గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి | c ramachandraiah lashes out at chandra babu | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి

Published Mon, Apr 10 2017 1:36 AM | Last Updated on Tue, Aug 14 2018 3:05 PM

గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి - Sakshi

గవర్నర్‌ను రీకాల్‌ చేయాలి

కాంగ్రెస్‌ నేత రామచంద్రయ్య డిమాండ్‌

తిరుపతి సిటీ: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ప్రభుత్వ పాలనకు మద్దతిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌ను వెంటనే రీకాల్‌ చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ నేత సి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తూ.. ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.

మూడేళ్లుగా చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ప్రజాభిమానమున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని.. అదే ప్రజాభిమానంతో 67 మంది ఎమ్మెల్యేలను  ఆయన గెలిపించుకున్నారని పేర్కొన్నారు. ఆయన మీద కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, అలాంటి వ్యక్తిని నేరస్తుడు అని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement