శ్రీలక్ష్మి గైర్హాజరుపై కోర్టు ఆగ్రహం | CBI court orders srilakshmi to produce medical reports | Sakshi
Sakshi News home page

శ్రీలక్ష్మి గైర్హాజరుపై కోర్టు ఆగ్రహం

Published Mon, Aug 12 2013 11:28 AM | Last Updated on Tue, Nov 6 2018 5:47 PM

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గైర్హాజరుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్విడ్ ప్రో కో కేసులో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు సోమవారం ఉదయం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఇదే సమయంలో ఓఎంసీ కేసు కూడా విచారణకు వచ్చింది.

అయితే, ఈ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ విషయమై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యం కారణంగానే ఆమె హాజరు కాలేదని తెలిసింది. అయితే, ఈ విషయంలో కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. మరుసటి వాయిదాకు కూడా శ్రీలక్ష్మి హాజరు కాలేకపోతే తప్పనిసరిగా మెడికల్ రిపోర్టు సమర్పించాలని ఆమె తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement