్టీఆర్ కంటే మించిన నేతగా ప్రజలముందుకు వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆ క్రమంలో పబ్లిసిటీతో ఇమేజ్ పెంచుకోవడానికి రోజుకో జిమ్మిక్కు చేయడం.. దానికి అనుకూల మీడియా గొడుగుపట్టడం రివాజుగా ఉండేది. ఏ కార్యక్రమం నిర్వహించినా తనకొక్కడికే పేరు రావాలన్న తాపత్రయం చంద్రబాబుది. అధికారాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. వీడియో కాన్ఫరెన్స్లంటూ కలెక్టర్లు మొదలుకొని హెచ్ఓడి స్థాయి అధికారులతో నేరుగా తానే గంటల తరబడి మాట్లాడేవారు. జిల్లా ఎస్పీలు, డీఎస్పీలకు కూడా తానే ఆదేశాలిచ్చేవారు. క్యాబినెట్ మంత్రులు నిమిత్తమాత్రులుగా, ప్రేక్షకుల్లా మిగిలిపోయేవారు. మంత్రులెవరైనా కలెక్టర్కో, ఎస్పీకో ఫోన్ చేస్తే.. ‘‘ముఖ్యమంత్రిగారు మాతో మాట్లాడారు’’ అనే సమాధానం వారికి లభించేది. చంద్రబాబు తమకు ఎటువంటి గౌరవం లేకుండా చేస్తున్నారంటూ మంత్రులు లోలోపల వాపోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు వెళ్లకపోతే.. ఏ కార్యాలయంలో కూడా దుమ్ము దులపడం లేదనేటట్లుగా ప్రచారం సాగింది. ‘జన్మభూమి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఒక్కడే కష్టపడుతున్నట్లు మిగతా క్యాబినెట్ మంత్రులు, అధికార యంత్రాంగానికి పాత్ర ఏమీలేనట్లు కొన్ని పత్రికలు రాసేవి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు ఏకపాత్రాభినయం నిరాఘాటంగా సాగిపోయేది. అది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం కావచ్చు.. బడ్జెట్పై చర్చ కావచ్చు.. ద్రవ్యవినిమయబిల్లుపై ముగింపు ఉపన్యాసం కావచ్చు.. చివరకు మంత్రులకు సభ్యులు వేసిన ప్రశ్నకు సైతం.. జవాబును సంబంధిత మంత్రితో మొదలుపెట్టించడం.. 5 నిమిషాలు గడవకముందే చంద్రబాబు జోక్యం చేసుకొని.. గంటల తరబడి మాట్లాడటం షరామామూలుగా ఉండేది. రాజకీయం మొత్తం అంతా తన చుట్టూనే తిరగాలన్న బాబు యావ వల్ల.. ప్రభుత్వంలో ఎవ్వరూ తమ శాఖలపై మనసుపెట్టి పనిచేయని పరిస్థితి. రాష్ట్రంలో తుపాన్లు, వరదలు వస్తే బాబు తక్షణం అక్కడకు వెళ్లిపోయేవారు. తుపాను ప్రాంతంలో కూర్చొని అధికార యంత్రాంగంతో పునరావాస పనులను తానొక్కడే కష్టపడి పనిచేయిస్తున్నట్లు వార్తలు రాయించుకునేవారు. 2015లో సంభవించిన ‘హుద్హుద్’ తుపాను వల్ల విశాఖ దెబ్బతింటే.. అక్కడే తను ఉండి.. విశాఖను బాగుచేశానని, అది తన ఘనతేనని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఎవరికీ పేరు రాకూడదు. తానొక్కడే హైలైట్ కావాలి. ఇదీ బాబు ఆలోచనా విధానం. విజన్లేని చంద్రబాబు చంద్రబాబు గొప్ప ‘విజన్’ ఉన్న నాయకుడన్న ప్రచారం కూడా అనుకూల మీడియా సృష్టే. చంద్రబాబు 1999లో ‘విజన్ 2020’ అనే ఓ దార్శనిక పత్రాన్ని మెకిన్సే అనే విదేశీ సంస్థతో తయారు చేయిం చారు. 20 ఏళ్లల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వర్ణగ్రామాలు (బంగారు గ్రామాలు)గా, అన్ని పట్టణాలను స్వర్ణపట్టణాలు చేసి.. అంతి మంగా రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తానని అందుకు కొన్ని లక్ష్యాలను ఏర్పర్చుకున్నానంటూ గొప్ప కలను ఆవిష్కరించారు. దీంతో 20 ఏళ్లూ తనకే ప్రజలు అధికారాన్ని అప్పజెబుతారన్నది చంద్రబాబు లాజిక్. కానీ కొన్ని రోజుల్లోనే చంద్రబాబు విజన్ అంతరార్థం బయట పడింది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంతోనూ, విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచడంతోనూ పెద్దఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి కోసం పేదలు, కూలీలు వలస బాటపట్టడంతో వేలాది గ్రామాలు వల్లకాడుగా మారాయి. ఆ సందర్భం లోనే ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ ప్రజల కడగండ్లను పాట రూపంలో కళ్లకు కట్టి.. ప్రజల కళ్లు తెరిపించారు. కరవుకాలంలో వేల కోట్లతో క్రీడల నిర్వహణ చంద్రబాబు విజన్ ఎంత గొప్పదంటే.. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే.. హైదరాబాద్ గచ్చిబౌలిలో తన అనుయాయులు ముందుగానే కారుచౌకగా కొన్న భూములకు విలువ పెంచడం కోసం.. జీఎంసీ బాలయోగి స్టేడియంను నిర్మించి.. దానిలో జాతీయ క్రీడలు, ఇండోఆఫ్రికన్ క్రీడల్ని నిర్వహించారు. ఆ వంకతో గచ్చిబౌలి, పరిసర ప్రాంతాలలో వందల కోట్లు ఖర్చు చేసి భారీగా మౌలిక వసతులు తీర్చిదిద్దారు. క్రీడోత్సవాలు నిర్వహించాక క్రీడాకారుల కోసం కట్టిన అపార్ట్మెంట్లను వేలం వేశారు. ఆ తర్వాత కొన్ని ఐటీ కంపెనీలను అక్కడే నెలకొల్పారు. ఫలితంగానే.. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి ఎగసి.. తర్వాతి కాలంలో మురళీమోహన్కు చెందిన జయభేరిలాంటి సంస్థలకు,బాబు బినామీలకు లాభాలపంట పండించాయి. బాబు ‘విజన్’ కేవలం, తను, తన సన్నిహితులు బాగుపడడానికి రూపొందించినదే. విజన్ ఉన్నది వైఎస్సార్కే రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల గురించి తపిం చిన ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, పేద బడుగుబలహీన వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్, సాగునీటి రంగానికి ప్రాధాన్యం కల్పించడం, పేద వృద్ధాప్య, వితంతు పెన్షన్ల మొత్తాన్ని పెంచడం.. సబ్సిడీ బియ్యం ధర తగ్గింపు.. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించి దార్శనికత కలిగిన నాయకుడిగా ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకోగలిగారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్నైనా.. దేశంలో ఏ ప్రభుత్వమైనా అమలు చేస్తున్నదా? చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అధికారాన్ని పూర్తిగా దుర్విని యోగం చేశారు. హైదరాబాద్లో లాగే అమరావతిలో కూడా అదే ఫార్ములా అమలు చేయడానికి ప్లాన్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కారు చౌకగా సుమారు నాలుగున్నర వేల ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. కానీ తన పాలనలో జరగని అభివృద్ధిని కొత్త ప్రభుత్వం లక్షాపాతిక కోట్ల నిధులను కుమ్మరించి చేయాలని డిమాండ్ చేయడంలో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం ఒక్క పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని, రైతులిచ్చిన భూముల్లో 5,000 ఎకరాలను అమ్మితే.. 2.25 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చంద్రబాబు లెక్కలు చెబుతున్నారు. అంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తను, తన అనుయాయులు కారుచౌకగా అమరావతి చుట్టుపక్కల కొనుక్కున్న సుమారు 4,500 ఎకరాలకు 2 లక్షల కోట్లు వస్తుం దని చంద్రబాబు ఒప్పుకున్నట్లయింది. కనుకనే, అమరావతిలోనే.. రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు మొండిగా వాదిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మిగతా ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు. అమరావతిలో తమ భూములకు విలువ పెరగాలన్నదే చంద్రబాబు పంతం. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబును పాలనాదక్షుడిగా చిత్రీకరించిన అనుకూల మీడియా.. ప్రస్తుతం చంద్రబాబు సాగిస్తున్న కృత్రిమ ఉద్యమానికి కూడా గొడుగుపడుతున్నది. విజ్ఞులైన ప్రజలు అన్నీ గ్రహిస్తారు! సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి -
ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు
-
సీఎం జగన్ చేతికి ఎముక ఉందా?
సాక్షి, రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి నాయకుల వల్లే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. అడగకుండానే సీఎం జగన్ అన్నీ చేసేస్తున్నారని, ఆయన చేతికి ఎముక ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోందని అన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ... అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. తాను రెండుసార్లు మంత్రిగా పనిచేసినా రాయచోటిలో ఇంత అభివృద్ధి చేయలేకపోయానని, ఇందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు. ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్బాషా అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలల్లోనే వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. (చదవండి: రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం) -
‘బాబు వల్ల ఏపీకి విభజన కంటే ఎక్కువ నష్టం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి అంతా అబద్దమని తేల్చి చెప్పారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు మదిలో రాజధాని ఆలోచన వచ్చిందని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాల కంపు అని... ఆయన అవినీతి హిమాలయాలంత అని ఘాటుగా విమర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ‘నాడు మోదీని తిట్టి నేడు ఆయన కాళ్లు పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి కాళ్లబేరానికి దిగాడు. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. చంద్రబాబు, పవన్లు బీజేపీని ఎందుకు విమర్శించరు? అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన మా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. ఎంత మంది అడ్డుపడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తార’ని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. -
'సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదు'
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవివేకమని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి పలుమార్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోలేదా అంటూ గుర్తుచేశారు. జగన్ నేరస్తుడు కాదని, ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వైఎస్ జగన్కు ఉండడంతో కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకున్నారు. సీబీఐ చెప్పిందే చివరి నిర్ణయం కాదని , పైకోర్టులు ఇచ్చే తీర్పే అసలు నిర్ణయం అని వెల్లడించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్న చింత లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్ట్లను ఏర్పాటు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అనేకసార్లు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనకు చిల్లర పార్టీల మద్దతు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక అక్రమంగా తవ్వించినందుకు రూ.100 కోట్ల ఫెనాల్టీ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తప్పు చేస్తే అడిగే హక్కు ఎవరికైనా ఉందని, కానీ తప్పు చేయకుండానే తప్పుడు వార్తలు రాసే పత్రికలపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన ఘనత దేశ చరిత్రలో పవన్కల్యాణ్కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టే కార్యక్రమాలను భుజానికెత్తుకునే పవన్కు జగన్ నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. -
‘టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య ప్రశంసించారు. పెట్టుబడి సహాయంగా రైతు భరోసా డబ్బులను నేరుగా ఖాతాల్లోకి వేయడంతో రైతులంతా ఆనందంగా ఉన్నారని చెప్పారు. నిన్ననే ప్రారంభమైన రైతు భరోసా పథకంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను నిలువునా ముంచిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చి రైతులు అల్లాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లో దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ను చంద్రబాబు వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబుకు సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు. గడువు కంటే ముందే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్ను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నవరత్నాలను నవగ్రహాలు అని చంద్రబాబు అనడం సిగ్గు చేటన్నారు. గతంలో చేసిన అవినీతి, కుంభకోణం బయటపడుతుందనే మోదీ అంటే ద్వేషం లేదంటూ చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందితే జుట్టు.. అదకపోతే కాళ్లు పట్టుకునేవాడిలా చంద్రబాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. మధ్యవర్తిత్వం కోసమే బ్రోకర్లను, బినామీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపించారు. దీనికంటే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుందని సూచించారు. చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసే అబాసుపాలు కావడం తప్పదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. -
క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?
సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని ప్రజలు శిక్షించి 23 సీట్లకు పరిమితం చేసినా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధానకార్యదర్శి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్లలో చేసిన దరిద్రపాలన గురించి మరిచిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతికి వెళ్ళినప్పుడు సీఎం సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు. సంతకం అనేది జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత విషయం. మనిషికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం. జగన్మోహన్రెడ్డి ఒక్క తిరుపతినే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సంతకం చేయకపోతేనే తప్పుపట్టాలి. మరి మీరు చేసిన సంతకాల పరిస్థితి ఏమిటి? రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపుల రద్దు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చేశారు. కానీ ఏ ఒక్క సంతకాన్ని అమలు చేయలేదు. నీచ సంస్కృతికి చంద్రబాబు విషవృక్షం లాంటివాడు. ఎన్టీఆర్పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కాదా? టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్రెడ్డి, ఆయన కుటంబసభ్యులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయించలేదా? ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. లోకకల్యాణం కోసం జగన్మోహన్రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందుకు ఎల్లో మీడియా సహకరిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యనిషేధానికి చర్యలు తీసుకుంటుంటే అభినందించకపోగా ఇష్టారాజ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్రస్తుతం టీడీపీ అనేది ముగిసిన అధ్యాయం. మోదీని జగన్ కలిస్తే కేసుల కోసమని మాట్లాడతారా? కేంద్రంలో మోదీ రెండోసారి గెలిచి అధికారంలోకి రావడంతో తనకు ముప్పు రాకుండా చంద్రబాబు తన కోవర్ట్లను బీజేపీలోకి పంపింది వాస్తవం కాదా? పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పడం మర్చిపోయారా? మోదీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మోదీపై చేసిన విమర్శలపై బీజేపీ నాయకులు స్పందించాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కాదా? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా? కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా?’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు. -
‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఎగ్జిట్ పోల్ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీర్ణియించుకోలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారమని ఆరోపించారు. ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు. జాతీయ నేతలు పిలవకున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం లేదంటున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటన్నారు. విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కకు పెట్టారన్నారు. చంద్రబాబుకు దేశంలో ఎక్కడ విలువలేదని, ఎంత తిరిగిన ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పవన్.. కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారు?
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అవినీతిని ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిని ఎందుకు ప్రశ్నించడంలేదని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ వైఫల్యాలను చెప్పకుండా ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వైఫల్యంపై అధికార పార్టీని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ల చీకటి ఒప్పందం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ల మధ్యవర్తిగా లింగమనేని రమేష్ పనిచేస్తున్నారన్నారు. తన వరకు మాట్లాడుకొని 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదని, ఈ సారి రహస్య ఒప్పందాలతో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుందంటున్న పవన్.. కేసీఆర్ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు, అవినీతి అన్ని పవన్కు తెలుసనని, అయినప్పటికీ అతను ప్రశ్నించడం లేదని విమర్శించారు. మరోసారి మోసం చంద్రబాబు, పవన్లు కుట్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. (జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల మార్పులు!) -
‘మహానాడులో అవినీతిపై తీర్మానం చేయాల్సింది’
సాక్షి, కడప : అత్యాచారాల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటిని అరికట్టలేకపోతుందని విమర్శించారు. అయినా మహిళా ఎమ్మార్వోపై టీడీపీ నేతలు దాడి చేసినపుడు వారిని వెనకేసుకొచ్చిన చంద్రబాబు నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు.. జాబు లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రామచంద్రయ్య మండిపడ్డారు. ఒకపక్క కరువు రహిత రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటూనే మరో పక్క కరువు మండలాలు ప్రకటించడం చంద్రబాబుకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. మహానాడుకు ప్రజల సొమ్మును వాడుతున్నారు.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని రామచంద్రయ్య విమర్శించారు. మహానాడుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపై నిలదీస్తే ప్రతిపక్షాలు అభివృద్దికి అడ్డుపడుతున్నాయంటూ ఎదురుదాడి చేస్తారని విమర్శించారు. రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కుని వారికి ఇంతవరకు న్యాయం చేయలేదని రామచంద్రయ్య ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. మహానాడులో అవినీతిపై కూడా ఒక తీర్మానం చేసి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. -
బాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడింది
-
‘ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా?’
సాక్షి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీనా?.. సోమవారం చంద్రబాబు చేసిన ర్యాలీ ప్రభుత్వానిదా..? పార్టీదా..? నాలుగేళ్లు ఘోరాలు, పాపాలు చేసి ఇప్పుడు ర్యాలీలు చేస్తారా..? కాల్ మనీ కేసు రిపోర్ట్ ఏమైంది? ఎవరినైనా అరెస్టు చేశారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3000 అత్యాచార ఘటనలు జరిగాయని, వాటిపై తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు రక్షణ ఇచ్చింది చంద్రబాబేనని, ఇపుడు మహిళలకు రక్షణ అంటే నమ్మేదెవరన్నారు. చంద్రబాబు మానస్థిక పరిస్థితి బాగానే ఉందా అని ఎద్దేవా చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదిక.. చంద్రబాబు వాయిస్సే నని తేల్చింది కాబట్టి బాబు గౌరవంగా పదవి నుంచి తప్పుకోవాలన్నారు. -
‘చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేరు’
సాక్షి, కడప: తన రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని బూచిగా చూపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన తప్పటడుగులతోనే సాగుతోందన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయలేరని, ఎవరో ఒకరికి కూటమిగా ఏర్పాటు చేసుకునే అధికారంలోకి వస్తున్నారన్నారు. చంద్రబాబు పొత్తు కారణంగా బీజేపీ బలైంది.. తన వ్యక్తిగత వైఫల్యాలు పక్క దారి పట్టించేందుకు చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని ప్రజలు గుర్తించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏం నేరవేర్చారో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలన డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి దీక్ష చేయడం ఏంటని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిపారు. చంద్రబాబు లీకులు మాత్రమే ఇస్తారని, నేరుగా చెప్పరని రామచంద్రయ్య పేర్కొన్నారు. -
నిరర్థక పాలనకు నాలుగేళ్లు!
నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలన దేశ ప్రజలకు ఓ చేదు అనుభవం. నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్నడూ లేని విధంగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ప్రజల ముందుకు రావడం, ప్రతిపక్ష పార్టీలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి నోటీసులు అందించడం వంటి పరిణామాలు గమనిస్తే.. మోదీ పాలనలో ఈ దేశం ఏ దిశగా పయనిస్తున్నదో అర్థం అవుతుంది. ముఖ్యంగా, రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం నీరుగారుస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆవేదన కలిగించక మానదు. రాజకీయాలలో పోలికలు అనివార్యం. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 5వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా దేశంలో వివిధ రంగాలలో కనిపించిన ప్రగతిని, గత ప్రభుత్వాలు సాధించిన విజయాలతో బేరీజు వేయడం అనివార్యం. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే.. 1991లో దేశ ప్రధానిగా పి.వి.నరసింహారావు పదవీబాధ్యతలు చేపట్టేనాటికి, దేశంలో ఆర్థికంగా, సామాజికంగా దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న వాస్తవం అందరికీ తెలుసు. తన 5 ఏళ్ల పదవీకాలంలో పీవీ దేశాన్ని కష్టాల కడలి నుంచి ఒడ్డుకు చేర్చడం భారతదేశ చరిత్రలో ఓ విశిష్ట అధ్యాయం. అలాగే.. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి మన్మోహన్సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంపై సంక్షోభ ప్రభావం పడకుండా సురక్షితంగా కాపాడగలిగింది. దేశాన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులకు ఏవిధంగా తెచ్చారో చెప్పుకోవడానికే ఈ రెండు ఉదాహరణలు.. ఇందుకు పూర్తి విరుద్ధంగా 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టినపుడు దేశంలో ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మరో పార్టీ మద్దతు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని నడపగలిగే స్థానాలు బీజేపీకి లభించాయి. అలాగే, అంతర్జాతీయ ముడి చమురు ధరలు అధ:పాతాళానికి చేరాయి. దానివల్ల విదేశీ మారకద్రవ్యం నిల్వలు పెరగడానికి ఆస్కారం కలిగింది. మరోవైపు చైనాకు ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటు సాధిస్తూ ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మార్కెట్గా అవతరించిన దశ అది. ఈ సానుకూలతలు అధికారం చేపట్టగానే నరేంద్రమోదీకి స్వాగతం పలికాయి. ఆర్థికరంగంతోపాటు అన్ని రంగాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలిగిన అద్భుత అవకాశాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నరేంద్రమోదీ వాటిని సద్వినియోగం చేసుకోకపోవడమే ఓ పెద్ద విషాదం. తప్పుడు నిర్ణయాలు, పనికిమాలిన సాహసాలతో.. మోదీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. ఫలితంగానే.. స్వయంకృతాపరాధంతో ప్రభుత్వంలోని చివరి సంవత్సరంలో ఇంటాబయటా అనేక సమస్యలతో నరేంద్రమోదీ, అమిత్షాల ద్వయం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నెరవేర్చని ప్రధానహామీలు ఎన్నికల ముందు నరేంద్రమోదీ ‘అవినీతి’ని తమ ప్రధాన ఎన్నికల ఎజెండా చేసుకొని లబ్ధి పొందారు. యూపీఏ హయాంలో ఎన్నో స్కామ్లు జరిగాయని, లక్షల కోట్ల నల్లధనం విదేశాలకు తరలిపోయిందని ప్రచారం చేసిన మోదీ చట్టాలను సవరించి స్విస్ బ్యాంకుల్లో పోగుపడిన నల్లధనాన్ని 100 రోజుల్లోనే వెనక్కు తెప్పించి ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని వాగ్దానం చేశారు. 100 రోజులు కాదు కదా.. నాలుగేళ్లు గడిచినా ఆ హామీ నెరవేరలేదు. ఎందుకు నెరవేర్చలేదో మోదీ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. మోదీ పాలనలో అసలు బ్యాంకింగ్ వ్యవస్థపైనే ప్రజలు క్రమంగా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు ఎంతో బలిష్టంగా కనిపించిన భారత బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడపై నీలినీడలు కమ్ముకొన్నాయి. అప్పులు తీసుకొని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్మాల్యా, నీరవ్మోదీ, మోహుల్చోక్సీ వంటి నిందితులు విదేశాలకు పారిపోయి.. ‘చేతనైతే పట్టుకోండి చూద్దాం’ అన్నట్లు సవాల్ విసురుతుంటే.. ప్రభుత్వం నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తోంది. ప్రస్తుతం నగదు కొరతతో ఏటిఎంలు మూతపడగా.. సామాన్య ప్రజలు, రైతులు తాము దాచుకొన్న సొమ్మును ‘విత్డ్రా’ చేసుకోలేని విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి, మరికొన్ని ప్రయోజనాలు సాధించడానికంటూ.. ప్రధాని మోదీ తీసుకొన్న ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా, ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 100 మందికి పైగా అభాగ్యులు ఎటీఎం క్యూలలో నిల్చొని, బ్యాంకుల వద్ద పడిగాపులు పడి ప్రాణాలు విడిచారు. నోట్ల రద్దు నిర్ణయం అన్ని రంగాలను దెబ్బ తీసింది. దేశవ్యాప్తంగా, అసంఘటిత రంగంలో, ఇతర చిన్న మధ్యతరహా పారిశ్రామిక రంగాల్లో 15 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయి. చిన్న వ్యాపారస్థులు చితికిపోయారు. నోట్లరద్దు నిర్ణయం తర్వాత సమాజంలో అలజడి, భయాందోళనలు రేకెత్తాయి. నెలరోజుల్లో అంతా సర్దుకొంటుందని మోదీ చెప్పిన మాట ఆచరణలో సాధ్యం కాలేదు. పెద్దనోట్ల రద్దు తర్వాత.. దొంగ నోట్ల సమస్య సమసిపోతుందని, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని, 6 నెలల్లో సమాజం యావత్తు ‘నగదు రహితం’ గా రూపాంతరం చెందుతుందని మోదీ, అరుణ్జైట్లీలు నమ్మకం చెప్పిన మాటలు.. గాలికి పేలాలపిండి కొట్టుకుపోయిన చందం అయ్యాయి. నోట్లరద్దు తర్వాత ప్రజలకు ఎదురైన చేదు అనుభవం ‘జీఎస్టీ’. కాంగ్రెస్తో సహా దేశంలో ఎవ్వరూ జీఎస్టీని ఎవ్వరూ వ్యతిరేకించలేదు. కానీ, తప్పుల తడకగా, ముందు వెనుకా ఆలోచించకుండా జీఎస్టీని ప్రజలపై రుద్దారు. ఒకే దేశం, ఒకే పన్ను అనే నినాదంతో ప్రవేశపెట్టిన ‘జీఎస్టీ’ ని అత్యంత సంక్లిష్టంగా మార్చారు. పైగా, సమాఖ్య సహకార స్ఫూర్తిని కాలరాసేవిధంగా జీఎస్టీ పరిధి బయట అనేక సెస్సులు విధించారు. ప్రభుత్వ పనితీరును కొలమానంగా నిలిచే అంశాల్లో ఎగుమతుల రంగం కీలకమైనది. 2013–14లో భారతదేశం చేసిన ఎగుమతుల విలువ 314 బిలియన్ డాలర్లు. రెండేళ్లు గడిచేసరికే, అంటే 2016–17 నాటికల్లా ఎగుమతుల్లో 13% క్షీణత నమోదై ఆదాయం 276 బిలియన్ల డాలర్లకు తగ్గిపోయింది. యూపీఏ పదేళ్ల పాలనలో ఎగుమతుల్లో 400% వృద్ధిని సాధించగా.. మోదీ ప్రభుత్వం దిగుమతుల్లో మాత్రమే నిలకడైన వృద్ధిని నమోదు చేస్తోంది. ఆర్థిక రంగానికి ఈ పరిణామాలు శరాఘాతం వంటివి. ఎన్డీఏ చెప్పుకొంటున్న 7% ఆర్థికాభివృద్ధి రేటు అన్నది పాత విధానంలో లెక్కిస్తే 5% మాత్రమే. సంక్షేమరంగంలో సంక్షోభం ఎన్డీఏ ప్రవేశపెట్టిన వరుస బడ్జెట్లను పరిశీలించినట్లయితే.. షెడ్యూల్ కులాలు, తరగతులు మైనార్టీలు, మహిళల సంక్షేమానికి కేటాయింపులు బాగా తగ్గాయి. ప్రభుత్వ సంక్షేమ పపథకాలు లబ్ధిదారులకు పాదర్శకంగా అందడానికి గత యుపిఏ ప్రభుత్వం ‘ఆధార్’ కార్డును ప్రవేశపెట్టగా.. ఇపుడు అదే ఆధార్ను నియంత్రణ సాధనంగా ఉపయోగిస్తూ.. నిరుపేదలకు ఆధార్ లింక్ లేదనే నెపంతో.. వారికి అందాల్సిన సంక్షేమ ఫలాల్ని దూరం చేయడం గమనార్హం! యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామన్న హామీ నిరవేరలేదు. ప్రస్థుతం, ఒక అంచనా ప్రకారం ప్రతిరోజూ 30,000 మంది యువత జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తుంటే.. కేవలం 450 మందికి మాత్రమే లభిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని గట్టెక్కించి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న హామీ ఆచరణలో ఘోరంగా విఫలమైంది. జాతీయ సర్వేల గణాంకాల ప్రకారం ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు 50% మేర పెరిగాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కనీస మద్ధతు ధరలను స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు పెంచవలసి ఉండగా.. గత 4 ఏళ్లల్లో సగటున 7% మాత్రమే పెంచారు. యుపిఏ 10ఏళ్ల పాలనలో రైతుల ఆదాయం 40% మేర పెరిగింది. ఎంతో ఘనంగా చెప్పుకొన్న ప్రధాని బీమా యోజన, కృషి సంచాయి పథకం వంటివి రైతులకు ఏ మాత్రం మేలు చేయలేకపోతున్నాయి. ఇరుగుపొరుగు దేశాలతో దిగజారుతున్న సంబంధాలు భారతదేశం స్వయంగా వలసవాద ఇక్కట్లను, ఆర్థిక వనరుల దోపిడిని, జాతివివక్షను ఎదుర్కొన్న ఫలితంగా ఆ అనుభవాల నుంచి ఆదర్శాలు, వాస్తవాల కలబోతగా పండిట్ నెహ్రూ భారతదేశం విదేశాంగ విధానానికి బలమైన పునాదులు వేశారు. అందుకే పండిట్ నెహ్రూ మొదలుకొని వాజ్పేయి వరకూ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ప్రధానిగా ఉన్నా.. భారతదేశ విదేశాంగ విధానంలో పెద్దగా మార్పు లేకుండా సాగింది. అయితే, మోదీ అధికారం చేపట్టాక అనుసరిస్తున్న విదేశాంగ విధానికి దారితెన్నూ లేకుండా పోయింది. ఇరుగుపొరుగు దేశాలతో భారత్ సంబంధాలు బలహీనపడ్డాయి. పాకిస్థాన్, చైనాలతోనే కాక.. సామాజికంగా, సాంస్కృతికంగా, చరిత్రాత్మకంగా బలమైన సంబంధాలు కలిగిన నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలతోగల సంబంధాలు కూడా సమస్యాత్మకంగా మారడం చూస్తున్నాం. గత 4 ఏళ్లల్లో దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు బాలికలు, మహిళలపై అత్యాచార ఘటనలపై అంతర్జాతీయ సమాజంలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్లో జరుగుతున్న సంఘటనలను ఉదహరిస్తూ.. కథనాలు, సంపాదకీయాలు రాస్తున్నాయి. అదేవిధంగా సమతుల్యతతో రాష్ట్రాలకు న్యాయంగా అందించవలసిన పన్నులవాటా పంపిణీని అస్తవ్యస్తం చేసిన కారణంగానే.. దక్షిణాది రాష్ట్రాలు తమకు జరిగిన అన్యాయంపై ఏకత్రాటిపై వచ్చి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నాయి. రాజకీయ అవసరాలను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్రమోదీ కొన్ని రాష్ట్రాలకు పెద్దఎత్తున ఆర్థిక ప్యాకేజీలు అందించి.. మిగతావాటిని నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు విభజన బిల్లు ప్రకారం ఇవ్వాల్సిన ప్రయోజనాలు, ప్రత్యేక తరగతి హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీ మాట తప్పడం, మౌనంగా ఉండటం, రాష్ట్రంలో సాగుతున్న ప్రజా ఉద్యమాలను విస్మరించడాన్ని తెలుగు ప్రజలు సహించరు. నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలన దేశ ప్రజలకు ఓ చేదు అనుభవం. స్వతంత్ర ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థలో కూడా స్తబ్దత నెలకొనడం, నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్నడూ లేని విధంగా తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ప్రజల ముందుకు రావడం, ప్రతిపక్ష పార్టీలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి నోటీసులు అందించడం వంటి పరిణామాలు గమనిస్తే.. మోదీ పాలనలో ఈ దేశం ఏ దిశగా పయనిస్తున్నదో అర్థం అవుతుంది. ముఖ్యంగా, రాజ్యాంగ వ్యవస్థలను నీరు గారుస్తున్న తీరు ప్రజాస్వామ్య వాదులకు ఆవేదన కలిగించక మానదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా ఈ దేశ ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శించారు. అటువంటి సమయం మళ్లీ ఆసన్నమైంది. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ఫోన్: 81069 15555 -
‘చంద్రబాబు అనుభవం దీనికే పనికొచ్చింది’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుభవముందని ప్రజలు ఓట్లు వేస్తే ఆ అనుభవాన్ని దోచుకోవడానికి, దాచుకోవడానికే ఉపయోగించారని కాంగ్రెస్ మాజీ మంత్రి సి. రామచంద్రయ్య విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, దీనికి నిదర్శనం కాగ్ రిపోర్టేనని ఆరోపించారు. అసెంబ్లీ ఆఖరి రోజున కాగ్ రిపోర్ట్ రావడం వల్ల కొన్ని విషయాలు చర్చకు రాలేదని, మొదట్లో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెడితే చర్చకు తావు ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. చంద్రబాబు ప్రపంచం అంతా తిరిగి అప్పులు తీసుకువచ్చారని, ఆ భారం అంతా ప్రజలపైనే పడుతుందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 32 శాతం అప్పులే కట్టాలన్నారు. డబ్బును దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల 2018-19 చివరినాటికి రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. -
బీజేపీ, టీడీపీపై సీఆర్ ఫైర్
వైఎస్సార్ జిల్లా : బీజేపీ, టీడీపీలపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య(సీఆర్) మండిపడ్డారు. కడపలో విలేకరులతో మాట్లాడారు. ‘లోక్ సభలో మెజారిటీ ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీపైన ఉంది. ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాక కచ్చితంగా చర్చ జరిగి తీరాల్సిందే. ఇప్పడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. అప్రజాస్వామిక ప్రభుత్వం కేంద్రంలో ఉంది. వీరికి పాలించే హక్కు లేదు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండటం చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల దించుకునే పరిస్థితి నెలకొంది’ అని ఘాటుగా స్పందించారు. ‘ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నాడు. తన స్వలాభం కోసం కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నేతలను ఢిల్లీకి తీసుకెళ్తా అని అఖిలపక్షం సమావేశంలో చెప్పి ఒక్కడే ఢిల్లీకి వెళ్లాడు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాక అన్ని పార్టీల ఎంపీలు వెళ్లిపోయాక అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుని పోవడం వృధాప్రయాస. ప్రతి దాన్నీ అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు. మోదీ పార్లమెంటుకు దండం పెడితే చంద్రబాబు ఫోటోలకు ఫోజూ ఇచ్చి దండం పెడతావా’ అని ఘాటుగా ధ్వజమెత్తారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేసే రకం చంద్రబాబు అని విమర్శించారు. ఐదు కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన లబ్ది కోసం తెలంగాణ విడదీయాలని లేఖ ఇచ్చి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విడదీసిందని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు చేతకాని తనం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడని అన్నారు. -
సోషల్ మీడియా ‘ఫోబియా’
ఇంతకాలం తమ రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కొన్ని పార్టీలకు, వ్యక్తులకు అనుకూలంగా మలచడంలో తలమునకలుగా ఉన్నవారు తాము కల్పిస్తున్న ‘భ్రమలు’ సోషల్ మీడియా కారణంగా తొలగిపోతాయని భయపడుతున్నారు. తెలుగునాట సోషల్ మీడియా ఓ మాఫియాగా మారిపోతోందని కొందరు తెగ బాధపడిపోతున్నారు. పనిగట్టుకొని సాగిస్తున్న సోషల్ మీడియా దుష్ప్రచారం కొందరు ప్రముఖులకు ప్రాణ సంకటంగా మారిందన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇంతకాలం ప్రధానస్రవంతి మీడియా ఏకచత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇపుడు ఆ పరిస్థితి మారింది. ప్రధాన స్రవంతి మీడియా (మొత్తం కాదు) చేస్తున్న వక్రీకరణలు, వండివారుస్తున్న కథనాలు, నిజాలుగా చెలామణి చేస్తున్న అసత్య వార్తల వెనుకనున్న గుట్టుమట్లను సోషల్ మీడియా ఎత్తి చూపిస్తున్నది. నిజాలేమిటో గ్రహించడానికి ఈ రోజు ప్రజలకు ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. బహుశ ఆ దుగ్ధతోనే కాబోలు ప్రధాన స్రవంతి మీడియాకి చెందిన కొందరు ‘సోషల్ మీడియా’ మొత్తాన్ని ఓ భూతంగా, మాఫియాగా చిత్రీకరిస్తున్నారు. ఏపీ విషయంలో ‘సోషల్ మీడియా’ నిర్వర్తిస్తున్న పాత్రను విశ్లేషించి చూసినపుడు అది మాఫియానా? లేక ప్రజలకు మేలు చేస్తున్న మీడియానా? అన్నది అర్థమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో ప్రసంగిస్తూ ‘‘దేశంలోని రాజకీయ వేత్తల్లో నా అంత సీనియర్ ఎవరూ లేరు’’ అని ప్రకటించుకున్నారు. దేశంలోని సీనియర్ రాజకీయ వేత్తల్లో బాబు ఒకరేగానీ.. ఆయన సీనియర్ మోస్ట్ కాదు. ఈ వాస్తవాన్ని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తాను ప్రజలకు తెలియపర్చకపోతే.. అసెంబ్లీ సాక్షిగా బాబు చెప్పిన అబద్ధమే నిజంగా చెలామణి అయిపోయేది. ముందూవెనుకా ఆలోచించకుండా బాబు తనకి సంబంధించి ఇటువంటి అనేక అసత్యాలను గతంలో ప్రచారం చేశారు. తాజాగా ఏపీ ప్రత్యేకహోదాకు సంబంధించి బాబు పలు సందర్భాలలో మాట మార్చారు. ఆయన ఏయే సందర్భాలలో ఏ విధంగా మాట మార్చిందీ వీడియో క్లిప్పింగ్ సాక్ష్యాలతో సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకోగలిగారు. అదేవిధంగా 2017 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. మీడియా సాక్షిగా బాబు ‘‘రాష్ట్రానికి అన్నీ వచ్చాయి.. ఇంతకంటే ఎక్కువ ఎవరిస్తారు?’’ అంటూ చెప్పిన మాటల్ని హెడ్లైన్స్లో ప్రచురించిన వార్తా పత్రికల క్లిప్పింగులు సోషల్ మీడియా ద్వారా షేర్ కావడంతో.. అధికార పార్టీ నేతల గొంతుకల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ప్రజలకిచ్చిన హామీల విషయంలోగానీ, ప్రత్యేకహోదా ప్యాకేజీల అంశాల్లోగానీ పూటకోమాట, రోజుకో విధానం అవలంభించే బాబు లాంటి రాజకీయనాయకుల ఊసరవెల్లి విన్యాసాల్ని సోషల్ మీడియా ద్వారా సామాన్య ప్రజలు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ‘సోషల్ మీడియా’ను భూతంగా చూపుతున్న ప్రధాన స్రవంతి మీడియాలోని ఓ వర్గం రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించడం ఎప్పుడో మానేసింది. అధికారంలో ఉన్న వారు ఏం చెప్పినా బుద్ధిగా వినడం, రాయడం.. దానిని ప్రజలకు చేరవేయడమే వాటి బాధ్యతగా మారింది. ఇటీవల బాబు.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదని; తాను పరమ పవిత్రంగా రాజకీయాలు చేస్తున్నందునే హాయిగా నిద్రపోగలుగుతున్నానని కొన్ని పత్రికలకు, కొన్ని చానెళ్లకు చెప్పారు. ఆయన మాటల్లోని అసంబద్ధతను రిపోర్టర్లు ప్రశ్నించలేదు. బాబు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు నోటు కేసును ఆ ప్రతినిధులు ప్రస్తావించలేదు. ఎందుకు అడ్డదారుల్లో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాల్సి వచ్చిందో అడగలేదు. బాబు ఏం చెప్పినా అదే శిరోధార్యంగా.. అబద్ధాలను నిజాలుగా జనం మీదకు వదిలే ‘మీడియా’ను ఏమనాలి? అధికారంలోకి వచ్చాక రైతులకు బేషరతుగా చేస్తానన్న రుణమాఫీపై బాబు మాట మార్చారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక హామీలకు మంగళం పాడారు. గతంలో ఇలాంటి విమర్శలు వస్తే వాటిని అవలీలగా తిప్పికొట్టగలిగేవారు. కానీ, నేడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కనుక ఇబ్బందిపడుతున్నారు. ఇక, అమరావతి నిర్మాణానికి సంబంధించి బాబు చేస్తున్న డొల్ల ప్రకటనలు.. సింగపూర్ను మించిన రాజధాని, టోక్యోను మించిన రాజధాని, న్యూయార్క్ను తలదన్నే రాజధాని అంటూ ఏ దేశం వెళితే ఆ దేశాన్ని మించిన రాజధాని కడతానంటూ చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకాలం తమ రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని రాజకీయంగా కొన్ని పార్టీలకు, వ్యక్తులకు అనుకూలంగా మలచడంలో తెలుగునాట తలమునకలుగా ఉన్నవారు తాము కల్పిస్తున్న ‘భ్రమలు’ సోషల్ మీడియా కారణంగా తొలగిపోతాయని ఇప్పుడు భయపడుతున్నారు. అందుకే సోషల్ మీడియా ఫోబియాతో దానిని ఓ మాఫియాగా చిత్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగపర్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే, మొత్తం సోషల్ మీడియానే లేకుండా చేయాలన్న ప్రయత్నాలు మంచిదికాదు. వాస్తవాల విశ్లేషణకు నేడు సోషల్ మీడియానే సామాన్యులకు దిక్కుగా మారిందనడం అతిశయోక్తికాదు. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ఫోన్: 81069 15555 -
‘ప్రధానిగా రాహుల్ తొలి సంతకం దానిపైనే’
సాక్షి, కడప: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి పోరాడుతూనే ఉందని చెప్పారు. చట్టసవరణ చేసైనా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. పార్లమెంట్లో విభజన హామీలపై చర్చ జరపకుంటే చరిత్ర హీనులవుతారని ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని చివరి అస్త్రంగా ఉపయోగిస్తామన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అవకాశవాది: సీఆర్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మొదటి లేఖ రాసింది సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు అధిక సంఖ్యలో వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాదని, అవకాశాన్ని బట్టి ఆయన మారిపోతుంటారని దుయ్యబట్టారు. భూములు కబ్జా చేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. -
‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేందుకే
వైఎస్సార్ జిల్లా : ‘ఓటుకు నోటు’ కేసు నుంచి బయటపడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపు, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరశనగా రాయచోటిలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ తీసింది. ఈ ర్యాలీలో రామచంద్రయ్య పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ..బడ్జెట్ కేటాయింపు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బాబు నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. 16 నెలల పాటు చంద్రబాబు నాయుడికి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని, ఇది చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. బీజేపీతో జగన్ చెలిమికి తహతహలాడున్నాడని చంద్రబాబు విష ప్రచారం మొదలుపెట్టాడని అన్నారు. బాబు నిజాయతీ పరుడైతే నాలుగేళ్లుగా మతతత్వ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎలా కొనసాగుతున్నాడని సూటిగా అడిగారు.? -
'బాబుపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ దుస్థితి'
సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల అజెండాగా మారిందని, కేంద్రం వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. ప్రజల అజెండాగా మారిన ప్రత్యేక హోదాపై రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు వైఎస్ జగన్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇస్తుంది. మొదటి నుంచీ విభజన హామీల్లో పేర్కొన్న అంశాలను తీర్చాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. ప్రత్యేక హోదా అంశంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కోటి సంతకాలను సేకరించాం. మొదటి నుంచి కూడా ఏపీ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిస్తూనే ఉంది. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటున్నారే తప్ప దాని వల్ల కలిగే లాభాలను మాత్రం ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిల్లో అరుంధతి నక్షత్రం మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీ కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్కు తాను తెచ్చినన్ని నిధులు ఏ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడం నిజం కాదా?.. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయి. విభజన హామీల కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోకుండా ఒక్కడే పోయి ఏం తెచ్చి పెట్టాడో చంద్రబాబుకే తెలియాలన్నారు. సీఎం చంద్రబాబు ఇంతవరకూ అఖిలపక్షం నిర్వహించక పోవడం దారుణం. హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తుంటే ఆ అంశంపై సైతం దుష్ప్రచారం చేయడం శోచనీయం. నిజం చెప్పాలంటే చంద్రబాబుపై ఉన్న కేసుల వల్లే ఏపీకి ఈ గతి పట్టింది. చంద్రబాబు తనపై ఉన్న కేసుల భయంతోనే కేంద్రాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జేఏసీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. పెద్ద నేతలను ఇటువంటి వాటికి వాడుకోవడం సమంజసం కాదని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య హితవు పలికారు. -
వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
-
‘వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నాం’
వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామాపై వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామని కాంగ్రెస సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్లు తెరిచి అందరితో కలిసి హోదా కోసం పోరాడాలని సూచించారు. జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెక్కలపై కమిటీ కాకుండా జరిగిన అన్యాయంపై కమిటీ వేయాలని సూచించారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీపై పోరాటం చేయాలని కోరారు. -
‘చంద్రబాబుపై కేసులే ప్రజలకు శాపం’
సాక్షి, కడప: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపారని కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హక్కు పూర్వకంగా వచ్చేవి కూడా ఇవ్వలేదని, ఏపీని కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు లేవు.. కడప ఉక్కు పరిశ్రమ ఊసేలేదు, రైల్వేజోన్ ప్రకటనే లేదని వాపోయారు. ఎంపీలు, కేంద్రమంత్రులు ఉన్నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడకపోవడం శోచనీయమన్నారు. రాష్టానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా చూస్తూ కూర్చున్న ఏకైక ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాడు ఎన్టీఆర్ నిలబెడితే ఇప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. చంద్రబాబు చేతకానితనం ఆయనపై ఉన్న కేసులు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయని అన్నారు. ఇంకెంతకాలం చంద్రబాబు నాటకాలు ఆడతారని సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికితే చాటు సంబరాలు చేసుకునే స్థితికి టీడీపీ నాయకులు దిగజారారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసే వ్యక్తులు, విదేశీ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు ఎగ్గొట్టిన నాయకులు కేంద్ర మంత్రులుగా ఉండటం బాధాకరమన్నారు. ఇటువంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. -
‘చంద్రబాబు వల్లే రెండుగా చీలిన బీజేపీ’
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు కారణంగా ఏపీలో బీజేపీ రెండుగా చీలిందని కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమాల గురించి కేంద్రానికి గవర్నర్ నరసింహన్ చెప్పడంతో ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులతో లేఖ రాయించారని అన్నారు. ‘నీ కులతత్వం, అరాచకాలు, దుర్వినియోగం, అవినీతి.. వీటన్నిటి గురించి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ చెప్పడంతో.. నీ బీజేపీ మిత్రులతో లేఖ రాయించావు. నీవల్ల బీజేపీ కూడా రెండుగా చీలింద’ని చంద్రబాబుపై రామచంద్రయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బాబు చేతకానితనం, ఓటుకు కోట్లు కేసులో దొరకడంతో ఆంధ్ర ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. క్రిమినల్ కేసులో దోషివి కాబట్టే కేంద్రానికి భయపడుతున్నారని ఆరోపించారు. విభజన హామీలు ఎందుకు సాధించలేకపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. ఏపీని నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో చంద్రబాబు నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల పాలనలో ఆయన చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే నైతికత బాబుకు లేదని, టీడీపీలోనే సామర్థ్యం ఉన్న మరో నాయకుడికి సీఎం పదవి కట్టబెట్టాలని సలహాయిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా చంద్రబాబే అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. కాగా, ఏపీ కొత్త గవర్నర్ను నియమించాలని కేంద్ర హోంశాఖకు విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఈనెల 11న లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లోపు కొత్త గవర్నర్ రావాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. -
అనుభవం నీడలో ‘బాబు’ వైఫల్యాలు
చంద్రబాబుకు చాలా అనుభవం ఉండవచ్చు కానీ, దాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న! ప్రత్యేకహోదా వదులుకోవడంలోనా? కేంద్ర నిధుల్ని సాధించలేక పోవడంలోనా? ఫిరాయింపుల్లో ఆరితేరిపోవడంలోనా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ ధోరణి రోజు రోజుకు వికృతరూపం దాలుస్తున్నది. అందుకు జన్మభూమి కార్యక్రమాల నిర్వహణ తీరుతెన్నులే అతిపెద్ద ఉదాహరణ. ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహించే జన్మభూమి కార్యక్రమాల్ని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా ఉపయోగించుకోవడం అందరికీ కన్పిస్తూనే ఉంది. రాజ్యాంగ పరంగా గ్రామీణ ప్రాంతంలో అయితే సర్పంచ్, పట్టణ ప్రాంతంలోనైతే కార్పొరేటర్ అధ్యక్షత వహించాల్సిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో వారెక్కడా కన్పించడం లేదు. జన్మభూమి సభా వేదికలో బాబు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కడపజిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం బాబు అనుసరించిన వైఖరి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. జన్మభూమి అభివృద్ధి వేదికలేతప్ప రాజ కీయ వేదికలు కాదని సుద్దులు చెబుతున్న సీఎం ఎందుకు పులివెందులలో జరిగిన జన్మభూమి వేదిక నుంచి రాజకీయాలు మాట్లాడారు? గండికోట ప్రాజెక్టుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే రూపకల్పన జరిగిందని.. రూ. 1,300 కోట్లల్లో రూ. 1,100 కోట్లు ఖర్చు చేశారని కడప లోక్సభ సభ్యుడు అవినాష్రెడ్డి వివరిస్తుంటే, ఆయనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? బాబు మాట్లాడుతున్న ప్రతిమాట, వేస్తున్న ప్రతి అడుగు రాజ్యాంగ విరుద్ధంగా సాగిపోవడాన్ని ఎవరైనా ఎలా సహించగలరు? వ్యక్తిగత స్వార్థంతో పనిగట్టుకొని పాలనా వ్యవస్థల్ని పతనావస్థకు చేరుస్తుంటే ఏవిధంగా ఉపేక్షించగలం? గత మూడున్నరేళ్లుగా శీతాకాల శాసనసభా సమావేశాల్ని 45 రోజులు మించి నడపని ప్రభుత్వం.. ఈసారి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ సమావేశాల్ని బహిష్కరించడంతో, సభను ఏకపక్షంగా 12 రోజులపాటు నడిపారు. సభలో ఎటువంటి నిర్మాణాత్మకమైన చర్చ లేకుండానే మొత్తం 16 బిల్లులు ఆమోదించుకొన్నారు. ఒక్క రోజు లోనే 10 బిల్లుల్ని చుట్టేశారు. రాష్ట్రంలో 12%గా ఉన్న ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదు? ఎస్టీలకు మంత్రి ఉండాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని గంపగుత్తగా ఒకటో, రెండో కులాలకు పందేరం చేయకుండా అందరికీ సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? కాపులకు 5% రిజర్వేషన్లు అందించే అంశంలో జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ నివేదిక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించక ముందే.. కమిషన్లో మెంబర్ సెక్రటరీగా ఉన్న ఓ వ్యక్తి ద్వారా దొడ్డిదారిన నివేదికను తెప్పించుకొని.. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన తీరు బాబు రాజకీయ ఎత్తుగడగానే కనిపించింది తప్ప కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి గోచరించలేదు. పైగా, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం కేంద్రానికి ఇప్పటివరకూ అందకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ‘పోలవరం’ ప్రాజెక్టును తలకెత్తుకోవడంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యం కంటే, వేలకోట్ల ముడుపులు దండుకోవడానికి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చెప్పుకోవాలన్న బాబు దుర్భుద్ధి కారణంగానే.. నేడు ‘పోలవరం’ వివాదాస్పదంగా మారింది. అయితే.. పోలవరం అంశంలో.. కేంద్ర ప్రభుత్వం.. బాబు రాజకీయ ఉచ్చులో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేకపోవడంతోనే.. ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా తీగతోపాటు డొంకంతా బయటకు వస్తోంది. ప్రభుత్వంలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతిపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం అందినందునే.. పోలవరంతో సహా అనేక పథకాలకు కేంద్రం నిధుల మంజూరును నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వైపునుంచి ఇవ్వాల్సిన యుటిలిటీ సర్టిఫికేట్లు (యుసిలు) అందించకపోవడం, ప్రభుత్వపరంగా చొరవ లోపించడంతో.. పోలవరంతోపాటు అనేక పథకాలకు కేంద్ర నిధులు తగ్గిపోయాయి. మొత్తం 45 కేంద్ర పథకాల్లో 42 పథకాలకు కనిష్టస్థాయి నిధులు కూడా రాబట్టుకోలేకపోవడం బాబు పరిపాలనా వైఫల్యానికి తార్కాణం. రాష్ట్రంలో గాడితప్పిన పరిపాలనకు బాధ్యత వహించాల్సిన బాబు తన వైఫల్యాలను అధికార యంత్రాంగంపై, కొంతమంది ఐఏఎస్ అధికారులపై నెట్టివేసే ప్రయత్నాన్ని ఎంతో తెలివిగా చేస్తున్నారు. తానొక్కడే కష్టపడుతుంటే.. అధికార యంత్రాంగం సహకరించడం లేదని ప్రజలకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. నిజానికి, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని అధికారయంత్రాంగం ప్రయత్నిస్తుంటే గండి కొడుతున్నదే బాబు. ఇక ‘జనసేన’ పవన్కల్యాణ్ అయితే ఇప్పటికీ బాబు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. కానీ, దాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న! ఈ మూడున్నరేళ్లల్లో.. బాబు అనుభవం దేనికి పనికొచ్చింది? రాష్ట్రానికి ప్రత్యేకహోదా వదులుకోవడంలోనా? విభజన బిల్లులోని అంశాలను, కేంద్ర నిధుల్ని సాధించలేకపోవడంలోనా? ఫిరాయింపుల్ని ప్రోత్సహించి.. కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగ విలువల్ని పరిహాసం చేసేందుకా? వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనేతల్ని దబాయించడంలోనా? దేనిలో బాబు అనుభవం పనికొచ్చింది? పుష్కరాల్లో, పడవ ప్రమాదాల్లో, పోలీస్ ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నా.. దానికి ఎవరూ పూచీ వహించరంటే భరించాలా? ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర అభివృద్ధికి అక్కరకు రాని అనుభవం కంటే నిజాయితీ, చిత్తశుద్ధి గల నాయకత్వమే రాష్ట్రానికి మేలు చేస్తుంది. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ మొబైల్ : 81069 15555 -
ఆయన గోబెల్ శిష్యుడిలా తయారయ్యాడు
వైఎస్సార్ జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజమని ప్రచారం చేసే పాల్ జోసెల్ గోబెల్(హిట్లర్ సహచరుడు)కు శిష్యుడిలా తయారయ్యాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సి రామచంద్రయ్య విమర్శించారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర అభివృద్ధి పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అధికారులు సహకారం లేనిదే గతంలో పాలించిన నాయకులు ఎలా అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేతగానితనాన్ని అధికారులపై తోయడం ఎంత వరకు సమంజసం అన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పై రోజుకో ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో అడ్డంగా దొరకడంతో కేంద్రాన్ని గట్టిగా అడగలేకున్నాడని, ఇదే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగక పోవడానికి ప్రధాన కారణమని విమర్శించారు. మంత్రిగా, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా, పార్లమెంటరీ సంఘాల్లో పనిచేసిన తనకు గన్ మెన్లను తీసేశారని, సర్పంచ్గా కూడా గెలవలేని టీడీపీ నేతలకు మాత్రం గన్ మెన్లను ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీటలు వారుతున్న బీజేపీ సౌధం
నిన్న మొన్నటి వరకు మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా కనిపించిన బీజేపీ అగ్రనాయకత్వానికి ఒక్కసారిగా వెన్నులో వణుకు మొదలైంది. సమీప భవిష్యత్తులో తమకు ఓటమే ఉండని పార్టీగా చెప్పుకొంటున్న బీజేపీకి ఎదురుగాలి పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానం నుంచే మొదలైంది. మూడున్నరేళ్ల ముందు లక్షా 34 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి వినోద్ఖన్నా హఠాన్మరణం చెందడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలో.. ప్రజలు ఎటువంటి సానుభూతి చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి ఏకంగా లక్షా 90 వేల మెజార్టీ అందించిన సంఘటన అపూర్వం. గురుదాస్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని చెప్పుకొనే కంటే, అక్కడి ప్రజలు బీజేపీని కసితో ఓడించారని చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది. నిజానికి, గురుదాస్పూర్ ఎన్నికల ఫలితం వెలువడటానికి ముందే బీజేపీ తన కలవరపాటును బహిర్గతపర్చింది. హిమాచల్ ప్రదేశ్తోపాటు గుజరాత్కు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమైన కేంద్ర ఎన్నికల ప్రధాన సంస్థ (సీఈసీ)పై ఒత్తిడి తెచ్చింది. ఎప్పుడో 4 నెలల క్రితం జూలైలో వచ్చిన వరదలకు సంబంధించిన పనులు గుజరాత్లో జరుగుతున్నాయి కనుక ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే.. ఆ పనులకు ఆటంకం కలుగుతాయంటూ కుంటిసాకులు చెప్పి సీఈసీపై ఒత్తిడి తెచ్చింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా గుజరాత్లోని వ్యాపార వర్గాలు, వస్త్ర వ్యాపారంపై ఆధారపడిన కార్మికులు బీజేపీపై విముఖత పెంచుకొన్నారు. సంప్రదాయంగా బీజేపీకి మద్దతుదారులుగా నిలిచిన వారు.. ఇప్పుడా పార్టీకి గుణపాఠం చెప్పాలనుకుంటున్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీంతో ఒక దశలో జీఎస్టీపై ఒక్క అడుగు కూడా వెనక్కు వేసేదిలేదంటూ మొండికేసిన ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, గుజరాత్ ఎన్నికలను, అక్కడి వ్యాపార వర్గాల ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని చేనేత రంగంపై విధించిన శ్లాబ్తోపాటు గుజరాత్లో పేరొందిన ‘ఖాక్రా’ వంటి తినుబండారాలపై విధించిన పన్నులో కొంత సడలింపు ఇచ్చారు. బీజేపీకి దేశంలో ఎదురుగాలి వీస్తున్న సంకేతాలు స్పష్టంగానే బయటపడ్డాయి. గుజరాత్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చేయాలని చూశారు. ఆయన ఓటమికి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి, ఫిరాయింపులకు పాల్పడినా ఫలితం దక్కలేదు. అహ్మద్ పటేల్ విజయం బీజేపీకి చావుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణించారు. 2014లో మోదీ విజయానికి దోహదం చేసిన యువత, వర్సిటీ విద్యార్థులు ఎన్డీఏ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో ఉన్నారు. ప్రతి ఏడాది 2 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ.. ఈ మూడున్నరేళ్లల్లో మొత్తం 5 లక్షలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఎకనామిక్స్ టైమ్స్ సర్వే ప్రకారం ‘మేక్ ఇన్ ఇండియా’ కనీస స్థాయిలో కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయింది. స్టార్టప్ ఇండియా, డిజి టల్ ఇండియాలు ఆరంభ శూరత్వంగా మిగిలిపోయాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సూచీలను, అంకెలను అధికం చేసి చూపించడానికి.. ఇంతవరకూ అనుసరిస్తున్న విధానాలను మార్చేశారు. ఫలితంగానే, ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక వృద్ధి రేటు వాస్తవ అంకెల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అంకెల గారడీతో ప్రజలను ఎక్కువ కాలం నమ్మించలేరు. ముఖ్యంగా.. యువత వాస్తవాలను తెలుసుకోగలిగింది. ఫలితంగానే ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, గౌహతి యూనివర్సిటీ వంటి వాటిల్లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికలలో బీజేపీ విద్యార్థి అనుబంధ విభాగం ఏబీవీపీ చిత్తుగా ఓడిపోయింది. అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించవలసిన బీజేపీ నాయకత్వం ప్రతిపక్షాలను దెబ్బతీయడంలో మూడున్నరేళ్లుగా తలమునకలై ఉంది. ‘ప్రతిపక్షాలనైతే నిలువరించవచ్చుననుకొన్నారు గానీ ప్రజలను ఎలా నిలువరించగలరు? అందుకే బీజేపీకి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ప్రధాని మోదీ చేసిన ‘పెద్దనోట్ల రద్దు’ ఓ పెద్ద దుస్సాహసం అని దేశంలోని ప్రతిపక్షపార్టీలే కాదు.. ప్రపంచం యావత్తూ విమర్శించింది. మోదీ తలపెట్టిన యుద్ధం పేదరికంపై కాదని, పేదల పైనేనని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. ప్రజలకు ప్రభుత్వంపైన, బ్యాంకింగ్ వ్యవస్థపై విశ్వాసం పోయిందని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయం రాసింది. పెద్దనోట్ల రద్దు వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి 2% తగ్గుతుందని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పినట్లే.. నేడు దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా తయారై.. స్థూల జాతీయోత్పత్తి 2% కంటే దిగువకు పడిపోయింది. మోదీ నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని బీజేపీ సీనియర్ నేతలైన అరుణ్ శౌరీ, సుబ్రమణ్యస్వామి ఇంతకుముందే ఎత్తిచూపగా తాజాగా యశ్వంత్ సిన్హా చేసిన విమర్శకు బీజేపీ వద్ద సమాధానం లేదు. అమిత్షా కుమారుడి అవినీతి వ్యవహారంపై బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తాము ఎవ్వరికీ జవాబుదారీ కాదని బహుశా మోదీ, అమిత్షాల ద్వయం భావిస్తూ ఉండొచ్చు. ప్రజ లకు జవాబుదారీగా ఉండకపోతే జరిగే నష్టం ఏమిటో బీటలు వారుతున్న బీజేపీని చూసిన వారికి అర్థం అవుతుంది. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ మొబైల్ : 81069 15555 -
గవర్నర్ను రీకాల్ చేయాలి
కాంగ్రెస్ నేత రామచంద్రయ్య డిమాండ్ తిరుపతి సిటీ: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ప్రభుత్వ పాలనకు మద్దతిస్తున్న గవర్నర్ నరసింహన్ను వెంటనే రీకాల్ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తూ.. ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజాభిమానమున్న నాయకుడు వైఎస్ జగన్ అని.. అదే ప్రజాభిమానంతో 67 మంది ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకున్నారని పేర్కొన్నారు. ఆయన మీద కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, అలాంటి వ్యక్తిని నేరస్తుడు అని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. -
పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులా?
-
ఆయన చేత అబద్ధాలు చెప్పించారు:సీఆర్
అమరావతి : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చేత అబద్దాలు చెప్పించారని శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత సీ. రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోమవారం గవర్నర్ ప్రసంగమంతా వాస్తవాలకు భిన్నంగా సాగిందని, ఆయన ధోరణి చూస్తుంటే తన కాలం వెళ్లదీస్తున్నట్టుగా ఉందన్నారు. పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. బ్రహ్మండంగా జరిగాయనడాన్ని ఆక్షేపించారు. ఎకనామిక్స్ సర్వేలో అత్యంత అవినీతిపరమైన రాష్ట్రంగా ఏపీ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు తనకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుని అందులో బతుకుతున్నారని విమర్శించారు. రాజ్యాంగపరంగా ఆరు నెలల గ్యాప్ లేకుండా అసెంబ్లీని ఏర్పాటు చేయాలన్న కారణంగానే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ బిల్డింగ్లు సుందరంగా ఉంటే సరిపోదని, సభలో అర్ధవంతంగా చర్చలు జరిపి పరిష్కారాలు చూపాలని రామచంద్రయ్య సూచించారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడితేనే రాష్ట్రంలో సులువుగా పోరాడగలుగుతారని అన్నారు. ఆ కేసు వల్ల రాష్ట్రం , ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమన్నా చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు నుంచి త్వరగా బయటపడాలని వ్యాఖ్యానించారు. -
ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ ప్రారంభోత్సవం
ఆహ్వానించడంలోనూ అవమానం.. ♦ మండలి ప్రధాన ప్రతిపక్ష నేతకు కేవలం మేసేజ్ ద్వారా ఆహ్వానం ♦ కనీస ప్రొటోకాల్ పాటించలేదని కార్యక్రమానికి రాని సీ రామచంద్రయ్య ♦ తమకు మెసేజ్ కూడా రాలేదన్న వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నేత ♦ అధికార మిత్రపక్ష బీజేపీ పక్ష నేత సైతం గైర్హాజరు సాక్షి, అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీ నాయకులు లేకుండానే రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించే విషయంలో ప్రభుత్వం కనీస మర్యాదలు పాటించని కారణంగానే ప్రతిపక్ష నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. శాసనసభలో మూడు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మిత్రపక్షంగా కొన సాగుతున్న బీజేపీ శాసనసభాపక్ష నాయ కుడు విష్ణుకుమార్రాజు కార్యక్రమంలో పాల్గొనలేదు. కారణాలు తెలుసుకునేం దుకు ‘సాక్షి’ ఫోను ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమకు ఆహ్వానం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. మరోవైపు శాసనమండలిలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, బీజేపీ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండగా, టీడీపీ మినహా మిగిలిన పార్టీ మండలిలో ఆయా పార్టీల పక్ష నాయకులు కార్యక్రమానికి హాజరు కాలేదు. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న తనకు ఒక అధికారి ఫోను నుంచి కేవలం ఒక మెసేజ్ రూపంలో ఆహ్వానం అందిందని కాంగ్రెస్ పక్ష నాయకుడు సీ రామచంద్రయ్య తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించే విషయంలో కనీస గౌరవం ఇవ్వని కారణంగా తాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు చెప్పారు. వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీపీఐ పక్ష నాయకుడు పీజే చంద్రశేఖర్, బీజేపీ మండలిపక్ష నేత సోము వీర్రాజులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. -
కడపలో సీ రామచంద్రయ్య మౌన ప్రదర్శన
-
జల్లికట్టు తరహా పోరాటం రావాలి
-
జల్లికట్టు తరహా పోరాటం రావాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్య చెప్పారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణి ఏమాత్రం సరిగా లేదని ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమిళనాడులో ప్రజలు జల్లికట్టు కోసం పోరాడి కేంద్రం మెడలు వంచారని, అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పొద్దున చెప్పిన విషయాలను సాయంత్రానికి మరిచిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం వేరుపడి రెండున్నరేళ్లు దాటిపోయినా ప్రత్యేక హోదాపై అతీగతీ లేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి హోదా కోసం పోరాడాలని కోరారు. జన సేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారని, ఇప్పుడు అందరూ ఒక్క వేదికపైకి రావలసిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ముందుండి నడిపినా తాము అందుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని రామచంద్రయ్య చెప్పారు. ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో టీడీపీ, బీజేపీలు దోబూచులాడుతున్నాయని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన కోసం ఆ పార్టీలు ఇప్పటికైనా కలిసొస్తే మంచిదని, రాకపోయినా ఆ పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. -
బాబు ముద్దుల పండుగ చేస్తాడట..!
ప్రొద్దుటూరు : ప్రజల కష్టాలు చెప్పుకున్నా తీర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో బీచ్లవ్ ఏర్పాటు చేసి 9వేల జంటలతో ముద్దుల పండగ చేస్తానని చెప్పడం దారుణమైన విషయమని శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ఏపీకి రావడం ఇక్కడ టిఫిన్ చేయడం... చంద్రబాబు బాగా పని చేస్తున్నాడని చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లాలో వేరుశనగ పంట దెబ్బతినడంతో రైతులు రూ.350 కోట్లు నష్టపోయారన్నారు. అనంతపురం జిల్లాలో మూడు రోజులుండి 8 లక్షల ఎకరాలను రెయిన్ గన్లతో కాపాడానని బాబు చెప్పాడన్నారు. అయితే అనంతలోని అన్ని మండలాలను ఎందుకు కరువు మండలాలుగా ప్రకటించారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు చెప్పింది అబద్ధమని తేలిపోయిందన్నారు. అగ్రిగోల్డ్ ఏజెంట్లు కొన్ని లక్షల కోట్లు రాబట్టారని, దానిపై విచారణ సరిగా జరగలేదన్నారు. 60 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రిటైర్డు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వేలం వేస్తామని కోర్టు ప్రకటించిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి ప్రత్యేక హోదాపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఎమ్మెల్యేలు అంతా అవినీతి పరులని, ఇక ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరు ముందుకు వస్తారన్నారు. చంద్రబాబు ఇంటి మరమ్మతులకు రూ.40 కోట్లు, ప్రత్యేక విమానాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు. ఇది ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేశారో చెప్పాలని సి.రామచంద్రయ్య నిలదీశారు. -
'మోదీ సర్వేలో చంద్రబాబుకు 8వ స్థానం'
కడప(వైఎస్సార్ జిల్లా): అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ చేయించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఎనిమిదో స్థానం వచ్చిందని శాసనమండలి ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు తన చుట్టూ ఒక రకమైన ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ప్రజలను బతకముంటున్నారని విమర్శించారు. రాయలసీమ కరువుతో అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. కరువుపై తాను చేయించిన సర్వేను తానే నమ్మలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని అన్నారు. -
కాపులు బాబు మాయలో పడొద్దు
-
చంద్రబాబులో వెంకయ్యకు ఏం నచ్చింది?
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబులో వెంకయ్యకు నచ్చిందేంటో చెప్పాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమా? రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబించడమా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? ప్రజాధనం దుబారా చేయడమా? ఇవేనా చంద్రబాబులో వెంకయ్యకు నచ్చిన అంశాలు?’ అంటూ సీ రామచంద్రయ్య నిలదీశారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నందుకే చంద్రబాబును వెంకయ్య అభినందించారా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీని అభినందించేందుకే నిన్నటి శంకుస్థాపన సభ పెట్టారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విభజన చట్టంలో ఉన్నదేనని చెప్పారు. కమిషన్ల కోసమే పోలవరాన్ని రాష్ట్రం చేపట్టేలా చంద్రబాబు చూసుకున్నారని, అందుకు సహకరించినందుకే అరుణ్జైట్లీని ఆయన సన్మానించారని మండిపడ్డారు. -
కథల కడలిపై సి.రా. సంతకం
అరవయ్యేళ్ల నాటి మాటేమో! ఇరవై దాటిన కుర్రాడొకడు ధాటీగా వచ్చి తెలుగు కథా రచనలో ఇదీ నా చోటు అంటూ మఠం వేసుక్కూచున్నాడు. గ్రూప్ ఫొటోలో గురజాడ, మల్లాది, చలం, కొకు, చాసో ఎందరెందరో! ఇలా హఠం చేసిన కుర్రాణ్ణి పండితులూ, పాఠకులూ రారమ్మన్నారు. చప్పట్లూ కొట్టారు. తెలుగు సాహిత్యంలో సైకలాజికల్ డ్రామాకి తెరలో, తలుపులో ఇంకేవో తెరిచాడన్నారు. ఇదంతా 1958 ముందు నాటి కాలంలో టీ ఎస్టేట్లలో బాస్గా పన్జేసే సి.రామచంద్రరావు అనే టెన్నిస్ కమ్ గోల్ఫ్ ప్లేయర్ కథ. ఆయన కథల్తో గూడా అలాగే ఆడుకున్నాడు. ఇంతా చేస్తే రాసింది టాల్స్టాయ్లాగా వార్ అండ్ పీస్లూ వంద పుస్తకాలూ కాదు. తిప్పి తిప్పి కొడితే తొమ్మిదే కథలు! కాదు పదీ అంటాడాయన. స్కోర్ గురించి పేచీ ఎందుకు! చెప్పిందే ఒప్పుకుందాం. అసలు సంగతి గెలుపు. ఆయన గెలిచాడు. పాఠకుల హృదయాల్ని. ఒక ఆఫీసరు, ఒక కూలీ, ఒకమ్మాయి, లేబర్ యూనియన్ మనుషులు, ఆడా, మగా, పెళ్లాం మొగుడూ అయినవాళ్లూ కానివాళ్ల మనసుల్లో కదిలే, మెదిలే మూవీలని స్టిల్ ఫొటోగ్రాఫర్లా క్లిక్ చేశాడు. చిత్రం! అన్నీ క్లిక్ అయ్యాయి. వీక్లీ పాఠకులంతా అద్భుతాలంటూ హాహాకారాలు చేశారు. కానీ ఆ తర్వాత ఆయనే క్లిక్ చేయడం మానేశాడు. కథల్లోకొచ్చి మఠం వేసినట్టే పోతానని మారాం చేశాడు. టెన్నిస్ రాకెట్ పట్టుకుని కలం వదిలేశాడు. రెనెగేడ్ రైటర్! ఆయనెలా పోతే మనకేంటి! కథలున్నాయిగా. ‘వేలుపిళ్లై’ మన వేలు విడిచిన మేనమామేగా! ‘ఏనుగుల రాయి’ కథలో మనం గుంపులో గోవింద అనుకుందాం! ‘నల్లతోలు’ నీదీ నాదీ! మన జాతి కథ. ఇలా చెప్పుకుంటూ పోతే టీ తోటల్లో ఎకరాల కెకరాల్లో పరిగెత్తినంత ఆయాసం వస్తుంది. కుదురుగా కూచుని ‘వేలుపిళ్లై’ పుస్తకం చదూకుంటే పోలా! అలనాటి ఆ కథలు రాసిన ఈ టెన్నిస్ రాకెట్కి నిన్నే 85వ పుట్టిన రోజట. (బిలేటెడ్) ఛీర్స్! మోహన్ -
ఏకపక్ష పాలన ఎన్నాళ్లో సాగదు...!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ శాసనమండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య ఒక పార్టీ గుర్తుతో గెలిచిన నేతలకు ఇంకొక పార్టీవారు కండువా కప్పటం దిగజారిన రాజకీయాలకు సంకేతమని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల దృష్టిలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయిందని, బాబు పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అవినీతి కంపులో మునుగుతున్న తెలుగుదేశం పార్టీ 2019లో మళ్లీ అధికారంలోకి వస్తుందనుకుంటే అది కల్ల అన్నారు, ఏపీ ప్రజలను తక్కువగా అంచనా వేస్తే చరిత్ర పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్న సి. రామచంద్రయ్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మొదట్లో ఎన్టీఆర్కు సన్నిహితులైన మీరు తర్వాత చంద్రబాబుకు ఎలా దగ్గరయ్యారు? ఎన్టీఆర్ నిజంగానే ఉన్నతమైన వ్యక్తి. కాన్షీరామ్ తర్వాత దేశంలో రాజకీయ విప్లవం తీసుకొచ్చిన నేత ఎన్టీరామారావే. ఆయనకు దూరంకావడానికి కారణం.. అప్పట్లో మమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. పార్లమెంటరీ ప్రజా స్వామ్యమే ప్రమాదంలో పడిందనే భావనను బాబు ప్రచారంలో పెట్టాడు. దాన్ని నేను, నాతో పాటు చాలామంది నమ్మారు. తర్వాత నిజం గ్రహించినప్పుడు ఎంతో అపరాధ భావన ఉండేది. నిజాయితీగా చెబుతున్నాను. ‘నేను ఘోర తప్పిదం చేశాను. కానీ ఆ తప్పుకు నేను భరించేటంత శిక్షను మాత్రమే నాకివ్వు’ అని దేవుణ్ని ప్రార్థించాను. చంద్రబాబు ప్రభుత్వం తీరు, విధానాలపై మీ అభిప్రాయం? చంద్రబాబు తీరు బాలేదు. అడ్డూ అదుపూ లేనివిధంగా ఏమిటీ హైప్? ఈ ఊదర గొట్టు ప్రచారం ఏమిటి? 12 ఏళ్లక్రితం నాటి గోదావరి పుష్కరాలను జవహర్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి ఒక్కరే అద్భుతంగా నిర్వహించారు. కానీ బాబు చేసిందేమిటి. పొద్దున్నించి రాత్రి వరకు అక్కడే కూర్చుని.. 29 మందిని బలిపెట్టారు. ఎందుకిదంతా? టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందనుకుంటున్నారు? ప్రజల్లో టీడీపీ విలువ బాగా పడిపోయింది. గత ఎన్నికల్లో మైనారిటీలు అంటే క్రిస్టియన్లు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల్లో జగన్ గురించి టీడీపీ వాళ్లు బాగా వ్యతిరేక ప్రచారం చేశారు. అరుునప్పటికీ వీళ్లు టీడీపీకి ఓట్లు వేయలేదు. జగన్మోహన్ రెడ్డికే ఓట్లేశారు. పైగా వాళ్ల ఓటు ఇప్పుడు జగన్కే మరింతగా కన్సాలిడేట్ అయింది. థ్యాంక్స్ టు బీజేపీ, థ్యాంక్స్ టు టీడీపీ... కాపు ఉద్యమం, ముద్రగడ దీక్షపై వ్యవహరించిన తీరు బాబుకు ఎదురు తన్నింది. కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చింది. సీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు? హంద్రీ-నీవా గాలేరు ప్రాజెక్టుకు వైఎస్సార్ 7 వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో కేవలం 13 కోట్లు ఖర్చుపెట్టారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చి సీమను సస్యశ్యామలం చేస్తానంటున్నాడు. ఎలా చేస్తారు? ఎవరో కంటే బాబు భుజాలపై వేసుకున్నట్లు ఉంది. నదుల అనుసంధానం చేశానంటున్నారు కదా? ఈ కాలువలో నీళ్లు బక్కెట్లో తీసుకెళ్లి ఆ కాలు వలో వేస్తే అది అనుసంధానమా? దానివల్ల ఉప యోగమేమిటి? స్వతంత్ర సాగునీటి నిపుణులకు చూపించి దీనివల్ల ఎంత లాభముంది.. పోలవరం ప్రాజెక్టు జాప్యం వల్ల ఎంత నష్టం జరుగనుందని విచారించాలి. మూడేళ్లలో పోలవరం పూర్తయితే పట్టిసీ మను తీసేయాల్సి ఉంటుంది. దీన్ని పూర్తి చేయకుండా పట్టి సీమను తెస్తే రాయలసీమకు ఏం ఒరిగింది? దరిద్రం తప్ప. రాజధానిపై మీ వ్యాఖ్య ఏమిటి? నిపుణుల కమిటీ వేస్తామని, వారు ఆరునెలల్లో నివేదికను సమర్పిస్తారని దాన్ని అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని విభజన చట్టంలో చెప్పారు. కానీ రాజధాని వ్యవహారాన్ని మొత్తంగా బాబు లాగేసుకున్నాడు. రైతులనుంచి సేకరించిన ఆ భూమి ఆయన ఇల్లా? పార్టీ ఆఫీసా? ఎట్టా తీసుకుంటారు? కొన్ని తరాలను శాసించేటటువంటి నిర్ణయమది. 5 కోట్ల ప్రజానీకానికి చెందిన విషయం. ఎక్కడ కట్టా లనే విషయాన్ని ప్రతిపక్షంతో మాటమాత్రంగానైనా చర్చించాలి కదా. కానీ 2050 వరకు తానే ఉంటానని చంద్రబాబు చెబుతున్నారు కదా? అంటే, ఏపీ ప్రజలను బాబు అంత తక్కువగా అంచనా వేశాడా? బాబు పాలన పట్ల వ్యతిరేకత ఉంది. ఉందని ఆయనకూ తెలుసు. తన పాలనపట్ల 80 శాతం సంతృప్తి ఉంది కానీ ఇంతకుముందుకన్నా ప్రభుత్వంలో 45 శాతం అవినీతి పెరిగిందని కూడా ఆయనే చెప్పారు. అంటే 80 శాతం సంతృప్తి చెందినవాళ్లు ఈ అవినీతిని క్షమిస్తున్నా రనా? పాలనలో చాలా అసంగతమైన విషయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర ఎలా ఉందనుకుంటున్నారు? జగన్ బాగానే పనిచేస్తున్నారు. గతంలో బాబుకు, జగన్కూ వచ్చిన ఓట్లకు సంబంధించి ఒక శాతమే తేడా ఉంది. బాబు, టీడీపీ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా జగన్కు అన్ని ఓట్లు వచ్చాయి. బాబేమో మోదీ కాళ్లు పట్టుకున్నాడు. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నాడు. కాపుల నడుములు పట్టుకున్నాడు. కోట్ల రైతులకు అమలు చేయలేని వాగ్దానాలు చేశాడు. ఇన్ని చేస్తే బాబుకు వచ్చిన ఓట్లు ఒక శాతం అధికం మాత్రమే. మరి రేపు పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఓటుకు కోట్లు కేసులో యాభైలక్షల వ్యవహారం మామూలు ఆరోపణ అనుకుం టున్నారా? ముఖ్యమంత్రి ఇలాంటోడని తెలిస్తే రాష్ట్రానికి ఇక పెట్టుబడులు వస్తాయా? అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం అని జాతీయ సర్వేలో తేల్చారు. బాబు పని తీరు 13వ నంబర్కి పడిపోయింది. ఏపీలో అవినీతికి హద్దుల్లేవు. బీజేపీ, టీడీపీల సంబంధాలు ఈ మూడేళ్లు సజావుగా ఉంటాయంటారా? వాళ్లూ విడిపోవాలని ఉన్నారు. వీళ్లూ అదే ఆలోచనతోటే ఉన్నారు. వాడుకున్న తర్వాత బాబే కొంతకాలానికి వదిలేస్తాడు. కానీ బీజేపీ వాళ్లు కూడా ఈసారి బాబుతో ఉంటే తాము ఎదగలేమని పొత్తునుంచి వెళ్లిపోవాలనే పద్ధతిలో ఉన్నారని తెలుస్తోంది. చివరగా 2019.. రేపటి ఎన్నికలపై మీ అంచనా ఏమిటి? 2019లో టీడీపీ పూర్తిగా అధికారంలోకి వస్తుందనుకుంటే అది కల్ల. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం తప్పకుండా పెరుగుతుంది. పార్టీ చావలేదు కానీ రోగగ్రస్తురాలిగా మారింది. కోలుకుంటామని నాకు నూరుశాతం నమ్మకం ఉంది. కాబట్టి 2019లో ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్నవారు మా తలుపులు తట్టవలసి ఉంటుంది. మేం ఎవరితో కలవచ్చు. కలవకూడదు అనేది మా ఎంపికే. (సి. రామచంద్రయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=yFLrKnVHRcA -
క్షమాపణ చెప్పకపోగా వాదనకు దిగారు
-
మండలిలో వాగ్వాదం.. ఉద్రిక్తత
-
మండలిలో వాగ్వాదం.. ఉద్రిక్తత
ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీని తప్పుపట్టలేమని శాసనమండలి విపక్ష నేత సీ. రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మొదటినుంచీ ప్రత్యేకహోదా ఇవ్వలేమని చెబుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లుగా ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ కాదని.. అది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉన్నా.. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రామచంద్రయ్య వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాను ప్రధానితో సఖ్యతగా ఉన్నానని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామంటే.. కేంద్రానికి.. లేదా మీకే ఇచ్చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అధికార, విపక్ష నేతల వాగ్వాదంతో శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వలనే ప్రత్యేకహోదా రాలేదంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో శాసన మండలిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంలోనే రామచంద్రయ్యపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనను ఏకవచనంతో సంబోధిస్తూ, ''20 ఏళ్లు కలిసి పనిచేశాం, నువ్వేంటో నాకు తెలియదా... మీరు అలా చేయబట్టే 2 శాతం ఓట్లు వచ్చాయి.. ఇక కూర్చో'' అంటూ వ్యాఖ్యానించారు. దాంతో రామచంద్రయ్య కూడా ఆగ్రహానికి గురయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత విపక్ష సభ్యులకు దానిపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కూడా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమాత్రం దానికి ఇక్కడ కూర్చోబెట్టి వినిపించడం ఎందుకు, ప్రకటన ప్రతి ఇస్తే ఇళ్లకు వెళ్లి చదువుకునేవాళ్లం కదా అని అన్నారు. -
'చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదు'
కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న తర్వాత రాష్ట్రంలో అనేక పరిణామాలు జరగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ తనది కాదని... చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. -
'టీడీపీని పవన్ ఎందుకు నిలదీయలేదు'
వైఎస్ఆర్ జిల్లా: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీని ఎందుకు నిలదీయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆదివారం వైఎస్ఆర్ జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై పవన్ విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన పవన్.. గతం తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది' అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీయేనని సి.రామచంద్రయ్య గుర్తు చేశారు. -
పుష్కరాల పేరుతో కుట్ర: సీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా పుష్కరాల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్ జరగకుండా కుట్రపన్నారని ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరగకుండా బాబు కుట్రపన్నారు. హోదాపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధిలేదు. బిల్లు ద్రవ్య బిల్లా? కాదా?అని తేల్చడానికి బిల్లును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.. లోక్సభ స్పీకర్కు పంపాలని నిర్ణయించినప్పుడు బీజేపీ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టడమే అందుకు నిదర్శనమ’న్నారు. పుష్కరాలను చంద్రబాబు సొంత ఇంటి కార్యక్రమంగా భావించి అందరినీ ఆహ్వానిస్తున్నారని మండిపడ్డారు. -
‘హోదా’ సాధన బాధ్యత బాబుదే
‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుదే. ప్రజలను మభ్యపెట్టేందుకు జైట్లీతో తాజాగా మాట్లాడినట్లు చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా పునాది లాంటిది. బంద్ విజయవంతం కావడంతో టీడీపీ ప్రజాప్రతినిధుల గుండెల్లో దడ మొదలైంది’’ - సి.రామచంద్రయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్సీ -
'హోదా బిల్లును ఆర్థిక బిల్లు అనడం హాస్యాస్పదం'
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లును ఆర్థిక బిల్లు అనడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. మంగళవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిపాటు చర్చ జరిగిన తర్వాత ఆర్థిక బిల్లు అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు పలికే అవకాశం ఉన్నా శల్యసారథ్యం చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు. -
బిల్లును అడ్డుకోవడం దారుణం
-
'బాబు అలా చేస్తే ఏపీలో రక్తపాతమే'
హైదరాబాద్: అవినీతిలో ఏపీది ప్రథమ స్థానం అని అందుకే ఇక్కడికి పెట్టుబడులు రావని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన పెట్టుబడులు రావని అన్నారు. ప్రత్యేక హోదా తప్ప రాష్ట్రానికి మరో మార్గం లేదని ఆయన చెప్పారు. అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులనుక కలిసి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం కేటాయించిన రూ.700కోట్లలో కేవలం ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగుతోందని అన్నారు. దేవుళ్లకే భద్రత లేకుండా పోయిందని బెజవాడలో ఆళయాల కూల్చివేత నేపథ్యంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా అటవీ భూములను డీ నోటిఫై చేసి వైఎస్ఆర్ జిల్లాలో అటవీ ప్రాంతాన్ని ఏర్పాటుచేస్తామంటే అక్కడ రక్తపాతమవుతుందని హెచ్చరించారు. -
'ఆ అగ్గిలో బాబు బూడిదవడం ఖాయం'
-
'ఆ అగ్గిలో బాబు బూడిదవడం ఖాయం'
విజయవాడ: గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మెప్పుకోసమే గవర్నర్ పనిచేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం బాగుందని గవర్నర్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్ ఎందుకు నోరు మెదపడం లేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. బీసీలు, కాపుల మధ్య చంద్రబాబు అగ్గిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ అగ్గిలో చంద్రబాబు బూడిదవడం ఖాయం అని రామచంద్రయ్య అన్నారు. -
అమరావతి ప్రజారాజధాని కాదు....
హైదరాబాద్ : ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాజధాని సెంటిమెంట్ను చంద్రబాబు తన దోపిడికి అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. స్విస్ చాలెంజ్ పద్దతిని వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రజా రాజధాని కాదు... చంద్రబాబు పెట్టుబడిదారుల రాజధాని అని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల భూములు తీసుకుని చంద్రబాబు తనకు నచ్చిన వారికి ఇస్తున్నారని విమర్శించారు. గతంలో రాచరికంలో కూడా ఇలా జరిగి ఉందన్నారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా ఇష్టానుసారం వ్యవహరించడం సరికాదని చంద్రబాబుకు రామచంద్రయ్య ఈ సందర్బంగా సూచించారు. రాజధాని నిర్మిణ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేసి... బహిరంగ టెండర్లు పిలవాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
'అసలు ముందుగా అరెస్ట్ కావాల్సింది బాబే'
గుంటూరు: అమరేశ్వర ఆలయానికి అనుబంధంగా మద్రాస్లో ఉన్న 471 ఎకరాల సదావర్తి సత్రం భూములను టీడీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రూ. 6 కోట్ల విలువైన ఎకరా భూమిని రూ. 27 లక్షలకే వేలం వేయడం వల్ల దోపిడీకి తెరతీసిందని మండిపడ్డారు. బుధవారం ఏపీసీసీ నేతలు గవర్నర్ను కలిశారు. టీడీపీ నేతలకే ఈ భూములను ధారాదత్తం చేసేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ అక్రమ వేలాన్ని రద్దు చేయాలని, రూ. 5 వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం ఇచ్చామని రఘువీరా చెప్పారు. దేవుడి భూములను వేలం వేసే అధికారం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రూ. 5 వేల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. వేలానికి సంబంధించి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా టీడీపీ నేతలకు ఈ భూములను కట్టబెట్టేలా వేలం ప్రక్రియ సాగిందని రఘువీరా దుయ్యబట్టారు. దేవుడి భూముల ఆస్తులను రక్షించేందుకు ఏపీలోనూ, తమిళనాడులోనూ కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని సీ రామచంద్రయ్య చెప్పారు. అదేవిధంగా ముద్రగడ దీక్షపై ప్రభుత్వ తీరుపైనా ఏపీసీసీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో ముద్రగడ పద్మనాభంను పరామర్శించనీయకుండా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ముద్రగడ కుమారుడిని పోలీసులు చితకబాదడం అమానుషమని అన్నారు. అసలు ముందుగా అరెస్ట్ కావాల్సింది చంద్రబాబు నాయుడేనని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఏపీ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీ రామచంద్రయ్య విమర్శించారు. -
రామచంద్రయ్యను అడ్డుకున్న పోలీసులు
రాజమండ్రి : ఉద్యమాన్ని అణచివేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు సి.రామచంద్రయ్య వచ్చారు. అయితే ముద్రగడను పరామర్శించేందుకు అనుమతి లేదంటూ ఆయన్ని ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సి.రామచంద్రయ్య మండిపడ్డారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. -
'అమరావతికి భూములు అప్పగించొద్దు'
శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య కడప: జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి భూములు మాత్రం అమరావతి కోసం అటవీశాఖకు కట్టబెడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతికి జిల్లా భూములు అప్పగించవద్దంటూ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరామకృష్ణన్ కమిషన్ను తోసి రాజని అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయడం చట్టవిరుద్దమన్నారు. రాజధానికి అమరావతి సురక్షిత ప్రాంతం కాదని చెప్పారు. ఒక సామాజికవర్గ ప్రయోజనాల కోసమే రాజధాని నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ దాన్ని సాధించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ ప్రయత్నించిన దాఖలాలు లేవన్నారు. పార్టీలకు అతీతంగా నిలదీయాలి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యే ఎస్బి అంజద్బాషా కోరారు. జిల్లాలోని 56 వేల ఎకరాల ప్రభుత్వ భూములను అటవీశాఖకు ఇవ్వడం సమంజసం కాదన్నారు. విభజనతో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణం తక్షణమే ఆపాలి అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని రాయలసీమ హక్కు అని, శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. సీమను అన్ని విధాలా అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులోమరో చీలిక వస్తుందని తెలిపారు. డీసీసీ కార్యదర్శి ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజధాని కోసం ఇక్కడి భూములను ప్రభుత్వం అటవీశాఖకు అప్పగిస్తున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జె.పెద్దన్న, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, రాయలసీమ ఉద్యమ నాయకుడు వై.నాగిరెడ్డి, సిద్దేశ్వరం సాధన సమితి జిల్లా కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నీలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్ప్లాన్ ఓ మాయాజాలం
ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా భావిస్తున్న ఒక్క అమరావతి నగరంలోనే వచ్చే 20 ఏళ్లలో 45 లక్షలు, రాజధాని ప్రాంతమైన కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో కోటీ పది లక్షల జనాభా, 2050 నాటికి కోటీ 35 లక్షలకు పెరుగుతుందా? ఔననే చెప్పారు సింగపూర్ నిపుణులు. 2015 మార్చిలో సింగపూర్ నిపుణులు సమర్పిం చిన మాస్టర్ ప్లాన్లో సీఆర్డీఏ ప్రాంత జనాభా పైన చెప్పుకున్న విధంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే వారు చెప్పినది ఊహాజనితమేననీ, ప్రచారార్భాటాలతో ప్రజ లను మభ్యపెట్టడానికి పన్నిన వ్యూహంలో భాగమేననీ స్పష్టమౌతుంది. జన విస్ఫోటనం గురించి అంతా కలవరపడుతూనే ఉంటారు. కానీ సరైన సమయంలో ఎవరూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషిని ఆరంభిం చరు. జనాభా పెరుగుదల ప్రపంచంలో ఎక్కువ దేశాలకు శాపమే. పరిశో ధన జరిగే కొలదీ కొత్త కోణాలు బయట పడుతూనే ఉన్నాయి. జనాభా పెరుగుదల పర్యావరణకు కూడా సమస్యగా పరిణమిస్తోంది. ఆరోగ్యం మీద స్పృహ, మహిళా సాధికారత అమలు వంటి అంశాలపై అవగాహన పెరిగితే జనాభాను అదుపులో ఉంచవచ్చునంటారు నిపుణులు. కానీ ఇలాంటి కీలక అంశాల అంచనాలో, లేదా పథకాల అమలులో, ఆఖరికి సమస్య పరిష్కా రంలో కూడా నేతలు మొక్కుబడిగానే ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు రాజ ధానిగా భావిస్తున్న ఒక్క అమరావతి నగరంలోనే వచ్చే 20 ఏళ్లలో 45 లక్షలు, రాజధాని ప్రాంతమైన కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలో కోటీ పది లక్షల జనాభా, 2050 నాటికి కోటీ 35 లక్షలకు పెరుగుతుందా? ఔననే చెప్పారు సింగపూర్ నిపుణులు. 2015 మార్చిలో సింగపూర్ నిపుణులు సమర్పించిన మాస్టర్ ప్లాన్లో సీఆర్డీఏ ప్రాంత జనాభా పైన చెప్పుకున్న విధంగా పెరుగుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే వారు చెప్పినది ఊహాజనితమేననీ, ప్రచారార్భాటాలతో ప్రజలను మభ్యపెట్టడానికి పన్నిన వ్యూహంలో భాగమేననీ స్పష్టమౌతుంది. మైండ్ గేమ్లో ఇది కూడా ఒక దశ. వీటిని ప్రశ్నించడం అవసరం. రాజధాని కాబట్టి అమరావతి/సీఆర్డీఏ కూడా హైదరాబాద్ వలెనే అభివృద్ధి చెందుతాయా అంటే, జనాభాపరంగా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవనే సమాధానం వస్తుంది. లక్షలలో వలసలు జరుగు తాయా అన్నది కూడా అనుమానమే. రాష్ర్టం విడిపోయిందనీ, ఇపుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 13 జిల్లాలేననీ గమనించాలి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహా నగరాలు రాయలసీమను ఆనుకొనే ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. 1992లో ఐటీ శకం మొదలయ్యేనాటికే హైదరాబాద్లో బలమైన పారిశ్రామిక, శాస్త్ర-సాంకేతిక, విద్యా, పరిశోధనా వ్యవస్థలు నెల కొన్నాయి. నాటి జనాభా 43.6 లక్షలు. పదేళ్లలో 57.2 లక్షలకు, 2011కు 77.5 లక్షల జనాభా పెరిగింది. ఈ రెండు దశాబ్దాలలో ఐటీ రంగం వేగంగా విస్తరించింది. అయినప్పటికీ 1992 తర్వాత మరో 40 లక్షలు (దాదాపు) మాత్రమే జనాభా పెరగడం సాధ్యమైంది. ఇతర రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్కు వలసలు సాగాయి. హైదరాబాద్ ఆకర్షించిన స్థాయిలో అమరావతి కూడా పెట్టుబడులను, ఉద్యోగులను, విద్యార్థులను, అసంఘటిత రంగాలను ఆకర్షించడం సాధ్యం కాదు. ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని కావడం, ఆహ్లాదకర వాతావరణం, నగరం చుట్టూ లక్షల ఎకరాల బంజరుభూములు ప్రభుత్వ అధీ నంలో ఉండడం వంటి కారణాలు హైదరాబాద్కు కలిసొచ్చాయని గుర్తించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెట్టాలనుకొనే ఐటీ కంపెనీలకుగానీ, సేవా రంగంలోని ఇతర కంపెనీలకు గానీ ఇప్పుడున్న పరిస్థితులలో విశాఖ పట్నమే మొదటి ఆకర్షణ అవడానికి అవకాశాలు ఎక్కువ. విజయవాడ పెరుగుదలను గురించి కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబోయే గణాంకాలు, జనాభా లెక్కలు గతంలో కూడా ఇచ్చిన ప్పటికీ మరొకసారి ప్రస్తావించడం అవసరం. పట్టిక 1ని గమనిస్తే 2011 నాటికి విజయవాడ నగర కార్పొరేషన్ జనాభా 10.34 లక్షలు ఉంది. ఆ నగరం చుట్టూ ఉన్న 23 చిన్న చిన్న పట్టణాలు (మంగళగిరి, తాడేపల్లి సహా), పంచాయతీలు, గ్రామాలు కలుపుకొని అర్బన్ జనాభా 14.91 లక్షలు. 1991 తర్వాత రెండు దశాబ్దాలలో నగరం పెరుగుదల 20 శాతానికి దగ్గరగా మాత్రమే ఉంది. దీని ప్రకారం ఒక నగరానికి ఈ పెరుగుదల తక్కువ కిందే లెక్క. ఇప్పుడు విభజన అనంతరం విజయవాడ ప్రాంతం రాజధాని అయింది కాబట్టి భవిష్యత్తులో ఈ నగరం గణనీయంగా పెరుగు తుందన్న వాదనకు ఆధారం లేదు. కృష్ణా-గుంటూరు జిల్లాలలో జనాభా పెరుగుదల తీరును పరిశీలిస్తే ఈ అంశం అవగతమవుతుంది. (పట్టిక 2). రెండు-మూడు దశాబ్దాలలో భారత జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గిన రాష్ట్రాలలో కేరళ, తమిళనాడుల తరువాతి స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ అభివృద్ధి చెందిన జిల్లాలలో ఆ తగ్గుదల సుస్పష్టం. పట్టిక 2ను గమనిస్తే 1981-91 దశకం తర్వాత రెండు జిల్లాలలోను మొత్తం, గ్రామీణ జనాభా పెరుగుదలలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. కృష్ణాలో అయితే గ్రామీణ ప్రాంతంలో నికరంగా తగ్గుదలే కనిపిస్తున్నది. ఇది మామూలు విషయం కాదు. నగరీకరణ పెరుగుదల కూడా 20-22% లోనే ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2010-11లో నగరీకరణ ఇదేవిధంగా (20.78%) ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) శివారు ప్రాంతాలు 70 శాతం పెరిగాయి. కృష్ణా జిల్లాకు ఆనుకొని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో నగరీకరణ పెరుగుదల అత్యంత తక్కువగా (6.01%). తూర్పుగోదావరి జిల్లాలోను అది 10.56% మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలపు నగరీకరణలో రాయ లసీమలో ఎక్కువగాను (43.60%), తరువాత తెలంగాణ (39.29%), కోస్తాంధ్ర (18.45%) స్థానాలు పొందాయి. జాతీయ స్థాయిలో 2001-11 నగరీకరణ పెరుగుదల 31.80 శాతంగా నమోదైంది. కొంతకాలాన్ని తీసుకుని జనాభా పెరుగుదలను విశ్లేషించేటపుడు సాంవత్సరిక పెరుగుదలను ముఖ్యంగా చూస్తారు. ఆవిధంగా చూసిన ప్పటికి గుంటూరు-కృష్ణాలలో గత రెండు దశాబ్దాలలో నగరీకరణ పెరుగు దల 3.5 శాతం లోపే ఉన్నది. సీఆర్డీఏ ప్రాంతంలో వచ్చే 20 ఏళ్లలో సరాసరి 6.62 శాతం, విజయవాడ-అమరావతి ప్రాంతంలో 9.21 శాతం జనాభా పెరుగుతుందని అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతం ప్రధానంగా ఉన్నచోట కూడ 4.5 శాతం పైగా అంచనా వేశారు. మొన్న సీఆర్డీఏ విడుదల చేసిన ఫ్యాక్ట్ బుక్ ప్రకారం రాజధాని ప్రాంత జనాభా 58.74 లక్షలు (2011). 2001 జనాభా 52.45 లక్షలు. అంటే గత దశాబ్దంలో సాంవత్సరిక వృద్ధి 1.14 శాతం మాత్రమే. ఇది 6.62కు త్వరత్వరగాపెరగడమనేది పూర్తిగా వాస్తవ విరుద్ధం. జనాభాకు సంబంధించిన అంశాలను కూడా సరిగా అంచనా వేయకుండానే మలేషియా, సింగపూర్ నిపుణుల పేరుతో కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ అంటూ మాయాజాలాన్ని ప్రదర్శించడం నిజాయితీ కలిగిన ప్రభుత్వాలు చేయాల్సిన పనికాదు. ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య రచయిత సెస్ పరిశోధనా సంస్థలో ఆచార్యులు, నగరీకరణ విశ్లేషకులు ఈమెయిల్ : crchandraiah@gmail.com -
