సాక్షి, హైదరాబాద్: ఓటర్ల తుది జాబితా ప్రకటన ఈ నెల 31వ తేదీకి వాయిదా పడింది. సవరణకు 30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనకు సమయం పడుతున్నందున జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు గురువారం పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఈ నెల 17 వరకు సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు.