టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ విశాఖ జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడలో ఉద్రిక్తతకు దారి తీసింది.
టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Apr 15 2014 11:24 PM | Updated on Aug 14 2018 4:21 PM
విశాఖ: టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ విశాఖ జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో సీఐ అప్పల్నాయుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పరస్పరదాడుల్లో ఇరువర్గాలకు చెందిన 8 మందికి స్వల్పగాయాలైనట్టు పోలీసులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రామంలో అధికారులు పికెటింగ్ ఏర్పాటుచేశారు.
Advertisement
Advertisement