
షూ సాక్సుల్లో అర కిలో బంగారం
షూ సాక్సుల్లో అరకిలో బంగారు బిస్కెట్లను దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్, న్యూస్లైన్: షూ సాక్సుల్లో అరకిలో బంగారు బిస్కెట్లను దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఫ్లై దుబాయ్ ఎయిర్లైన్స్ విమానంలో వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఖాజా(30)ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
అతడి షూ సాక్సుల్లో నాలుగు బంగారు బిస్కెట్లు, ఓ రింగ్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 565 గ్రాముల బరువు ఉన్న వీటి విలువ రూ. 17.56 లక్షల వరకు ఉంటుందని అంచనా.