
సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీఎం అండ్ హెచ్వో పరిసరాల్లోని వ్యాక్సిన్ శీతలీకరణ కేంద్రంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. శీతలీకరణ గది కావడంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తోంది. శీతలీకరణ కేంద్రంలో నిలువ ఉంచిన ఇంజక్షన్లు, ఇతర మెడిసిన్ దగ్ధం అవుతున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టు అధికారులు చెబుతున్నారు.