'ప్రజల దోపిడి పార్టీగా టీడీపీ మారింది'
హైదరాబాద్: తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు మాట్లాడిన తీరులో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై ఏమాత్రం పశ్చాత్తాపం, నిజాయితీ కనిపించలేదని కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఆయన శుక్రవారం ఇందిరాభవన్ లో విలేకరులతో మాట్లాడారు. మహానాడు అంటే పార్టీ ప్రజలకు ఏమిచేసిందో..ఇంకా ఏమి చేయాల్సి ఉందో తెలపేది గా ఉండాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేని పరిస్థితి తలెత్తిందో సమీక్షించి ప్రజలకు వాస్తవాలను చెప్పి భరోసా ఇస్తారనుకుంటే.. తన తప్పులను ఇతరుల మీద వేస్తూ.. చంద్రబాబు తనను తాను పొగుడుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ మౌలిక సిద్దాంతాలను వదిలిపెట్టిందని.. ముఖ్యంగా రైతులను, సామాన్య ప్రజానీకం విషయంలో చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు అదేవిధంగా ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ మాట్లాడుతూ.. పరిటాల హత్యకు కారుకులెవరో తేల్చాలన్నారు. రవి హత్య కేసులో ఆరోపణలు వచ్చిన వారిని టీడీపీలో చేర్చుకుని ఎంపీ గా అవకాశం ఇచ్చిన బాబు పరిటాల అభిమానులకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మహానాడు వేదికగా చంద్రబాబు ప్రయత్నించారన్నారు. గత రెండేళ్ల పాలనలో అవినీతితో తెలుగు ప్రజల దోపిడి పార్టీగా టీడీపీ మారింది కాబట్టే చంద్రబాబుకు మహానాడు పండుగ నాడుగా కనపడిందన్నారు. ఎన్టీఆర్ ను గొప్ప నటుడిగా, దివంగత ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం కానీ.. ఆయన ఒక్కడే తెలుగు జాతికి ఏకైక నాయకుడని చెప్పడం తగదని, దీనికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘సీఎం ఫిరాయింపుల పథకం’ అని పెట్టుకో..
బాబుకు రామచంద్రయ్య సూచన సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నాడని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఘాటుగా విమర్శించారు. ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి పేరిట ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని, అయితే ప్రస్తుతం ఆయన బతికుండగానే చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న బీమా ఇలా ప్రతి పథకానికి చంద్రబాబు పేరు పెట్టుకోవడం శోచనీయమన్నారు. ఇలా సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టుకున్న ఆయన.. ఇలాగే ముఖ్యమంత్రి ఫిరాయింపుల పథకం, చంద్రబాబు అవినీతి పథకం లాంటి పేర్లు పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. అవినీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పీకల్లోతు కూరుకొనిపోయాడని, అందుకే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదని ఆరోపించారు. సోమవారం ఇందిర భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. -
'హోదా విషయంలో మొదటి ముద్దాయి బాబే'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నింటా రాజీపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హొదా అవసరం లేదని కేంద్రప్రభుత్వం తేల్చడంలో మొదటి ముద్దాయి చంద్రబాబేనన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు పూర్తైతే ఏపీ ఎడారిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే బాబు పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వానికి అప్పగించడం లేదని దుయ్యబెట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
'ఎన్టీఆర్ ఆ నిబంధనలు ఆనాడే పెట్టారు'
కడప: ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చే నేతలంతా అన్ని పదవులు వదులుకుని రావాలని ఆనాడే స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ నిబంధనలలోనే పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ నిబంధనలనే తుంగలో తొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. గురువారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ఇలాంటి వారు ఉంటారని తెలుసుంటే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే రాజ్యాంగంలో పరిష్కారం చూపేవారని అన్నారు. వేరే పార్టీ వారిని చేర్చుకునే రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్లు, మండలి ఛైర్మన్లపై రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలని సూచించారు. మనం గర్వపడే ప్రజాస్వామ్య పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం మంచిదేనని కొనియాడారు. అయితే చంద్రబాబు ప్రతిపక్షాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని సి.రామచంద్రయ్య విమర్శించారు. -
'చంద్రబాబు అలా చెప్పడం సిగ్గుచేటు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కరువు నిధులు మంజూరు చేయడంలేదని, తన విన్నపాలను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ చంద్రబాబు ప్రజల ముందు బేలతనాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్రం ఆయనను అవమానిస్తుంటే ఎన్డీయే నుంచి వైదొలగాలని, కేంద్ర కేబినెట్లో ఉన్న టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, చంద్రబాబుకు మధ్య ఏర్పడ్డ ఇగో సమస్య రాష్ట్ర భవిష్యత్ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు నివారణపై దృష్టిపెట్టాల్సిన చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రలోభపెట్టడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారని, పశుగ్రాసం లేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణపై దృష్టిపెట్టి ప్రజలను ఆదుకోవాలని సీ రామచంద్రయ్య కోరారు. -
కడపలో రైతు సదస్సు రసాభాస...
- కలెక్టర్- ప్రజాప్రతినిధుల వాగ్వాదం కడప(వైఎస్సార్ జిల్లా) వైఎస్సార్ జిల్లా కడప నగరంలో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రధాని ఫసల్ భీమా యోజనపై రైతుల అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ప్రజాప్రతినిధులు- కలెక్టర్ మధ్య వాగ్యుద్ధం జరగడంతో రైతులందరూ సదస్సును మధ్యలోనే బహిష్కరించారు. తీవ్ర గందరగోళం మధ్య సదస్సు అర్ధంతరంగా ముగిసింది. ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను మంటకలుపుతోందని, రాజధాని కోసం కృష్ణా జిల్లాలో సేకరించిన 57వేల ఎకరాల అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలోని 57 వేల ఎకరాల భూములను అటవీ శాఖకు బదలాయించడాన్ని ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా రైతులు, ప్రజల అవసరాలకు ఉపయోగపడే 57 వేల ఎకరాల భూమిని అటవీశాఖకు బదలాయించడం దారుణమని, దీనిని తాము అంగీకరించేది లేదని, దీనిపై కలెక్టర్ వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. రైతులను నట్టేట ముంచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ అడ్డుకోవాలని వారు కోరారు. మధ్యలోనే జోక్యం చేసుకున్న కలెక్టర్ ఇది రాజకీయ సభ కాదని, ప్రజాప్రతినిధులకు తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంతో రభస మొదలైంది. జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడే విషయమై తాము మాట్లాడుతుంటే రాజకీయాలనడం సరికాదని సి.రామచంద్రయ్య, రవీంద్రనాథ్రెడ్డి సదస్సునుంచి వెళ్లిపోయారు. వారి వెనుకే రైతులందరూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. విధిలేక అధికారులు సదస్సును అర్థంతరంగా ముగించారు. -
ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని శనివారానికి వాయిదా వేశారు. శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. ఈ నెల 29, 30 తేదీల్లో సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని పేర్కొంటూ విప్ జారీ చేశారు. మండలిలో మంగళవారం ఇసుక మాఫియాపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మధ్య వాగ్వాదం జరిగింది.ఇసుక పేరుతో దోచుకుంది మీరంటే మీరేనంటూ ఇరువులు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కాసేపు సభలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చైర్మన్ ఘంగా చక్రపాణి ఇరువురు నేతలకు సర్దిచెప్పి చర్చను ముగించారు. అనంతరం మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. -
అక్రమంగా కొన్నవారిపై కాకుండా రాసిన వాళ్లపై కేసులా?
మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములను అక్రమంగా కొన్నవారిపై చర్యలు తీసుకోకుం డా, వాటి గురించి రాసిన వాళ్లపై కేసులు పెడుతూ మీడియాను బెదిరిస్తారా.. ఇదెక్కడి న్యాయం అంటూ సీఎం చంద్రబాబుపై మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. మిగిలిన పేపర్లు, చానళ్లు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంటే.. ఒక పేపర్లో వ్యతిరేకంగా రాస్తే ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ప్రభుత్వానికి ధైర్యముంటే భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సభలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయం ముందుగానే ప్రకటించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని పక్కనపెట్టి రాజధాని ప్రాంతంలో భూములు సేకరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై ముందుగానే లీకులు ఇవ్వడంతోనే అధికార పార్టీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్రమే చేపట్టాల్సి ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం ఏం లాభం ఆశించి తన భుజాన వేసుకుందని ప్రశ్నించారు. -
'అందుకే యూస్ లెస్ సీఎం అన్నాను'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అధికార టీడీపీ నేతల భూదందాపై వచ్చిన 'రాజధాని భూ దురాక్రమణ' కథనం వాస్తవని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. పక్కా ఆధారాలతో సహా భూ కుంభకోణాన్ని 'సాక్షి' బయటపెట్టిందన్నారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ 'భూముల కుంభకోణంపై సీఎం చంద్రబాబు విచారణకు సిద్ధపడాలి కానీ మీడియాపై, నేతలపై ఎదురుదాడికి దిగడం సరికాదు. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలన్నీ బోగస్. టీడీపీ నేతలు అసైన్డ్ భూములు కొని రెగ్యులైజేషన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తన సన్నిహితులకు ధనవంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల నుంచి మోసపూరితంగా భూములు లాక్కున్నారు. మరోవైపు నిధుల కేటాయింపు లేకుండా పోలవరం ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పందించడం లేదు. పోలవరం పూర్తికాకపోతే రాయలసీమ నాశమవుతుంది. ఈ అంశంపై ఆరోపణలు చేస్తూ యూస్లెస్ సీఎం అని కామెంట్ చేశాను. అది తప్పైనట్టు చంద్రబాబు టీడీపీ నేతలతో నా పై ఆరోపణలు చేపిస్తున్నారు' అని రామచంద్రయ్య తెలిపారు.