
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్ని పరీక్షించగా.. 54 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో 842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 41 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,681 కరోనా పరీక్షలు నిర్వహించారు. (చదవండి : ఆందోళన వద్దు..‘కోవిడ్’ను కట్టడి చేస్తాం)
జిల్లాల వారీగా కరోనా కేసులు..
Comments
Please login to add a commentAdd a comment