చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి. వి.కోట మండలం నాయకనేరి గ్రామ శివారులోని పంట పొలాలపై ఏనుగులు శనివారం దాడి చేశాయి. దాంతో భారీగా పంట నష్టం వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గత వారంలో కూడా ఇదే మండలంలో ఏనుగులు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. దీంతో భారీగా పంటలు ధ్వంసమైనాయి.