270 కేజీల గంజాయి సీజ్: ఆరుగురు అరెస్ట్ | ganja seized in east godavari district | Sakshi
Sakshi News home page

270 కేజీల గంజాయి సీజ్: ఆరుగురు అరెస్ట్

Jun 10 2016 9:17 AM | Updated on Sep 4 2017 2:10 AM

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 145 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 125 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement