రాజధాని రైతుల ధర్నా | Farmers stage dharna against Land Acquisition | Sakshi

రాజధాని రైతుల ధర్నా

Aug 23 2015 10:32 AM | Updated on Oct 1 2018 2:00 PM

రాజధాని ప్రాంతంలో భూములను కోల్పోతున్న రైతులు అరటి పీకలతో ఆందోళనకు దిగారు.

తాడేపల్లి (గుంటూరు జిల్లా) : రాజధాని ప్రాంతంలో భూములను కోల్పోతున్న రైతులు అరటి పీకలతో ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజీపై అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వరంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సహాయ కార్యదర్శి బాబురావు, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు పంటలు పండే జరీబు భూములను సేకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున బైఠాయించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కాగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement