సిఎంతో విభేదాలున్నా అధిష్టానంతో సన్నిహితమే | Danam Nagendar comments on MIM | Sakshi

సిఎంతో విభేదాలున్నా అధిష్టానంతో సన్నిహితమే

Published Mon, Jan 13 2014 5:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మంత్రి దానం నాగేందర్‌ - Sakshi

మంత్రి దానం నాగేందర్‌

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎంఐఎంకు విభేదాలు ఉన్నప్పటికి అధిష్టానంతో మాత్రం సన్నిహిత సంబంధాలే ఉన్నాయని మంత్రి దానం నాగేందర్‌ చెప్పారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎంఐఎంకు  విభేదాలు ఉన్నప్పటికి అధిష్టానంతో మాత్రం సన్నిహిత సంబంధాలే ఉన్నాయని మంత్రి దానం నాగేందర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని శాసనసభా స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఎంఐఎంతో  పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

ఏఐసీసీ పరిశీలకురాలు విజయధరణి ఈరోజు గాంధీభవన్‌లో మంత్రి దానం నాగేందర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నానని చెప్పారు. అందరి అభిప్రాయాలను అధిష్టానానికి నివేధిస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement